భోజన విరామ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన మూగ, చెవుడు, అనాథ పిల్లలు కలిశారు. వారి ముద్దుముద్దు ముఖాలు, సంజ్ఞలతో వారు చూపించిన ప్రేమాభిమానాలు మనస్సుకు హత్తుకుపోయాయి. వారి హావభావాలు నన్ను కట్టిపడేశాయి. ఓ ఆరేళ్ల చిన్నారి తన కన్నీటి గాథను సైగలతోనే నా ముందుంచింది. తాను ఈ పరిస్థితిలో ఉన్నా కనీసం పింఛన్ కూడా రావడం లేదట. ఆదుకునే మనసుంటే.. తమకున్న లోపం శాపం కాదంటూ గుండె నిబ్బరాన్ని ప్రదర్శించింది. మరో పదేళ్ల చిన్నారి ముకుళిత హస్తాలతో చేసిన ప్రార్థన నన్నెంతో ఆకట్టుకుంది. ఆ చిన్నారి, ఆమె సోదరి కూడా అనాథలేనని తెలియడంతో నా గుండె బాధతో బరువెక్కింది.
Published Tue, Mar 6 2018 7:10 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement