chris gayle
-
CT 2025, IND VS AUS: సిక్సర్ల శర్మ.. హిట్మ్యాన్ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో మరో రికార్డు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 3) జరుగుతున్న మ్యాచ్లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు. రోహిత్ ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్ల్లో 65 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు రోహిత్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. గేల్ 51 ఇన్నింగ్స్ల్లో 64 సిక్సర్లు బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాస్-5 ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.రోహిత్ శర్మ-65 సిక్సర్లు (42 ఇన్నింగ్స్లు)క్రిస్ గేల్-64 (51 ఇన్నింగ్స్లు)గ్లెన్ మ్యాక్స్వెల్-49 (30 ఇన్నింగ్స్లు)డేవిడ్ మిల్లర్-45 (30 ఇన్నింగ్స్లు)సౌరవ్ గంగూలీ-42 (32 ఇన్నింగ్స్లు)మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ 29 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీలో రోహిత్కు మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. రోహిత్ తక్కువ స్కోర్కే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ రెండో వికెట్గా వెనుదిరిగాడు. అంతకుముందు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా తక్కువ స్కోర్కే (8) ఔటయ్యాడు. రోహిత్ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 43/2గా ఉంది. విరాట్ కోహ్లి (5), శ్రేయస్ అయ్యర్ (0) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్కు దక్కింది.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలు చేసి ఆసీస్కు ఫైటింగ్ స్కోర్ అందించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ఉత్కంఠ పోరులో.. ఇంగ్లండ్ మాస్టర్స్పై విండీస్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో (International Masters League 2025)లో వెస్టిండీస్ మాస్టర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా మాస్టర్స్ను ఓడించిన విండీస్ జట్టు.. తాజాగా ఇంగ్లండ్పై గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గేల్ బృందం గట్టెక్కింది.అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ నిర్వహిస్తున్నారు. గతేడాదే మొదలుకావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 22న IML మొదలైంది. భారత్తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 24న తమ తొలి మ్యాచ్లో భాగంగా వెస్టిండీస్ మాస్టర్స్(West Indies Masters) ఆస్ట్రేలియా మాస్టర్స్తో తలపడింది. బ్రియన్ లారా(Brian Lara) కెప్టెన్సీలో ఆడిన విండీస్.. ఏడు వికెట్ల తేడాతో కంగారూ జట్టును ఓడించి తొలి విజయం నమోదు చేసింది. గేల్ మెరుపు ఇన్నింగ్స్ఇక గురువారం రాత్రి తమ రెండో మ్యాచ్ ఆడిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ను ఢీకొట్టింది. ఈసారి నవీ ముంబై వేదికగా క్రిస్గేల్ సారథ్యంలో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది.ఓపెనర్లలో డ్వేన్ స్మిత్ 25 బంతుల్లో 35 పరుగులు చేయగా.. గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 39 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో నర్సింగ్ డియోనరైన్(23 బంతుల్లో 35 నాటౌట్), ఆష్లే నర్స్(13 బంతుల్లో 29) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ మాస్టర్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.ఇంగ్లండ్ మాస్టర్స్ బౌలర్లలో మాంటీ పనేసర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ షోఫీల్డ్ రెండు, క్రిస్ ట్రెమ్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాస్టర్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇయాన్ బెల్ ఒక్క పరుగుకే నిష్క్రమించాడు.ఈ క్రమంలో కెప్టెన్, వన్డౌన్ బ్యాటర్ ఇయాన్ మోర్గాన్(13 బంతుల్లో 22)తో కలిసి మరో ఓపెనర్ ఫిల్ మస్టర్డ్(19 బంతుల్లో 31) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు అవుటైన తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు. టిమ్ ఆంబ్రోస్(3), డారెన్ మ్యాడీ(14), టిమ్ బ్రెస్నన్(5) పూర్తిగా విఫలమయ్యారు. 171 పరుగులకు పరిమితంఅయితే, క్రిస్ షోఫీల్డ్(26 బంతుల్లో 32) మాత్రం రాణించగా.. క్రిస్ ట్రెమ్లెట్(19 బంతుల్లో 27 నాటౌట్), స్టువర్ట్ మీకర్(10 బంతుల్లో 24) అతడికి సహకరించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) ఇరవై ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ మాస్టర్స్ 171 పరుగుల వద్ద నిలిచిపోయింది. దీంతో వెస్టిండీస్ మాస్టర్స్ ఎనిమిది పరుగుల తేడాతో జయభేరి మోగించింది.విండీస్ బౌలర్లలో జెరోమ్ టేలర్, రవి రాంపాల్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. డ్వేన్ స్మిత్, ఆష్లే నర్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక వెస్టిండీస్ తదుపరి మార్చి 6న శ్రీలంక మాస్టర్స్తో తలపడనుండగా.. ఇంగ్లండ్ మాస్టర్స్ సోమవారం సౌతాఫ్రికా మాస్టర్స్ను ఢీకొట్టనుంది. టాప్లో ఇండియా మాస్టర్స్ఇక ఈ టీ20 లీగ్లో సచిన్ టెండుల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు తొలుత శ్రీలంక మాస్టర్స్పై.. తర్వాత ఇంగ్లండ్ మాస్టర్స్పై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్రేటు(+2.461) పరంగా మెరుగైన స్థితిలో నిలిచిన ఇండియా మాస్టర్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక వెస్టిండీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: IND vs NZ: కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరం.. కెప్టెన్గా అతడు! -
క్రిస్ గేల్ విధ్వంసం.. లేటు వయసులోనూ తగ్గని యూనివర్సల్ బాస్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో (International Masters League 2025) ఇవాళ (ఫిబ్రవరి 27) వెస్టిండీస్ మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్ జట్లు తలపడుతున్నాయి. నవీ ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి వెస్టిండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) చెలరేగండతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గేల్తో పాటు మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ , నర్సింగ్ డియోనరైన్, ఆష్లే నర్స్ కూడా చెలరేగారు. గేల్ 19 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గేల్ పాత రోజులను గుర్తు చేశాడు. లేటు వయసులోనూ విధ్వంసం సృష్టించాడు. డ్వేన్ సైతం వేగంగా పరుగులు సాధించాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. డియోనరైన్ 23 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ఆష్లే నర్స్ 13 బంతుల్లో 2 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో కిర్క్ ఎడ్వర్డ్స్ 9, చాడ్విక్ వాల్టన్ 9, దినేశ్ రామ్దిన్ 8, జెరోమ్ టేలర్ ఒక్క పరుగు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాంటీ పనేసర్ 3 వికెట్లు తీయగా.. క్రిస్ స్కోఫీల్డ్ 2, క్రిస్ ట్రెమ్లెట్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాదే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్లో 6 దేశాలకు (భారత్, శ్రీలంక. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్) చెందిన దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత్కు సచిన్, శ్రీలంకకు సంగక్కర, వెస్టిండీస్కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నారు. భారత మాస్టర్స్ జట్టులో సచిన్తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు.ఈ ఎడిషన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో భారత్ అత్యధిక మ్యాచ్లు గెలిచింది. భారత మాస్టర్స్.. శ్రీలంక, ఇంగ్లండ్ మాస్టర్స్పై విజయాలు సాధించారు. మరో రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా మాస్టర్స్పై విండీస్.. సౌతాఫ్రికా మాస్టర్స్పై శ్రీలంక మాస్టర్స్ విజయాలు సాధించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గురించే చర్చ. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్ కోసం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో సెమీ ఫైనలిస్టులు, ఫైనల్స్ చేరే జట్లు, విజేతపై తమ అంచనాలు తెలియజేస్తూ సందడి చేస్తున్నారు.సచిన్ టెండ్కులర్కు రెండో స్థానంఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) వన్డే క్రికెట్లో టాప్-5 ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్లు వీరేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో తన సహచర ఓపెనర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండ్కులర్(Sachin Tendulkar)కు వీరూ భాయ్ రెండో స్థానం ఇవ్వడం విశేషం. మరి ఆ మొదటి ప్లేయర్ ఎవరంటారా?!..అప్పుడే తొలిసారిగా చూశానుచాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘నా ఆల్టైమ్ గ్రేటెస్ట్ వన్డే బ్యాటర్లలో క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉంటాడు. అతడు గొప్ప బ్యాటర్. గొప్ప ఓపెనర్ కూడా! 2002-03లో టీమిండియా వెస్టిండీస్కు వెళ్లింది. నాటి ఆరు మ్యాచ్ల సిరీస్లో గేల్ మూడు శతకాలు బాదాడు.అంతర్జాతీయ స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో బ్యాక్ ఫుట్ షాట్లతో సిక్సర్లు బాదిన క్రికెటర్ను నేను అప్పుడే తొలిసారిగా చూశాను’’ అని సెహ్వాగ్ గేల్పై ప్రశంసలు కురిపించాడు. ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్కు చోటిచ్చిన వీరూ భాయ్.. ‘‘డివిలియర్స్ బ్యాటింగ్ చేసే విధాననం నాకెంతో ఇష్టం. సిక్సర్లు కొట్టడంలో అతడిదొక ప్రత్యేక శైలి’’ అని పేర్కొన్నాడు.అతడిని చూసే నేర్చుకున్నాఅదే విధంగా.. పాకిస్తాన్ మాజీ స్టార్ ఇంజమామ్ ఉల్ హక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆసియాలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఇంజమామ్ ఒకడు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చేవాడు. మ్యాచ్ను ఎలాగోలా తన ఆధీనంలోకి తెచ్చుకునేవాడు.చివరిదాకా ఇన్నింగ్స్ ఎలా కొనసాగించాలో నేను అతడిని చూసే నేర్చుకున్నా. ఓవర్కు ఏడు లేదంటే ఎనిమిది పరుగులు రాబట్టడం అప్పట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇంజమామ్ మాత్రం మంచినీళ్లు తాగినంత సులువుగా ఇన్నింగ్స్ ఆడేవాడు. ఎవరి బౌలింగ్లో ఎప్పుడు సిక్సర్లు కొట్టాలన్న విషయంపై అతడికి స్పష్టమైన అవగాహన ఉండేది’’ అని సెహ్వాగ్ కొనియాడాడు.సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లుఇక సచిన్ టెండుల్కర్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికి అభిమాన క్రికెటర్.. నాకు ఆదర్శమూర్తి అయిన సచిన్ టెండుల్కర్ గురించి చెప్పాలంటే.. ఆయనతో కలిసి బ్యాటింగ్కు వెళ్తుంటే... అడవిలో సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లు ఉండేది.అప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు ఆ సింహంపైనే ఉండేవి. నేను సైలెంట్గా నా పనిచేసుకుపోయేవాడిని’’ అని అభిమానం చాటుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లికి అగ్రస్థానం ఇచ్చిన సెహ్వాగ్.. ‘‘నంబర్ వన్ విరాట్ కోహ్లి. సరైన సమయంలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య.అతడొక ఛేజ్మాస్టర్. ఆరంభంలో ఉన్న కోహ్లికి.. ఇప్పటి కోహ్లికి చాలా తేడా ఉంది. రోజురోజుకు అతడు మరింత పరిణతి చెందుతున్నాడు. 2011-12 తర్వాత మాత్రం సూపర్స్టార్గా ఎదిగాడు. ఫిట్నెస్, ఆటలో నిలకడ.. ఈ రెండింటిలో తనకు తానే సాటి. అద్భుతమైన ఇన్నింగ్స్కు అతడు పెట్టింది పేరు’’అని రన్మెషీన్పై ప్రశంసల జల్లు కురిపించాడు.వీరేంద్ర సెహ్వాగ్ ఆల్టైమ్ బెస్ట్ టాప్-5 క్రికెటర్లు1. విరాట్ కోహ్లి(ఇండియా)2. సచిన్ టెండుల్కర్(ఇండియా)3. ఇంజమామ్ -ఉల్ -హక్(పాకిస్తాన్)4. ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా)5. క్రిస్ గేల్(వెస్టిండీస్).చదవండి: బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
వరల్డ్క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే: క్రిస్ గేల్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో విజేతగా ఎవరన్న అంశంపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) తన అంచనా తెలియజేశాడు. ఈసారి టీమిండియానే టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కాగా 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో ఫైనల్ చేరింది.తటస్థ వేదికపై రోహిత్ సేనఅయితే, నాటి టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి ఈ వన్డే ఫార్మాట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో ఈ విషయం గురించి చర్చించగా.. తటస్థ వేదికపై రోహిత్ సేన మ్యాచ్లు ఆడేలా హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోయినా.. ఐసీసీ చర్యలకు ఉపక్రమించడంతో దిగివచ్చింది. దీంతో దుబాయ్ వేదికగా టీమిండియా తమ మ్యాచ్లు ఆడేందుకు మార్గం సుగమమైంది.రెండు గ్రూపులుమరోవైపు.. పాకిస్తాన్లోని రావల్పిండి, కరాచి, లాహోర్ నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు. ఇక ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ అర్హత సాధించగా.. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి.ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా మ్యాచ్తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న ఈ ఐసీసీ ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. అనంతంర మార్చి 2న న్యూజిలాండ్తో తలపడుతుంది.ఐసీసీ టోర్నీలలో అద్భుతంగాకాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై తడబడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకుల నడుమ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై.. టైటిల్ను చేజార్చుకుంది. అయితే, అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగించి చాంపియన్గా అవతరించింది.ఇదే జోరులో చాంపియన్స్ ట్రోఫీలోనూ అడుగుపెట్టనున్న రోహిత్ సేనకు.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ మంచి సన్నాహకంగా ఉపయోగపడుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలుత నాగ్పూర్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. కటక్లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. ఇక రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చి.. విధ్వంసకర శతకం(90 బంతుల్లో 119 రన్స్) బాదడం టీమిండియాకు అతిపెద్ద సానుకూలాంశంగా పరిణమించింది.అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ తక్తో మాట్లాడిన విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియానే ఫేవరెట్. టైటిల్ గెలిచే జట్టు ఇదే’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్. వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ఘనత అతడిది. హిట్మ్యాన్ అతడు. వన్డేల్లో నా సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో విఫలమైనా మెగా టోర్నీలో మాత్రం తప్పక రాణిస్తాడు’’ అని క్రిస్ గేల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
క్రిస్ గేల్ను అధిగమించిన రోహిత్.. ప్రపంచ రికార్డుకు గురి
తాను బ్యాట్ ఝులిపిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి నిరూపించాడు. ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌండరీలు, సిక్స్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రో‘హిట్’.. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్(Chris Gayle) సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు.. అరుదైన ప్రపంచ రికార్డుకు మరింత చేరువయ్యాడు.కాగా గత కొంతకాలంగా బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. కటక్ వన్డేతో ఫామ్లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో డెబ్బై ఆరు బంతుల్లోనే శతకమార్కును అందుకుని.. తన వన్డే కెరీర్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లతో పాటు.. ఏడు సిక్స్లు ఉన్నాయి.రెండో స్థానానికి ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ను అధిగమించి షాహిన్ ఆఫ్రిది తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 267 వన్డేలు పూర్తి చేసుకున్న రోహిత్ 338 సిక్స్లు బాదాడు.మరోవైపు.. వెస్టిండీస్ తరఫున 301 వన్డేల్లో గేల్ 331 సిక్సర్లు కొట్టాడు. ఇక పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్లతో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ప్రపంచ రికార్డుకు రోహిత్ శర్మ ఇంకా కేవలం పదమూడు సిక్స్ల దూరంలో ఉన్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటికే అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. అతడి ఖాతాలో ఏకంగా 631 సిక్స్లు ఉన్నాయి. రోహిత్ వన్డేల్లో 338, టీ20లలో 205, టెస్టుల్లో 88 సిక్స్లు బాదాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతున్న టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత సూర్యకుమార్ బృందం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో సొంతం చేసుకోగా.. మరో వన్డే మిగిలి ఉండగానే వన్డే సిరీస్ను రోహిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. కటక్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బట్లర్ బృందాన్ని 304 పరుగులకు ఆలౌట్ చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ... మొత్తంగా తొంభై బంతుల్లో 119 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మెరుపు అర్ధ శతకం(52 బంతుల్లో 60) రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) మరోసారి రాణించారు.ఈ క్రమంలో 44.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. హిట్ షోతో అలరించిన రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం ఆఖరి వన్డే జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. -
మళ్లీ బరిలోకి దిగనున్న క్రిస్ గేల్
విండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఫిబ్రవరి 22 నుంచి భారత్లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్లో (2025) గేల్ విండీస్ తరఫున బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీలో గేల్తో పాటు సౌతాఫ్రికా మాజీ పేసర్ మఖాయా ఎన్తిని (Makhaya Ntini), ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) బరిలోకి దిగనున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భారత్కు సచిన్ టెండూల్కర్, శ్రీలంకకు కుమార సంగక్కర, వెస్టిండీస్కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో ఇండియన్ మాస్టర్స్కు ప్రాతినిథ్యం వహించేందుకు యువరాజ్ సింగ్ ఇటీవలే తన సమ్మతిని తెలిపాడు.ఈ టోర్నీ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్లకు రాజ్కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్లతో పాటు నాకౌట్ మ్యాచ్లు రాయ్పూర్లో జరుగనున్నాయి.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. సెమీస్లో విజేతలు మార్చి 16న రాయ్పూర్లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఈ టోర్నీలోని మ్యాచ్లన్నీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్హిట్స్లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భారత జట్టు (అంచనా): సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శిఖర్ ధవన్, రాహుల్ శర్మ, నమన్ ఓఝా, స్టువర్ట్ బిన్నీ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారి, ప్రజ్ఞాన్ ఓఝా -
చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్లు)కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్లు)ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్లు)నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్లు)కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్లు)కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో పోలార్డే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. -
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్లో ఓడి, బ్రిస్బేన్లో మ్యాచ్ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్తో ఈ సిరీస్లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.స్టార్క్కు చుక్కలు చూపించిన జైసూఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్లో చితకబాదాడు. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు.ఆల్టైమ్ రికార్డు బ్రేక్అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్గా 145 పరుగుల లీడ్లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డుSometimes JaisWall, sometimes JaisBall! 🔥Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
కివీస్ పేసర్ భారీ హిట్టింగ్.. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు సమం
తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును సౌథీ సమం చేశాడు. కివీస్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడుతోంది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.లాథమ్, సాంట్నర్ ఫిఫ్టీలుహామిల్టన్లోని సెడాన్ పార్కులో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్తో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (135 బంతుల్లో 63; 9 ఫోర్లు), మిచెల్ సాంట్నర్ (54 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.మరోవైపు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (44; 9 ఫోర్లు), విల్ యంగ్ (42; 10 ఫోర్లు) రాణించారు. అయితే, ఒక దశలో 172/2తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్... మిడిలార్డర్ వైఫల్యంతో 231/7కు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (18), డరైన్ మిషెల్ (14), టామ్ బ్లన్డెల్ (21), గ్లెన్ ఫిలిప్స్ (5) విఫలమయ్యారు.చెలరేగిన సౌథీమరికాసేపట్లో ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటున్న దశలో ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ చెలరేగాడు. ఈ మ్యాచ్తో టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలుకనున్న టిమ్ సౌథీ (10 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా దుమ్ము రేపడంతో న్యూజిలాండ్ మూడొందల మార్కు దాటగలిగింది. వీరిద్దరి ధాటికి కివీస్ టి20 తరహాలో చివరి 8 ఓవర్లలో 76 పరుగులు రాబట్టడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.టెస్టు క్రికెట్లో భారీ సిక్స్లకు పెట్టింది పేరైన సౌథీకాగా టెస్టు క్రికెట్లో భారీ సిక్స్లకు పెట్టింది పేరైన సౌథీ ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో... క్రిస్ గేల్ (98 సిక్స్లు)తో సమంగా నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో ఉన్నది వీరేఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (133 సిక్స్లు) అగ్ర స్థానంలో ఉండగా... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ (107 సిక్స్లు), ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ (100 సిక్స్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.ఇక టీమిండియా నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్లు), రోహిత్ శర్మ (88 సిక్స్లు) ఈ జాబితాలో వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తరఫున 107వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సౌథీ... ఇంగ్లండ్తో సిరీస్ అనంతరం కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.ఇంగ్లండ్ 143 ఆలౌట్ఆదివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 143 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 340 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: భారత్తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ను అధిగమించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పాక్కు చేదు అనుభవంసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా టూర్కు వెళ్లింది. ఈ పర్యటన టీ20 సిరీస్తో మొదలుకగా.. పాక్కు చేదు అనుభవం ఎదురైంది.డర్బన్లో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ప్రొటీస్ జట్టు చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. సెంచూరియన్లో శుక్రవారం నాటి రెండో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. సౌతాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది పాక్.సయీమ్ ఆయుబ్ ధనాధన్ ఇన్నింగ్స్ వృథాఓపెనర్ సయీమ్ ఆయుబ్(57 బంతుల్లో 98 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్కు తోడు.. బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ సూపర్ సెంచరీ(63 బంతుల్లో 117), రాసీ వాన్ డెర్ డసెన్(38 బంతుల్లో 66) అద్భుత అర్ధ శతకం కారణంగా పాక్కు ఓటమి తప్పలేదు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఘనంగా(31, 3 ఫోర్లు, ఒక సిక్సర్)నే ఇన్నింగ్స్ను ఆరంభించినా.. దానిని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ పొట్టి ఫార్మాట్లో అతడు అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.గేల్ ప్రపంచ రికార్డును బద్దలుసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం షార్టెస్ట్ క్రికెట్లో ఓవరాల్గా 11,020 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. పదకొండు వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్కు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ 298 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే, ఓవరాల్గా మాత్రం అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో గేల్ యూనివర్సల్ బాస్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 14562 టీ20 రన్స్ ఉన్నాయి.టీ20 క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లో 11000 పరుగులు సాధించిన ఆటగాళ్లు1. బాబర్ ఆజం- 298 ఇన్నింగ్స్2. క్రిస్ గేల్- 314 ఇన్నింగ్స్3. డేవిడ్ వార్నర్- 330 ఇన్నింగ్స్4. విరాట్ కోహ్లి- 337 ఇన్నింగ్స్.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. గేల్, పంత్ రికార్డులు బద్దలు
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్.. 28 బంతుల్లోనే (త్రిపురతో జరిగిన మ్యాచ్లో) శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది.గేల్, పంత్ రికార్డులు బద్దలుటీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రిషబ్ పేరిట ఉండగా.. తాజాగా ఉర్విల్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్లో 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ 7 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ ఫాస్టెస్ట్ సెంచరీభారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రీదమ్ పాల్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో నగస్వల్లా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన గుజరాత్ 10.2 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఉర్విల్ సునామీ శతకంతో విరుచుకుపడగా.. ఆర్య దేశాయ్ (38) మరో ఎండ్ నుంచి ఉర్విల్కు సహకరించాడు.ఎవరీ ఉర్విల్ పటేల్..?26 ఏళ్ల ఉర్విల్ బరోడాలోని మెహసానాలో జన్మించాడు. 2018లో అతను బరోడా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అతను లిస్ట్-ఏ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఆతర్వాత ఉర్విల్కు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసేందుకు ఆరేళ్లు పట్టింది. ఉర్విల్ గతేడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. రెండు రోజుల కిందట జరిగిన మెగా వేలంలో ఉర్విల్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఉర్విల్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మనసు మార్చుకుంటాయేమో వేచి చూడాలి. -
LLC 2024: క్రిస్ గేల్ ఊచకోత.. ధావన్ మెరుపులు (వీడియో)
విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి తమలో ఏమాత్రం జోరుతగ్గలేదని మరోసారి నిరూపించారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)2024లో గేల్, ధావన్ మెరుపులు మెరిపించారు.ఈ లీగ్లో గుజరాత్ గ్రేట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు.. శుక్రవారం కోనార్క్ సూర్యాస్ ఓడిశా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోనార్క్ జట్టు కెప్టెన్ టాస్ గెలిచి తొలుత గుజరాత్ టీమ్ను బ్యాటింగ్ ఆహ్హనించాడు.గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వ్యాన్ వాయక్(2)ను ఆదిలోనే పేసర్ వినయ్ కుమార్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గేల్..ధావన్తో కలిసి ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.గేల్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34 పరుగులు చేయగా.. ధావన్ 24 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో ప్రసన్న(31) పరుగులతో రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది.అనంతం 142 పరుగుల లక్ష్యంతో దిగిన కోనార్క్ కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోనార్క్ బ్యాటర్లలో మునివీరా(47) టాప్ స్కోరర్గా నిలవగా.. ఓబ్రియన్(43) పరుగులతో రాణించాడు.Chris Gayle 🤝 Shikhar Dhawan. 🔥- Gabbar and universe Boss together in the LLC. 🤯 pic.twitter.com/N8r4pbtQ3f— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2024 -
చరిత్ర సృష్టించిన పూరన్
విండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీ20ల్లో ఓ అరుదైన సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్లో భీకర ఫామ్లో ఉన్న పూరన్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్లో ఏడు సిక్సర్లు బాదిన పూరన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో 63 ఇన్నింగ్స్లు ఆడి 151 సిక్సర్లు బాదాడు. పూరన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పటివరకు 21 సిక్సర్లు బాదాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో పూరన్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 135.. 2012లో 121 సిక్సర్లు బాదాడు.పేట్రియాట్స్తో మ్యాచ్లో 43 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసిన పూరన్.. మరో అరుదైన ఘనత కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పూరన్ ఈ ఏడాది టీ20ల్లో 2022 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మొహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ 2021లో 48 ఇన్నింగ్స్ల్లో 2036 పరుగులు చేశాడు. పూరన్ తర్వాతి స్థానంలో అలెక్స్ హేల్స్ ఉన్నాడు. హేల్స్ 2022లో 61 మ్యాచ్లు ఆడి 1946 పరుగులు చేశాడు.సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ (పూరన్ జట్టు) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు.అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పూరన్తో పాటు జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు.కాగా, ఈ మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్రైడర్స్తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది. చదవండి: రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి -
అశ్విన్ దృష్టిలో బెస్ట్ ఐపీఎల్ టీం ఏది?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్కీపర్గా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. వన్డౌన్లో సురేశ్ రైనా, నాలుగో స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఆరో స్థానంలో ధోని, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా సునీల్ నరైన్, రషీద్ ఖాన్, పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా పేర్లను ప్రకటించాడు.అశ్విన్ తన ఆల్టైమ్ ఫేవరెట్ ఐపీఎల్ జట్టులో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్కు చోటు కల్పించకపోవడం ఆసక్తికరం. అశ్విన్ తన జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్కు చెందిన యూట్యూబ్ (చీకీ చీకా) ఛానల్తో మాట్లాడుతూ అశ్విన్ ఈ విషయాలను వెల్లడించాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం లేదు. ఆయా రాష్ట్రాల్లో లోకల్ టోర్నీలు జరుగుతున్నాయి. త్వరలో దులీప్ ట్రోఫీ మొదలుకానుంది. అనంతరం బంగ్లాదేశ్ భారత్లో పర్యటిస్తుంది. ఆటగాళ్లంతా కచ్చితంగా దులీప్ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ప్రదర్శనల ఆధారంగానే బంగ్లా సిరీస్కు జట్టు ఎంపిక జరుగవచ్చు. ఏది ఎలా ఉన్నా అశ్విన్ మాత్రం భారత టెస్ట్ జట్టులో తప్పక ఉంటాడు. -
క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351) టాప్లో ఉన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 170 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ గేల్ రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్లో రోహిత్ 20 బంతుల్లో ఓ సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్ ఓ మోస్తరు స్కోర్తో రాణించినా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్లో భారత్పై విజయం సాధించింది. -
IND VS SL 3rd ODI: హిట్మ్యాన్ మరో రెండు సిక్సర్లు కొడితే..!
శ్రీలంకతో మూడో వన్డేకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో రెండు సిక్సర్లు కొడితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ను (294 ఇన్నింగ్స్ల్లో 331 సిక్సర్లు) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 330 సిక్సర్లు (256 ఇన్నింగ్స్ల్లో) ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాక్ మాజీ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 369 ఇన్నింగ్స్ల్లో 351 సిక్సర్లు బాదాడు.కాగా, లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్.. గేల్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్.. ఛేదనలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గేల్ 177 సిక్సర్లు కొడితే.. రోహిత్ 179 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్లో భీకర ఫామ్లో ఉన్న రోహిత్ రెండు మ్యాచ్ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలు చేశాడు.తొలి వన్డేలో 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసిన రోహిత్.. రెండో వన్డేలో 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. రోహిత్ రెండు వన్డేల్లో మెరిసినా భారత్ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం సాధించింది. రెండు మ్యాచ్ల్లో భారత్ రోహిత్ అందించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిపాలైంది. సిరీస్లో మూడో వన్డే ఆగస్ట్ 7న జరుగనుంది. -
క్రిస్ గేల్ ఊచకోత..వయసు మీద పడినా అదే జోరు
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గడం లేదు. కెరీర్ ఉన్నతిలో ఎలా విధ్వంసం సృష్టించాడో, లేటు వయసులోనే అదే తరహాలో రెచ్చిపోతున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ది బౌలర్లను చీల్చిచెండాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఫలితంగా వెస్టిండీస్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.THE CHRIS GAYLE SHOW IN WCL. 🐐70 (40) with 4 fours and 6 sixes - the vintage Universe Boss at the Edgbaston Stadium, he's hitting them cleanly. 🌟 pic.twitter.com/jM5O2Lt7uo— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2024ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఆష్వెల్ ప్రిన్స్ (46 నాటౌట్), డేన్ విలాస్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రిచర్డ్ లెవి 20, నీల్ మెక్కెంజీ 0, జాక్ కలిస్ 18, జస్టిన్ ఓంటాంగ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జేసన్ మొహమ్మద్ 2, శామ్యూల్ బద్రీ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. క్రిస్ గేల్, చాడ్విక్ వాల్టన్ (29 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డ్వేన్ స్మిత్ 22, జోనాథన్ కార్టర్ 6, ఆష్లే నర్స్ 0 పరుగులకు ఔట్ కాగా..వెర్నన్ ఫిలాండర్ 2, లాంగ్వెల్డ్త్, మెక్ కెంజీ తలో వికెట్ పడగొట్టారు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆరు జట్లు (పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) పాల్గొంటున్న విషయం తెలిసిందే. జులై 3న ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్లు జరిగాయి. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. ఆతర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. అన్ని జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రో'హిట్'మ్యాన్ శర్మ.. రికార్డులు బద్దలు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్మ్యాన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్.. క్రిస్ గేల్ (63) తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో రోహిత్ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్- 63రోహిత్ శర్మ- 50జోస్ బట్లర్- 43డేవిడ్ వార్నర్- 40యువరాజ్ సింగ్- 33విరాట్ కోహ్లి- 33టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలురోహిత్ శర్మ- 113జయవర్దనే- 111విరాట్- 105వార్నర్- 103తిలకరత్నే దిల్షన్- 101భారత కెప్టెన్గా అత్యధిక పరుగులువిరాట్- 12883ధోని- 11207అజహారుద్దీన్- 8095గంగూలీ- 7643రోహిత్- 5012ఐసీసీ నాకౌట్స్లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ- 22క్రిస్ గేల్- 21ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
టీ20 వరల్డ్కప్లో సిక్సర్ల సునామీ.. మనోళ్లు ఒక్కరూ లేరు!
