Top Stories
ప్రధాన వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు.కాగా, ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ మరో ఏడాది పొడిగించారు. విద్యార్థుల 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. తాజాగా ఈ ఆఫర్ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ పేర్కొన్నారు.

16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి
చంఢీగడ్: అదొక పదహారేళ్ల క్రితం కేసు.. అందులోనూ హైప్రొహైల్ కేసు. ఒక జస్టిస్ తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి సుదీర్ఘకాలం వేచి చూసిన కేసు. హర్యానా జడ్జిగా పని చేసిన జస్టిస్ నిర్మలా యాదవ్.. భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే కేసు. అయితే ఆ కేసు సుదీర్ఘంగా విచారణ చేసింది సీబీఐ. చివరకు ఆ కేసులో నిర్మలా యాదవ్ ఎటువంటి తప్పుచేయలేదని తేలడంతో ఆమెకు బిగ్ రీలీఫ్ లభించింది. తాజాగా సీబీఐ కోర్టు.. ఆమెను నిర్దోషిగా తేల్చి తీర్పును వెలువరించింది. 2008 జరిగిన ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా ఈరోజు(శనివారం) సీబీఐ కోర్టుకు హాజరైన ఆమె.. తీర్పు తర్వాత మాట్లాడారు. తనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, అందుకే ఇంతకాలం ఓపిక పట్టిన దానికి ప్రతిఫలం లభించిందన్నారు. ఒక జడ్జికి ఇవ్వబోయి.. మరొక జడ్జికి క్యాష్ డెలివరీఆ ఇదర్దు జడ్జి పేర్లు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి. ఒకరు నిర్మలా యాదవ్ అయితే మరొకకే నిర్మలాజిత్ కౌర్. అయితే హర్యానా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్ క్లర్క్.. ఓ రూ. 15 లక్షల నగదును ప్యాక్ చేసుకుని నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తాను ఇవ్వాల్సింది జస్టిస్ నిర్మలాజిత్ కౌర్ కని కాకపోతే పొరపాటున జస్టిస్ నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు ఆ ప్యాక్ తీసుకెళ్లిన అప్పటి క్లర్క్. రోజుల వ్యవధిలో ఆమెపై రెండు ఎఫ్ఐఆర్లుఈ కేసుకు సంబంధించి 2008, ఆగస్టు 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ తర్వాత మళ్లీ ఓ కీలక మలుపు తీసుకుంది. అప్పటి యూనియన్ టెర్రిటరీ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ ఆదేశాలతో ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు. దాంతో 12 రోజుల వ్యవధిలో సీబీఐ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.2009 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభంజస్టిస్ నిర్మలా యాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల్లో దర్యాప్తు చేపట్టేందుకు తమకు అనుమతి కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టుకు విజ్క్షప్తి చేసింది సీబీఐ. దీనికి అనుమతి లభించడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ పై విచారణ చేపట్టింది సీబీఐ. 2011లో ఆమెపై చార్జిషీట్ నమోదు చేసింది సీబీఐ.దీనిలో భాగంగా మొత్తం 84 మంది సాక్షులను పేర్లను నమోదు చేసింది. ఇందులో 69 మందిని విచారించిన సీబీఐ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 10 మంది సాక్షులను తిరిగి విచారించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే 10 మంది కీలక సాక్షులను మళ్లీ విచారించారు. చివరకు ఆ రూ. 15 లక్షల కేసులో జస్టిల్ నిర్మలా యాదవ్ పాత్ర ఏమీ లేదని తేలడంతో ఆమె నిర్దోషిగా నిరూపితమయ్యారు.

తెలుగువారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
తాడేపల్లి: రేపు తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.

గుజరాత్ రెండో వికెట్ డౌన్.. జోస్ బట్లర్ ఔట్
IPL 2025 MI vs GT live updates and highlights: ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి.గుజరాత్ రెండో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన బట్లర్.. ముజీబ్ ఉర్ రెహ్మన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(49), షారూఖ్ ఖాన్(0) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్..12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్(42), బట్లర్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. శుబ్మన్ గిల్ ఔట్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన గిల్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న గిల్, సుదర్శన్గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయిసుదర్శన్(32), శుబ్మన్ గిల్(32) దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు శుబ్మన్ గిల్(13), సాయిసుదర్శన్(13) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ

'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?'
అరుణాచల శివుడిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు. అరుణాచలం దర్శనానికి ముందు, దర్శనం తర్వాత.. అన్నంతగా జీవితం మారిపోతుందంటారు. విక్టరీ వెంకటేశ్, కిరణ్ అబ్బవరం.. ఇలా ఎందరో సెలబ్రిటీలు ఆ ప్రదేశాన్ని ఎంతగానో ఆరాధిస్తారు. తాజాగా హీరోయిన్ స్నేహ (Actress Sneha) కూడా అరుణాచలం వెళ్లింది. భర్త ప్రసన్నకుమార్తో కలిసి గిరిప్రదక్షిణ చేసింది. గిరి ప్రదక్షిణసూర్యుడు ఉదయించడానికి ముందే ముఖానికి మాస్కులు ధరించి భార్యాభర్తలిద్దరూ కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు. దారిలో ఎదురయ్యే ఆలయాల దగ్గర ఆగి కొబ్బరికాయలు కొడుతూ తర్వాత నడక సాగించారు. ఈ క్రమంలో తమకు ఎదురైన హిజ్రాలతో నవ్వుతూ ఫోటోలు కూడా దిగారు. అంతా బాగుంది కానీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వీళ్లిద్దరూ చెప్పులు, శాండిల్స్ ధరించారు. కాస్తయినా బుద్ధి లేదా?అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన భక్తులు, అభిమానులు స్నేహ దంపతులపై మండిపడుతున్నారు. కాళ్లకు చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడమేంటి? కొంచెమైనా బుద్ధి లేదా? ఇది మహాపాపం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం.. వారు తెలియక చేసుంటారని వెనకేసుకొస్తున్నారు.సినిమా- పర్సనల్ లైఫ్స్నేహ తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్గా రాణించింది. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హనుమాన్ జంక్షన్, వెంకీ, శ్రీరామదాసు, రాధాగోపాలం, పాండురంగడు, అమరావతి, రాజన్న, సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన డ్రాగన్ మూవీలో డాక్టర్గా అతిథి పాత్రలో కనిపించింది. ఇకపోతే స్నేహ కథానాయికగా సక్సెస్ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్న సమయంలోనే నటుడు ప్రసన్నకుమార్తో ప్రేమలో పడింది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక కుమారుడు, కూతురు జన్మించారు. AK Fan Boy Prasanna Sir and Sneha Mam went to Girivilam.Prasanna sir will be eyeing for huge success for his character in GBU.#Ajith#AjithKumar#GoodBadUgly#Prasanna#SnehaPrasanna pic.twitter.com/fxQWoQvNzS— Deepak Kaliamurthy (@Dheeptweet) March 28, 2025 చదవండి: బాలీవుడ్లో అంతా గొర్రెలే.. సౌత్ను చూసి నేర్చుకోండి: నటుడు

హైదరాబాద్లో రియల్ఎస్టేట్ పతనం
రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ప్రతికూల విధానాలు, ఆకాశాన్నంటిన ప్రాపర్టీ ధరలు.. కారణాలేవైనా.. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పల్టీలు కొడుతూ పతనమైపోతోంది. రెండేళ్ల క్రితం ఎన్నికలతో మొదలైన స్థిరాస్తి రంగం మందగమనం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో గ్రేటర్లో గృహ విక్రయాలు, లాంచింగ్స్ భారీగా తగ్గాయి. దేశంలోనే ఇళ్ల అమ్మకాలు, లాంచింగ్స్లో అత్యధిక క్షీణత మన నగరంలోనే ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (క్యూ1) 10,100 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2024 క్యూ1లో 19,660 సేల్ అయ్యాయి. ఏడాది కాలంలో విక్రయాలలో 49 శాతం తగ్గుదల నమోదయిందని అనరాక్ గ్రూప్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే నగరంలో 2025 క్యూ1లో కొత్తగా 10,275 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అదే 2024 క్యూ1లో 22,960 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో లాంచింగ్స్ 55 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే ఆశ్చర్యకరంగా నగరంలో కొత్తగా ప్రారంభమైన ఇళ్లలో లగ్జరీ గృహాలదే ఆధిపత్యం. గ్రేటర్లో కొత్త ఇళ్ల నిర్మాణాలలో రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ఇళ్ల వాటా 70 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇన్వెంటరీ 5 లక్షలపైనే.. ఏడు నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కాస్త తగ్గాయి. 2024 క్యూ1లో 5,80,890 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. 2025 క్యూ1 నాటికి 5,59,810కు క్షీణించాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం తగ్గింది. స్థిరమైన ఆర్థిక పరిస్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ కారణంగా దేశంలో గృహాల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో ప్రాపర్టీ ధరలు మాత్రం 17 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా ఎన్సీఆర్లో 34 శాతం, బెంగళూరులో 20 శాతం వృద్ధి చెందాయి.దేశంలోనూ సేమ్.. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ స్థిరాస్తి రంగం తిరోగమనంలోనే ఉంది. ఈ ఏడాది క్యూ1లో ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 28 శాతం, లాంచింగ్స్ 10 శాతం క్షీణించాయి. 2025 క్యూ1లో 93,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే గతేడాది క్యూ1లో 1,30,170 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇదే సమయంలో 7 నగరాల్లో 2025 క్యూ1లో 1,00,020 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2024లో 1,10,865 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే ఏడాదిలో 10 శాతం లాంచింగ్స్ క్షీణించాయి.లగ్జరీదే హవా.. లాంచింగ్స్లో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలే అత్యధికం. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ తరహా ఇళ్ల వాటా 42 శాతం ఉన్నాయి. ఆ తర్వాత రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే ప్రీమియం యూనిట్ల వాటా 27 శాతం, రూ.40–80 లక్షల ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్స్ వాటా 12 శాతంగా ఉన్నాయి.

విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్లో హెచ్చరించింది. వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.‘‘యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్ ఎక్చ్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్లైన్లో యాక్టివ్గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది.

ఆరోజు అన్నీ హామీలు అమలు చేయగలుగుతాం అనిపించింది
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: ఎన్నికల హామీల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్లేటు ఫిరాయించారు. సూపర్ సిక్స్ను ఎగ్గొట్టేందుకు ఈసారి కొత్త రాగం అందుకున్నారు. ఇందుకు మంగళగిరి ఇవాళ జరిగిన టీడీపీ ఆవిర్భావ సమావేశాలు వేదిక అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చాం. ఆరోజు బయట నుండి చూస్తే అన్నీ చేయగలుగుతాం అనిపించింది. నేను అనేకసార్లు చెప్పా. అభివృద్ధి జరగాలి.. సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అప్పులు చేసి సంక్షేమపథకాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయాం అంటూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో అప్పులపైనా మళ్లీ పచ్చి అబద్ధాలు చెప్పారాయన. రాష్ట్రానికి రూ. 9.75 లక్షల కోట్లు అప్పుందంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు యూటర్న్ వ్యాఖ్యలు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే మాట్లాడారాయన. ఇప్పుడు టీడీపీ సభలోనూ అమలు చేయలేకపోతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

ఆస్పత్రిలో ప్రసవ వేదనతో ఉండగా భూకంపం.. పాపం ఆ మహిళ..!
సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా..మరోవైపు పేషెంట్ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మరచిపోతున్న మానవత్వపు విలువను గుర్తుచేసేందుకు దేవుడి పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. థాయ్లాండ్, మయన్మార్లని శుక్రవారం రెండు భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతులం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంల నడుమ జరిగిన ఓ అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా థాయ్లాండ్లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో.. బ్యాంకాక్లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచర్పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్లోనే ఆస్పత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరిపోసుకుందంటూ ఓ వీడియోని షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. భూప్రకంపన నేపథ్యంలో మయ కింగ్ చులాలాంగ్కార్న్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్లు, వీల్చైర్లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్పై బయటకు తీసుకొచ్చి పార్క్లోనే డెలివిరీ చేశారు. ఆ పార్కులోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మయన్మార్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకి కానరాలేదని సమాచారం. ఏదీఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అంతా ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు. Footage during the earthquake in #Bangkok a baby was born in the park 😭 Waht a story to tell ‘’ I was born during the earthquake ‘’ #แผ่นดินไหว #earthquake #myanmarearthquake #bangkokearthquake #ตึกถล่ม pic.twitter.com/7E0FdzfPEf— Miia 🩵 (@i30199) March 28, 2025 (చదవండి: వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆది వరాహస్వామి ఆలయం..)

