టీమిండియాతో కీలక రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఈ మ్యాచ్ కటక్ బారాబతి స్టేడియంలో జరుగుతోంది. తొలి మ్యాచ్లో నెగ్గిన టీమిండియా సిరీస్లో 1-0తో ముందున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది.