వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్తేజ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ఇంటిలిజెంట్. సాయి ధరమ్ ధర్మభాయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.