జిల్లాలోని పాడేరు మండలం వంటలమామిడి ఘట్రోడ్డులో మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో 37 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.