అద్భుతమైన ఆటతోపాటు విలక్షణమైన యాటిట్యూడ్తోనూ అభిమానుల్ని అలరించడంలో ముందుంటారు జమైకన్ క్రిస్గేల్, ఇండియన్ ‘గబ్బర్’ శిఖర్ ధావన్! మొన్నటి ఐపీఎల్లో వేర్వేరు జట్ల తరఫున ఆడిన ఈ దిగ్గజాలు.. వేదిక మారగానే ఒక్కటైపోయారు. మూకుమ్మడిగా‘జుమ్మా..చుమ్మా..’ పాటకు స్టెప్పులేసి ఇరగదీశారు. ఇటీవల ముంబైలో జరిగిన సియాట్ అవార్డుల ఫంక్షన్లో గేల్-గబ్బర్ల సందడి వీడియో వైరల్ అయింది.