అమెరికాతో మ్యాచ్లో వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు.కేవలం 39 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్స్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అమెరికాతో మ్యాచ్లో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించాడు.ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్ అంటే పూనకం వచ్చినట్లుగా బ్యాట్తో రెచ్చిపోయే విండీస్ వీరుల జాబితాలో చేరాడు.ఇక బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అద్బుత బౌలింగ్తో ఆకట్టుకున్న విండీస్ స్పిన్నర్ రోస్టన్ చేజ్(3/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ బ్యాటర్ల సిక్సర్ల హవాఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 11.. ఇంగ్లండ్ మీద👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 10.. సౌతాఫ్రికా మీద👉ఆరోన్ జోన్స్(అమెరికా)- 10.. కెనడా మీద👉రిలీ రొసోవ్(సౌతాఫ్రికా)-8.. బంగ్లాదేశ్ మీద👉నికోలస్ పూరన్(వెస్టిండీస్)-8.. అఫ్గనిస్తాన్ మీద👉షాయీ హోప్(వెస్టిండీస్)-8.. అమెరికా మీద..టీ20 వరల్డ్కప్లో ఒక ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు👉నికోలసన్ పూరన్(వెస్టిండీస్)- 17(2024 ఇప్పటి వరకు)👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 16(2012)👉మార్లన్ సామ్యూల్స్- 15(2012)👉షేన్ వాట్సన్- 15(2012). చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి! View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. కేవలం 27 బంతుల్లోనే.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. సైప్రస్తో జరిగిన మ్యాచ్లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన శతకం. పురుషులు, మహిళలు, అంతర్జాతీయ స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే వేగవంతమైన సెంచరీ. అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాప్టీ ఈటన్ నమోదు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని సాహిల్ చౌహాన్ కేవలం నాలుగు నెలల్లో బద్దలు కొట్టాడు. లాఫ్టీ ఈటన్ ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 27న నేపాల్పై 33 బంతుల్లో శతక్కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో సాహిల్ సెంచరీకి ముందు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ఫార్మాట్ మొత్తంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. సాహిల్కు ముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడుతూ పూణే వారియర్స్పై 30 బంతుల్లో శతక్కొట్టాడు. తాజాగా సాహిల్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సైప్రస్తో మ్యాచ్లో ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న సాహిల్ 144 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో (ఓ ఇన్నింగ్స్లో) ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే. సాహిల్ సునామీ శతకంతో విరుచుకుపడటంతో సైప్రస్పై ఎస్టోనియా ఘన విజయం సాధించింది. -
నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. గేల్ రికార్డు బ్రేక్
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా పూరన్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు విండీస్ తరపున 91 టీ20లు ఆడి 1914 పరుగులు చేశాడు. పూరన్ కెరీర్లో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. విండీస్ తరపున 79 మ్యాచ్లు ఆడిన గేల్ 1899 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో గేల్ అల్టైమ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్పై 13 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది.దీంతో సూపర్-8కు కరేబియన్ జట్టు అర్హత సాధించింది. అదే విధంగా విండీస్ చేతిలో ఓటమి చవిచూసిన కివీస్.. తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఇవాళ (జూన్ 9) భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తేలికపాటి జల్లులు, ఔట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా టాస్ అరగంట ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:50 గంటలకు ప్రారంభమైంది.ఈ మ్యాచ్లో భారత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. పాక్ గత మ్యాచ్లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. పాక్.. వికెట్కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్కు పక్కన పెట్టి ఇమాద్ వసీంను తుది జట్టులోకి తీసుకుంది.Hitman Rohit Sharma signs Universe Boss Chris Gayle's jacket ahead of #INDvPAK clash in New York.📸: Diseny + Hotstar pic.twitter.com/aNnV3WNCE6— CricTracker (@Cricketracker) June 9, 2024సందడి చేసిన క్రిస్ గేల్..మ్యాచ్ ప్రారంభానికి ముందు విండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ న్యూయార్క్ మైదానంలో సందడి చేశాడు. ఈ సందర్భంగా గేల్ ధరించిన తెలుపు రంగు సూట్ ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. గేల్ ధరించిన సూట్పై (రెండు చేతులపై) భారత్, పాకిస్తాన్ జెండా రంగులు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ప్రత్యేకత గుర్తుగా గేల్ ఈ తరహా డ్రస్ ధరించినట్లు తెలుస్తుంది. గేల్ తన సూట్పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, చహల్ తదితరుల ఆటోగ్రాఫ్లు తీసుకున్నాడు. గేల్.. భారత ఆటగాళ్లతో సందడి చేసిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్ -
T20 World Cup 2024: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్
ఆసీస్ వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ను అధిగమించాడు. ఒమన్పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. గేల్ పేరిట 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్ల మార్కు తాకగా.. గేల్కు 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
టీ20 ప్రపంచకప్-2024లో యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్లో కెనడాపై సంచలన విజయం సాధించింది.డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ మ్యాచ్లో కెనడాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అంతర్జాతీయ టీ20లలో తమ అత్యధిక పరుగుల ఛేదనను నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఇక ఈ విజయంలో యూఎస్ఏ వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్దే కీలక పాత్ర. కెనడా విధించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికా జట్టు ఆరంభంలోనే తడబడింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(0), కెప్టెన్ మొనాక్ పటేల్(16) వికెట్లు కోల్పోయింది.ఆరోన్ జోన్స్ సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్(46 బంతుల్లో 65)తో కలిసి ఆరోన్ జోన్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 94 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్ట్రైకురేటు 235తో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్గా ఆరోన్ జోన్స్ చరిత్రకెక్కాడు. కాగా యూఎస్ఏ విజయంలో కీలక పాత్ర పోషించి.. తొమ్మిదో ఎడిషన్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగానూ నిలిచాడు.టీ20 వరల్డ్కప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు👉క్రిస్ గేల్- 11- ఇంగ్లండ్ మీద- 2016లో..👉క్రిస్ గేల్- 10- సౌతాఫ్రికా మీద- 2007లో..👉ఆరోన్ జోన్స్- 10- కెనడా మీద- 2024లో..👉రిలీ రొసోవ్- 8- బంగ్లాదేశ్ మీద- 2022లో. View this post on Instagram A post shared by ICC (@icc)చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా -
జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. ఈ మ్యాచ్లో బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఓటమి తప్పదనుకున్న చోట బట్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలో తడబడింది. వరుస క్రమంలో జైశ్వాల్, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అనంతరం పరాగ్, అశ్విన్, హెట్మైర్ వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయమైందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం తన పట్టును విడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తన జోరును కొనసాగించాడు. తన హాఫ్ సెంచరీ పూర్తియ్యాక కేకేఆర్ బౌలర్లను బట్లర్ ఊచకోత కోశాడు. ఆఖరివరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 6 సిక్స్లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. క్రిస్ గేల్ రికార్డు బద్దలు ఓవరాల్గా బట్లర్కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం గేల్(6 సెంచరీలు) రికార్డును జోస్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో బట్లర్(7) నిలిచాడు. Like this tweet if u witnessed jos Buttler Alone warrior century knock Jos the boss you absolutely beauty #KKRvRR | #IPL2024 pic.twitter.com/EpWGnD1OOL — 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) April 16, 2024 -
IPL 2024: యూనివర్సల్ బాస్తో కన్నడ బ్యూటీ.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
IPL 2024: గేల్ రికార్డు సమం చేసిన బట్లర్.. రాహుల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. నిన్నటి సెంచరీతో క్యాష్ రిచ్ లీగ్లో సెంచరీల సంఖ్యను ఆరుకు పెంచుకున్న బట్లర్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్తో (6) కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్ చేసుకున్నాడు. బట్లర్ తన వందో ఐపీఎల్ మ్యాచ్లో వంద కొట్టడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో బట్లర్కు ముందు కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాహుల్ సైతం తన వందో మ్యాచ్లో శతక్కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. బట్లర్ నిన్న సెంచరీ చేసిన మ్యాచ్లోనే విరాట్ కూడా సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విరాట్ ఐపీఎల్ సెంచరీల సంఖ్య ఎనిమిదికి చేరింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. ఈ మ్యాచ్లో విరాట్ తన సెంచరీ పూర్తి చేసేందుకు 67 బంతులు తీసుకుని విమర్శలపాలయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీ కావడమే విరాట్పై విమర్శలకు కారణం. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విరాట్ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్ కూడా విరాట్ బ్యాటింగ్ సమయంలో స్పిన్నర్ల పక్షాన ఉండింది. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్రైజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ఫైనల్కు చేరి తమ తొలి టైటిల్పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హీరోలు వీరే.. 2024 సీజన్లో ఎవరు..?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది. ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ టాప్ రికార్డు అయిన ఆరెంజ్ క్యాప్పై (అత్యధిక పరుగులు) ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ తొలి ఎడిషన్ (2008) నుంచే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐపీఎల్ తొలి ఆరెంజ్ క్యాప్ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్లో మార్ష్ 11 మ్యాచ్ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 616 పరుగులు చేసి సీజన్ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. అనంతరం 2009 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఆ సీజన్లో హేడెన్ 12 మ్యాచ్ల్లో 5 అర్దసెంచరీల సాయంతో 572 పరుగులు చేశాడు. 2010 ఎడిషన్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్ల్లో 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించిన తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం 2011, 2012 సీజన్లలో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ వరుసగా రెండు సార్లు (608, 733) ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకోగా.. 2013లో సీఎస్కే ఆటగాడు మైక్ హస్సీ (733), 2014లో కేకేఆర్ రాబిన్ ఉతప్ప (660), 2015లో సన్రైజర్స్ డేవిడ్ వార్నర్ (562) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. 2016లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి (973) లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు (ఒక సీజన్లో) చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. 2017లో సన్రైజర్స్ వార్నర్ (692), 2018లో సన్రైజర్స్ కేన్ విలియమ్సన్ (735), 2019లో వార్నర్ (692) ముచ్చటగా మూడో సారి, 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేఎల్ రాహుల్ (670), 2021లో సీఎస్కే రుతురాజ్ గైక్వాడ్ (635), 2022లో రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ (863), 2023లో గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్ (890) ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నారు. మరి ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారో కామెంట్లో తెలియజేయండి. -
బాబర్ ఆజమ్ విధ్వంసం.. టీ20ల్లో 11వ శతకం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఇస్లామాబాద్ యునైటెడ్తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్లో బాబర్.. 59 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సైమ్ అయూబ్ (38) కాస్త పర్వాలేదనిపించగా.. మొహమ్మద్ హరీస్ (2), హసీబుల్లా ఖాన్ (0), పాల్ వాల్టర్ (19), రోవ్మన్ పావెల్ (8) విఫలమయ్యారు. ఆఖర్లో ఆసిఫ్ అలీ (17 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న బాబర్.. ఆతర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీం షా, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, పొట్టి క్రికెట్లో 11వ సెంచరీ (284 మ్యాచ్ల్లో) పూర్తి చేసుకున్న బాబర్.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో గేల్ అత్యధికంగా 22 సెంచరీలు (463 మ్యాచ్ల్లో) చేశాడు. -
క్రిస్ గేల్ ఊచకోత.. 46 బంతుల్లోనే 10 సిక్సర్ల సాయంతో..!
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, తెలంగాణ టైగర్స్ ప్లేయర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. వీవీఐపీ ఉత్తర్ప్రదేశ్తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్ గేల్ సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 46 బంతులు ఎదుర్కొన్న యూనివర్సల్ బాస్.. 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. గేల్ విధ్వంకర ఇన్నింగ్స్తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ టైగర్స్ విజయం సాధించలేకపోవడం కొసమెరుపు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ టైగర్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్ప్రదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 269 పరుగులు (నాలుగు వికెట్ల నష్టానికి) చేసింది. పవన్ నేగి విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 139; 16 ఫోర్లు, 8 సిక్సర్లు), అన్షుల్ కపూర్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకంతో విజృంభించారు. ఆఖర్లో కెప్టెన్ సురేశ్ రైనా (13 బంతుల్లో 27; 5 ఫోర్లు) మెరుపు వేగంతో పరుగులు చేశాడు. Chris Gayle masterclass in the IVPL. 🔥pic.twitter.com/v3ggELI13K— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024 అనంతరం అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలంగాణ టైగర్స్.. క్రిస్ గేల్ రెచ్చిపోయినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. గేల్ ఔటైన తర్వాత ఆఖర్లో శశకాంత్ రెడ్డి (39), కమలేశ్ (46 నాటౌట్) తెలంగాణను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఉత్తర్ప్రదేశ్ నిర్ధేశించిన లక్ష్యానికి తెలంగాణ 46 పరుగుల దూరంలో నిలిచిపోయింది. యూపీ బౌలర్లలో క్రిస్ మోఫు 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ ఏడాదే కొత్తగా ప్రారంభమైన ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ఫిబ్రవరి 23న మొదలైంది. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ లీగ్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024.. జట్ల వివరాలు
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) తొలి ఎడిషన్ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఇవాల్టి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇవాళ జరుగనున్న తొలి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్కోడ్లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. జట్ల వివరాలు.. రాజస్థాన్ లెజెండ్స్: ప్రవీణ్ కుమార్ (కెప్టెన్), ఏంజెలో పెరీరా, సీక్కుగే ప్రసన్న, పర్వీందర్ అవానా, లఖ్వీందర్ లఖా, దీపక్ మోహన్ కుక్కర్, సంజయ్ బామెల్, ఇషాన్ మల్హోత్రా, తరుణ్ కుమార్, గౌరవ్ సచ్దేవా, రవి కుమార్ అరోరా, లక్ష్మణ్ సింగ్, ముఖేష్ శర్మ, నరేష్ గహ్లోత్, రోహిత్ ఝలానీ, డాక్టర్ సతీష్ జైన్, నరేంద్ర కుమార్ మీనా, అమన్ వోహ్రా తెలంగాణ టైగర్స్: క్రిస్ గేల్ (కెప్టెన్), రికార్డో పావెల్, దిల్షన్ మునవీర, సుదీప్ త్యాగి, మన్ప్రీత్ గోనీ, మల్లికార్జున్ జగితి, రవి కుమార్, ఉమామేశ్ జి, కొడమర్తి కమలేష్, రాఘవ అమ్మిరెడ్డి, డాక్టర్ గిరి, తోట చంద్రశేఖర్, కేసరి శ్రీకాంత్, జె జగదీష్ రెడ్డి, ఎం రాజకృష్ణ, అభిజీ కదమ్, అహ్మద్ క్వాద్రీ, సమీర్ షేక్, గోవింద రాజు వీవీఐపీ ఉత్తర ప్రదేశ్: సురేష్ రైనా (కెప్టెన్), డాన్ క్రిస్టియన్, క్రిస్ ఎంఫోఫు, రజత్ భాటియా, అనురీత్ సింగ్, పర్విందర్ సింగ్, భాను సేథ్, రోహిత్ ప్రకాష్ శ్రీవాస్తవ, మిరతుంజయ్, కెఎస్ రాణా, జోగిందర్ సింగ్, వినోద్ విల్సన్, అన్షుల్ కపూర్, పర్వీన్ తహప్పర్, రాజేందర్ బిష్త్, దామోదర్ రెడ్కర్ , ప్రదీప్ కుమార్ పింటు, చంద్ర శేఖర కె, మోను కుమార్ ముంబై ఛాంపియన్స్: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), ఫిల్ మస్టర్డ్, అభిషేక్ జున్జున్వాలా, పీటర్ ట్రెగో, పంకజ్ సింగ్, గౌరంగ్ అగర్వాల్, ముఖేష్ సైనీ, అమిత్ సనన్, వినయ్ యాదవ్, నిర్వాన్ అత్రి, ప్రశాంత్ ఎ తగాడే, విజయ్ సింగ్, ఇక్బాల్ అబ్దుల్లా, విశ్వజిత్సిన్హ్ సోలన్సిన్హ్ సోలన్వాలా, సింగ్, అజయ్ సింగ్, మొహమ్మద్ జావేద్ మన్సూరి, విక్రమ్ భాస్కర్, కపిల్ మెహతా రెడ్ కార్పెట్ ఢిల్లీ: హర్షల్ గిబ్స్ (కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, తిసారా పెరీరా, ఇమ్రాన్ తాహిర్, అభిమన్యు మిథున్, రాజీవ్ త్యాగి, జితేంద్ర కుమార్, షాజిల్ బి, కపిల్ రాణా, విక్రమ్ ధనరాజ్ బాత్రా, బాబూరావ్ యాదవ్, అషు శర్మ, యుజ్వేందర్ సింగ్, అమిత్ శర్మ, ఆశిస్ శర్మ, మన్విన్దర్ శర్మ బిస్లా, రాకేష్ టాండేల్, విక్రాంత్ యాదవ్, అమిత్ తోమర్ ఛత్తీస్గఢ్ వారియర్స్: యూసుఫ్ పఠాన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్, నమన్ ఓజా, డ్వేన్ స్మిత్, అమిత్ పాల్, రోహిత్ కుమార్ ధృవ్, ధీరజ్ జి నర్వేకర్, ఆశిష్ శర్మ, మహ్మద్ కలీం ఖాన్, అనిమేష్ శర్మ, అభిషేక్ తామ్రాకర్, జతిన్ సహాయ్ సక్సేనా, సుశాంత్ శుక్లా, సుశాంత్ శుక్లా గిరి, షాదాబ్ జకాతి, హర్ప్రీత్ సింగ్, క్రాంతి కుమార్ వర్మ, రూపేష్ నాయక్ -
ఫిబ్రవరి 23 నుంచి వెటరన్ ఐపీఎల్.. తెలంగాణ కెప్టెన్గా క్రిస్ గేల్
విధ్వంసకర బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్ మరోసారి విధ్వంసానికి రెడీ అంటున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే వెటరన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో వీరు మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి నిర్వహించబడుతున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 3న ముగుస్తుంది. తొలుత ఈ టోర్నీని డెహ్రడూన్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వేదికను గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు మారుస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 23న జరుగునున్న తొలి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్కోడ్లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో భాగంగా కరాచీ కింగ్స్తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న మ్యాచ్లో బాబర్ (పెషావర్ జల్మీ) ఈ రికార్డును సాధించాడు. బాబర్కు ముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్లు తీసుకోగా.. బాబర్ కేవలం 271 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్, గేల్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (299 మ్యాచ్లు), డేవిడ్ వార్నర్ (303), ఆరోన్ ఫించ్ (327) ఉన్నారు. ఓవరాల్గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 12 మంది (బాబర్ సహా) క్రాస్ చేశారు. పాక్ తరఫున షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ ఈ ఘనతను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10,000 పరుగుల మార్కును తాకిన బాబర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. పెషావర్ ఇన్నింగ్స్లో బాబరే టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఒక్కడే రాణించడంతో 154 పరుగులకు ఆలౌటైంది. బాబర్తో పాటు రోవ్మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పెషావర్ ఇన్నింగ్స్లో ముగ్గురు (సైమ్ అయూబ్, జీషన్, సలాంకీల్) డకౌట్లయ్యారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఫ్యాన్స్కు ఇక పండగే.. క్రిస్ గేల్ రీ ఎంట్రీ! తెలంగాణ కెప్టెన్గా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్లో తెలంగాణ టైగర్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్రిస్ గేల్ స్వయంగా వెల్లడించాడు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు తొమ్మిది రోజుల పాటు డెహ్రడూన్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగనుంది. "నాపై నాకున్న నమ్మకం, అభిమానుల హర్ష ద్వనిలు నన్ను మళ్లీ బ్యాట్ పట్టేలా చేస్తున్నాయి. వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలతో మళ్లీ ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఐవీపీఎల్కు సిద్దమవ్వండి" అంటూ గేల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. గేల్తో పాటు భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్ప్రీత్ గోనీ, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం ఎన్ని జట్లు అంటే? ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్తో పాటు యూరోస్పోర్టస్ ఛానెల్లో అభిమానులు వీక్షించవచ్చు. కాగా వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్, హెర్షల్ గిబ్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో భాగం కానున్నట్లు సమాచారం. -
చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే!
Ind vs Afg 3rd T20- Virat Kohli On Cusp Of Becoming...: సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇప్పటికే ఎన్నెన్నో ఘనతలు సాధించాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అఫ్గనిస్తాన్తో మూడో టీ20 సందర్భంగా ఈ రన్మెషీన్ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. రీఎంట్రీలో దూకుడుగా కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం అనంతరం కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా తొలి టీ20తోనే బరిలోకి దిగాల్సి ఉండగా.. కూతురు వామిక పుట్టినరోజు(జనవరి 11) నేపథ్యంలో ఆ మ్యాచ్కు దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇండోర్లో ఆదివారం నాటి రెండో టీ20 సందర్భంగా రంగంలోకి దిగిన విరాట్ కోహ్లి.. 16 బంతుల్లో 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా దూకుడుగా ఆడుతూ అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడుతూ అభిమానులకు వినోదాన్ని పంచాడు. ఐపీఎల్ హోం గ్రౌంగ్లో సిక్స్తో ఆరంభిస్తే ఇక ఇప్పటికే ఈ సిరీస్ను టీమిండియా 2-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో బుధవారం నాటి నామమాత్రపు మూడో టీ20కి ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. విరాట్ కోహ్లికి ఐపీఎల్లో హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్గా ఈ జాబితాలో క్రిస్ గేల్(14562), షోయబ్ మాలిక్(12993), కీరన్ పొలార్డ్(12430) తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు. Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W — BCCI (@BCCI) January 15, 2024 పొట్టి ఫార్మాట్లో అన్నీ కలిపి దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ(టీ20) ట్రోఫీలో భాగమైన కోహ్లి.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్నీ కలిపి పొట్టి ఫార్మాట్లో పదకొండు వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో 4037 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి నంబర్ వన్(అత్యధిక రన్స్) బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అదే విధంగా.. ఐపీఎల్లోనూ 7263 రన్స్తో హయ్యస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
Viral Video: క్రిస్ గేల్ ఏం చేశాడో చూడండి..!