అయినను రాజకీయ భక్తులు నోరు విప్పరేం?
మనం ఎవరైనా.. ఏదో సందర్భవశాత్తు.. తప్పనిసరైతేనే అబద్దాలు చెబితే చెప్పవచ్చు. కానీ దైవసన్నిధికి వెళ్లినప్పుడు మాత్రం అలా అసత్యాలు చెప్పడానికి వెనుకాడతాం. రాజకీయ నేతలకు ఈ విషయంలో కూడా మినహాయింపే ఉన్నట్లు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు.. అంతా పవిత్రంగా భావించే తిరుమలను సైతం తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో విపక్షంలో ఉన్నప్పుడు కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాని ఆరితేరినట్లు కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు పురస్కరించుకుని తిరుమలకు వెళ్లినప్పుడు ఆయన చెప్పిన విషయాలలో అబద్దాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత భూమన వాదన విన్న తర్వాత తిరుమల యాత్ర సందర్భంగా కూడా అబద్దాలు చెబుతున్నారన్న విమర్శలకు సీఎం ఎందుకు ఆస్కారం ఇస్తున్నారనే భావన కలుగుతోంది. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే నీచత్వం చంద్రబాబు, పవన్లదని భూమన అన్నప్పుడు దానిని ఖండించవలసిన టీడీపీకాని, ప్రభుత్వంలోని వారు కాని అసలు పట్టించుకోలేదంటే దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి లేదనే అర్ధం అవుతుంది కదా!. 👉వైఎస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశాన్ని.. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా గోరంతలు కొండంతలు చేసి తిరుమల అపవిత్రం అయిపోతోందంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ ఆరోపణలు గుప్పించేవారు. వాటిలో అత్యధికం అసత్యాలే అనే సంగతి అప్పట్లోనే రుజువు అయ్యింది కూడా. కానీ జగన్ ప్రభుత్వానికి జరగవలసిన డామేజీ అప్పటికే జరిగిపోయింది. ఉదాహరణకు తిరుమలకు వెళ్లే బస్ల టిక్కెట్లపై అన్యమత ప్రచారం ఉందని, కొండపై శిలువ రూపంలో లైట్లు ఉన్నాయని.. ఇలా ఒకటేమిటి దారుణమైన అబద్దాలు ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా పోటీపడి ఈ అసత్యాలను జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేసేవి. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయిన ఈ పద్దతి మానుకున్నారా? అంటే లేదు. అదే ధోరణి అనుసరిస్తున్నారు. 👉చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అత్యంత ఘోరమైన అపచారం.. తిరుమల లడ్డూ విషయంలో చేశారు. కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు ఆరోపణ చేశారు. దానికి అదనంగా అయోధ్యకు పంపిన లడ్డూలలో కల్తీలడ్డూలు వెళ్లాయని దారుణమైన అబద్దాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. తీరా చూస్తే ఇవేవి నిజం కాదని వెల్లడైంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి సరఫరా అయితే దానిని టీటీడీ అధికారులు వెనక్కి పంపినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాంటప్పుడు జంతు కొవ్వు కలిసిన నెయ్యి లడ్డూలో ఎలా వాడతారన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. అలాగే అయోధ్యకు లడ్డూలను తయారు చేయించి పంపించింది ప్రస్తుతం టిటిడి సభ్యుడిగా ఉన్న సౌరబ్ బోరా అని తేలింది. ఆయన స్వచ్చమైన ఆవు నేయితో తయారు చేసిన లడ్డూలను పంపితే.. పవన్ కళ్యాణ్ మాత్రం తప్పుడు ఆరోపణ చేశారు. పోనీ ఆయన తన అభిప్రాయానికి కట్టుబడి బోరా పై ఏమైనా చర్య తీసుకోవాలని కోరారా? అంటే అదీ లేదు. ఇవన్నీ తిరుమలేషుని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం కాదా? అన్న ప్రశ్న వస్తే సమాధానం ఉండదు. చంద్రబాబు తాజా తిరుమల టూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఏడుకొండలను ఆనుకుని ఉన్న ప్రాంతం స్వామివారి సొంతం అని, అక్కడ ఓబెరాయ్ హోటల్కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి అభివృద్ది సంస్థ ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని మాత్రం కప్పిపెట్టారు. పైగా ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగానే ఎల్లో మీడియా రాయలసీమలోనే మొదటి సెవెన్ స్టార్ హోటల్ అంటూ ఊదరగొట్టింది. మొత్తానికి.. సాధువుల నిరసనలతో ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేవలోక్ ప్రాజెక్టు కు కేటాంచిన భూ అనుమతిని కూడారద్దు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టుకు 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వమే విల్లాలు,గదుల నిర్మాణం నిమిత్తం అనుమతి ఇచ్చింది. గతంలో అసెంబ్లీలో.. ఏడు కొండలు లేవు.. రెండు కొండలే ఉన్నాయని కొందరన్నారని మరో అసత్య వచనం చెప్పారు. దానిపై అప్పట్లో పోరాడనని చంద్రబాబు అంటున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు అబద్దమాడినట్ట్లు ఒకటికి పదిసార్లు రుజువు అయినా అదే అసత్యం చెబుతూ ఉంటారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడు కొండలను దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో జి,ఓ.746 ఇచ్చారని ప్రస్తుత ఈఓ శ్యామలరావు హైకోర్టులో వేసిన ఒక అఫిడవిట్లో తెలిపారు. 👉ఒక వదంతిని సృష్టించడం, దానిని నిజమని ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన గురించి తెలిసినవారు వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని ఒకసారి , దానిని కొనసాగిస్తామని మరోసారి చెబుతున్నారు. ఇది కాకుండా కొత్తగా ఆలయాల నిర్మాణం కోసం ఇంకో ట్రస్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజానికి శ్రీవాణి ట్రస్టు ను ఏర్పాటు చేసింది టీడీపీ హయాంలోనే అట. దానిని వైఎస్సార్సీపీ హయాంలో సమర్ధంగా నిర్వహించి విదేశాలలో, దేశ వ్యాప్తంగా 3600 దేవాలయాలను నిర్మించిందని భూమన చెప్పారు. అనేక చోట్ల కళ్యాణోత్సవాలను కూడా జరిపించారు. ఇది వాస్తవమా?కాదా?.. ఇప్పుడేదో కొత్తగా దేశంలో టీటీడీ(TTD) తరపున ఆలయాలు నిర్మించబోతున్నట్లు బిల్డప్ ఇవ్వడం అవసరమా?. నిజంగానే శ్రీవాణి ట్రస్టు ను రద్దు చేసి ఆ నిధులను టీటీడీ సాధారణ నిధులలోకి తీసుకువస్తే రూ. 600 కోట్ల జీఎస్టీని చెల్లించవలసి వస్తుందని భూమన చెప్పారు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఈ ట్రస్టును రద్దు చేసి మరో కొత్త ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారో తెలియదు. గతంలో శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు ఆరోపించేవారు. అది నిజం కాదని పరోక్షంగా ఆయన అంగీకరిస్తున్నారనుకోవాలి. ఇక.. తిరుమలకు నీటి కొరత రాబోతోందని, ఆలయం మూసివేయాలని ఒక అధికారి తనతో చెప్పారంటూ చంద్రబాబు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ అధికారి పేరు ఎందుకు చెప్పలేదు. నిజంగానే నీటి సమస్య వస్తే భక్తులను కొండపైకి రాకుండా ఆపుతారేమో కాని, స్వామివారి నిత్య కైంకర్యాలను ఆపి ,ఆలయాన్ని మూసివేయడం ఎక్కడైనా జరుగుతుందా? అనేదానికి జవాబు దొరకదు. ఆఖరికి సెంటిమెంట్ విషయాలలో కూడా చంద్రబాబు ఇలా మాట్లాడడమేమిటో అర్ధం కాదు. గతంలో అప్పటి ఈఓ ధర్మారెడ్డి తనయుడు ఆకస్మికంగా చనిపోతే.. కర్మకాండ ముగిసిన తర్వాత ఆయన ఆలయానికి వస్తే దానిని తప్పుపడుతూ ఆలయాన్ని అపవిత్రం చేస్తారా? అని చంద్రబాబు, పవన్లు అన్నారన్న సంగతిని భూమన ప్రస్తావించారు. మరి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించి నెలలు తిరగకముందే.. చంద్రబాబు కుటుంబం తిరుమలకు ఎలా వస్తారని, ఇది అపవిత్రం కాదా? అని భూమన ప్రశ్నించారు.దీనికి చంద్రబాబు లేదంటే ఆయన తరపున టీటీడీ వాళ్లైనా జవాబు ఇవ్వాలి కదా!. కిక్కురుమన్నట్లు లేదు. అంతేకాదు.సోషల్ మీడియాలో ఒక ఫొటోతో కూడా వ్యాఖ్య ఒకటి కనిపించింది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్లినప్పుడు స్పూన్ తో ప్రసాదం స్వీకరించడాన్ని కూడా ఆక్షేపించి తమ రాజకీయ అవసరాలకోసం చంద్రబాబు వాడుకున్నారట. మరి అదే చంద్రబాబు తన మనుమడితో పాటు స్పూన్ తోనే ప్రసాదం తీసుకుంటున్న ఫోటో కనిపించింది. నిజానికి ఇది పెద్ద అంశం కాదు. కాని చంద్రబాబు దేనినైనా రాజకీయం చేయగలరని.. తనవరకు వస్తే మాత్రం ఏమి జరగనట్లే ఉంటారని చెప్పడానికే ఇలాంటి నిదర్శనాలు అవుతాయి. పాపనాశనం రిజర్వాయిర్లో బోటింగ్ పెట్టారట. అదే జగన్ టైంలో పెట్టి ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎంత గగ్గోలు పెట్టేవో?. ఇప్పుడేమో వివాదం అయ్యేసరికి అధికారులు ఏవో సాకులు చెబుతున్నారు. తిరుమల అదనపు ఈవో అచ్చంగా రాజకీయవేత్త మాదిరి.. స్థానికంగా వైఎస్సార్సీపీ అభిమానులన్న అనుమానంతో చిరువ్యాపారులను బెదిరిస్తున్నారట. సామాన్యులకే స్వామివారి దర్శనంలో ప్రాధాన్యత అని చంద్రబాబు,పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు ఊదరగొడుతుంటారు. కాని ఆచరణలో మాత్రంఅందుకు భిన్నంగా ప్రస్తుతం రోజుకు ఎనిమిదివేల మందికి వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారట. వీటిలో అత్యధికం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందట. దాంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండవలసి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు. ఇక ఆలయాల కూల్చివేతలు, మఠాల భవనాల ధ్వంసం చేయడం వంటివి జరుగుతున్నా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు నోరు విప్పి మాట్లాడం లేదు. హిందూ మత ఉద్దారకులమని ప్రచారం చేసుకునే బీజేపీ సైతం వీటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. మతాన్ని,దైవక్షేత్రాలను రాజకీయాలకు వాడుకుంటున్న వీరికి నిజంగా భక్తి ఉందా? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. వీరు అపర భక్తులా? లేక రాజకీయ భక్తులా అంటే ఏమి చెబుతాం?.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
బ్యాంకులకు రంజాన్ సెలవు లేదా?
టీనేజ్ లవ్ స్టోరీ మధురం.. రిలీజ్ ఎప్పుడంటే?
శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు
డొక్కా సీతమ్మగా ఆమని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
అరుదైన శస్త్ర చికిత్సతో వృద్ధుడి గుండె పదిలం
కొత్త ఏడాది.. తెలివైన పెట్టుబడి
కాటమరాజు తిరునాళ్లు.. భక్తులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
చరణ్ బర్త్డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్
గుజరాత్ రెండో వికెట్ డౌన్.. జోస్ బట్లర్ ఔట్
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్కు చెంపపెట్టు
పదో తరగతి సోషల్ పరీక్ష వాయిదా
ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
IPL 2025: భువీ వరల్డ్ రికార్డు
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
ఈవీఎంలు లేకపోతే ఇదే పరిస్థితి.. లాభం లేదు వచ్చే ఎన్నికలను ఉపగ్రహం నుండి మేనేజ్ చేద్దాం సార్
నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్లు దానం
'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?'
పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
బ్యాంకులకు రంజాన్ సెలవు లేదా?
టీనేజ్ లవ్ స్టోరీ మధురం.. రిలీజ్ ఎప్పుడంటే?
శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు
డొక్కా సీతమ్మగా ఆమని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
అరుదైన శస్త్ర చికిత్సతో వృద్ధుడి గుండె పదిలం
కొత్త ఏడాది.. తెలివైన పెట్టుబడి
కాటమరాజు తిరునాళ్లు.. భక్తులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
చరణ్ బర్త్డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్
గుజరాత్ రెండో వికెట్ డౌన్.. జోస్ బట్లర్ ఔట్
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్కు చెంపపెట్టు
పదో తరగతి సోషల్ పరీక్ష వాయిదా
ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
IPL 2025: భువీ వరల్డ్ రికార్డు
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
ఈవీఎంలు లేకపోతే ఇదే పరిస్థితి.. లాభం లేదు వచ్చే ఎన్నికలను ఉపగ్రహం నుండి మేనేజ్ చేద్దాం సార్
నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్లు దానం
'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?'
పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
సినిమా

‘ఓరీ’ దేవుడా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు మేనేజర్!
ఓరీ(Orry) అలియాస్ ఓర్హాన్ అవత్రమని.. ఈ పేరు బాలీవుడ్తో పాటు సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి బాగా తెలుసు. బాలీవుడ్ తారల పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ నిలిస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. జాన్వీ కపూర్, అనన్య పాండే, సుహానా ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ కిడ్స్ పార్టీల్లో మనోడు కచ్చితంగా ఉండాల్సిందే. ఇలా స్టార్స్తో కలిసి తిరుగడంతో మనోడికి కూడా ‘స్టార్’ హోదా వచ్చేసింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేంది. ఇన్స్టాలో ఏ పోస్ట్ పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ఈ సోషల్ మీడియా సంచలనం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇతని మేనేజర్గా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పని చేస్తోంది. ఆమె ఎవరో కాదు ‘ఖడ్గం’ఫేం కిమ్ శర్మ(kim sharma).కిమ్ శర్మ తన కెరీర్ను మోడల్గా ప్రారంభించి, 2000లో 'మొహబ్బతేన్' చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు సినిమా 'ఖడ్గం' (2002)లో నటించి మంచి పేరు సంపాదించింది. అయితే, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఈ అందాల తార సినీ పరిశ్రమకు వీడ్కోలు పలికింది. ఆ తర్వాత ఆమె బిజినెస్ రంగంలోకి ప్రవేశించి, ప్రస్తుతం ధర్మ కార్నర్స్టోన్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ సోషల్ మీడియా స్టార్ ఓరీకి సంబంధించినది. కిమ్ శర్మ తన చాకచక్యంతో ఓరీ నికర విలువను రూ. 10 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. ఒకప్పటి హీరోయిన్ నుంచి మేనేజర్గా స్థానం మార్చుకున్న ఆమె జీవన ప్రస్థానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మల మధ్య బ్రేకప్ అంటూ గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో విజయ్ వర్మ (Vijay Varma) తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సంబంధంలో కోపం, బాధ, సంతోషం, చిరాకు వంటి భావోద్వేగాలన్నీ అనుభవించాలని, వాటిని స్వీకరించడం ద్వారానే ఆ బంధాన్ని సంతోషమయం చేసుకోవచ్చని అన్నారు. "రిలేషన్షిప్ను ఐస్క్రీమ్ లాగా ఆస్వాదించాలి. అప్పుడే నీవు సంతోషంగా ఉంటావు" అని విజయ్ పేర్కొన్నారు.మరోవైపు, తమన్నా కూడా ప్రేమపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రేమను వ్యాపార లావాదేవీలా చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయి. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్నప్పుడే నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను" అని ఆమె అన్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తే, వీరు విడిపోయారనే వార్తలు నిజమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్లో తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. అంతేకాక, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వెల్లడించారు. కానీ, ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్రతిపాదించగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత చూపలేదట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని, కెరీర్పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బ్రేకప్ గురించి వీరిద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆ సినిమా క్లోజింగ్ కలెక్షన్లకు దగ్గరగా 'మ్యాడ్ స్క్వేర్' డే-1 నంబర్స్
మ్యాడ్ స్క్వేర్(Mad Square) సినిమాతో థియేటర్స్లో నవ్వులు పూయించిన మ్యాడ్ గాంగ్.. బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా మార్చి 28 సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.మ్యాడ్ స్క్వేర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద రూ. 20.8 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని తెలిపింది. సినిమా విడుదల సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మ్యాడ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లకు దగ్గరగా మ్యాడ్ స్క్వేర్ మొదటిరోజు కలెక్షన్లు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఆయన మాటే నిజం అయిందని నెటిజన్లు అంటున్నారు. 2023లో విడుదలైన మ్యాడ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు రూ. 26 కోట్లు అని తెలిసిందే. (ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ)ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీనే ఉంది. లూసిఫర్-2, వీర ధీర శూర, రాబిన్ హుడ్ వంటి సినిమాలు థియేటర్స్లో ఉన్నాయి. ఇలాంటి పోటీ సమయంలోనూ మ్యాడ్ స్క్వేర్ భారీ ఓపెనింగ్స్ని రాబట్టింది. మ్యాడ్ పార్ట్-1 కోసం రూ. 8 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తే రూ. 26 కోట్లు రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్ కోసం రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, మొదటిరోజే మ్యాడ్ స్క్వేర్ రూ. 20.8 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
టాలీవుడ్లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో చాలా సినిమాల్లో అభినయకు ఛాన్సులు వచ్చాయి.త్వరలో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నానని కాబోయే భర్తతో కలిసి గుడిగంట కొడుతోన్న ఫొటోను అభినయ పంచుకుంది. ఈ క్రమంలోనే మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్లు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఆమె ఫోటోలు షేర్ చేసింది. అతని పేరు 'సన్నీ వర్మ' అని తెలిపింది. ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు, భవనాలు, నీటిపారుదల, ఎలక్ట్రికల్, మైనింగ్, రైల్వేల నిర్మాణంలో భాగమైన ఒక అంతర్జాతీయ సంస్థలో అతను పనిచేస్తున్నట్లు సమాచారం.కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ తన ప్రేమను మొదటిసారి ఇలా రివీల్ చేసింది. 'నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్లో ఉన్నాను. 15 ఏళ్లుగా మా మధ్య బంధం ఉంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నా వ్యక్తిగత విషయం ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా అతనితో పంచుకోగలను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
ఐపీఎల్-2025లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖాముఖి పోటీలో సీఎస్కేదే పైచేయి అయినా.. ఈసారి మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. చెన్నై కంచుకోటను బద్దలు కొట్టి 2008 తర్వాత మొదటిసారి చెపాక్లో జయకేతనం ఎగురవేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి (Virat Kohli- 31) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్(14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) రాణించారు.ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మతీశ పతిరణకు రెండు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితం కావడంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. Back 2️⃣ back wins! 🔥Chat, how are we feeling? 🤩pic.twitter.com/8xT6VaS7hf— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025 చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.జడేజాతో ముచ్చట్లుఇదిలా ఉంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి.. చెన్నై స్టార్ రవీంద్ర జడేజాతో కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో కోహ్లి కాస్త సీరియస్గా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. జడ్డూ మాత్రం నవ్వులు చిందించాడు. ఇంతలో అక్కడికి చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ రాగానే కోహ్లి మరింత సీరియస్ అయినట్లు కనిపించింది. అతడితో వాదనకు దిగిన కోహ్లి.. ఖలీల్ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూనే కనిపించాడు.కోహ్లి చేయి పట్టుకుని మరీ ఖలీల్ అతడిని అనునయించేందుకు ప్రయత్నించగా.. అతడు మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. ఇంతలో కోహ్లికి డ్రెస్సింగ్రూమ్ నుంచి పిలుపు రావడటంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’కాగా చెన్నై బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఖలీల్.. ఆర్సీబీ ఇన్నింగ్స్లో మూడో ఓవర్ కూడా తానే వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే కోహ్లిని ఎల్బీడబ్ల్యూ(లెగ్ బిఫోర్ వికెట్) చేసినట్లుగా భావించిన ఖలీల్.. సంబరాలు మొదలుపెట్టేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు.అయితే, అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని ఖలీల్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లాడు. కానీ అక్కడ చెన్నైకి విరుద్ధంగా థర్డ్ అంపైర్ తీర్పు వచ్చింది. బంతి లెగ్ స్టంప్ ఆవలి దిశగా పిచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో కోహ్లి సేవ్ అవ్వగా.. సీఎస్కే ఓ రివ్యూను కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇదే విషయమై ఖలీల్తో సీరియస్గా చర్చించి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! Kohli mere bacche shant hoja 😭😭 pic.twitter.com/yGITzOsOXr— n (@humsuffer_) March 29, 2025

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
పాకిస్తాన్తో మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్పై 73 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ మహ్మద్ అబ్బాస్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అరంగేట్ర మ్యాచ్లోనే అబ్బాస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు.తొలుత బ్యాటింగ్లో దుమ్ములేపిన అబ్బాస్.. అనంతరం బౌలింగ్లో ఓ కీలక వికెట్ కూడా పడగొట్టాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన అబ్బాస్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అబ్బాస్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.వన్డే అరంగేట్రంలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అబ్బాస్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా అల్రౌండర్ కృనాల్ పాండ్యా పేరిట ఉండేది. కృనాల్ పాండ్యా 2021లో ఇంగ్లండ్పై తన వన్డే అరంగేట్రంలో 26 బంతుల్లో ఆర్ధశతకం సాధించాడు. తాజా మ్యాచ్లో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అబ్బాస్.. పాండ్యా ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా కివీస్ తరుపన డెబ్యూచేసిన అబ్బాస్.. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆటగాడు కావడం గమనార్హం.చాప్మన్ సూపర్ సెంచరీ..ఇక ఈమ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్మన్ (111 బంతుల్లో 132; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. అతడితో నపా డారిల్ మిచెల్ (84 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు.పాక్ బౌలర్లలో ఇర్ఫాన్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రౌఫ్, జావిద్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 44.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజం(76) టాప్ స్కోరర్గా నిలవగా.. మొహమ్మద్ రిజ్వాన్ (30), సల్మాన్ అఘా (58) పర్వాలేదన్పించారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. డఫీ రెండు, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు.చదవండి: MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి!

అసాధారణ విజయాలు.. మేమంతా అందుకు అర్హులమే: రోహిత్ శర్మ
గత ఏడాది కాలంలో తాము అద్భుత విజయాలు సాధించామని.. ఇందుకు 2022లోనే పునాది పడిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. నాటి టీ20 ప్రపంచకప్ టోర్నీలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో సత్తా చాటామని పేర్కొన్నాడు. పరాజయాలకు పొంగిపోకుండా.. తమ బలాన్ని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు.ఎన్నో ఎత్తుపళ్లాలుఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశామని.. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు గెలవడం ఆటగాళ్ల అంకితభావానికి నిదర్శనమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కెప్టెన్గా రోహిత్ శర్మ, హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, మరుసటి ఏడాది నుంచి భారత జట్టు రాత మారిపోయింది. సొంతగడ్డపై అజేయంగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై మాత్రం తడబడింది. ఇక ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ఈ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు.పరాజయమన్నదే లేకుండా దూసుకుపోయి చాంపియన్గా అవతరించింది. అనంతరం ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఇదే తరహాలో టైటిల్ సాధించింది. లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచిన టీమిండియా.. సెమీస్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీ సాధించింది.అప్పుడే మాకు స్పష్టత వచ్చింది..ఈ జ్ఞాపకాలను తాజాగా నెమరు వేసుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ‘‘2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్లో మేము సెమీస్లోనే ఓడిపోయాం. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అప్పుడే మాకో స్పష్టత వచ్చింది.జట్టులోని ప్రతి సభ్యుడి నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో చెప్పాము. జట్టులో వారి పాత్ర ఏమిటో వివరించాం. అప్పటి నుంచి మా జట్టు దృక్పథం మారిపోయింది. పరాజయాలకు కుంగిపోకుండా.. మరింత గొప్పగా కమ్బ్యాక్ ఇచ్చాము.ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి మా సత్తా ఏమిటో చూపించాం. కాబట్టి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. వరుస ఐసీసీ టోర్నమెంట్లలో 24 మ్యాచ్లకు గానూ 23 గెలవడం అసాధారణ విషయం.మేమంతా అందుకు అర్హులమేమేము దానిని సాధ్యం చేసి చూపించాం. బయటి నుంచి చూసే వాళ్లకు కూడా ఇది బాగానే అనిపిస్తుంది. కానీ మేము ఇందుకోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. మూడు పెద్ద టోర్నమెంట్లలో జట్టు సాధించిన ఈ విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఈవెంట్లలో ఆడిన ప్రతి ఒక్క ఆటగాడు అన్ని రకాల గౌరవాలకు అర్హుడు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.కాగా ఐపీఎల్-2025లోనూ రోహిత్ ముంబైకే ఆడుతున్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై.. శనివారం నాటి పోరులో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians)

ఈ ఆర్సీబీకి ఏమైంది.. వరుసగా మ్యాచ్లు గెలిచేస్తుంది.. టైటిల్ కూడా గెలుస్తుందా ఏంది..?
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ గత 17 సీజన్లతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు తొలి మ్యాచ్ నుంచే విజయాల బాట పట్టింది. సాధారణంగా ఆర్సీబీ తొలి మ్యాచ్లను పెద్దగా పట్టించుకోదు. ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరిన ప్రతిసారి ఆఖరి మ్యాచ్ల్లోనే విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీ వరుసగా కేకేఆర్, ముంబై ఇండియన్స్పై విజయాలు నమోదు చేసింది. ఈ రెండు విజయాలు ప్రత్యర్థుల అడ్డాలో రావడం మరింత ప్రత్యేకం. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ను ఆర్సీబీ ఈడెన్ గార్డన్స్లో ఓడించింది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కేను 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్లో మట్టికరిపించింది.ఈ సీజన్లో ఆర్సీబీ జట్టుగా కూడా బలంగా కనిపిస్తుంది. గత సీజన్లలోలా ఒకరిద్దరిపై ఆధారపడినట్లు కనిపించడం లేదు. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కామ్గా ఉంటూ ఆశ్చర్యకర రీతిలో వ్యూహాలు పన్నుతుకున్నాడు. పాటిదార్ కెప్టెన్సీ కూడా ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుపును సూచిస్తుంది. పాటిదార్ వ్యక్తిగతంగా కూడా రాణించడం ఆర్సీబీకి మరో శుభ సూచకం. ఈ సీజన్లో ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్ల్లో పాటిదార్ చాలా మూల్యమైన ఇన్నింగ్స్లు ఆడాడు. పాటిదార్ బలంగా షాట్లు ఆడుతూ స్పిన్నర్లను బెంబేలెత్తిస్తున్నాడు. పాటిదార్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. ఆర్సీబీ ఈసారి ఖచ్చితంగా అద్భుతం చేస్తుంది.ఈ సీజన్లో ఆర్సీబీకి మరో శుభ సూచకం హాజిల్వుడ్ ఫామ్. హాజిల్వుడ్ ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్ల్లో అతడు కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు మ్యాచ్ల్లో హాజిల్వుడ్ ఆదిలోనే వికెట్లు తీసి ప్రత్యర్ధులను డిఫెన్స్లో పడేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీకి లభించిన మరో ఎక్స్ ఫ్యాక్టర్ ఫిల్ సాల్ట్. సాల్ట్ ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడి జట్టుకు బలమైన పునాది వేశాడు. తొలి మ్యాచ్లో అర్ద సెంచరీతో మెరిసిన విరాట్.. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ పర్వాలేదనిపించాడు.తొలి మ్యాచ్లో తన స్పిన్ బౌలింగ్తో అద్బుతం చేసిన కృనాల్ పాండ్యా కూడా ఈ సీజన్లో ఆర్సీబీకి టైటిల్ అందించేలా ఉన్నాడు. దేవ్దత్ పడిక్కల్, జితేశ్ శర్మ కూడా లైన్లోకి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ మరింత పటిష్టంగా తయారవుతుంది. విదేశీ విధ్వంకర వీరులు లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్ తమ సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ సీజన్లో టైటిల్ గెలవకుండా ఆర్సీబీని ఎవ్వరూ ఆపలేరు. ఆర్సీబీలో దేశీయ బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. భువనేశ్వర్ కుమార్ చేరిక ఆర్సీబీ పేస్ విభాగానికి మరింత ఊపునిచ్చింది. యశ్ దయాల్ సీఎస్కేతో మ్యాచ్లో ఒకే ఒవర్లో రెండు వికెట్లు తీసి మంచి టచ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. స్పిన్నర్ సుయాశ్ శర్మ తొలి మ్యాచ్లో మ్యాజిక్ చేశాడు. సీఎస్కేతో మ్యాచ్లో సుయాశ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా ఆర్సీబీ ఈ సీజన్లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ప్రతి సీజన్కు ముందు ఈ సాలా కప్ నమ్మదే అని డప్పు కొట్టుకునే ఆర్సీబీ ఫ్యాన్స్ గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువగా హడావుడి చేయడం లేదు. ఇదీ ఓ రకంగా ఆర్సీబీ టైటిల్ గెలుపుకు సూచకంగా తీసుకోవచ్చు. అన్నిటి కంటే ఎక్కువగా ఈ సారి అంకెల కో ఇన్సిడెన్స్ ఆర్సీబీకి కలిసొస్తుందేమో అనిపిస్తుంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ సంఖ్య కూడా పద్దెనిమిదే కావడం విశేషం. మరి 18 సీజన్ ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ సీజన్ అవుతుందో లేదో వేచి చూడాలి.
బిజినెస్

రెస్టారెంట్ సర్వీసుల్లో జీఎస్టీపై స్పష్టత
న్యూఢిల్లీ: రెస్టారెంట్ల సర్వీసులపై విధించే జీఎస్టీపై కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) స్పష్టతనిచ్చింది. రోజుకు రూ.7,500 పైగా గది అద్దెను వసూలు చేసే హోటళ్లలో, రెస్టారెంటు సర్వీసులపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో (ఐటీసీ) 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. అంతకన్నా తక్కువ అద్దె ఉండే హోటళ్లలో ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ యథాతథంగా కొనసాగుతుందని వివరించింది. దీనికి క్రితం ఆర్థిక సంవత్సరం వసూలు చేసిన అద్దె ప్రాతిపదికగా ఉంటుంది.

రైల్వే టికెట్ కౌంటర్లో కొన్నా.. ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు
రైల్వే టికెట్లను.. రైల్వే కౌంటర్లలో కొనుగోలు చేస్తే ఆన్లైన్లో IRCTC వెబ్సైట్ ద్వారా లేదా 139కి కాల్ చేసి రద్దు చేసుకోవచ్చు. అయితే టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్న తరువాత రీఫండ్ కోసం రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ కొత్త చొరవ వల్ల ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి ప్రత్యేకించి స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది లక్షలాది మంది రైలు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుందని అన్నారు.ఈ-టిక్కెట్లకు బదులుగా కౌంటర్ల నుంచి వెయిటింగ్ టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు రైలు బయలుదేరే ముందు స్టేషన్కు వెళ్లి టిక్కెట్లను రద్దు చేసుకోవాలా?.. అని బీజేపీ ఎంపీ మేధా విశ్రామ్ కులకర్ణి అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ పై విధంగా సమాధానం ఇచ్చారు.ఇదీ చదవండి: మస్క్ కీలక నిర్ణయం.. ఏఐ స్టార్టప్కు X అమ్మకం!గతంలో ప్రయాణికులు టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి, డబ్బు వాపసు తీసుకోవడానికి రైల్వే కౌంటర్లకు తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీనికోసం ప్రయాణికులు సమయాన్ని వృధా చేయాల్సి వచ్చేది. కొత్త ఆన్లైన్ టిక్కెట్ రద్దు వ్యవస్థ భారతీయ రైల్వే వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియను చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ముకేశ్ అంబానీ రూ.1000 కోట్ల ప్రైవేట్ జెట్ ఇదే..
భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారని అందరికీ తెలుసు. వీరు విలాసవంతమైన నివాసంలో ఉంటూ.. ఖరీదైన కార్లను ఉపయోగిస్తుంటారు. ఇవి కాకుండా ఈయన వెయ్యి కోట్ల రూపాయల ఓ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారు.ముకేశ్ అంబానీ కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ బోయింగ్ 737 మ్యాక్స్ 9. దీని విలువ రూ.1000 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన విమానం భారతదేశంలోని ఏ వ్యాపారవేత్త దగ్గరా లేదు. దీంతో అత్యంత ఖరీదైన విమానం కలిగిన వ్యాపారవేత్తగా అంబానీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.బోయింగ్ 737 మ్యాక్స్ 9 ప్రైవేట్ జెట్ను.. వాషింగ్టన్లోని రెంటన్లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేసి ఇండియాకు డెలివరీ చేశారు. బోయింగ్ చుట్టూ ఉన్న వివాదాల కారణంగా డెలివరీ కాస్త ఆలస్యం అయింది. మొత్తానికి అంబానీ భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9 యజమానిగా నిలిచారు.ఇదీ చదవండి: అమాంతం పెరిగిపోతున్న బంగారం ధరలు: నాలుగు రోజుల్లో..బోయింగ్ 737 మ్యాక్స్ 9 ప్రైవేట్ జెట్ను ముకేశ్ అంబానీ ప్రేత్యేకంగా తయారు చేసుకున్నారు. ఈ జెట్ మాత్రమే కాకుండా.. బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ERJ-135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900 వంటి తొమ్మిది ప్రైవేట్ విమానాలు అంబానీ వద్ద ఉన్నాయి.

రియల్టీ లావాదేవీల్లో సీబీఆర్ఈ టాప్
న్యూఢిల్లీ: గతేడాది అత్యధిక స్థాయిలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ లావాదేవీల నిర్వహణతో సీబీఆర్ఈ అగ్రస్థానంలో నిలిచింది. ఎంఎస్సీఐ రియల్ అసెట్స్ ప్రకారం 2024లో 63.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. కీలకమైన పారిశ్రామిక (68.7 శాతం), రిటైల్ (64.1 శాతం) తదితర విభాగాల్లోనూ అగ్రగామిగా నిలి్చంది.పెట్టుబడులకు సంబంధించి ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ టాప్ హబ్లుగా (చెరి 23 శాతం) నిలవగా, బెంగళూరు (18 శాతం), చెన్నై (10 శాతం), హైదరాబాద్ (8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మార్కెట్ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సీబీఆర్ఈ ఇండియా ఎండీ (క్యాపిటల్ మార్కెట్స్, ల్యాండ్) గౌరవ్ కుమార్ తెలిపారు.మరోవైపు అంతర్జాతీయంగాను కమర్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు విక్రయాల్లో 22 శాతం మార్కెట్ వాటాతో సీబీఆర్ఈ నంబర్ 1 ర్యాంకులో కొనుసాగుతోంది. ఆదాయాన్ని అందించే ప్రాపర్టీలను కొనుగోలు, చేసి విక్రయించే ప్రక్రియను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సేల్స్గా వ్యవహరిస్తారు.ఆఫీస్ బిల్డింగ్లు, రిటైల్ స్పేస్లు, హోటళ్లు, స్థలం లాంటి రియల్ ఎస్టేట్ అసెట్లు అద్దె రూపంలో ఆదాయాన్ని అందిస్తాయి. అలాగే వాటి విలువ కూడా పెరుగుతుంది. సీబీఆర్ఈ లాంటి సంస్థలు ఈ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలివ్వడం, లావాదేవీలను నిర్వహించడం, కొనుగోలుదారులు–విక్రేతలను అనుసంధానించడం ద్వారా పెట్టుబడులు, విక్రయాల్లాంటి విషయాల్లో తోడ్పాటు అందిస్తాయి.
ఫ్యామిలీ

పరిస్థితులు ఎలా ఉన్నా గెలవడం అంటే ఇదే..! వైరల్గా ఆనంద్ మహీంద్రా పోస్ట్
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకంటూటారు. అవి యువతకే కాదు, ఉద్యోగులకు, సాధారణ గృహిణులకు స్థైర్యాన్ని, స్పూర్తిని అందించేలా ఉంటాయి. మనకే ఇంత పెద్ద కష్టం ఏమో!.. అనే అజ్ఞానం నుంచి బయటపడేసేలా ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈసారి కూడా ఆనంద్ అలాంటి స్ఫూర్తిని కలిగించే వీడియోని షేర్చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే స్టోరీ ఇదీ..!.సమస్యలనేవి వస్తూనే ఉంటాయి. అయితే అవి ఏ రూపంలో వచ్చినా మనం ధైర్యం, ఆశ కోల్పోకూడదు. అదే చెబుతోంది ఈ రాజ్కుమార్ దాబీ గాథ. అతడు మహీంద్రా గ్రూప్ ఉద్యోగి. సేల్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతను 2014లో కంటిశుక్లంకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. దాంతో అప్పటి నుంచి నెమ్మదినెమ్మదిగా దృష్టిని కోల్పోవడం ప్రారంభించాడు. అలా ఇప్పుడాయన 5% దృష్టిని మాత్రమే కలిగి ఉన్నారు. అయినా ఆయన అధైర్యపడలేదు. అపుడెలా ఉద్యోగంలో డైనమిక్గా పనిచేశారో అలానే దూసుకుపోతున్నారు. తన సహోద్యోగులతో సమానంగా పనిచేస్తారాయన. ఆ టైంలో కూడా ఆయన సుమారు 5 మందికి పైగా తన విభాగంలో శిక్షణ ఇచ్చారు. అతడి సీనియర్ ఉద్యోగులు సైతం రాజ్కుమార్ దాబీ విల్పవర్కి అబ్బురపడటమే కాదు అతడి పనిని మెచ్చుకుంటున్నారు కూడా. అంతేగాదు అతను ఇలాంటి స్థితిలో కూడా మంచిగా అమ్మకాలు జోరందుకునేలా చేశాడని చెబుతున్నారు వారంతా. అతడు కంపెనీని తన కుటుంబంలా భావించి..వర్క్ గురించి తన కింద ఉద్యోగులకు తర్ఫీదు ఇస్తాడు. ఫలితంగా అతడు వాళ్ల నుంచి ప్రేమ ఆప్యాయతలో కూడిన ప్రోత్సహాం అందుకుంటాడు. అందువల్లే అతడు ఈ ఆకస్మిక వైకల్యాన్ని అధిగమించి ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. అతడు తనకు సడెన్గా వచ్చిపడిన ఈవైకల్యానికి చింతిస్తూ కూర్చోలేదు. కేవలం పరిష్కారం దిశగా, తాను చేయగలిగే పనిపై దృష్టిసారించాడు. అదే అతడిని తన ఉద్యోగంలో యథావిధిగా కొనసాగిలే చేసింది. పని అనేది తన అభిరుచిగా భావించి చేసేవారికి తిరిగే ఉండదు అనేందుకు రాజ్కుమార్ దాబీనే ఉదాహరణ. ఆ వ్యక్తి తన కంపెనీలో సహోద్యోగిగా కొనసాగడం గర్వంగా భావిస్తున్నా అంటూ అతడికి సంబంధించిన వీడియోని కూడా జత చేసి పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. నెటిజన్లు కూడా ఇది స్పూర్తిదాయకమైన కథ, కార్యాలయంలో గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో ఇతడిని చూస్తే క్లియర్గా తెలుస్తుందని కొందరూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదు, అదే మనల్ని ముందుకు సాగేలా ధైర్యం అందిస్తుంది అంటూ పోస్టులు పెట్టారు. Often, the #MondayMotivation you need is right next to you, on your home turf…Dhanyavaad, Thank you, Rajkumar Dabi, for making me so proud to be your colleague. You inspire us every single day…pic.twitter.com/2UcBnqQxjc— anand mahindra (@anandmahindra) March 24, 2025 (చదవండి: 'విల్పవర్' అంటే ఇది..ఏకంగా వీల్చైర్తో బంగీ జంప్..! వీడియో వైరల్)

వేసవిలో డీ హైడ్రేషన్ కట్టడికి కొబ్బరి నీరే తప్పనిసరా..?
సమ్మర్ వచ్చేస్తుందంటేనే భయం వేస్తుంది. ఉక్కపోతాలు, సూర్యుడి భగభగలు తలుచుకుంటే వామ్మో..! అనిపిస్తుంది. ఆఖరికి వండిన ఏ వంటకాలు నిల్వ ఉండవు. మధ్యాహ్నా 12 దాటితే బయటకు అగుపెట్టే ఛాన్సే లేదన్నంత వేడి సెగలు. ఎంత నీడ పట్టున కూర్చొన్న ఆ ఎండల వేడికి ఒకటే దాహం, నోరంతా పెడుచుకట్టుకుపోయినట్లు ఉంటుంది. దాంతో చాలావరకు కొబ్బరి బొండాలు, చెరుకురసం వంటివి వాటితో హైడ్రేటెడ్గా ఉండేలా చేసుకుంటారు. అయితే చెరుకురసంలో ఉండే అధిక చక్కెరల దృష్ట్యా కొబ్బరి నీళ్ల వైపుకే మొగ్గు చూపుతారు. అందులోనూ వేసవి అని అటు కొబ్బరి కాయల వ్యాపారలు అదును చూసి ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. ఎండల భయంతో విధిలేక అంత ధర వెచ్చించి మరీ కొని తాగేస్తుంటారు. అయితే అదేం అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. సమ్మర్లో కొబ్బరి బొండాలు తప్పనిసరి ఏం కాదని తేల్చి చెబుతున్నారు. వాటికి బదులుగా తక్కువ ఖర్చులో డీహైడ్రేషన్కి చెక్పెట్టొచ్చని చెబుతున్నారు అదెలాగో చూద్దామా..!.ఆరోగ్య స్పుహ ఎక్కువై సోషల్ మీడియాలోనూ, పేపర్లోనూ కొబ్బరి నీరుకి మించిన దివ్యౌషధం లేదంటూ ఊదరగొట్టుస్తున్నారు. నిజానికి కొబ్బరి నీరేమి సర్వరోగ నివారిణి కాదంటున్నారు వైద్యులు. ఇది హైడ్రేషన్గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అది సమంజసమే అయినా..మార్కెట్లో అధిక ధర పలుకుతున్నప్పడు ప్రత్యామ్నాయంగా తరుచుగా నీరు తాగితే చాలు. పోనీ వేడికి తాళ్లలేకపోతున్నాం అనుకుంటే అరటిపండ్లు, నీళ్లు తాగినా డీహైడ్రేషన్కి గురవ్వరని చెబుతున్నారు నిపుణులు. ఎలక్ట్రోలైట్ల సమృద్ధి కారణంగా..చాలామంది వేసవిలో కొబ్బరి నీళ్లు తాగకపోతే వేడి చేస్తుందని, ముక్కు నుంచి రక్తం కారుతుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అది చాలా తప్పు ఆ సమస్యకు మూల కారణం తెలుసుకునేలా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలే గానీ కొబ్బరినీరు తగ్గిస్తుందని చెప్పడం సరైనది కాదంటున్నారు వైద్యులు. అలాగే చాలామంది మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొబ్బరి నీరే మంచిదనుకుంటారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే కొబ్బరినీటిలో పోషకాలు ఉన్నాయి కానీ అది మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించేంత శక్తి అయితే ఉండదని నొక్కి చెప్పారు నిపుణులు. కేవలం వడదెబ్బ తగ్గినప్పుడు ఈ కొబ్బరినీరు తక్షణమే శక్తిని ఇచ్చి, ఎలక్ట్రోలైట్లతో బాడీని భర్తీ చేస్తుంది. త్వరితగతిన కోలుకునేలా చేస్తుందన్నారు. లేత కొబ్బరి నీరు ప్రకృతి ప్రసాదించిన రిఫ్రెషింగ్ అమృతం!. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఇది, తక్కువ కేలరీలు, అధిక పొటాషియం, విటమిన్ బీ, సీలు కలిగిన హైడ్రేటింగ్ పానీయం. రీహైడ్రేషన్, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మనకు మంచి ఆరోగ్యకరమై ఎనర్జీ ఇచ్చేందుకు తీసుకోవాలే తప్ప. అది తీసుకుంటేనే హైడ్రేటెడ్గా ఉంటామనేది అపోహేనని తేల్చి చెప్పారు. అలాగే దీన్నీ హైడ్రేషన్కి సంబంధించిన ప్రాథమిక వనరుగా తీసుకోకూడదు. ఆ సమస్యలు ఉత్ఫన్నమైనప్పుడూ..అథ్లెట్లకు లేదా వేడి వాతావరణంలో పనిచేసేవారికి కొబ్బరినీటిలో ఉండే అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తీసుకోమని వైద్యులు సూచిస్తారే తప్ప, ప్రత్యామ్నాయంగా అరటిపండ్లు, చల్లటి నీరు తాగవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ ఇది అన్నీ ఆరోగ్య సమస్యలకు అద్భుత నివారిణీ మాత్రం కాదని చెప్పారు. ముఖ్యంగా విరేచనాలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి అలసట బారిన పడకుండా ఉండేలా వైద్యులు నీటికి బదులుగా దీన్ని సూచించడం జరుగుతుందని వివరించారు. కాబట్టి సరసమైన ధరల్లో కొబ్బరి బొండాలు దొరికితే హయిగా కొనుక్కుని ఆస్వాదించండి లేదంటే హైడ్రేషన్ కోసం తక్కువ ధరలోనే ప్రత్యామ్నాయులు ఉన్నాయనే విషయం గ్రహించండి అని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: జెన్ జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!)

సెహ్రీ..తెల్లవారే ముందు వంటకాల విందు..!
మతాలకతీతంగా ప్రతి నగరవాసి సంప్రదాయ ఆహార సంస్కృతిలో మమేకమైపోయే సమయం రంజాన్. పాతబస్తీని అంతగా పట్టించుకోని ఐటీ నిపుణులు సైతం అసలు సిసలు హైదరాబాద్ అనుభవం కోసం ఓల్డ్ సిటీకి రౌండ్స్ కొట్టే సీజన్ ఇది. ఓ రకంగా దీన్ని లోకల్ టూరిజం అని పేర్కొనవచ్చు. రంజాన్ సీజన్లో ఈ లోకల్ టూరిస్టులు ఆస్వాదించే వాటిలో హలీమ్, ఇఫ్తార్లు మాత్రమే కాదు సెహ్రీ కూడా ఒకటి. రోజూ రకరకాల కారణాలతో.. రంజాన్ సమయంలో నగరం సెహ్రీ ప్రత్యేక మెనూల కోసం మేల్కొంటోంది. ఇది ముస్లింలు తమ రోజాను (ఉదయం నుంచి సాయంత్రం వరకూ చేసే ఉపవాసం) పునఃప్రారంభించే ముందుగా.. సూర్యోదయానికి ముందు తినే ఉదయపు భోజనం. అయితే ఈ సమయం సాధారణంగా ముస్లిమేతరులు ఎవరికీ అనుభవంలో లేని తెల్లవారుజామున ఆస్వాదించే వైవిధ్యభరిత అనుభూతి. సమయం మాత్రమే కాదు ఆ సమయానికి రెస్టారెంట్స్ వడ్డించే వంటకాలు కూడా ప్రత్యేక అనుభూతే. వైవిధ్యభరిత అనుభూతి.. సెహ్రీ కోసం బయటకు వెళ్లడం సంప్రదాయ పద్ధతి కానప్పటికీ, లేట్నైట్ షిఫ్టుల్లో పని చేసే వారి సంఖ్య పెరగడంతో పాటు, వంటగదిలోకి అడుగు పెట్టకుండానే రంజాన్ సమయంలో రిలాక్స్డ్ ఫుడ్ని ఇష్టపడే వారూ పెరగడం వల్ల కొత్తగా సెహ్రీ ఇంటి బయట ఊపందుకుంటోంది. రెస్టారెంట్లలో సెహ్రీ భోజనం సాధారణంగా తెల్లవారుజామున 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. సిసలైన సిటీ రుచుల సెహ్రీ.. సాధారణ బిర్యానీ లేదా హలీమ్లా కాకుండా, సెహ్రీలో కిచిడీ ఖట్టా–ఖీమా, నిహారీ విత్ నాన్, దమ్ కా కీమా కబాబ్లతో సహా అనేక రకాల సంప్రదాయ వంటకాలు సెహ్రీలో వడ్డిస్తారు. వీటిని రెస్టారెంట్లు ఈ సమయంలో ప్రత్యేకంగా అందిస్తాయి. కబాబ్లు వగైరా కూడా ఇందులో ఉన్నాయి, కానీ పూర్తిగా కొత్త మెనూను ఈ సందర్భంగా చాలా మంది రుచి చూస్తారు. సిటీలోని అనేక రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్సైడ్ కేఫ్స్ సైతం ప్రత్యేక సెహ్రీ మెనూ ప్లేటర్ను అందిస్తున్నాయి. ఈ ప్లేటర్లు లేదా కాంబోలు కనీసం నలుగురికి సరిపోయేంత పెద్దవిగా ఉండడం విశేషం. ఎక్కువగా ఈ సెహ్రీ కాంబోల్లో కబాబ్లు, రోటీలు, అన్నం, పప్పులతో పాటు మాంసాహార స్టార్టర్ల మిశ్రమం ఉంటుంది. దీంతో పాటు వివిధ రకాల కబాబ్లు, నయాబ్ హోటల్లో పాపులర్ డిష్ ఓ ఆఫాల్ ఫ్రై, రోటీ పే బోటీ, కబాబ్స్తో రోగ్ని రోటీ వంటివి సెహ్రీ స్పెషల్స్గా పేరొందాయి. ఎక్కడెక్కడ రుచి చూడొచ్చు అంటే.. ఓల్డ్ సిటీ, టోలిచౌకి, విమానాశ్రయ రహదారి (అరామ్ఘర్) వంటి ప్రాంతాల్లోని రెస్టారెంట్లు సెహ్రీ మెనులను అందిస్తాయి. అలాగే –టోలిచౌకి వంటి ప్రాంతాల్లో కూడా తాత్కాలిక ఆహార దుకాణాలు కనిపిస్తాయి. పాతబస్తీలోని నయాబ్ హోటల్ వంటి కొన్ని రెస్టారెంట్లు తమ సెహ్రీ మెనులను ఉదయం 1 గంట నుంచే అందిస్తాయి. అపరిమిత సెహ్రీ బఫేలను అందించేవి కూడా ఉన్నాయి. ‘గత సంవత్సరం ఇంటి బయట ‘సెహ్రీ’ కోసం అనేక మంది ఆసక్తిని కనబరిచారు, అందువల్ల మేం అనేక కొత్త రుచులను జోడించాం. ఉదయం 1 నుంచి 5 గంటల వరకూ స్పెషల్ మెనూలు అందిస్తున్నాం’ అని చార్మినార్ సమీపంలోని హోటల్ నయాబ్కు చెందిన జునైద్ అంటున్నారు. కొత్త మెనూలో ‘ఆచారి’ మటన్/చికెన్, నయాబ్ స్పెషల్ చికెన్, ‘కిచ్డీకి’, ‘దమ్ కా ఖీమా’ వంటి రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సెహ్రీ నగర నిజానికి ఒక భారీ ఆకర్షణగా మారుతోంది. మేం మా ‘సెహ్రీ’ మెనులో మటన్ ‘తహరీ’ అనే ప్రత్యేక వంటకం అందిస్తున్నాం’ అని లకడికాపూల్లోని పెషావర్ రెస్టారెంట్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ మోయిద్ చెబుతున్నారు. (చదవండి: జెన్–జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!)

జెన్–జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!
జెన్–జడ్ అనగానే ‘డైనమిక్ నేచర్’ అంటారు. అంతమాత్రాన అంతా సవ్యంగా ఉన్నట్లు కాదు. జెన్–జడ్ ఉద్యోగులు సరిచేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జెన్–జడ్లో ప్రొఫెషనలిజం లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు...క్వాయిట్ క్విట్టింగ్యువ ఉద్యోగులకు సంబంధించి నిశ్శబ్ద నిష్క్రమణ (క్వాయిట్ క్విట్టింగ్) భారతీయ పరిశ్రమలలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పరిశ్రమ నిర్వాహకులలో ఆందోళనను పెంచుతుంది. ‘ఉద్యోగం అంటే కాలేజికి ఎక్స్టెన్షన్ కాదు. ప్రొఫెషనలిజం అవసరమని చాలామందికి అర్థం కావడం లేదు. వివిధ రంగాల డైనమిక్స్పై కూడా అవగాహన కొరవడింది. ప్రతి రంగానికి ఒకే రకమైన పని అవసరాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. జెన్–జడ్ ఉద్యోగుల ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు టీమ్లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీతి శర్మ.జెన్ జడ్ అలా కాదు...పాత తరం ఉద్యోగులు, జెన్–జడ్ ఉద్యోగులకు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ‘మౌనమే మంచిది’ అన్నట్లుగా ఉండేవాళ్లు. జెన్–జడ్ అలా కాదు...తమ అసమ్మతిని బహిరంగంగా చెప్పడానికి వెనకాడడం లేదు. పని ప్రమాణాలు, అవసరాల విషయంలో యువతరానికి, పాతతరానికి ఎంతో తేడా ఉంది. ‘పని మాత్రమే జీవితం అని యువతరం అనుకోవడం లేదు. పనికి మించిన జీవితం ఉందనే విషయం వారికి తెలుసు. అయితే దీన్ని పాతతరం అంగీకరించం కష్టం’ అంటుంది దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్ దివిజా బాసిన్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ అయిన దివిజకు 2.6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘హార్డ్ వర్క్’ను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది అంటారు ఆమె. అయితే ఇది చిత్రానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు యువతలోని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి.స్కిల్ గ్యాప్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ బాడీ నాస్కామ్ నివేదిక ప్రకారం టెక్ రంగంలో ఆరు లక్షల మంది నిపుణుల కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న ‘స్కిల్ గ్యాప్’ సమస్యకు సులువైన పరిష్కార మార్గాలు లేకపోయినప్పటికీ యువత కార్పొరేట్ వాతావరణానికి అలవాటు పడటానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్క్స్పై పరిశ్రమలు మరింత దృష్టి పెట్టే అవసరం ఉంది. రిక్రూట్మెంట్కు వచ్చే కంపెనీలు విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్కు సంబంధించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయని దిల్లీకి చెందిన ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ హెడ్ చెప్పారు.కష్టమే సుమీ!అమెరికాకు చెందిన రెజ్యూమ్బిల్డర్.కామ్ నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది మేనేజర్లు, బిజినెస్ లీడర్లు జెన్ జడ్తో పనిచేయడం కష్టమని చెప్పారు. స్కిల్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం భారతీయ గ్రాడ్యుయేట్లలో 51 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. నేషనల్ ఎంప్లాయిబిలిటీ రిపోర్ట్ ఫర్ ఇంజనీరింగ్ ప్రకారం 80 శాతం మంది భారతీయ ఇంజనీర్లకు అవసరమైన నైపుణ్యాలు లేవు. అందుబాటులో ఉన్న ప్రతిభావంతులను నియమించుకోవడం తప్ప కంపెనీలకు మరో మార్గం కనిపించడం లేదు. (చదవండి:
ఫొటోలు
International

పేక మేడల్లా కుప్పకూలాయి
భారీ భూకంపం థాయ్లాండ్, మయన్మార్లను అతలాకుతలం చేసింది. 7.7 తీవ్రతతో మయన్మార్లో సంభవించిన ప్రకంపనల ధాటికి ఇరు దేశాల్లో అపార ఆస్తి నష్టం సంభవించింది. భారీ భవనాలు కుప్పకూలాయి. నిర్మాణాలన్నీ పగుళ్లిచ్చాయి. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విధ్వంస తీవ్రత దృష్ట్యా ప్రాణ నష్టమూ భారీగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా మయన్మార్లో 180 మందికి పైగా మరణించగా 750 మందికి పైగా గాయపడ్డారు. బ్యాంకాక్లో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి. బ్యాంకాక్/కోల్కతా: ప్రకృతి ప్రకోపానికి థాయ్లాండ్, మయన్మార్ చిగురుటాకుల్లా వణికిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరు దేశాల్లోనూ భారీ విధ్వంసం మిగిల్చింది. కాసేపటికే 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. పురాతన బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరా లైన్లు తదితరాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల్లో ఇప్పటిదాకా 200 మందికి పైగా మరణించారు. మయన్మార్లోనే 180 మందికి పైగా మరణించారు. 750 మందికి పైగా గాయపడ్డారని సైనిక ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం తక్షణం ఆదుకోవాలని కోరింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా ఉంది. మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకూలింది. అందులో అత్యధికులు మరణించి ఉంటారంటున్నారు. భూకంప కేంద్రాన్ని సెంట్రల్ మయన్మార్లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేకు సమీపంలో మొన్య్వా సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో ప్రమాద తీవ్రత చాలా పెరిగింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో భారీ భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. చటూచాక్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భారీ భవంతి నేలమట్టమైంది. దానికింద కనీసం 90 మందికి పైగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. భూకంప తీవ్రతకు భవనాలు అటూ ఇటూ ఊగిపోతున్న దృశ్యాలు, అత్యంత ఎత్తైన ఓ భవనం తాలూకు పై అంతస్తులోని స్విమింగ్పూల్ నుంచి నీళ్లన్నీ కిందకు పడుతున్న వీడియోలు వైరల్గా మారాయి. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని భూకంపాలు తప్పకపోవచ్చన్న హెచ్చరికలు వణికిస్తున్నాయి. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి. ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. బ్యాంకాక్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. రెండేళ్ల క్రితం తుర్కియేలో 50 వేల మందికి పైగా భూకంపానికి బలవడం తెలిసిందే. ఆ తర్వాత అతి తీవ్ర భూకంపం ఇదే. మయన్మార్లో... సైనిక పాలనలో మగ్గుతున్న మయన్మార్లో 1946 తర్వాత ఇదే అతి తీవ్రమైన భూకంపం. నేపిడాలో రాజప్రసాదాలు, భవనాలు దెబ్బ తిన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చీలిపోయి కన్పిస్తున్నాయి. ఐకానిక్ వంతెన, ఆలయాలు తదితరాలు కుప్పకూలాయి. ఇప్పటిదాకా 90 మందికి పైగా మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. చాలామందికి తీవ్ర గాయాలు కావడంతో రక్తానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మాండలేలో మసీదు కూలి 20 మంది మరణించారు. నగరానికి ఆగ్నేయాన సగాయింగ్ ప్రాంతంలో 90 ఏళ్ల నాటి బ్రిడ్జి కుప్పకూలింది. మా సో యానే బౌద్ధారామం కూడా నేలమట్టమైంది. మృతులు భారీగా పెరగవచ్చని సైనిక నియంత జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్ చెప్పారు. థాయ్లాండ్లో... భూకంపం ధాటికి ఇళ్లు, కార్యాలయాల నుంచి జనం ఉన్నపళంగా పరిగెత్తుకొచ్చారు. భవనాలు కళ్లముందే కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. బ్యాంకాక్లోని 1.7 కోట్ల జనాభాలో అత్యధికులు భారీ అపార్ట్మెంట్లలోనే నివసిస్తారు. భూకంపం దెబ్బకు భయాందోళనలకు లోనై కార్లు, ఇతర వాహనాల్లో రోడ్లెక్కడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. ర్యాపిడ్ ట్రాన్సిల్, సబ్వే వ్యవస్థలను తాత్కాలికంగా మూసేయడంతో భారీ జననష్టం తప్పింది. నగరం మొత్తాన్నీ ప్రమాద ప్రాంతంగా పేర్కొన్నారు. కుప్పకూలిన నిర్మాణంలోని భవన శిథిలాలు ఏ క్షణమైనా పూర్తిగా పడిపోయేలా కన్పిస్తున్నాయి. దాంతో శిథిలాల కింద చిక్కిన వారికోసం పోలీసు శునకాలతో వెదుకుతున్నారు. ఆ ప్రాంతాన్ని ప్రధాని షినవత్రా సందర్శించారు. భద్రత దృష్ట్యా ప్రతి భవనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అత్యవసర కేబినెట్ సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. బ్యాంకాక్లో 10 మందికి పైగా మరణించినట్టు ధ్రువీకరించారు. చాలా భవనాలకు పగుళ్లు రావడంతో లోనికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు.హృదయ విదారకం మయన్మార్, థాయ్లాండ్ల్లో భూకంప దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద చిక్కినవారు హాహాకారాలు చేస్తున్నారు. శిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే జనం వెదుక్కుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.అన్నివిధాలా సాయం: మోదీ న్యూఢిల్లీ: భూకంప విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జరిగిన ఘోరం చూసి చలించిపోయా. బాధితుల క్షేమం కోసం ప్రారి్థస్తున్నా. థాయ్లాండ్, మయన్మార్లకు అన్నివిధాలా సాయం అందించేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రెండు దేశాలకూ భారత్ సహాయ తదితర సామగ్రి పంపుతోంది. థాయ్లాండ్లోని భారతీయుల కోసం బ్యాంకాక్లో భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్ (+66 618819218) ఏర్పాటు చేసింది. భూకంప మృతుల్లో భారతీయులెవరూ లేరని పేర్కొంది. బ్యాంకాక్లో ఏప్రిల్ 4న బిమ్స్టెక్ ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ అధినేతలు భేటీలో పాల్గొంటారు. కోల్కతా నుంచి ఈశాన్యం దాకా...భూకంపం తాలూకు ప్రకంపనలు భారత్లోనూ కన్పించాయి. కోల్కతాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం మధ్యాహ్నం భూమి 2.5 తీవ్రతతో స్వల్పంగా కంపించింది. ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. వాయవ్య చైనాలోని యునాన్, సీచుయాన్ ప్రావిన్సుల్లో కూడా భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. మాంగ్షీ తదితర నగరాల్లో భూకంప తీవ్రత హెచ్చుగా ఉంది. ఇల్లు, నిర్మాణాలు బాగా దెబ్బతిన్నాయి.బతుకుతామనుకోలేదుభూకంపం నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. మేమంతా ఆఫీసులో ఉండగా అలజడి రేగింది. భూకంపమంటూ అరుపులు విన్పించడంతో వెంటనే బయటికి పరుగెత్తుకెళ్లాం. నిర్మాణంలోని భారీ భవనాలు కూలిపోయాయి. ఇళ్లు పగుళ్లివ్వడంతో వాటిని ఖాళీ చేయించి జనాన్ని పార్కులు, ఖాళీ స్థలాల్లోకి పంపుతున్నారు. మేం యూనివర్సిటీ క్యాంపస్లో తలదాచుకున్నాం.– ‘సాక్షి’తో ఫోన్లో బ్యాంకాక్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రమేశ్చాలామంది చనిపోయారు బ్యాంకాక్లో ఇంతటి భూకంపం ఎన్నడూ చూడలేదు. 40, 50 అంతస్తులున్న నాలుగైదు భవనాలు కూలిపోయాయి. వాటిలోని చాలామంది చనిపోయే ఉంటారు. భారత పర్యాటకులు బస చేసే ప్రాంతాల్లో విధ్వంస తీవ్రత ఎక్కువగా ఉంది. తెలుగు వారందరినీ గ్రూపుల్లో అప్రమత్తం చేస్తున్నాం.– వెంకటేశ్ యాదవ్,బ్యాంకాక్లోని ఆంధ్రా రెస్టారెంట్ ఎండీ

శిశు మరణాల తగ్గింపులో భారత్ భేష్
ఐరాస: శిశు మరణాలను అరికట్టడంలో భారత్ ప్రయత్నాలు, పురోగతిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఐక్యరాజ్యసమితి ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టలిటీ ఎస్టిమేషన్ ఇటీవల నివేదికను విడుదల చేసింది. శిశు మరణాలను తగ్గించిన ఐదు ‘ఆదర్శవంతమైన దేశాల’ను, నివారించదగిన శిశు మరణాలను తగ్గించడంలో పురోగతి కోసం వాటి వ్యూహాలను ఉదాహరించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా పలు అల్ప, మధ్య ఆదాయ దేశాలు ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను 2000 నుంచి బాగా తగ్గించగలిగాయి. భారత్తో పాటు అంగోలా, భూటాన్, బొలీవియా, కాబో వెర్డే, మొరాకో, సెనెగల్, టాంజానియా, జాంబియా శిశు మరణాలను మూడింట రెండొంతులు తగ్గించగలిగాయి’’ అని నివేదిక పేర్కొంది.వ్యూహాత్మక పెట్టుబడులతో ..ఆరోగ్య వ్యవస్థపై వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా భారత్ ఇప్పటికే లక్షలాది శిశువుల ప్రాణాలను కాపాడిందని ఐరాస నివేదిక పేర్కొంది. 2000 నుంచి చూస్తే ఐదేళ్లలోపు శిశువల మరణాల్లో 70 శాతం తగ్గింపును, నవజాత శిశు మరణాల్లో 61 శాతం తగ్గింపును సాధించిందని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని కొనియాడింది.‘‘ఇందులో భాగంగా ప్రతి గర్భిణీ ఉచిత ప్రసవానికి అర్హురాలు. శిశు సంరక్షణ, ప్రజారోగ్య సంస్థల్లో ఉచిత రవాణా, మందులు, రోగనిర్ధారణ, ఆహార మద్దతును అందిస్తున్నారు. సమగ్ర కవరేజీ, ఆరోగ్య సేవల అమలుకు ప్రసూతి వెయిటింగ్ హోమ్స్, మాతా శిశు ఆరోగ్య విభాగాలు, నవజాత శిశు స్థిరీకరణ యూనిట్లు, అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు సంరక్షణ యూనిట్లు, తల్లి సంరక్షణ యూనిట్లు, జనన లోపాల స్క్రీనింగ్కు ప్రత్యేక కార్యక్రమం, మౌలిక సదుపాయాల బలోపేతం తదితరాలు కూడా ప్రశంసనీయం. ఫలితంగా ఏటా లక్షలాది మందికి ఆరోగ్యకర గర్భధారణ సాధ్యమవుతోంది. బిడ్డలు ఆరోగ్యంగా పుడుతున్నారు. మాతాశిశు ఆరోగ్య సేవలకు మంత్రసానులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నియామకం, శిక్షణ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. డేటా వ్యవస్థలు, మాతా, నవజాత శిశువు, శిశు ఆరోగ్య సూచికలను ఎప్పటికప్పుడు డిజిటైజ్ చేస్తున్నారు. భిన్న భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య వ్యవస్థ నిర్మాణాలున్నా భారత్ (India) ఈ ఘనత సాధించింది’’అని ప్రశంసించింది.చదవండి: అర్ధశతాబ్దం భూగర్భంలో.. నేడు కళ్లు చెదిరే ధరలో! ‘‘భారత్లో 2000 నాటికి ఐదేళ్లలోపు శిశువుల్లో కేవలం 56 శాతం మందికే తట్టు టీకాలు వేసేవారు. దాంతో ఏకంగా 1,89,000 మంది శిశువులు తట్టుతో మరణించారు. 2023 నాటికి 93 శాతం శిశువులకు తట్టు టీకా (Vaccine) వేశారు. దాంతో తట్టు మర ణాలు 97 శాతం తగ్గి 5,200కు పరిమితమయ్యాయి. వ్యాక్సిన్లు, పోషకాహారం, సురక్షితమైన నీరు, ప్రాథమిక పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిబద్ధత వల్ల లక్షలాది మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి’’ అని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ రస్సెల్ ప్రశంసించారు. శిశు మరణాలను భారత్ రికార్డు స్థాయికి తగ్గించడం గొప్ప విషయమన్నారు.

అర్ధశతాబ్దం భూగర్భంలో.. నేడు కళ్లు చెదిరే ధరలో!
అవన్నీ అరుదైన నాణేలు. కొన్ని అయితే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా వేలానికి రాలేదు. మరికొన్ని నాణేలను చరిత్రకారులు కూడా ఎన్నడూ చూడలేదు. ఇంతటి విశేషాలున్న పురాతన నాణేలు ఇప్పుడు వేలంపాటకు వచ్చాయి. వీటిని దక్కించుకోవాలంటే దాదాపు రూ.860 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంత రేటు పలుకుతున్న ఈ నాణేల కథాకమామిషు ఓసారి చూద్దాం.ఒక ట్రావెలర్ కథ.. ప్రపంచంలోనే 100 వేర్వేరు ప్రాంతాలకు చెందిన అరుదైన నాణేలను మే 20వ తేదీన స్విట్జర్లాండ్లో వేలం వేయనున్నారు. అన్నింటినీ ఒకేసారిగా కాకుండా మూడేళ్లకాలంలో కొద్ది కొద్దిగా వేలంలో విక్రయించనున్నారు. దాదాపు 15,000 నాణేలను ఏకంగా 50 సంవత్సరాలపాటు ఎవరికీ దక్కకుండా భూగర్భంలో దాచేసి తర్వాత బయటకు తీయడంతో ఇప్పుడీ నాణేల గురించి చర్చ మొదలైంది. యూరప్కు చెందిన ఒక వ్యక్తి గతంలో అమెరికాలో స్థిరపడ్డాడు. అత్యంత దారుణమైన స్టాక్మార్కెట్ (Stock Market) పతనంగా చరిత్రలో నిలిచిపోయిన ‘1929 వాల్స్ట్రీట్ క్రాష్’ ఉదంతం తర్వాత మదుపరులు స్టాక్మార్కెట్పై నమ్మకం కోల్పోయారు. అంతా బంగారం కొనడంపై దృష్టిపెట్టారు. అదే సమయంలో ఇతను సైతం తొలుత బంగారు కొన్నాడు. తర్వాత పాత నాణేలను కొని వాటిని అధిక ధరలకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా తన బంగారు నాణేల కొనుగోలు ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు.1930వ దశకంలో భార్యతో కలిసి ప్రపంచయాత్ర మొదలెట్టి ఎన్నో దేశాల్లో అరుదైన నాణేలను సేకరించడం మొదలెట్టాడు. ఎక్కువగా అమెరికా, యురప్ ప్రాంతాల నాణేలను సేకరించారు. ప్రతి నాణెం ప్రత్యేకత, విశిష్టతలను రాసిపెట్టుకున్నాడు. తర్వాత ఈ జంట యూరప్లో స్థిరపడింది. అయితే యూరప్ను అడాల్ఫ్ హిట్లర్ సారథ్యంలోని నాజీ పార్టీ దురాక్రమిస్తుండటంతో భయపడిపోయి తమ నాణేలను సురక్షితంగా దాచాలని భావించారు. 15,000 నాణేలను వేర్వేరుగా సిగార్ పెట్టెల్లో పెట్టి వాటిని అల్యూమినియం డబ్బాల్లో నింపి భూమిలో పాతిపెట్టారు. వాటిని దాచిన రహస్యప్రాంతం జాడను తమ కుటుంబసభ్యులకు మాత్రం చెప్పారు. అలా ఆ నాణేలు ఏకంగా 50 సంవత్సరాలపాటు భూమిలోనే ఉండిపోయాయి. ఇటీవల వాళ్ల వారసులు వాటిని బయటకు తీసి కొంతకాలం బ్యాంక్ లాకర్లో దాచారు. తాజాగా వేలం సంస్థకు అప్పగించారు. స్విట్లర్లాండ్లోని నమిస్మాటికా ఆర్స్ క్లాసికా వేలం సంస్థ వీటిని వేర్వేరు లాట్లుగా వేలం(Auction) వేయనుంది. ఎన్నెన్నో అరుదైన బంగారు నాణేలుదాదాపు 80 సంవత్సరాలుగా ఎవ్వరూ చూడని అరుదైన బంగారు నాణేలు (Gold Coins) ఈ ‘ట్రావెలర్ కలెక్షన్’లో ఉన్నాయి. 1629లో ముద్రించిన ‘100’డ్యూకాట్ ఫెర్డినాడ్–3 రాజు బంగారు నాణెం సైతం ఇందులో ఉంది. ఫెర్డినాడ్–3 రాజు చెక్ రాజ్యం, క్రొయేషియా, హంగేరీ, ఆస్ట్రియాలకు పాలించారు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఈ నాణెం బరువు ఏకంగా 348.5 గ్రాములు. ఆనాడు యూరప్లో ముద్రించిన అతిబరువైన నాణేల్లో ఇదీ ఒకటి. ఇరాన్లో 18వ శతాబ్దం చివర్లో, ఆఘా మొహమ్మద్ ఖాన్ ఖాజర్ కాలంలో ఇస్ఫమాన్, టెహ్రాన్లలో ముద్రించిన టోమాన్ బంగారు నాణేలు సైతం ఈయన కలెక్షన్లో ఉన్నాయి.చదవండి: పాస్పోర్టు మర్చిపోయిన పైలట్.. విమానం యూటర్న్!‘‘ఏమాత్రం పాడవకుండా కొత్తగా ఉన్న ఈ నాణేలు చరిత్రలోని ఎన్నో విశేషాలను మనకందిస్తాయి. మా వేలం సంస్థ కీర్తినీ పెంచుతాయి’’అని వేలం సంస్థ డైరెక్టర్ ఆర్టురో రూసో అన్నారు. ‘‘ఈ రకం డిజైన్ నాణేలను నేనెప్పుడూ చూడలేదు. ఇలాంటి నాణేలు గత 80 ఏళ్లలో ఎక్కడా వేలానికి రాలేదు’’ అని కలెక్షన్ కన్సల్టెంట్ డేవిడ్ గెస్ట్ అన్నారు. ప్రమాదంలో అలనాటి ఏథెనా పాథినోస్ బంగారు శిల్పం కరిగిపోగా వచ్చిన బంగారం నుంచి క్రీస్తుపూర్వం 296 ఏడాదిలో తయారుచేసిన నాణేన్ని సైతం వేలానికి ఉంచారు.– సాక్షి, నేషనల్ డెస్క్

భూకంపం ధాటికి.. బ్యాంకాక్లో ఎమర్జెన్సీ
బ్యాంకాక్: మయన్మార్ భారీ భూకంపం పొరుగున ఉన్న థాయ్లాండ్పైనా తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఉత్తర భాగం.. ప్రత్యేకించి రాజధాని బ్యాంకాక్ భారీ ప్రకంపనతో వణికిపోయింది. రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైంది. వందల భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేలమట్టమైన బహుళ అంతస్థుల శిథిలాల కింద ఎంత మంది చిక్కుకుని ఉంటారన్న దానిపై అంచనాకి రాలేకపోతున్నారు. మరోసారి భూకంపం వస్తుందన్న అంచనాలతో అధికారులు బ్యాంకాక్లో భవనాలను ఖాళీ చేయిన్నారు. మెట్రో, రైలు సేవలు నిలిపివేశారు. ఎయిర్పోర్టు దెబ్బ తినడంతో సర్వీసులను నిలిపివేసి లాక్డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం ధాటికి విద్యుత్ సేవలకు, పలు చోట్ల ఇంటర్నెట్కు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ పర్యాటక నగరం కావడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగతిన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని అక్కడ స్థిరపడ్డ తెలుగు వ్యాపారి ఒకరు చెబుతున్నారు. #แผ่นดินไหว#แผ่นดินไหว #bangkok #earthquake #Thailand #Myanmar #disaster pic.twitter.com/lwHeZYNNCo— Siu (@ItsSiuOfficial) March 28, 2025At the time of the #Earthquake, some people were on the MRT and luckily the swaying moment had already stopped at the station. So, everyone ran out quickly while the station floor was swinging. #Thailand #Bangkok #Myanmar #แผ่นดินไหว pic.twitter.com/1XlClCWkfH— कृतिका शर्मा (@Kriti_Sanatani) March 28, 2025Bangkok gempa bumi kuat. Received photos & videos from my brother. His office crack everywhere & heard ada building yang runtuh. Semoga dipermudahkan 🥺 #bangkok pic.twitter.com/L4jXpyRfSh— netaflutar (@Netaflutar) March 28, 2025
National

సర్వీస్ చార్జీ స్వచ్ఛందమే
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. వినియోగదారులు సర్వీస్ చార్జీలను స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందే తప్ప వారి నుంచి బలవంతంగా వసూలు చేయజాలవని స్పష్టం చేసింది. బిల్లుపై అదనంగా సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయరాదన్న సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నిబంధనలను సవాల్ చేస్తూ రెస్తారెంట్ల సంఘాలు వేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ‘‘కస్టమర్లకు ఇష్టమైతే టిప్ ఇవ్వొచ్చు. అంతేతప్ప సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అసలు బిల్లులో కలపని ఈ మొత్తాన్ని జీఎస్టీ లేదా సర్వీస్ ట్యాక్స్ అని కస్టమర్లు భావించే అవకాశముంది. ఇది మోసమే అవుతుంది’’ అని జడ్జి పేర్కొన్నారు. పిటిషన్దారులైన ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్హెచ్ఆర్ఏఐ), నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆండియా(ఎన్ఆర్ఏఐ)లకు చెరో రూ.లక్ష చొప్పున జరిమానా సైతం విధించారు. వినియోగదారుల సంక్షేమానికి ఉపయోగపడేలా ఈ మొత్తాన్ని సీపీపీఏ ఖాతాలో జమ చేయాలన్నారు. రెస్టారెంట్ల హక్కుల కంటే వినియోగదారుల హక్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు.

అసలైన రైతు నేత దలీవాల్: సుప్రీం
న్యూఢిల్లీ: రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలీవాల్ అసలు సిసలైన రైతు నాయకుడని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయనకు రాజకీయ అజెండా లేదని వెల్లడించింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం దలీవాల్ నాలుగు నెలలపాటు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన దీక్ష విరమించారు. ఎలాంటి రాజకీయ అజెండా లేకుండా రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న నిజమైన నేత దలీవాల్ అని సుప్రీంకోర్టు ప్రశంసించింది. పంజాబ్– హరియాణా సరిహద్దులోని ఖానౌరీ, శంభులో రైతుల నిరనసన శిబిరాలు ఇటీవల మూతపడ్డాయి. రహదారులపై రాకపోకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పంజాబ్ అడ్వొకేట్ జనరల్ గుర్మీందర్సింగ్ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో దలీవాల్పై న్యాయస్థానం ప్రశంసల వర్షం కురిపించింది. రైతు సమస్యల పరిష్కారానికి ఆయన నిజాయతీగా కృషి చేస్తున్నారని, మరికొందరు నాయకులు మాత్రం సమస్యలు పరిష్కారం కావొద్దని కోరుకుంటున్నారని ఆక్షేపించింది. ఈ నెల 19వ తేదీన అరెస్టయిన రైతు సంఘం నేతలు పాంధర్, కోహర్, కోట్రాతోపాటు ఇతర నాయకులు శుక్రవారం జైళ్ల నుంచి విడుదలయ్యారు.