విండీస్ క్రికెట్ యెధుడు, విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ గతకొంతకాలంగా క్రికెట్కు దూరంగా ఉన్నా సోషల్మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉన్నాడు. యూనివర్సల్ బాస్ తరుచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంటాడు. తాజాగా గేల్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో గేల్ వచ్చీపోయే వాహదారుల గ్యాస్ బిల్లులు కడుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ, సరదాగా కనిపించాడు. అచ్చం గేల్లానే ఉన్న ఓ వ్యక్తి ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. Chris Gayle paid everyone's gas bill at the gas station. - The universal boss, Gayle...!!! 🐐pic.twitter.com/ATTqhGpahx — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024 గేల్ లాంటి జాలీ స్పోర్ట్స్ పర్సన్తో సెల్ఫీ దిగడమే ఎక్కువనుకుంటే, గ్యాస్ బిల్లులు కూడా అదనంగా కలిసొచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో గేల్ మైకంలో ఉండి ఇలా చేస్తున్నట్లున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా ఏదో ఒక సరదా పని చేసి సోషల్మీడియాకెక్కడం గేల్కు అలవాటే. అందుకే అతనికి విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 44 ఏళ్ల గేల్ క్రికెట్లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుని రికార్డుల రారాజుగా కీర్తించబడుతున్నాడు. పొట్టి ఫార్మాట్లో గేల్ ఇప్పటికీ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అలాగే సిక్సర్లకు సంబంధించిన పలు రికార్డులు కూడా గేల్ ఖాతాలో ఉన్నాయి. గేల్ ఐపీఎల్లో ఏకంగా 6 సెంచరీలు బాది ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో జరిగే దాదాపు ప్రతీ లీగ్లోనూ గేల్ పాల్గొన్నాడు. గేల్కు పరిమిత ఓవర్ల ఫార్మాట్తో పాటు టెస్ట్ ఫార్మాట్లో కూడా ఘనమైన రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో అతను 103 టెస్ట్లు ఆడి రెండు ట్రిపుల్ సెంచరీలు సహా 15 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు బాదాడు. గేల్ వన్డేల్లో 25, టీ20ల్లో 2 సెంచరీలు చేశాడు. గేల్కు క్రికెట్ చరిత్రలోనే అత్యంత జాలీ క్రికెటర్గా పేరుంది. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. రోహిత్, గేల్కు కూడా సాధ్యం కాని ఘనత సొంతం
పొట్టి ఫార్మాట్లో యూఏఈ కెప్టెన్, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్ ఇయర్స్లో హిట్మ్యాన్ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 26 మ్యాచ్ల్లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన నిన్నటి మ్యాచ్లో ముహమ్మద్ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్ లక్రా (63 నాటౌట్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్ జవాదుల్లా (4/26), అలీ నసీర్ (4/24) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ నబీ (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న జరుగనుంది. -
గర్జించిన గంభీర్.. క్రిస్ గేల్ పోరాటం వృధా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య నిన్న (డిసెంబర్ 6) జరిగిన మ్యాచ్ చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో గుజరాత్పై ఇండియా క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. క్రిస్ గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో పోరాడినప్పటికీ గుజరాత్ను గెలిపించలేకపోయారు. క్యాపిటల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి గుజరాత్ 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గర్జించిన గంభీర్.. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో కిర్క్ ఎడ్వర్డ్స్ (26), కెవిన్ పీటర్సన్ (26), రికార్డో పావెల్ (28), బెన్ డంక్ (30), చిప్లి (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఎమ్రిట్, రజత్ భాటియా చెరో 2 వికెట్లు.. శ్రీశాంత్, లడ్డా, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు. Gambhir 🤝 Knock-out game. Captain Gambhir lead by example in LLC.....!!!!!pic.twitter.com/ZN6edPYZtb— Johns. (@CricCrazyJohns) December 6, 2023 గేల్ పోరాటం వృధా.. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. క్రిస్ గేల్, కెవిన్ ఓబ్రెయిన్ పోరాడినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. గేల్, ఓబ్రెయిన్ క్రీజ్లో ఉండగా.. గుజరాత్ గెలుపు సునాయాసమేనని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. గేల్, ఓబ్రెయిన్లకు ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాక్ కల్లిస్ (11), రిచర్డ్ లెవి (11), అభిషేక్ ఝున్ఝున్వాలా (13) విఫలమయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో రస్టీ థీరన్, ఈశ్వర్ పాండే చెరో 2 వికెట్లు.. ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇసురు ఉడాన తలో వికెట్ దక్కించుకున్నారు. -
మళ్లీ మొదలెట్టిన క్రిస్ గేల్.. అవకాశం వచ్చినా సెంచరీ చేయలేకపోయిన సిమన్స్
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్ ఝులిపించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో భాగంగా భిల్వారా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్కు ఆడుతున్న గేల్.. భిల్వారా కింగ్స్తో నిన్న (నవంబర్ 22) జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. జెయింట్స్ ఇన్నింగ్స్లో రిచర్డ్ లెవి (28), అభిషేక్ ఝున్ఝున్వాలా (24), ఖురానా (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జాక్ కలిస్ (14), కెవిన్ ఓబ్రెయిన్ (11), కెప్టెన్ పార్థివ్ పటేల్ (8) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. భిల్వారా బౌలర్లలో రాహుల్ శర్మ, జెసల్ కరియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బార్న్వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్.. గుజరాత్ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్ ఇన్నింగ్స్లో లెండిల్ సిమన్స్ (61 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. కింగ్స్ గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా సిమన్స్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. కనీసం రెండు పరుగులు చేయగలిగినా సిమన్స్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు. కింగ్స్ ఇన్నింగ్స్లో తిలకరత్నే దిల్షన్ (1), యూసఫ్ పఠాన్ (5), కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జెయింట్స్ బౌలర్లలో రయాద్ ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ చెరో 2 వికెట్లు, శ్రీశాంత్, లడ్డా, రజత్ భాటియా తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 23) ఇండియా క్యాపిటల్స్, అర్బన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
హర్భజన్ మాయాజాలం.. కలిస్, గేల్ మెరుపులు వృధా
లెజెండ్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్లో భాగంగా గుజరాత్ జెయింట్స్తో నిన్న (నవంబర్ 20) జరిగిన మ్యాచ్లో మణిపాల్ టైగర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్.. హ్యామిల్టన్ మసకద్జ (37), తిసార పెరీరా (32), రాబిన్ ఉతప్ప (23) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జెయింట్స్ బౌలర్లలో రజత్ భాటియా 3, ట్రెంట్ జాన్స్టన్ 2, ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ, లడ్డా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్.. పర్వీందర్ అవానా (3-0-19-4), హర్భజన్ సింగ్ (4-1-14-2), తిసార పెరీరా (2-0-6-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. క్రిస్ గేల్ (24 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్), జాక్ కలిస్ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), పార్థివ్ పటేల్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్) జెయింట్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. లీగ్లో భాగంగా ఇవాళ (నవంబర్ 21) సథరన్ సూపర్ స్టార్స్, అర్బన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
వరల్డ్కప్లో రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ఆల్టైమ్ రికార్డు బద్దలు
CWC 2023- Ind vs NZ- Rohit Sharma Record: వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక సిక్సర్ల వీరుడిగా వెస్టిండీస్ స్టార్ క్రిస్గేల్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ముంబై వేదికగా టీమిండియా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడుతోంది. వాంఖడేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. కివీస్ను బౌలింగ్కు ఆహ్వానించింది. యువ బ్యాటర్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలి ఓవర్ నాలుగో బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో తొలి బౌండరీ బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మూడో ఓవర్ మూడో బంతికి సిక్సర్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మరో మూడు సిక్స్లు బాదాడు. దీంతో ప్రపంచకప్ తాజా ఎడిషన్లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 27కు చేరుకుంది. ఈ క్రమంలో వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా హిట్మ్యాన్ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్గేల్ను వెనక్కి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్లో మ్యాచ్లో.. మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 47 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పవర్ ప్లేలో దూకుడు ప్రదర్శించిన హిట్మ్యాన్ ఇన్నింగ్స్కు.. తొమ్మిదో ఓవర్ రెండో బంతి వద్ద తెరపడింది. కివీస్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లు ►27 - రోహిత్ శర్మ (2023) ►26 - క్రిస్ గేల్ (2015) ►22 - ఇయాన్ మోర్గాన్ (2019) ►22 - గ్లెన్ మ్యాక్స్వెల్ (2023) ►21 - ఏబి డివిలియర్స్ (2015) ►21 - క్వింటన్ డికాక్ (2023) చదవండి: న్యూజిలాండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే? View this post on Instagram A post shared by ICC (@icc) -
Rohit-Gayle: జెర్సీలపై 45.. వారికి నచ్చేది మాత్రం 6..!
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో మెరుపు శతకంతో (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించిన రోహిత్ శర్మ, టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ శతకంతో హిట్మ్యాన్ పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్ల రికార్డు ముఖ్యమైనది. విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ నిన్నటి మ్యాచ్లో అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కలిపి గేల్ 553 సిక్సర్లు సాధించగా.. రోహిత్ ఆఫ్ఘన్తో మ్యాచ్లో ఈ సంఖ్యను అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 556 సిక్సర్లు ఉన్నాయి. The 45s love their 6⃣s 👍 pic.twitter.com/5FHEP0xEwL — ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2023 హిట్మ్యాన్ తన రికార్డును బద్దలుకొట్టిన నేపథ్యంలో గేల్ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు రోహిత్ థ్యాంక్స్ చెబుతూ.. 4, 5 మన జెర్సీలపై ఉండే సంఖ్యలు.. మన ఫేవరెట్ మాత్రం 6 అంటూ తన సోషల్మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ఇద్దరు సిక్సర్ల వీరుల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసి వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, రోహిత్, క్రిస్ గేల్లు 45 సంఖ్య జెర్సీలు ధరిస్తారన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆడుతూపాడుతూ 35 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్లో రోహిత్ సెంచరీతో కదంతొక్కగా.. కోహ్లి (55 నాటౌట్), ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) రాణించారు. -
గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!; రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Rohit Sharma on Chris Gayle’s record In in international cricket: వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు తాను బద్దలు కొడితే బాగానే ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అయితే, ఇలాంటి విషయాల గురించి తాను ఎక్కువగా ఆలోచించని పేర్కొన్నాడు. కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్.. ఒకప్పుడు జట్టులో చోటు కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి. ఓపెనర్గా ప్రమోటై.. హిట్మ్యాన్గా రోహిత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చొరవతో ఓపెనర్గా ప్రమోట్ అయిన రోహిత్.. హిట్మ్యాన్గా మారిపోయాడు. అద్భుతమైన ఆట తీరుతో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా టీమిండియా కెప్టెన్ అయ్యాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్రకెక్కాడు. అరుదైన రికార్డు ముంగిట రోహిత్ అంతేకాదు.. సిక్సర్ల విషయంలోనూ టీమిండియా బ్యాటర్లందరి కంటే ముందే ఉన్నాడు. అంతర్జాతీయ టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా.. 77, 280, 182 సిక్స్లు బాదాడు హిట్మ్యాన్. ఈ క్రమంలో.. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. యూనివర్సల్ బాస్ సిక్సర్ల రికార్డుపై కన్నేసిన హిట్మ్యాన్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తన పేరిట ప్రపంచ రికార్డు లిఖించుకున్నాడు. 483 మ్యాచ్లలో యూనివర్సల్ బాస్ ఏకంగా 553 సిక్స్లు బాదాడు. కాగా క్రిస్ గేల్ రికార్డును అధిగమించేందుకు రోహిత్ కేవలం 15 సిక్స్ల దూరంలో ఉన్నాడు. అస్సలు అనుకోలేదు ఈ నేపథ్యంలో.. క్రికెట్ జర్నలిస్టు విమల్ కుమార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒకవేళ ఇది సాధ్యమైతే అరుదై రికార్డుగా మిగిలిపోతుంది. అయినా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతానని అస్సలు అనుకోలేదు. ఇలాంటి వాటి గురించి ఆలోచించడం ఫన్నీగా ఉంటుంది’’ అని హిట్మ్యాన్ వ్యాఖ్యానించాడు. 539 సిక్సర్లతో రెండో స్థానంలో రోహిత్ కాగా ఆసియా కప్-2023లో భాగంగా నేపాల్తో మ్యాచ్లో రోహిత్ శర్మ ఆరు సిక్స్లు బాదిన విషయం తెలిసిందే. శ్రీలంకలోని పల్లకెలెలో జరిగిన మ్యాచ్లో 59 బంతుల్లో 74 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్.. టీమిండియాను 10 వికెట్ల తేడాతో గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ వన్డే టోర్నీలో టీమిండియా తదుపరి పాకిస్తాన్తో కొలంబోలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు రోహిత్ శర్మ మొత్తంగా 446 మ్యాచ్లు ఆడి 539 సిక్స్లు బాదాడు. చదవండి: సచిన్ కంటే ఇంజమామ్ గొప్ప.. కోహ్లి కంటే బాబర్ బెటర్.. ఏంటిది? చెత్తగా.. -
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్
విండీస్తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 50 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన సూర్యకుమార్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ను అధిగమించాడు. 50 టీ20 ఇన్నింగ్స్ల తర్వాత స్కై ఖాతాలో 104 సిక్సర్లు ఉండగా.. గేల్ పేరిట 103 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు ఎవిన్ లెవిస్ 111 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లెవిస్, స్కై, గేల్ల తర్వాత కివీస్ కొలిన్ మున్రో (92), ఆరోన్ ఫించ్ (79) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 50 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ స్కై నాలుగో స్థానంలో ఉన్నాడు. విండీస్తో ఐదో టీ20లో 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్.. 50 ఇన్నింగ్స్ల అనంతరం 1841 పరుగులు చేసి ఈ విభాగంలో విరాట్ కోహ్లి (1943), బాబర్ ఆజమ్ (1942), మహ్మద్ రిజ్వాన్ (1888) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో స్కై తర్వాత కేఎల్ రాహుల్ (1751) ఐదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్కు స్వర్గధామమైన ఫ్లోరిడా పిచ్పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఐదో టీ20లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఫలితంగా భారత్ మ్యాచ్తో పాటు సిరీస్ను (2-3) కూడా కోల్పోయింది. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్ను తృటిలో చేజార్చుకుంది. -
లంక ప్రీమియర్ లీగ్లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా గాలే టైటాన్స్తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్లో శతక్కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) పొట్టి క్రికెట్లో (అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్లు) అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 10 శతకాలు బాదిన రెండో బ్యాటర్ రికార్డుల్లోకెక్కాడు. Maiden LPL century for Babar Azam 👏 📸: Fan Code pic.twitter.com/S0KaiJmuAh — CricTracker (@Cricketracker) August 7, 2023 బాబర్కు ముందు విధ్వంకర వీరుడు, విండీస్ యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. గేల్ తన 463 మ్యాచ్ల టీ20 కెరీర్లో ఏకంగా 22 శతకాలు బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 2005 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్ల్లో పాల్గొన్న గేల్ 22 సెంచరీలతో పాటు 88 హాఫ్సెంచరీలు బాది 14562 పరుగులు చేశాడు. Kasun Rajitha ends Babar Azam's masterclass. Colombo Strikers need a miracle to win the game. pic.twitter.com/btIUW54X9p — CricTracker (@Cricketracker) August 7, 2023 ఇందులో గేల్ 2013 ఐపీఎల్లో పూణే వారియర్స్పై చేసిన 175 నాటౌట్ (66 బంతుల్లో) అత్యధికంగా ఉంది. గేల్ తర్వాతి స్థానంలో ఉన్న బాబర్ 2012 నుంచి నేటి వరకు 264 టీ20లు ఆడి 10 సెంచరీలు 77 హాఫ్ సెంచరీల సాయంతో 9412 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, బాబర్ల తర్వాత క్లింగర్ (206 మ్యాచ్ల్లో 5960 పరుగులు, 8 సెంచరీలు), డేవిడ్ వార్నర్ (11695 పరుగులు, 8 సెంచరీలు), విరాట్ కోహ్లి (11965, 8), ఆరోన్ ఫించ్ (11392, 8) తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు. Meet the duo with over ten or more centuries each in T20s🥶 pic.twitter.com/Wnkl8cn2SV — CricTracker (@Cricketracker) August 7, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. గాలే టైటాన్స్తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్లో కొలొంబో స్టయికర్స్ ఆటగాడు విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్ కెప్టెన్.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
ఆల్టైమ్ బెస్ట్ టీ20 జట్టు ఇదే.. !
టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే ఈ అధునాతన చాట్బోట్.. మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో పని చేస్తూ, టెక్స్ట్ రూపంలో యూజర్లు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సెకెన్ల వ్యవధిలో వివరమైన సమాధానం ఇస్తుంది. ఈ టూల్ తన బ్యాక్ ఎండ్లో ఉన్న అపారమైన డేటా బేస్ సాయంతో యూజర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్, ఆరోగ్యం, క్రీడలు, రాజకీయాలు, వంటకాలు, లైఫ్స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా చాట్ జీపీటీ ఇట్టే సమాధానం చెబుతుంది. ఈ ఏఐ టూల్ క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెబుతుంది. టీ20 క్రికెట్లో ఆల్టైమ్ బెస్ట్ జట్టు ఏది అని చాట్ జీపీటీని అడిగితే.. క్రిస్ గేల్, రోహిత్, కోహ్లి, ధోనిలతో కూడిన 11 మంది సభ్యుల పేర్లను చెప్పింది. జట్టు కూర్పు విషయంలో ఈ టూల్ అచ్చం మనిషిలా ఆలోచించి సమతూకమైన జట్టును ప్రకటించింది. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి స్పిన్నర్లు, పేసర్లు, వికెట్కీపర్.. ఇలా ఓ పర్ఫెక్ట్ జట్టుకు ఉండాల్సిన వనరులన్నిటినీ చాట్ జీపీటీ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సమకూర్చింది. ఈ జట్టుకు చాట్ జీపీటీ ధోనిని కెప్టెన్ కమ్ వికెట్కీపర్గా ఎన్నుకుంది. ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన చాట్ జీపీటీ.. వన్డౌన్లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఐదో ప్లేస్లో మ్యాక్స్వెల్, ఆతర్వాత ధోని, ఆల్రౌండర్ కోటాలో షాహిద్ అఫ్రిది, స్పెషలిస్ట్ స్పిన్నర్గా రషీద్ ఖాన్, పేసర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయిన్లను ఎంచుకుంది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఎంచుకోలేని పర్ఫెక్ట్ టీ20 జట్టును చాట్ జీపీటీ ఎంపిక చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయడం మనిషి వల్ల కాదని కామెంట్లు చేస్తున్నారు. -
శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..!
జింబాబ్వే టీ10 లీగ్లో ఆ దేశ స్టార్ ఆల్రౌండర్ సికందర్ రజా చెలరేగిపోయాడు. హరారే హరికేన్స్తో నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్లో శివాలెత్తిపోయిన రజా (బులవాయో బ్రేవ్స్ కెప్టెన్).. లీగ్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15 బంతుల్లో) కొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తం 21 బంతులను ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. రజాకు కోబ్ హెఫ్ట్ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో బులవాయో బ్రేవ్స్ 135 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఊదేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్.. భారత వెటరన్ రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విండీస్ వీరుడు ఎవిన్ లివిస్ (19 బంతుల్లో 49; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఫెరియెరా (21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 18 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాట్తో విధ్వంసం సృష్టించిన సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టగా.. ప్యాట్రిక్ డూలీ 2, తిస్కిన్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్స్.. సికందర్ రజా, కోబ్ హెఫ్ట్, వెబ్స్టర్ (12 నాటౌట్; ఫోర్, సిక్స్) విజృంభించడంతో 9.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్స్ ఇన్నింగ్స్లో బెన్ మెక్డెర్మాట్ (8) నిరాశపరచగా.. హరికేన్స్ బౌలర్లలో మహ్మద్ నబీ, నండ్రే బర్గర్ తలో వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్దే.. టీ10 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అబుదాబీ టీ10 లీగ్ 2021 సీజన్లో బాస్ 12 బంతుల్లో 50 కొట్టాడు. అంతకుముందు ఇదే లీగ్ 2018 సీజన్లో ఆఫ్ఘన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ కూడా 12 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. -
WC 2023: గొప్ప బ్యాటర్వే! కానీ నీకసలు బుర్ర లేదు..
ICC ODI World Cup 2023: వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్గేల్పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ‘‘ఎందుకిలా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు’’ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఇటీవలే వన్డే ప్రపంచకప్-2023 షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ అక్టోబరు 5న మొదలు కానున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి జూన్ 27 ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీలో ఫేవరెట్లు, సెమీ ఫైనలిస్టులపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. భారత్, పాక్తో పాటు ఆ రెండు జట్లు ఇందులో భాగంగా కరేబియన్ లెజెండ్ క్రిస్ గేల్ సైతం టాప్-4 జట్లను ఎంచుకున్నాడు. ‘‘ఫేవరెట్ ఎవరన్నది తెలియదు గానీ.. సెమీ ఫైనలిస్టులను మాత్రం అంచనా వేయగలను. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. ఈ నాలుగు సెమీస్ చేరగలవు’’ అని పేర్కొన్నాడు. ఇక్కడి దాకా అంతబాగానే ఉన్నా. వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా కీలక క్రికెటర్లు ఎవరన్న అంశంపై క్రిస్ గేల్ ఇచ్చిన జవాబే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ‘‘ఈసారి ప్రపంచకప్లో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఇండియాకు కీలకం కానున్నారు’’ అని తెలిపాడు. అతడికేమో గాయం.. ఇక కాగా టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా.. వెన్ను నొప్పి కారణంగా నెలల తరబడి జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు.. టీ20లలో నెంబర్ 1 బ్యాటర్గా నిలిచిన సూర్య వన్డే రికార్డు అంతంత మాత్రమే. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 23 వన్డేలు ఆడిన సూర్యకుమార్ చేసిన మొత్తం పరుగులు 433. అత్యధిక స్కోరు 64. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మేటి ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గేల్.. బుమ్రా, సూర్య పేర్లను చెప్పడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో ‘‘గొప్ప బ్యాటర్వి. కానీ నీకసలు బుర్ర లేదు’’ అంటూ గేల్ను ట్రోల్ చేస్తున్నారు. చదవండి: WC 2023: వెస్టిండీస్కు ఊహించని షాకిచ్చిన స్కాట్లాండ్! మరీ ఘోరంగా.. -
Virat Kohli: గేల్ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి!
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జూలు విదిల్చింది. కోహ్లి సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే గాక మెరుగైన రన్రేట్తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లేఆఫ్లో అడుగుపెడుతుంది. ఇక మ్యాచ్లో శతకం సాధించిన కోహ్లి ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ ఐపీఎల్లో ఆరు శతకాలు సాధించాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కోహ్లి ఐపీఎల్లో ఆరో సెంచరీ సాధించి గేల్ రికార్డును సమం చేశాడు. కోహ్లి, గేల్ తర్వాత జాస్ బట్లర్ ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి మరొక సెంచరీ సాధిస్తే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్గా చరిత్రకెక్కనున్నాడు. ఇక ఐపీఎల్లో ఒక మ్యాచ్లో రెండు శతకాలు నమోదు కావడం ఇది మూడోసారి. ఇంతకముందు 2016లో గుజరాత్ లయన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు కోహ్లి, డివిలియర్స్లు శతకాలు బాదారు. 2019లో డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో జంట ఆర్సీబీపై సెంచరీలతో చెలరేగగా.. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం ఎస్ఆర్హెచ్,ఆర్సీబీ మ్యాచ్లో.. మొదట క్లాసెన్ ఆర్సీబీపై .. అటుపై కోహ్లి ఎస్ఆర్హెచ్పై సెంచరీతో చెలరేగాడు. 💯 Bow down to the greatness of 👑 #ViratKohli 👏 He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds 🔥#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6 — JioCinema (@JioCinema) May 18, 2023 చదవండి: ఉప్పల్లో మ్యాచ్ అంటే చెలరేగుతాడు.. కోహ్లి అరుదైన రికార్డు -
LSG VS PBKS: ఆ ఒక్కడే తప్పించుకున్నాడు.. అప్పుడు భువీ..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం విధితమే. ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా లక్నో బ్యాటర్లు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ (257) నమోదు చేశారు. కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) విధ్వంసం ధాటికి పంజాబ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అయితే లక్నో బ్యాటర్ల బారి నుంచి ఒక్క పంజాబ్ బౌలర్ మాత్రం తప్పించుకున్నాడు. అతడే రాహుల్ చాహర్.ఈ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించగా, రాహుల్ చాహర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లను అద్భుతంగా బౌల్ చేసిన చాహర్.. 29 పరుగులు మాత్రమే ఇచ్చి, శివాలెత్తి ఉన్న లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. మరోవైపు మిగతా పంజాబ్ బౌలర్లు లక్నో బ్యాటర్ల ఊచకోతను విలవిలలాడిపోయారు. గుర్నూర్ సింగ్ బ్రార్ 3 ఓవర్లలో 42 పరుగులు, అర్షదీప్ సింగ్.. తన ఐపీఎల్ కెరీర్లో అత్యంత చెత్త గణాంకాలు (4-0-54-1), రబాడ 4 ఓవర్లలో 52 పరుగులు, సికందర్ రజా ఒక ఓవర్లో 17, సామ్ కర్రన్ 3 ఓవర్లలో 38, లివింగ్స్టోన్ ఒక ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నారు. ఛేదనలో పంజాబ్ ఆటగాళ్ల ధాటికి లక్నో బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. యశ్ ఠాకూర్ (4/37), నవీన్ ఉల్ హాక్ (3/30) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్ధి ఓటమిని ఖరారు చేశారు. రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, 2 కీలక వికెట్లు (అథర్వ టైడే (66), లివింగ్స్టోన్ (23)) తీశాడు. అప్పట్లో భువీ కూడా ఇంతే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ (ఆర్సీబీ- 263) నమోదైన మ్యాచ్లోనూ ఇదే తరహాలో ఓ బౌలర్ ఆర్సీబీ బౌలర్ల బారి నుంచి తప్పించుకున్నాడు. నాటి మ్యాచ్లో పూణే బౌలర్లంతా విచ్చలవిడిగా పరుగులు సమర్పించుకుంటే.. ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రం తాండవం చేస్తుండిన ఆర్సీబీ బ్యాటర్లను, ముఖ్యంగా అప్పటికే ఊగిపోతున్న క్రిస్ గేల్ను కట్టడి చేశాడు. ఆ మ్యాచ్లో భువీ 4 ఓవర్లు వేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇవ్వగా.. మిగతా బౌలర్లంతా 12 నుంచి 29 ఎకానమీ మధ్యలో పరుగులు సమర్పించుకున్నారు. -
ఐపీఎల్-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్కే మాజీ ఆల్రౌండర్ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్ఆర్ జోస్ బట్లర్, ఆర్సీబీ విరాట్, పంజాబ్ రాహుల్, ఢిల్లీ వార్నర్ ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్ శర్మ (240) బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) ఉన్నాడు. అత్యధిక డక్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రానున్న సీజన్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్మ్యాన్ మరో మ్యాచ్లో డకౌటైతే మన్దీప్ సింగ్ (14)ను అధిగమించి హోల్ అండ్ సోల్గా చెత్త రికార్డుకు ఓనర్ అవుతాడు. ఇవే కాకుండా రానున్న సీజన్లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే.. అత్యధిక మ్యాచ్లు: సీఎస్కే సారధి ఎంఎస్ ధోని రానున్న ఐపీఎల్ సీజన్లో 250 మ్యాచ్ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో 234 మ్యాచ్లు ఆడి టాప్లో ఉన్నాడు. అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ రానున్న సీజన్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్ ఖాతాలో 6244 రన్స్ ఉన్నాయి. అలాగే వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్లో చేరే అవకాశం ఉంది. అత్యధిక క్యాచ్లు: ఐపీఎల్లో ఇప్పటివరకు 97 క్యాచ్లు అందుకున్న రోహిత్ శర్మ, 93 క్యాచ్లు అందుకున్న విరాట్ కోహ్లి 100 క్యాచ్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్ రైనా (109) పేరిట ఉంది. -
వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 39 బంతుల్లోనే!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. విండీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కింగ్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన చార్లెస్.. మొదటి బంతి నుంచే ప్రోటీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్లు ఉన్నాయి. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్న ఈ కరీబియన్.. అనంతరం మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్క్ను పూర్తిచేశాడు. ఇక 39 బంతుల్లో విధ్వంసకర శతకం సాధించిన చార్లెస్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చార్లెస్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ సాధించిన వెస్టిండీస్ క్రికెటర్గా చార్లెస్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2016లో ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టీ20లో గేల్ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇక తాజా మ్యాచ్లో 39 బంతుల్లోనే సెంచరీ సాధించిన చార్లెస్.. గేల్ రికార్డు బ్రేక్ చేశాడు. ►అదే విధంగా విదేశీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన విండీస్ క్రికెటర్గా చార్లెస్(118) నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉండేది. 2007లో దక్షిణాఫ్రికా పైనే గేల్ 117 పరుగులు సాధించాడు. ►ఇక ప్రపంచ క్రికెట్లో టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా చార్లెస్ నిలిచాడు .అంతకుముందు ప్రోటీస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విండీస్ భారీ స్కోర్ ఇక చార్లెస్ అద్భుత ఇన్నింగ్స ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. చార్లెస్తో పాటు ఓపెనర్ కైల్ మైర్స్ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలరల్లో జానెసన్ మూడు వికెట్లు,పార్నెల్ రెండు వికెట్లు సాధించారు. -
ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్వే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ మరికొద్ది రోజుల్లో (మార్చి 31) ప్రారంభంకానున్న నేపథ్యంలో లీగ్లో ఇప్పటిదాకా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం. అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లి (ఆర్సీబీ తరఫున 223 మ్యాచ్ల్లో 6624 పరుగులు) అత్యధిక వ్యక్తిగత స్కోర్: క్రిస్ గేల్ (ఆర్సీబీ తరఫున పూణే వారియర్స్పై 66 బంతుల్లో 175 నాటౌట్) అత్యధిక సెంచరీలు: క్రిస్ గేల్ (6) అత్యధిక సగటు: కేఎల్ రాహుల్ (48.01) అత్యధిక స్ట్రయిక్ రేట్ (ఆండ్రీ రసెల్, 177.88) అత్యధిక హాఫ్ సెంచరీలు: డేవిడ్ వార్నర్ (55) ఫాస్టెస్ట్ ఫిఫ్టి (కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ 14 బంతుల్లో) ఫాస్టెస్ట్ సెంచరీ (క్రిస్ గేల్, పూణే వారియర్స్పై 30 బంతుల్లో) అత్యధిక ఫోర్లు (శిఖర్ ధవన్, 701) అత్యధిక సిక్సర్లు (క్రిస్ గేల్, 357) ఓ ఇన్నింగ్స్లో అత్యధిక ఫోర్లు (పాల్ వాల్తాటి, ఏబీ డివిలియర్స్-19) ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (క్రిస్ గేల్, 17) ఓ సీజన్లో అత్యధిక పరుగులు (విరాట్ కోహ్లి, 2016లో 973 పరుగులు) ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (క్రిస్ గేల్, రవీంద్ర జడేజా-36 పరుగులు) అత్యధిక డకౌట్లు (రోహిత్ శర్మ, మన్దీప్ సింగ్-14) అత్యధిక వికెట్లు (డ్వేన్ బ్రావో- 183) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (అల్జరీ జోసఫ్- 6/12) అత్యుత్తమ ఎకానమీ (రషీద్ ఖాన్- 6.37) అత్యధిక మెయిడిన్లు (ప్రవీణ్ కుమార్-14) అత్యధిక డాట్ బాల్స్ (భువనేశ్వర్ కుమార్-1406) అత్యధిక సార్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు (సునీల్ నరైన్-8 సార్లు) లీగ్ మొత్తంలో హ్యాట్రిక్లు: 21 అత్యధిక డిస్మిసల్స్ (వికెట్కీపర్గా): ధోని (170) అత్యధిక క్యాచ్లు (వికెట్కీపర్): ధోని (131) అత్యధిక స్టంపౌట్లు: ధోని (39) అత్యధిక క్యాచ్లు (ఫీల్డర్): సురేశ్ రైనా (109) ఓ ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు (ఫీల్డర్): నబీ (5) అత్యధిక మ్యాచ్లు: ధోని (234) కెప్టెన్గా అత్యధిక మ్యాచ్లు: ధోని (210) కెప్టెన్గా అత్యధిక విజయాలు: ధోని (123) అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు: ఏబీ డివిలియర్స్ (25) అత్యధిక టీమ్ స్కోర్: ఆర్సీబీ (263/3) అత్యల్ప టీమ్ స్కోర్: ఆర్సీబీ (49 ఆలౌట్) అత్యధిక టైటిల్స్: ముంబై ఇండియన్స్-5 -
క్రిస్ గేల్ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్ బాస్
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గడం లేదు. బాస్.. గతంలో బంతిని ఎలా చెడుగుడు ఆడేవాడో ఇప్పుడు అదే రీతిలో చెలరేగుతున్నాడు. గేల్ 43 ఏళ్ల వయసులోనూ యువకుల తరహాలో భారీ షాట్లు ఆడి ఔరా అనిపిస్తున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 15) ఇండియా మహారాజాస్తో జరిగిన మ్యాచ్లో గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి పాత రోజులు గుర్తు చేశాడు. అంతేకాక అతని జట్టు వరల్డ్ జెయింట్స్ను ఒంటిచేత్తో గెలిపించాడు. It’s the man with the moves!🏏👏 Ladies and Gentlemen, @henrygayle is the @officialskyexch Legend of the match! 🎉🔥#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/eht1CY7rP6 — Legends League Cricket (@llct20) March 15, 2023 వివరాల్లోకి వెళితే.. ఇండియా మహారాజాస్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్.. బ్రెట్ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్ (4-0-27-2) చెలరేగడడంతో ప్రత్యర్ధిని 136 పరుగులకే కట్టడి చేసింది. మహారాజాస్ టీమ్లో సురేశ్ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా.. బిస్లా (36), ఇర్ఫాన్ పఠాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. What a solid display!!! @WorldGiantsLLC pic.twitter.com/JYzOxr7K2q — Legends League Cricket (@llct20) March 15, 2023 అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్కు షేన్ వాట్సన్ (26), సమిత్ పటేల్ (12) సహకరించారు. మహారాజాస్ బౌలర్లలో యుసఫ్ పఠాన్ (4-0-14-2), ప్రవీణ్ తాంబే (4-0-22-1), హర్భజన్ సింగ్ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్లో ఇండియా మహారాజాస్ జట్టుకు హర్భజన్ సింగ్ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. Giants on top! A statement by the defending champions as we are close to the finals! 💪🏏@WorldGiantsLLC @henrygayle @AaronFinch5 @ShaneRWatson33 @BrettLee_58 @RossLTaylor #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/mvLoF2Ruos — Legends League Cricket (@llct20) March 15, 2023 లీగ్లో మహారాజాస్ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్లో గెలవగా.. వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇవాళ (మార్చి 16) వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ తలపడనున్నాయి. Points Table Update after Match Day 5. Table has been toppled from top to bottom! World Giants made a huge jump to the top spot after today’s win with the Lions shifting down to second, and the Maharajas drops to third consequently.#SkyexchnetLLCMasters #YahanSabBossHain pic.twitter.com/hDHT1I9uVO — Legends League Cricket (@llct20) March 15, 2023 .@harbhajan_singh is still the @rariohq Boss Cap Holder for the most wickets!#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/EnVV0j2Rad — Legends League Cricket (@llct20) March 15, 2023 .@GautamGambhir still holds his ground as the @rariohq Boss Cap Holder for the highest runs. #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/3zKKssdcka — Legends League Cricket (@llct20) March 15, 2023 Grind, Giggles, and Greatness! Gayle! ⚡💪💥 The legend of the match spills the tea on today's performance, daily routine secrets, and getting ready for tomorrow's showdown! @henrygayle#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/SwpRB1gopG — Legends League Cricket (@llct20) March 15, 2023 -
కోహ్లి కాదు, గేల్ కాదు.. ఏబీడీ ఆల్టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అతడే..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఇటీవల తనకు ఎదురైన ఓ క్లిష్ట ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. పొట్టి క్రికెట్లో ఆల్టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు అని ఏబీడీని ప్రశ్నించగా.. అతను తన ఆప్త మిత్రుడు విరాట్ కోహ్లి పేరు కానీ, ఆర్సీబీ మాజీ సహచరుడు, విధ్వంసకర ఆటగాడు, విండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ పేరు కానీ చెప్పకుండా ఎవరూ ఊహించని విధంగా ఆఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ పేరు చెప్పి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న రషీద్ను ఆల్టైమ్ గ్రేట్గా ప్రకటించడాన్ని సమర్ధించుకున్న ఏబీడీ.. రషీద్ను మ్యాచ్ విన్నర్గా పరిగణిస్తానని, మైదానంలో అతనో గర్జించే సింహమని కొనియాడాడు. రషీద్ ప్రతిసారి గెలవాలనుకుంటాడని, ఈ లక్షణమే అతన్ని ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలబెట్టిందని అన్నాడు. టీ20ల్లో రషీద్కు మించిన బెస్ట్ ఆల్రౌండన్ను చూడలేదని చెప్పిన ఏబీడీ.. పొట్టి ఫార్మాట్లో అతను ప్రదర్శించే గట్స్కు సలామ్ కొట్టాడు. సూపర్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ తన మనసులో మాటను బయటపెట్టాడు. కాగా, రషీద్ ఖాన్.. 2017 ఐపీఎల్ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. 2017 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 5 ఎడిషన్లలో 93 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్కు వలస వెళ్లిన రషీద్.. ఈ సీజన్ మొత్తంలో 19 వికెట్లు పడగొట్టి, ఆ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 77 మ్యాచ్ల్లో 126 వికెట్లు పడగొట్టిన రషీద్.. 92 ఐపీఎల్ మ్యాచ్ల్లో 112 వికెట్లు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రషీద్.. ఐపీఎల్తో పాటు ప్రపంచం నలుమూలల్లో జరిగే వివిధ లీగ్ల్లో పాల్గొంటాడు. అతను పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్ తరఫున, బిగ్ బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రయికర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
IPL: ఆల్టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! అతడికి బదులు..