3 నుంచి థాయ్లాండ్, శ్రీలంకల్లో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3 నుంచి 6వ తేదీ వరకు థాయ్లాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. ప్రాంతీయ సహకారానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ‘మహాసాగర్ విధానం’అమలే ఈ పర్యటన లక్ష్యమని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. మొదటగా ఆయన థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ 3, 4 తేదీల్లో జరిగే బిమ్స్టెక్ ఆరో శిఖరాగ్రంలో పాల్గొంటారు. 3న థాయ్ ప్రధానితో భేటీ అవుతారు. అనంతరం శ్రీలంకకు వెళతారని తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకేతో చర్చలు జరుపుతారంది. మారిషస్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ‘మహాసాగర్’ను ప్రకటించినట్లు విదేశాంగ శాఖ గుర్తు చేసింది. భారత్తోపాటు బంగాళాఖాత తీరప్రాంత దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్లతో ఏర్పాటైనదే బిమ్స్టెక్ కూటమి.

డీసీసీ చీఫ్లు మూడేళ్ల పాటుఎన్నికల్లో పోటీకి దూరమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వరుస భేటీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో పార్టీకి మూలస్తంభాలైన డీసీసీ అధ్యక్షులు పార్టీ కార్యలాపాలపై పూర్తి దృష్టి పెట్టేందుకు వీలుగా నియమితులైన మొదటి మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఏఐసీసీ నియమించిన ముకుల్ వాస్నిక్ కమిటీ చేసిన మూడేళ్ల నిషేధం ప్రతిపాదనను పార్టీ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్నిక్ కమిటీ సిఫార్సుల ప్రకారం డీసీసీ అధ్యక్షులు తమ ఐదేళ్ల పదవీ కాలంలో తొలి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీకి అనుమతించరు. వీరంతా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలను నిర్ధారించడం, ఎన్నికల ప్రచారాన్ని నిశితంగా పరిశీలించడం, సామాజిక ఇంజనీరింగ్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కోవడం, పార్టీ అనుకూల కథనాలను రూపొందించడం, జిల్లాల్లో ని అన్ని స్థాయిలలో మీడియా, సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం వంటి పనులకు నాయకత్వం వహిస్తారు. అభ్యర్థుల ఎంపికలో, వివిధ పదవులకు నామినీల పరిశీలనలో వీరే క్రియాశీలంగా ఉంటారు. ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత వహిస్తారు. ఈ మూడేళ్ల తర్వాత పదవుల ఎంపికలో డీసీసీలకు ప్రాధాన్యమిస్తారు. మూడేళ్ల ప్రతిపాదనపై వచ్చే నెలలో గుజరాత్లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
NRI

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్పర్సన్గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
క్రైమ్

హర్షవర్దిని ఎందుకమ్మా ఇలా చేశావు..!
రాప్తాడు రూరల్: మార్కుల ఒత్తిళ్లు ఓ ఇంటర్ విద్యార్థిని బలిగొన్నాయి. వివరాలు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని జీఎం కాలనీకి చెందిన లక్ష్మన్న కళ్యాణదుర్గంలో సెరికల్చర్ శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హర్షవర్దిని (17) నగర శివారులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాసింది. అయితే పరీక్షలు తాను సక్రమంగా రాయలేదని, ఆశించిన స్థాయిలో మార్కులు రావేమోననే అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఇంటికి చేరుకుని బోరున విలపించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పిల్లల కోసం వస్తే.. పిల్లలతో పాటు భార్యా దక్కలేదని..
డాబాగార్డెన్స్: పిల్లల కోసం కలలు కన్న ఒక నిరుపేద దంపతులకు ఫెర్టిలిటీ సెంటర్ తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇందుకోసం తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా.. కడుపులో పెరుగుతున్న కవలలతో సహా తల్లి కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆ ముగ్గురు ప్రాణాల విలువను రూ.4 లక్షలుగా వెలకట్టి ఆస్పత్రి యాజమాన్యం చేతులు దులుపుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి..అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ఎస్సీ కాలనీకి చెందిన గెంజి వరహాలు బాబు ఓ కంపెనీలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిందట లక్ష్మితో అతనికి వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో బాధపడుతున్న వరహాలు బాబుకు.. అదే కంపెనీలోని ఒక సహోద్యోగి రామ్నగర్లోని ఆరాధ్య ఆస్పత్రి గురించి చెప్పాడు. అక్కడ చికిత్స తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్పడంతో.. వరహాలు బాబు, లక్ష్మి దంపతులు ఎనిమిది నెలల కిందట ఆరాధ్య ఆస్పత్రిని సంప్రదించారు. ప్రారంభంలో ఆస్పత్రి యాజమాన్యం రూ.2,25,000 ఖర్చు అవుతుందని చెప్పగా.. తమ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో రూ.2,10,000కు అంగీకరించింది. వరహాలు బాబు పరీక్షల కోసం మరో రూ.12 వేలు చెల్లించాడు. పరీక్షలు పూర్తయ్యాయి. లక్ష్మికి రూ.12 రోజుల పాటు రోజుకు ఒక ఇంజక్షన్ చొప్పున 12 ఇంజక్షన్లు వేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా పరీక్షల కోసం మాకవరపాలెం నుంచి నగరానికి వెళ్లొస్తూ ఉండేవారు. ప్రయాణాలు, వైద్య ఖర్చులు, మందులు, స్కానింగ్ల కోసం నెలకు దాదాపు రూ. 20 వేల వరకు ఖర్చు చేసేవారు. నాలుగో నెలలో లక్ష్మి గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నారని వైద్యులు చెప్పడంతో సంతోషించిన ఆ దంపతులు.. ఇద్దరు పిల్లలు చాలని కోరారు. దీంతో వైద్యులు ఒక పిండాన్ని తొలగించారు. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లి, పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు. 7వ నెలలో నిర్వహించిన పరీక్షల్లో లక్ష్మికి మధుమేహం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలు పాటించినప్పటికీ.. సరైన పోషకాహారం లేక పిల్లల ఎదుగుదల సరిగా లేకపోయింది. దీంతో ఆస్పత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.ముందే చెప్పి ఉంటే..కాగా.. గత ఆదివారం రాత్రి లక్ష్మికి తీవ్రమైన విరేచనాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం వరకు అవి ఆగకపోవడంతో ఆందోళన చెందిన వరహాలు ఆస్పత్రికి ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఉదయం 8 గంటల తర్వాత స్పందించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. మధ్యాహ్నానికి ఆస్పత్రికి చేరుకున్న లక్ష్మిని మొదట 6వ అంతస్తులో, తర్వాత 3వ అంతస్తుకు మార్చారు. పరిస్థితి విషమించడంతో స్కానింగ్ చేయగా కడుపులో ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పిల్లలు చనిపోయినా భార్యను కాపాడమని వేడుకున్న వరహాలు బాబుకు చెప్పకుండానే అదే రోజు రాత్రి లక్ష్మిని అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం లక్ష్మి తుదిశ్వాస విడిచింది. భార్యను, కడుపులోని ఇద్దరు పిల్లలను కోల్పోయిన వరహాలు బాబు కన్నీరుమున్నీరుగా విలపించాడు. పిల్లల కోసం వస్తే.. పిల్లలతో పాటు భార్యా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆవేదననను చూసి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీస్తే.. ముగ్గురి ప్రాణాలకు కలిపి రూ.4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించాడు. ప్రతి నెలా పరీక్షలు చేస్తూ లక్షలు వసూలు చేసిన యాజమాన్యం.. చివరికి తల్లి శరీరం సహకరించడం లేదని చెప్పడం దారుణమని వరహాలు బాబు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ముందే చెప్పి ఉంటే ఈ ప్రయత్నమే చేసేవాళ్లం కాదని, ముగ్గురు ప్రాణాలను రూ.4 లక్షలకు వెలకట్టడం దారుణమని ఆమె రోదించింది.

భర్త సంపాదన ప్రియుడిపాలు!
కాకినాడ: భార్య వివాహేతర సంబంధంతో జీవితంపై విరక్తి చెంది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కేసులో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) ఈ నెల 25 వ తేదీన పెరవలి లాకుల వద్ద మోటార్ సైకిల్ వదలి కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి 26వ తేదీన ఇరగవరం మండలం రాపాక వద్ద శవమై తేలిన విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం తన చావుకు కారణమైన ఖండవల్లి గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్, మోత్రపు శివ ప్రసాద్, మృతుడి భార్య చల్లా దివ్య కుమారి కారణమని పేర్కొన్నాడు.ఫిర్యాదుదారు చల్లా వెంకట సుబ్బారావు ఇచ్చిన వివరాలు, గ్రామ పెద్దల సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు వారి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచినట్టు తెలిపారు. తన భార్య అదే గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని దుర్గారావు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు అమోఘ్ను ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో అతడితో పాటు తండ్రి శివప్రసాద్లు దుర్గారావును దుర్భాషలాడి అవమానించారు.దీంతో అతడు మనస్తాపం చెంది తన చావుకు వారు ముగ్గురే కారణమని, తాను దుబాయి వెళ్లి సంపాదించినదంతా దివ్యకుమారి ప్రియుడికి దోచిపెట్టిందని, దీంతో తాను ఆర్థికంగా చితికిపోయానని, వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపం చెందానని సూసైడ్ నోట్ రాసి కాల్వలోకి దూకాడు. నిందితులను రిమాండ్ నిమిత్తం తణుకు కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్టు ఎస్సై తెలిపారు.

బిడ్డా.. నన్ను విడిచి వెళ్లిపోయావా...
విజయనగరం: బిడ్డా.. చనిపోయేందుకే వచ్చావా.. ఎంతఘోరం జరిగిపోయింది.. అండగా ఉంటానని చెప్పి అందని లోకాలకు వెళ్లిపోయావా... అంటూ ఆ తల్లి రోదన అక్కడివారికి కన్నీరు తెప్పించింది. పొట్టకూటి కోసం తల్లికి తోడుగా వలసవెళ్లి రెండు నెలల తర్వాత పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత పడిన ఘటన సీతంపేట మండలం దోనుబాయి ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కె.కాగుమానుగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సవర చలపతి (14) దోనుబాయి ఆశ్రమపాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కూలిపని కోసం విజయవాడకు వలస వెళ్లిన తల్లి లండమ్మకు తోడుగా వెళ్లిపోవడంతో ఫిబ్రవరి నుంచి మార్చి 26 వరకు పాఠశాలకు గైర్హాజరయ్యాడు. పరీక్షలని తెలియడంతో ఈ నెల 27న పాఠశాలకు వచ్చి ఎప్పటివలే విద్యార్థులతో కలసిమెలసి ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఫలహారం అనంతరం పాఠశాల పై అంతస్తులో తన గదిలో బంకర్ బెడ్ మంచానికి ఊయల కట్టుకుని సరదాగా ఊగుతున్నాడు. ఈ క్రమంలో గట్టిగా ఊగడంతో ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయాడు. మంచం కూడా విద్యార్థిపై పడి తలకు బలమైన గాయమైంది. రక్తం ధారలా కారుతుండడాన్ని చూసిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యాధికారి భానుప్రతాప్తో పాటు వైద్యసిబ్బంది సేవలందించినా ఫలితం లేకపోయింది. తండ్రి భీముడు రెండేళ్ల కిందటే మృతిచెందాడు. ఇద్దరు అన్నదమ్ములు గణే‹Ù, ప్రసాద్ ఉన్నారు. ఎస్ఐ షేక్ మస్తాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ చంద్రమౌళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతిపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లికి తోడుగా వలస వెళ్లి... మృతుడి పెద్దఅన్నయ్యకు వివాహం కాగా, చిన్న అన్నయ్య నిరుద్యోగి. నిరుపేద కుటుంబం కావడంతో కూలిపనుల కోసం విజయవాడకు తల్లి బయలుదేరగా తోడుగా చలపతి వెళ్లాడు. ఐదు రోజుల కిందటే గ్రామానికి వచ్చారు. తొమ్మిదో తరగతి పరీక్షలు జరుగుతాయని గురువారం పాఠశాలకు వెళ్లాడు. ఇంతలో బిడ్డ మృతి చెందాడన్న పిడుగులాంటి సమాచారం అందడంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.కుటుంబాన్ని ఆదుకుంటాం మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి తెలిపారు. విద్యార్థి మృతివార్త తెలుసుకున్న వెంటనే ఆయన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. మృతికి కారణాలు తెలుసుకున్నారు. తనకు సమగ్ర నివేదిక అందించాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొరను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామపెద్దలు ఎస్.భాస్కరరావు, విజయ్, రవి తదితరులు పీఓను కోరారు. ముందుగా రుణ సౌకర్యం కలి్పంచి ఆదుకుంటామని పీఓ హామీ ఇచ్చారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.10 వేలు అందజేశారు. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, పార్వతీపురం ఐటీడీఏ డీడీ కృష్ణవేణి, ఏఎంవో కోటిబాబు, జీసీడీఓ రాములమ్మ, హెచ్ఎంలు ఎ.భాస్కరరావు, చంద్రరావు తదితరులు ఉన్నారు.