Former Players All Time IPL XI: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్లో ఈ విధ్వంసకర బ్యాట్స్మన్కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇండియన్ ఫ్యాన్స్కు మరింత చేరువయ్యాడు. ఢిల్లీ డేర్డెవిల్స్తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆటతో క్రికెట్ ప్రేమికులను అలరించాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ఏబీ డివిలియర్స్.. 170 ఇన్నింగ్స్లో కలిపి మొత్తంగా 5162 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ అత్యధిక స్కోరు 133. ఇలా అద్భుత ప్రదర్శనతో తను ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన ఏబీడీకి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన ఆల్టైం జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ఐపీఎల్-2023 నేపథ్యంలో జియోసినిమా షో లెజెండ్స్ లాంజ్లో క్రిస్ గేల్, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, రాబిన్ ఊతప్ప, స్కాట్ స్టైరిస్ వంటి మాజీ క్రికెటర్లతో కలిపి పాల్గొన్నాడు అనిల్ కుంబ్లే. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను ఈ సందర్భంగా... చర్చలో భాగంగా తమ ఆల్టైం ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్ను చెప్పాలని కోరగా.. కుంబ్లే.. డివిలియర్స్కు తన జట్టులో చోటు కష్టమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘నా జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను. ఇక ఆరోస్థానంలో పొలార్డ్ను ఆడిస్తా’’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సారథి ధోనికే తన ఓటు అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇతరుల్లో గేల్ ఓపెనర్గా తన పేరును తాను సూచించగా.. పార్థివ్ పటేల్ అతడికి జోడీగా విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు. ఈ చర్చలో భాగంగా ఆఖర్లో పొలార్డ్ను కాదని డివిలియర్స్కే చోటిచ్చారు మిగతా మాజీలు. లెజెండ్స్ ఎంపిక చేసిన ఆల్టైం ఐపీఎల్ జట్టు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సునిల్ నరైన్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ. చదవండి: Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్ప్రెషన్కు అర్థమేంటి! ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్గా సిరాజ్ -
డివిలియర్స్, క్రిస్ గేల్తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు
టీ20ల్లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్య మెరుపు శతకం సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య తన మూడో అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఓవరాల్గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఈ టీ20 వరల్డ్ నెం1 బ్యాటర్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సూర్యను పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసలతో ముంచెత్తాడు. దిగ్గజ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ను సూర్యకుమార్ మించిపోయాడు అని కనేరియా కొనియాడాడు. "ప్రపంచ క్రికెట్లో కొత్త యూనివర్స్ బాస్ వచ్చాడు. అతడు ఎవరో కాదు భారత విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్. సూర్య ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ముందే చెప్పాను ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో సూర్య లిఖించుకుంటాడని. అతడు ఈ మ్యాచ్లో కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు సాధించాడు. సూర్య లాంటి మరో ఆటగాడు ప్రపంచంలోనే ఉండడు. తరుచూ అందరూ సూర్యను డివిలియర్స్, క్రిస్ గేల్తో పోలుస్తున్నారు. కానీ, వారిద్దరూ కూడా సూర్య ముందు ప్రస్తుతం తేలిపోతారనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వారిద్దరిని తన ఆట తీరుతో సూర్యకుమార్ అధిగమించాడు. సూర్య తన విధ్వంసకర ఆటతో టీ20 క్రికెట్ను ఇప్పటికే వేరే స్థాయికి తీసుకువెళ్లాడు" అని కనేరియా తన యాట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్ -
టీ20 వరల్డ్కప్ల్లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
దేశవాళీ, ఐపీఎల్ తరహా లీగ్ల్లో మూడంకెల స్కోర్ను చేరుకోవడం సర్వసాధారణమైపోయినప్పటికీ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఈ మార్కును చేరుకోవడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే సెంచరీ సాధించిన ఆటగాళ్ల సంఖ్యను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి ఇవాల్టి (అక్టోబర్ 27) దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ వరకు కేవలం 10 శతకాలు మాత్రమే నమోదయ్యాయంటే నమ్మి తీరాల్సిందే. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రొస్సో సాధించిన సుడిగాలి శతకం (56 బంతుల్లో 109; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) టీ20 వరల్డ్కప్ చరిత్రలో పదవ శతకంగా రికార్డయ్యింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (117) తొలి శతకాన్ని నమోదు చేశాడు. 2007 ఇనాగురల్ టీ20 వరల్డ్కప్లో సౌతాఫ్రికాపై గేల్ శతకం బాదాడు. గేల్ తర్వాత పొట్టి ప్రపంచకప్లో రెండో శతకాన్ని టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా బాదాడు. రైనా 2010 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాపై 101 పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్కప్లో టీమిండియా తరఫున ఇప్పటివరకు మూడంకెల స్కోర్ సాధించిన ఆటగాడు రైనా ఒక్కడే కావడం విశేషం. వీరి తర్వాత మహేళ జయవర్ధనే (2010లో జింబాబ్వేపై 100), బ్రెండన్ మెక్కల్లమ్ (2012లో బంగ్లాదేశ్పై 123), అలెక్స్ హేల్స్ (2014లో శ్రీలంకపై 116 నాటౌట్), అహ్మద్ షెహజాద్ (2014లో బంగ్లాదేశ్పై 111 నాటౌట్), తమీమ్ ఇక్బాల్ (2016లో ఓమన్పై 103 నాటౌట్), క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్పై 100 నాటౌట్), జోస్ బట్లర్ (2021లో శ్రీలంకపై 101 నాటౌట్), తాజాగా రిలి రొస్సో టీ20 ప్రపంచకప్ల్లో శతకాలు సాధించారు. -
T20 WC: టీ20 వరల్డ్కప్-2022.. రోహిత్ శర్మను ఊరిస్తున్న ఐదు అరుదైన రికార్డులు
T20 World Cup 2022- Rohit Sharma: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం (అక్టోబరు 16) నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే టీమిండియా సభ్యుడిగా పలుసార్లు ఈ మెగా టోర్నీ ఆడిన రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్గా కొత్త హోదాలో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో అద్భుత రికార్డు ఉన్న హిట్మ్యాన్ను ఊరిస్తున్న ఐదు రికార్డులను ఓసారి పరిశీలిద్దాం. 1.కెప్టెన్గా అరుదైన రికార్డు సాధించే అవకాశం యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ హిట్టర్ క్రిస్గేల్ 2010 ప్రపంచకప్లో తమ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ సందర్భంగా టీమిండియాతో మ్యాచ్లో 66 బంతులు ఎదుర్కొన్న అతడు 98 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక కెప్టెన్కు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పుడు రోహిత్ శర్మకు ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశం ముందుంది. టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగనున్న హిట్మ్యాన్ 99 లేదంటే ఏకంగా సెంచరీ సాధించాడంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా నిలుస్తాడు. 2. నాలుగో స్థానం నుంచి.. టీ20 వరల్డ్కప్లో శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్దనేకు అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు ఉంది. మొత్తంగా ఐదుసార్లు ఈ ఐసీసీ ఈవెంట్ ఆడిన జయవర్ధనే 1016 పరుగులు సాధించాడు. విండీస్ హిట్టర్ క్రిస్గేల్ 965, తిలకరత్నె దిల్షాన్ 897 పరుగులతో అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాన్ని రోహిత్ శర్మ ఆక్రమించాడు. ఇప్పటి వరకు 847 పరుగులు సాధించాడు. ఈసారి ప్రపంచకప్లో అతడు మొత్తంగా 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. 3. ఈ రికార్డు లాంఛనమే! హిట్మ్యాన్ రోహిత్ శర్మ 2007లో టీమిండియా తరఫున తొలిసారి టీ20 వరల్డ్కప్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 33 మ్యాచ్లు ఆడిన అతడు.. మరో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకుంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా నిలుస్తాడు. ధోని, గేల్, ముష్షికర్ రహీంలను దాటుకుని.. శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్(35 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాడు. ఎలాంటి ఆటంకాలు, గాయాల బెడద వంటివి లేకుండా రోహిత్ బరిలోకి దిగితే ఈ రికార్డు సాధించడం లాంఛనమే! ఇప్పటి వరకు టీ20 వరల్డ్కప్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు ►తిలకరత్నె దిల్షాన్-35 ►డ్వేన్ బ్రావో- 34 ►షోయబ్ మాలిక్- 34 ►ఎంఎస్ ధోని- 33 ►క్రిస్ గేల్-33 ►ముష్ఫికర్ రహీం- 33 ►రోహిత్ శర్మ- 33 4. బ్రెండన్ మెకల్లమ్ రికార్డు అధిగమించే అవకాశం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఇంగ్లండ్ ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీ20 వరల్డ్కప్ చరిత్రలో తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. 2012లో బంగ్లాదేశ్తో మ్యాచ్లో 58 బంతుల్లో 123 పరుగులు సాధించి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇక మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 65 బంతుల్లో 79 పరుగులు. 2010లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ స్కోరు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్లో ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 4 సెంచరీలు నమోదు చేసిన హిట్మ్యాన్ .. మరో శతకం బాదడం సహా అదనంగా మరో 24 పరుగులు సాధిస్తే మెకల్లమ్ను అధిగమించే అవకాశం ఉంది. 5. ఇంకో మూడు సిక్స్లు కొడితే టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ శర్మ కచ్చితంగా బద్దలు కొట్టగల మరో రికార్డు ఇది. ఇప్పటి వరకు ఈ ఐసీసీ టోర్నీలో 31 సిక్సర్లు కొట్టిన హిట్మ్యాన్.. మరో మూడు సిక్స్లు బాదితే చాలు. ఈ మేజర్ ఈవెంట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు(33 సిక్స్లు) బద్దలు కొడతాడు. అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆరంభ మ్యాచ్లోనే రోహిత్ శర్మ ఈ ఫీట్ నమోదు చేయాలని ఆశిస్తూ హిట్మ్యాన్కు ఆల్ ది బెస్ట్ చెబుదాం!! -సాక్షి, వెబ్డెస్క్ చదవండి: Ind Vs WA XI: రాహుల్ ఇన్నింగ్స్ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్.. టీమిండియాకు తప్పని ఓటమి -
T20 WC: టీమిండియా కాదు.. ఈసారి వరల్డ్కప్ ఫైనల్లో వెస్టిండీస్తో పోటీపడేది ఆ జట్టే!
T20 World Cup 2022- Final Prediction: ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ను రెండుసార్లు ముద్దాడిన ఏకైక జట్టు వెస్టిండీస్. 2012, 2016లో ట్రోఫీని కైవసం చేసుకున్న విండీస్.. గతేడాది మాత్రం దారుణమైన ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. దీంతో పసికూనలతో క్వాలిఫైయర్స్ ఆడాల్సిన పరిస్థితి. ఇటీవలి కాలంలో కూడా పూరన్ బృందం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. టీమిండియా సహా పాకిస్తాన్, తాజాగా ఆస్ట్రేలియా తదితర జట్లతో జరిగిన టీ20 సిరీస్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆసీస్తో ఫైనల్లో.. పొట్టి ఫార్మాట్లో విండీస్ కష్టాలు ఇలా ఉంటే అతడు మాత్రం తమ జట్టు ఫైనల్కు చేరుకుంటుందని జోస్యం చెప్పాడు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తుదిపోరులో పోటీ పడుతుందంటూ గేల్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు దైనిక్ జాగరణ్తో ముచ్చటించిన యూనివర్సల్ బాస్.. ‘‘ఈసారి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య ఫైనల్ జరుగుతుందనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని.. తమదైన రోజున చెలరేగి ఆడతారని చెప్పుకొచ్చాడు. అయితే, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో వంటి ఆటగాళ్లు లేకపోవడం పెద్ద లోటు అన్న ఈ వెటరన్ ఓపెనర్.. ఫైనల్కు మాత్రం తమ జట్టు అర్హత సాధించే అవకాశం ఉందన్నాడు. కాగా క్రిస్ గేల్ ఇప్పటి వరకు ఆరు టీ20 వరల్డ్కప్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ జరుగనుంది. ఇందుకోసం పూరన్ బృందం ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకుంది. ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సహా టీమిండియా ఈసారి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు కూడా గట్టి పోటీనిచ్చేందుకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్గేల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీ20 ప్రపంచకప్-2022 వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్, యానిక్ కరియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, రేమాన్ రీఫర్, ఓడియన్ స్మిత్, షమార్ బ్రూక్స్. చదవండి: నిరాశ పరిచిన రోహిత్.. మరోసారి చెలరేగిన సూర్య కుమార్ -
విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ వచ్చేస్తున్నాడు..!
ఈనెల (సెప్టెంబర్) 16 నుంచి ప్రారంభంకానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) రెండో సీజన్ ఆడేందుకు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ మరోసారి భారత్లో అడుగుపెట్టనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ సారధ్యంలోని గుజరాత్ జెయింట్స్ యూనివర్సల్ బాస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం అదానీ స్పోర్ట్స్లైన్ శనివారం అధికారికంగా దృవీకరించింది. పొట్టి క్రికెట్లో అనేక రికార్డులు కలిగిన గేల్ ఎల్ఎల్సీలో ఆడటం చాలా సంతోషంగా ఉందని లీగ్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా అన్నారు. కాగా, గేల్తో ఒప్పందానికి ముందే గుజరాత్ జెయింట్స్ 15 మంది సభ్యుల బృందాన్ని (రూ. 5.51కోట్లు ఖర్చుతో) ఎంపిక చేసుకుంది. డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం ఫ్రాంచైజీ పర్సులో (మొత్తం 8 కోట్లు) కొంత డబ్బు మిగిలి ఉండటంతో (రూ. 2.48 కోట్లు) గేల్తో ఒప్పందం చేసుకోవాలని యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగా యునివర్సల్ బాస్తో సంప్రదింపులు జరిపి డీల్కు ఖాయం చేసుకుంది. సెహ్వాగ్, గేల్తో పాటు గుజరాత్ జెయింట్స్ జట్టులో డేనియల్ వెటోరీ, కెవిన్ ఓబ్రెయిన్, లెండిల్ సిమన్స్, అజంతా మెండిస్, గ్రేమ్ స్వాన్, మిచెల్ మెక్లాగెన్, రిచర్డ్ లెవి, క్రిస్ ట్రెమ్లెట్, పార్ధివ్ పటేల్ లాంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. గుజరాత్ జెయింట్స్ జట్టు: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), పార్థివ్ పటేల్, క్రిస్ గేల్, ఎల్టన్ చిగుంబురా, క్రిస్ ట్రెమ్లెట్, రిచర్డ్ లెవి, గ్రేమ్ స్వాన్, జోగిందర్ శర్మ, అశోక్ దిండా, డేనియల్ వెటోరి, కెవిన్ ఓబ్రెయిన్, స్టువర్ట్ బిన్నీ, మిచెల్ మెక్లాగెన్, లెండిల్ సిమన్స్, మన్విందర్ బిస్లా, అజంతా మెండిస్. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించి బిగ్ అప్డేట్.. కెప్టెన్ ఎవరంటే..? -
'మురళీధరన్, నరైన్ కాదు.. ప్రపంచ క్రికెట్లో నేనే బెస్ట్ స్పిన్నర్'
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఫీల్డ్లో గానీ ఆఫ్ధి ఫీల్డ్లో గానీ ఎంతో ఉత్సహంగా ఉంటాడో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో సారి గేల్ తన ఫన్నీ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం యూనివర్స్ బాస్ కరీబియన్ దీవులలో జరగబోయే సరికొత్త టోర్నీ 'సిక్స్టీ' లీగ్కు సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీ టీ10 ఫార్మాట్లో జరగనుంది. ఈ లీగ్ బుధవారం(ఆగస్టు 24) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్స్ బాస్ సరదా వాఖ్యలు చేశాడు. మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పేట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నా అని ఈ సందర్భంగా గేల్ తెలిపాడు. ఈ టోర్నీలో బ్యాట్తో పాటు బాల్తో కూడా రాణించాలని అనుకుంటున్నట్లు గేల్ వెల్లడించాడు. అదే విధంగా ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు తనే అత్యత్తుమ స్పిన్నర్ అని గేల్ ఫన్నీ కామెంట్లు చేశాడు. "నా బౌలింగ్ సహజమైనది. నేను కచ్చితంగా ఈ టోర్నీలో బౌలింగ్ చేస్తాను. మీకు తెలుసా..? ప్రపంచ క్రికెట్లో నేనే ఇప్పటి వరకు గ్రేట్ స్పిన్నర్ని. ముత్తయ్య మురళీధరన్ కూడా నాలా బౌలింగ్ చేయలేకపోయాడు. అతని కంటే నేను తక్కువ ఎకనామీతో బౌలింగ్ చేశాను. అదేవిధంగా సునీల్ నరైన్ కూడా నా దగ్గరకు రాలేడు" అని సరదాగా గేల్ వాఖ్యనించాడు. "మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టేందుకు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉండడంతో ఇది నా అరంగేట్ర మ్యాచ్గా భావిస్తున్నాను. ఈ టోర్నీతో మళ్లీ నా రిథమ్ను తిరిగి పొందుతాను. ఈ టోర్నీ నన్ను మరికొంత కాలం క్రికెట్ ఆడేలా సహాయపడుతుందని" యూనివర్స్ బాస్ పేర్కొన్నాడు. కాగా గేల్ చివరగా టీ20 ప్రపంచకప్లో ఆడాడు. -
అఫ్రిదిని అధిగమించి, క్రిస్ గేల్కు చేరువైన హిట్మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో హిట్మ్యాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. విండీస్తో నాలుగో టీ20లో మూడు సిక్సర్లు బాదిన హిట్మ్యాన్.. అన్ని ఫార్మాట్లలో సిక్సర్ల సంఖ్యను 477కు పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతను పాక్ మాజీ పవర్ హిట్టర్ షాహిద్ అఫ్రిదిని (476 సిక్సర్లు) అధిగమించాడు. ఈ జాబితాలో విండీస్ విధ్వంసకర యోధుడు, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది. ఇదిలా ఉంటే, విండీస్తో నాలుగో టీ20లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్కు మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ 96/2గా ఉంది. దీపక్ హుడా (15 బంతుల్లో 19), రిషబ్ పంత్ (15 బంతుల్లో 16) క్రీజ్లో ఉన్నారు. చదవండి: టీమిండియాకు భారీ షాక్... గాయంతో స్టార్ బౌలర్ ఔట్..! -
క్రిస్ గేల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ యునివర్స్ బాస్ మెరుపులు!
యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్ సీజన్లో సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని జెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. గత కొంత కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్న గేల్ మరోసారి తన బ్యాట్ను ఝుళిపించడానికి సిద్దమయ్యాడు. కాగా టీ20 క్రికెట్కే కింగ్గా ఉన్న గేల్ తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. టీ20ల్లో 10,000 పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యంత వేగవంతమైన సెంచరీ, అత్యధిక ఫోర్లు, సిక్స్లు వంటి చాలా రికార్డులు గేల్ ఖాతాలో ఉన్నాయి. కాగా వ్యక్తిగత కారణాలు వల్ల ఐపీఎల్-2022కు గేల్ దూరమయ్యాడు. ఇక లెజెండ్స్ లీగ్లో తను భాగంకానున్నట్లు గేల్ కూడా దృవీకరించాడు. "ఈ ప్రతిష్టాత్మకమైన లీగ్లో భాగం కావడం.. దిగ్గజాలతో కలిసి ఆడటం నాకు అపారమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. భారత్లోని మ్యాచ్ వేదికల వద్ద కలుద్దాం" అని ఒక ప్రకటనలో గేల్ పేర్కొన్నాడు. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనుంది. ఈ టోర్నీకి కోల్కతా, లక్నో, ఢిల్లీ, జోధ్పూర్, కటక్,రాజ్కోట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. లెజెండ్స్ లీగ్ రెండో సీజన్లో తొమ్మిది దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు పాల్గొనున్నారు చదవండి: Asia Cup 2022: 'గతేడాది పాక్ చేతిలో ఓటమి భారత్ను బాగా డ్యామేజ్ చేసింది.. ఈ సారి మాత్రం' -
మరోసారి వార్తల్లోకి విజయ్ మాల్యా, ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ‘‘సూపర్ ఫ్రెండ్షిప్, బెస్ట్ అక్విజిషన్" అంటూ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్తో ఉన్న ఫోటోను తాజాగా ట్వీట్ చేయడం విశేషంగా నిలిచింది. ‘‘క్రిస్టోఫర్ హెన్రీ గేల్ @హెన్రీగేల్, ‘యూనివర్స్ బాస్’ను కలుసుకోవడం అదృష్టం. ఆర్సీబీకి తీసుకున్నప్పటినుంచి మంచి స్నేహితుడు" అని మాజీ ఆర్సీబీ యజమాని మాల్యా పేర్కొన్నాడు. ఆర్సీబీకి గేల్ను కొనుగోలు చేయడం ఎప్పటికీ బెస్టే అంటూ రాసుకొచ్చాడు. ఈ పిక్ ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ కావడం మాత్రమే కాదు చర్చనీయాంశంగా మారింది. Great to catch up with my good friend Christopher Henry Gayle @henrygayle , the Universe Boss. Super friendship since I recruited him for RCB. Best acquisition of a player ever. pic.twitter.com/X5Ny9d6n6t — Vijay Mallya (@TheVijayMallya) June 22, 2022 దీంతో ‘లిక్కర్ కింగ్ విత్ యూనివర్స్ బాస్’ అంటూ కమెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆర్సీబీకి 2011-2017 వరకు ఆడాడు క్రిస్ గేల్. ఈ సందర్భంగా గేల్ పరుగుల సునామీ గురించి ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కేవలం 30 బాల్స్లోనే సెంచరీ బాదిన మెమరబుల్ ఇన్నింగ్స్ను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు గేల్ 2011లో రీప్లేస్మెంట్ ప్లేయర్గా ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి, అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా మారాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. 2009, 2010లో కోల్కతా నైట్ రైడర్స్కు కూడా ప్రాతినిధ్యం వహించిన గేల్ పంజాబ్ కింగ్స్కు ఆడాడు. అయితే, ఐపీఎల్ 2022 మెగా వేలానికి దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లో 142 మ్యాచ్లు ఆడిన గేల్ 4965 పరుగులు చేశాడు. 148.96 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో లీగ్లో 39.72 సగటుతో ఉన్నాడు. 2013లో ఇప్పుడు ఆగిపోయిన పూణే వారియర్స్పై అజేయంగా 175 పరుగులతో సహా ఆరు సెంచరీలను నమోదు చేశాడు. టీ20లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. -
IPL: ఐపీఎల్ స్ట్రాంగెస్ట్ ఎలెవన్.. రోహిత్ శర్మకు అవమానం!
టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఐపీఎల్లో తన ఆల్టైమ్ ఫేవరెట్ జట్టును ప్రకటించాడు. తన జట్టుకు ఎంఎస్ ధోనిని కెప్టెన్గా ఎంచుకున్న జాఫర్.. క్రిస్గేల్, మలింగ వంటి దిగ్గజాలకు చోటిచ్చాడు. అదే విధంగా ఆల్రౌండర్లుగా ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యాకు తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభానికి ముందు వరుస వైఫల్యాలతో విమర్శలకు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు పూర్వవైభవం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022తో పాటు మెగా టోర్నీలో తమ ఆల్టైమ్ ఫేవరెట్ జట్లను మాజీ ఆటగాళ్లు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా వసీం జాఫర్ క్రిక్ట్రాకర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఓపెనర్లుగా గేల్, కేఎల్ రాహుల్, వన్డౌన్లో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా, ధోని.. ఆల్రౌండర్లుగా రసెల్, పాండ్యా.. బౌలర్ల విభాగంలో రషీద్ ఖాన్, అశ్విన్/చహల్, బుమ్రా, మలింగాకు తన జట్టులో స్థానం ఇచ్చాడు. అయితే, ముంబై ఇండియన్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మకు మాత్రం వసీం చోటివ్వలేదు. వసీం జాఫర్ ఆల్టైమ్ బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్/యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ. చదవండి: Sachin Tendulkar Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు నో ఛాన్స్..! -
ఆర్సీబీ మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం
ఆర్సీబీ మాజీ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ను ఆ జట్టు యాజమాన్యం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆ జట్టు ఇటీవలే ఒక కార్యక్రమంలో హాల్ ఆఫ్ ఫేమ్ను పరిచయం చేసింది. ఆర్సీబీ తరపున సేవలందించిన క్రికెటర్లకు ఇందులో స్థానం దక్కనుంది. అయితే ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో తొలుత చేరిన క్రికెటర్లు.. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ కావడం విశేషం. కొన్నేళ్ల పాటు తమ సేవలను ఆర్సీబీకి అందించినందుకు కృతజ్ఞతగా వారిని హాల్ ఆఫ్ ఫేమ్లో చేరుస్తున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్లో ప్రకటించింది. దానికి సంబంధించిన వీడియోనూ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హాల్ ఆఫ్ ఫేమ్లో జాయిన్ అయిన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ను ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్, ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసన్లు అభినందిస్తూ స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరికి ఆన్లైన్ వేదికగానే వారి పేర్లతో పాటు జెర్సీ నెంబర్ ఉన్న గోల్డ్ మెటల్ మొమొంటోతో సత్కరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో గేల్, డివిలియర్స్కు విడదీయరాని బంధం ఉంది. డివిలియర్స్ 184 ఐపీఎల్ మ్యాచ్ల్లో 5162 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ 142 మ్యాచ్లాడి 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి! Introducing the #RCB Hall of Fame: Match winners, Legends, Superstars, Heroes - you can go on and on about @ABdeVilliers17 and @henrygayle, two individuals who are responsible for taking IPL to where it is today. #PlayBold #WeAreChallengers #IPL2022 #ನಮ್ಮRCB #RCBHallOfFame pic.twitter.com/r7VUkxqEzP — Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022 -
'సరైన గౌరవం దక్కలేదు'.. యునివర్సల్ బాస్ సంచలన వ్యాఖ్యలు
వెస్టిండీస్ స్టార్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్కు గేల్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్లో మధ్యలోనే వైదొలిగిన గేల్.. సుధీర్ఘకాలం బయోబబుల్లో ఉండలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా ఈసారి మెగావేలంలో గేల్ పాల్గొనలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తానని ఇటీవలే పేర్కొన్నాడు. తాజాగా ఐపీఎల్ 2022కు దూరంగా ఉండడం వెనుక గేల్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో తనకు సముచిత గౌరవం లభించలేదని ఆరోపించాడు. ఒక మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ.. ''గత రెండేళ్లుగా ఐపీఎల్ లో నాతో వ్యవహరించిన తీరు సరిగా లేదు. ఐపీఎల్లో ఎన్నో ఘనతలు అందుకున్న తర్వాత కూడా దక్కాల్సిన గౌరవం దక్కకపోవడంతో బాధ కలిగింది. అయితే క్రికెట్ తర్వాత కూడా మనకు జీవితం ఉంటుంది.. అందుకే ఈసారి ఐపీఎల్కు దూరంగా ఉండాలనుకున్నా. ఎవరిని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేకనే వేలంలోనూ పాల్గొనలేదు. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడే అవకాశం ఉంది. ఏ జట్టుకు ఆడుతానో తెలియదు కానీ.. నా అవసరం సదరు జట్టుకు కచ్చితంగా ఉంటుంది. ఐపీఎల్లో ఆర్సీబీ, కోల్కతా, పంజాబ్లకు ఆడినప్పటికి.. ఆర్సీబీ, పంజాబ్కు ఆడినప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ఆర్సీబీతో నా అనుబంధం చాలా గట్టిది. ఆ జట్టుకు టైటిల్ అందించలేకపోవడం కాస్త బాధ కలిగించింది. కానీ ఐపీఎల్లో నా అత్యధిక స్కోరు ఆ జట్టు తరపునే సాధించడం సంతోషం కలిగించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో గేల్ ట్రాక్ రికార్డు మాములుగా లేదు. ఇప్పటివరకు ఐపీఎల్లో 142 మ్యాచ్లు ఆడిన గేల్ 149 స్ట్రైక్రేట్తో 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఆరు సెంచరీలు కొట్టిన ఆటగాడు గేల్ తప్ప మరొకరు లేదు. మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్లో అత్యధిక స్కోరు గేల్ పేరిటే ఉంది. ఆర్సీబీ తరపున 2013లో పుణే వారియర్స్పై గేల్ ఆడిన 175 పరుగులు నాకౌట్ ఇన్నింగ్స్ ఇప్పటికి చెక్కుచెదరలేదు. చదవండి: Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎస్ఆర్హెచ్పై వార్నర్ అర్థశతకం.. ప్రపంచ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ హాఫ్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తన పాత టీమ్ ఎస్ఆర్హెచ్పై వార్నర్ విరుచుకుపడిన తీరు అద్భుతమని చెప్పాలి. ఆరంభంలో ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభించిన వార్నర్.. ఆ తర్వాత గేర్ మార్చి ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ ఓవరాల్గా 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు నాటౌట్గా నిలిచాడు. సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నప్పటికి వార్నర్ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టి20 క్రికెట్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్గా వార్నర్ నిలిచాడు. ఎస్ఆర్హెచ్పై చేసిన హాఫ్ సెంచరీ వార్నర్ ఖాతాలో 84వది. తద్వారా క్రిస్ గేల్(83 అర్థసెంచరీలు) పేరిట ఉన్న రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు. వార్నర్, గేల్ తర్వాత టీమిండియా మెషిన్గన్ విరాట్ కోహ్లి 77 హాఫ్ సెంచరీలతో మూడోస్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్ టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ 70 అర్థసెంచరీలతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా టి20 కెప్టెన్ రోహిత్ శర్మ 69 హాఫ్ సెంచరీలతో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాదు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనే వార్నర్ మరో రికార్డు అందుకున్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మార్క్రమ్ బౌలింగ్లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన వార్నర్.. టి20 క్రికెట్లో 400వ సిక్సర్ను పూర్తి చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: David Warner: సెంచరీ చేయకపోయినా పంతం నెగ్గించుకున్న వార్నర్! -
IPL: ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డు.. రోహిత్, గేల్లను అధిగమించి..
టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్-2022లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమేశ్.. చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక తమ జట్టు మూడో మ్యాచ్లో భాగంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు ఉమేశ్ యాదవ్. 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ మాయంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తద్వారా పంజాబ్పై తనకున్న ఘనమైన రికార్డును మరోసారి రిపీట్ చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఒకే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ, క్రిస్గేల్ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. కాగా ఉమేశ్ యాదవ్కు పంజాబ్పై ఇది ఆరో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. అంతకుముందు యూసఫ్ పఠాన్ దక్కన్ చార్జర్స్పై 5 సార్లు, రోహిత్ శర్మ కేకేఆర్పై 5 సార్లు, క్రిస్గేల్ కేకేఆర్పై 5 సార్లు ఈ ఘనత సాధించారు. ఇక ఐపీఎల్-2022లో పంజాబ్తో కేకేఆర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఉమేశ్ విజృంభణకు తోడు ఆండ్రీ రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో కోల్కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022 KKR Vs PBKS: నేనేం చేయగలనో నాకు తెలుసు.. క్రికెట్ ఆడేది అందుకే: రసెల్ A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
IPL: క్రిస్ గేల్ వచ్చేస్తున్నాడు..!
IPL 2022: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల వీరుడు, కరీబియన్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. ఈ ఏడాది (2022) ఐపీఎల్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఫామ్ లేమి, వయో భారం రిత్యా అతను ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. అయితే, యూనివర్సల్ బాస్ తాజాగా ఇన్స్టాలో చేసిన ఓ పోస్ట్ను బట్టి చూస్తే అతను ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్ జస్ట్ స్టార్ట్.. లెట్స్ గో.. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టేశా.. అంటూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను గేల్ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన అతని అభిమానులు.. బాస్ విల్ బి బ్యాక్ అంటూ తెగ సంబురపడిపోతున్నారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్లో గేల్తో పాటు మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మెరుపులు లేకపోవడంతో అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. తాజాగా గేల్ ఐపీఎల్ రీఎంట్రీ విషయంపై క్లూ ఇవ్వడంతో, ఏబీ అభిమానులు కూడా తమ ఫేవరెట్ క్రికెటర్ రీఎంట్రీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్కు ముందు ఏబీ తన ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గేల్ సైతం టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడన్న ప్రచారం జోరుగా సాగింది. యూనివర్సల్ బాస్.. తన ఐపీఎల్ కెరీర్లో 142 మ్యాచ్ల్లో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4965 పరుగులు చేశాడు. ఇందులో 405 ఫోర్లు, 357 సిక్సర్లు ఉన్నాయి. pic.twitter.com/jdXhGaclHQ — Addicric (@addicric) March 29, 2022 చదవండి: అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లినే టాప్ -
హెడ్ కోచ్గా క్రిస్ గేల్.. ఏ జట్టుకో తెలుసా?
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్లో కరాచీ కింగ్స్కు హెడ్ కోచ్గా వ్యవహరిస్తానని గేల్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్-2022 లో కరాచీ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కరాచీ కింగ్స్ ఒకే ఒక విజయం సాధించింది. కరాచీ కింగ్స్కు బాబర్ ఆజాం సారథిగా ఉన్నాడు. "వచ్చే సీజన్లో కరాచీ కింగ్స్కు నేను కొత్త ప్రధాన కోచ్ని అవుతాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు" అని గేల్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఫార్చ్యూన్ బారిషల్ జట్టుకు యూనివర్స్ బాస్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఐపీఎల్-2022కు కూడా క్రిస్ గేల్ దూరంగా ఉన్నాడు. 79 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన గేల్ 1899 పరుగులు సాధించాడు. ఓవరాల్గా తన టీ20 కేరిర్లో 445 మ్యాచ్లు ఆడిన గేల్ 14,321 పరుగులు చేశాడు. 2013 ఐపీఎల్ సీజన్లో కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి యూనివర్స్ బాస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి గేల్ తప్పుకోవాలని భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: 19 ఫోర్లు..2 సిక్స్లు.. సెంచరీతో చెలరేగిన సన్రైజర్స్ ఆటగాడు! -
IPL 2022 Auction: వీరేమో దూరం.... వాళ్లకు భారీ డిమాండ్!
IPL 2022 Mega Auction: ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.... ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఆడాలని ప్రపంచంలోని ప్రతి క్రికెటర్ కోరుకుంటానడంలో అతిశయోక్తి లేదు. ఇక మెగా వేలం వచ్చిందంటే కోట్లలో డబ్బు కొల్లగొట్టే అవకాశం. అయితే, కొంతమంది కీలక ఆటగాళ్లు ఈ సారి వేలానికి దూరమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పలువురు క్రికెటర్లు వేర్వేరు కారణాలతో ఈ సీజన్ ఐపీఎల్ ఆడరాదని నిర్ణయించుకున్నారు. వీరిలో క్రిస్ గేల్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, కైల్ జేమీసన్, స్యామ్ కరన్, జాయ్ రిచర్డ్సన్, డాన్ క్రిస్టియాన్, క్రిస్ వోక్స్, మాట్ హెన్రీ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు. ఇక మెగా వేలంలో డిమాండ్ ఉన్న క్రికెటర్లు ఎవరంటే! ఐపీఎల్లో గత రికార్డు, ప్రస్తుతం జట్ల అవసరాలు, భవిష్యత్తు... ఇలా అన్నీ చూస్తే వేలంలో కొందరు ఆటగాళ్లకు భారీ మొత్తం దక్కే అవకాశం కనిపిస్తోంది. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్సీ అర్హతలు ఉన్న శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపింగ్ హిట్టర్లు ఇషాన్ కిషన్, క్వింటన్ డి కాక్, టాప్ లెగ్ స్పిన్నర్ చహల్, ఫాస్ట్ బౌలర్ కగిసో రబడలకు మంచి డిమాండ్ ఉంది. మిగతా భారత ఆటగాళ్లలో దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయం. ఇప్పటి వరకు టీమిండియాకు ఆడని అన్క్యాప్డ్ ప్లేయర్లలో భారీ షాట్లు ఆడే తమిళనాడు ప్లేయర్ షారుఖ్ ఖాన్, యువ పేసర్ అవేశ్ ఖాన్లపై అందరి దృష్టీ ఉంది. చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా! -
అత్యుత్తమ టి20 జట్టు ఎంపిక.. సొంత జట్టు ఆటగాళ్లకు నో చాన్స్
శ్రీలంక మాజీ ఆల్రౌండర్ తిసార పెరీరా తన 11 మందితో కూడిన అత్యుత్తమ టి20 జట్టును ప్రకటించాడు. అయితే ఆశ్యర్యంగా తన సొంత జట్టు నుంచి ఒక్క ఆటగాడికి కూడా పెరీరా చోటు ఇవ్వకపోవడం విశేషం. పెరీరా ప్రకటించిన 11 మందిలో నలుగురు టీమిండియా నుంచి.. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు చొప్పున.. అఫ్గానిస్తాన్ నుంచి ఒక ఆటగాడిని ఎంపిక చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కెప్టెన్గా.. వికెట్కీపర్గా ఎంపిక చేశాడు. ఇక క్రిస్ గేల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా.. విరాట్ కోహ్లి మూడో స్థానంలో.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డేవిడ్ మిల్లర్లకు మిడిలార్డర్లో చోటు కల్పించాడు. ఇక స్పిన్నర్లుగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్లను ఎంపిక చేసిన పెరీరా.. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాన్ టైట్లను ఏంచుకున్నాడు. పెరీరా టి20 అత్యుత్తమ జట్టు: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్, డేవిడ్ మిల్లర్, ఎంఎస్ ధోని(కెప్టెన్ & వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునీల్ నరైన్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాన్ టైట్ చదవండి: Suranga Lakmal: టీమిండియతో సిరీస్ ఆఖరు.. రిటైర్ కానున్న స్టార్ క్రికెటర్ కాగా తిసారా పెరీరా శ్రీలంక తరపున 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన పెరీరా లంక తరపున 166 వన్డేల్లో 2338 పరుగులతో పాటు 175 వికెట్లు, 84 టి20ల్లో 1204 పరుగులు.. 61 వికెట్లు, 6 టెస్టుల్లో 203 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు. 2014 టి20 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టులో పెరీరా సభ్యుడిగా ఉన్నాడు. వన్డేలు, టి20ల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్గా పెరీరా చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పెరీరా.. సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్లో రాబిన్ పీటర్సన్ బౌలింగ్లో ఒక ఓవర్లో 35 పరుగులు కొట్టి కొత్త రికార్డు సృష్టించాడు. మే 3, 2021న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన పెరీరా 2017-19 మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లకు లంక కెప్టెన్గా వ్యవహరించాడు. -
వేలంలో పాల్గొనాలంటూ స్టార్ ఆటగాడికి ఫోన్కాల్..
ఐపీఎల్ 2022 మెగావేలంకు సంబంధించిన ఫైనల్ లిస్టు మంగళవారం విడుదలైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న మెగావేలానికి 590 మంది క్రికెటర్లు షార్ట్లిస్ట్ అయ్యారు. బెంగళూరు వేదికగా జరగనున్న వేలంలో వీరిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో చూడాలి. అయితే ఈసారి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్.. విధ్వంసకర ఆటగాడు.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్ సీజన్కు దూరంగా ఉండనున్నాడు. అందుకే ఈసారి వేలంలో తన పేరును కూడా రిజిస్టర్ చేసుకోలేదు. అయితే క్రిక్బజ్ నిర్వహించిన సర్వేలో రెండు ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనబోతున్న 590 మంది ఫైనల్ లిస్టులో గేల్ పేరును చేర్చాలని భావించినట్లు సమాచారం. చదవండి: ఆర్సీబీతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన కోహ్లి గేల్ పంబాబ్ కింగ్స్తో పాటు ఆర్సీబీకి ఎక్కువకాలం ఆడాడు. బహుశా ఈ రెండు ఫ్రాంచైజీలే గేల్ను సంప్రదించి ఈసారి వేలంలో పాల్గొనాలని.. తాము కొనుగోలు చేస్తామని ఫోన్ చేసినట్ల తెలిసింది. అయితే గేల్ ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడని.. వేలంలో ఈసారి తాను పాల్గొనబోయేది లేదని.. ఐపీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. గేల్తో పాటు బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్లకు కూడా ఫోన్ కాల్స్ వెళ్లినట్లు.. కానీ వీరిద్దరు ఈసారి ఐపీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇక ఈసారి 590 మంది క్రికెటర్లు వేలానికి షార్ట్లిస్ట్ అయినట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఇక టీమిండియా నుంచి శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, సురేశ్ రైనా, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తదితర స్టార్ ప్లేయర్లు రేసులో నిలిచారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్ నుంచి 5, ఇంగ్లండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి 5, న్యూజిలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్ నుంచి ఒకరు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన విడుదల చేశారు. చదవండి: IPL 2022 Auction Players List: మెగా వేలంలో పాల్గొనబోయేది వీళ్లే: బీసీసీఐ -
ప్రధాని మోదీ నుంచి పర్సనల్ మెసేజ్: క్రిస్ గేల్
విండీస్ హార్డ్ హిట్టర్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్కు ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం.ఈ విషయాన్ని ఇంతకముందు చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా గేల్ భారత క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తాజాగా జనవరి 26న భారత్ 73వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా క్రిస్ గేల్ భారతీయులకు తన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపాడు. చదవండి: Kohli Vs BCCI: కోహ్లి,గంగూలీ ఒకసారి ఫోన్లో మాట్లాడుకోండి: కపిల్ దేవ్ ''భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్ మెసేజ్తో ఈరోజు నిద్ర లేచా. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతీయులకు ఇవే నా శుభాకాంక్షలు. మోదీతో పాటు దేశ ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ దేశ క్రికెటర్లతో కలిసి ఐపీఎల్ సహా ఇతర క్లబ్ క్రికెట్లో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తుంటా. కంగ్రాట్స్ ఫ్రమ్ యునివర్సల్ బాస్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్కు ఆడాడు. దీనిలో ఆర్సీబీ తరపున 91 మ్యాచ్ల్లో 3420 పరుగులు సాధించాడు. కోహ్లి, డివిలియర్స్ తర్వాత ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా గేల్ నిలిచాడు. అయితే ఈసారి ఐపీఎల్లో మాత్రం గేల్ మెరుపులు మిస్ కానున్నాయి. ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి ప్లేయర్ల వేలం జాబితాలో గేల్ రిజిస్టర్ చేసుకోలేదు. ఈ కారణంగా గేల్ వేలానికి దూరమయ్యాడు. ఇక క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ తరపున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టి20లు ఆడాడు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం I would like to congratulate India on their 73rd Republic Day. I woke up to a personal message from Prime Minister Modi @narendramodi reaffirming my close personal ties with him and to the people of India. Congratulations from the Universe Boss and nuff love 🇮🇳🇯🇲❤️🙏🏿 — Chris Gayle (@henrygayle) January 26, 2022 -
ఈ ఏడాది ఐపీఎల్కి దూరంగా కానున్న స్టార్ ప్లేయర్లు వీరే..!
Most Of England Players Including Gayle To Skip IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్కి ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు సామూహికంగా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి జరగబోయే మెగా వేలంలో మొత్తం 1214 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. కొందరు ఇంగ్లండ్ క్రికెటర్లు మాత్రం లీగ్పై అనాసక్తి కనబర్చారు. వేలం కోసం 30 మంది ఇంగ్లండ్ ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. జో రూట్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ వంటి స్టార్ క్రికెటర్లు దూరంగా ఉన్నారు. అయితే బెయిర్ స్టో, టామ్ కర్రన్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. మరోవైపు వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సైతం క్యాష్ రిచ్ లీగ్కు డుమ్మా కొట్టాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్లో కొనసాగుతున్న గేల్.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్తో పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అతను ఐపీఎల్ మెగా వేలం కోసం తన పేరు నమోదు చేసుకోలేదని సమాచారం. కాగా, వీరితో పాటు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్పై అనాసక్తి కనబర్చాడు. తొలుత అతను లీగ్లో పాల్గొంటానని ప్రకటించినప్పటికీ.. నిర్ణీత గడువు సమయానికి పేరును నమోదు చేసుకోలేదు. ఇదిలా ఉంటే, వేలంలో పాల్గొనబోయే 1214 మంది ఆటగాళ్లలో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 270 మంది క్యాప్డ్ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా(59)కు చెందిన వారు కాగా, ఆ తర్వాత సౌతాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్ (29), అఫ్ఘానిస్థాన్ (20) దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. నేపాల్ (15), యూఎస్ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్ (1), స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: IPL 2022: మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టేది వీళ్లే.. -
క్రిస్ గేల్కు ఘోర అవమానం..!
Chris Gayle: విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్కు ఘోర అవమానం జరిగింది. సొంతగడ్డపై టీ20లకు వీడ్కోలు పలకాలనుకున్న తన ఆకాంక్షను ఆ దేశ క్రికెట్ బోర్డు బేఖాతరు చేసింది. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరగనున్న టీ20 సిరీస్ల కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో చోటు కల్పించకుండా అతన్ని అవమానపర్చింది. ఇప్పటికే వన్డేలు, టెస్ట్లకు గుడ్బై చెప్పిన గేల్.. తన సొంత మైదానమైన సబీనా పార్క్లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతానని గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయంతో గేల్.. తన సమీప భవిష్యత్తులో టీ20లు ఆడే అవకాశం లేదు. దీంతో అతను టీ20 రిటైర్మెంట్ అంశంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్.. జనవరి 16న ఐర్లాండ్తో ఏకైక టీ20, ఆతర్వాత జనవరి 22 నుండి 30 వరకు ఇంగ్లండ్తో 5 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే, గేల్ తన టీ20 కెరీర్లో మొత్తం 452 మ్యాచ్ల్లో 145.4 స్ట్రైక్రేట్తో 14,321 పరుగులు సాధించి, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొట్టి క్రికెట్లో గేల్ 87 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు బాదాడు. చదవండి: కోహ్లి-రోహిత్ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..! -
క్రికెట్లో అడుగుపెట్టనున్న ఉసేన్ బోల్ట్.. ఏ లీగ్లో ఆడనున్నాడంటే!
Usain Bolt set to play T20 cricket..?: ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత, జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ త్వరలో తన కలను సాకారం చేసుకోనున్నాడు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన క్రికెట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో త్వరలో నిర్వహించబోతున్న ఓ టీ20 లీగ్ లో బోల్ట్ పాల్గోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ భారత డిజిటల్ స్పోర్ట్స్ ఛానల్ ఈ లీగ్ కోసం బోల్ట్ను సంప్రదించున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. కాగా బోల్ట్ ఎనిమిది సార్లు ఒలిపింక్స్లో బంగారు పతక విజేతగా నిలిచాడు. అదే విధంగా 2009 బెర్లిన్లో జరిగిన ఐఏఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఇదే ప్రస్తుతం ప్రపంచ రికార్డును కలిగి ఉంది. కాగా ఇటీవల రన్నింగ్ నుంచి బోల్ట్ రిటైర్మ్మెంట్ ప్రకటించాడు. అయితే చాలా సందర్బాల్లో క్రికెట్ అంటే ఇష్టమని బోల్ట్ తెలిపాడు . తన తండ్రి కోరికకు తలొగ్గి రన్నింగ్ను కెరీర్గా ఎంచుకున్నానని, క్రికెట్ ఎప్పుడూ తన ‘ఫస్ట్ లవ్’ అని బోల్ట్ చాలా సందర్బాల్లో వెల్లడించాడు. కాగా క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ సూపర్ స్టార్లు జమైకాకు చెందినవారే. చదవండి: Ben Stokes 56 Number Armband: 56వ నెంబర్తో బరిలోకి.. నాన్నకు ప్రేమతో -
బౌలర్లకు చుక్కలు చూపించిన క్రిస్ గేల్.. కేవలం 23 బంతుల్లోనే..
Chris Gayle Smashed 52 Runs In Just 23 balls 58 In Abu Dhabi T10 league: అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్లో క్రిస్గేల్ మరోసారి చెలరేగాడు. శుక్రవారం బంగ్లా టైగర్స్తో జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ కేవలం 23 బంతుల్లో అజేయంగా 53 పరుగులు సాధించి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో యూనివర్సల్ బాస్ టీమ్ అబుదాబికు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అయితే క్రిస్ గేల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా టైగర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 131 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ అబుదాబి ఆరంభంనుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన గేల్ ఒక్క సారిగా మ్యాచ్పై ఆశలు పెంచాడు. సిక్స్లు, ఫోర్లు తో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే అఖరి ఓవర్లో 19 పరుగుల కావల్సిన నేపథ్యంలో గేల్ కేవలం ఒక్క సిక్స్ మాత్రమే బాదాడు. దీంతో 11 పరుగుల తేడాతో టీం అబుదాబిపై బంగ్లా టైగర్స్ విజయం సాధించింది. చదవండి: Ban Vs Pak Test Match: అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి డైవ్ చేశారు.. ఆఖరికి -
chris gayle: క్రిస్ గేల్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే..
Chris Gayle as Abu Dhabi plunder runs on T10 opening night : అబుదాబి టీ10లీగ్లో బంగ్లా టైగర్స్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ చేలరేగి ఆడాడు. ఈ టోర్నీలో టీమ్ అబుదాబికు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనివర్సల్ బాస్.. కేవలం 23 బంతుల్లో 5 సిక్స్లు, 2ఫోర్లుతో 49 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఎట్టకేలకు గేల్ బ్యాట్ ఝలిపించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. గేల్కు తోడుగా ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ కూడా ఆర్ధసెంచరీ చేయడంతో టీమ్ అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలలో 4వికెట్ల నష్టానికి 145 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 146 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్ నిర్ణీత 10ఓవర్లలలో 8వికెట్లు కోల్పోయి 108 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమ్ అబుదాబి 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా దుబాయ్ టీ10లీగ్ శుక్రవారం(నవంబర్-19) నుంచి ప్రారంభంమైంది. ఈ లీగ్లో క్రిస్ గేల్, డుప్లెసెస్, మహ్మద్ హాఫీజ్, లివింగ్స్టోన్ వంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. చదవండి: IND Vs NZ 2nd T20 : రోహిత్ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే? -
లంక ప్రీమియర్ లీగ్లో ఐపీఎల్ విధ్వంసకర వీరులు
Gayle, Du Plessis Among LPL 2021 Picks: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విధ్వంసకర వీరులు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న లంక ప్రీమియర్ లీగ్-2021లోనూ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్-2021లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించి రెండో అత్యధిక స్కోరర్గా నిలిచిన డుప్లెసిస్, పంజాబ్ కింగ్స్ తరఫున రాణించిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, సీఎస్కే తరఫున బౌలింగ్లో సత్తా చాటిన ఇమ్రన్ తాహిర్ తదితర ఆటగాళ్లతో పాటు టీ20 నంబర్ వన్ బౌలర్, దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రేజ్ షంషి, పాక్ స్టార్ ఆల్రౌండర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్లు మెరుపు ప్రదర్శనలతో అలరించేందుకు రెడీ అయ్యారు. వీరే కాకుండా బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్, విండీస్ రోవ్మన్ పావెల్, లంక స్టార్ ఆటగాళ్లు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా, అఖిల ధనంజయ, దినేశ్ చండీమాల్, ధనంజయ డిసిల్వ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు వివిధ ఫ్రాంఛైజీల తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం 5 జట్ల(కొలొంబో స్టార్స్, దంబుల్లా జెయింట్స్, గాలే గ్లాడియేటర్స్, జాఫ్నా కింగ్స్, కాండీ వారియర్స్)తో జరగనున్న ఈ లీగ్ డిసెంబర్ 5 నుంచి 23 వరకు జరగనుంది. చదవండి: ట్విటర్లో సచిన్ హవా.. విశ్వవ్యాప్త సర్వేలో మోదీ తర్వాతి స్థానం -
Chris Gayle: నేనింకా రిటైర్ కాలేదు.. ఆ హడావుడి అంతా అందుకే..!
Chris Gayle Confirms That He Hasnt Retired Yet From International Cricket: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా విండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రవర్తించిన తీరును చూసి.. ఈ కరీబియన్ యోధుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాడేమోనని అంతా భావించారు. అయితే, ఈ అంశంపై స్పందించిన గేల్.. తానింకా రిటైర్ కాలేదని, మరికొద్ది రోజులు క్రికెట్ ఆటడల సత్తా తనలో ఉందని.. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలోనే క్రికెట్కు గుడ్బై చెబుతానని స్పష్టం చేశాడు. అయితే, ఓ రకంగా ఇది ఆటకు వీడ్కోలు పలికినట్టేనని తికమక పెట్టాడు. ‘ప్రపంచకప్లో తనకు చివరి మ్యాచ్ కావడంతో ప్రేక్షకులతో సరదాగా వ్యవహరించానని, మరో ప్రపంచకప్ ఆడాలని ఉన్నా బోర్డు అవకాశం ఇస్తుందని అనుకోవడం లేదని తెలిపాడు. స్వస్థలం అయిన జమైకాలో తన వీడ్కోలు మ్యాచ్ ఆడేందకు బోర్డు అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్ ద్వారా స్పందించాడు. గేల్ ఇదివరకే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలసిందే. ఇదిలా ఉంటే, ఆసీస్తో మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన గేల్ 15 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అవుటయ్యాడు. గేల్ పిచ్ను వీడుతున్నప్పుడు వీడ్కోలు అన్నట్టుగా బ్యాట్ను ప్రేక్షకులు, కెమెరా వైపు చూపిస్తూ బయటకు వస్తుండగా.. సహచరులంతా బౌండరీ రోప్ వద్ద నిల్చొని గౌరవ స్వాగతం పలికారు. మరోవైపు, ఈ మ్యాచ్కు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావోకు మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. చదవండి: భారత టీ20 కెప్టెన్గా ఆ ఫాస్ట్ బౌలర్ను ఎంపిక చేయండి... -
ఫన్నీ బౌలింగ్.. మిచెల్ మార్ష్ ఔట్తో ముగించాడు
Chris Gayle Signs Off T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం నవ్వులు పంచింది. దీనికి కారణం క్రిస్ గేల్. అతని రిటైర్మెంట్పై క్లారిటీ లేనప్పటికీ టి20 ప్రపంచకప్లో విండీస్ తరపున గేల్ ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లే. అందుకు తగ్గట్లే గేల్ హావభావాలు ఉండడం విశేషం. ముందు బ్యాటింగ్కు సన్గ్లాసెస్ పెట్టుకొని రావడం.. ఆ తర్వాత ఔటై వెళ్తూ తన బ్యాట్ను పైకెత్తి ఫ్యాన్స్కు అభివాదం చేయడం కనిపించింది. చదవండి: T20 WC 2021: అతి పెద్ద సిక్స్ కొట్టిన రసెల్.. వీడియో వైరల్ ఇక బౌలింగ్లోనూ గేల్ తన వైవిధ్యతను చూపించాడు. ఆసీస్ విజయానికి దగ్గరైన వేళ విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ను గేల్ చేత వేయించాడు. కనీసం క్యాప్ తీయకుండా గేల్ బౌలింగ్ చేయడం విశేషం. ఓవర్ ఆద్యంతం ఫన్నీగా సాగింది. ఆసీస్ బ్యాటర్స్ వార్నర్, మిచెల్ మార్ష్లు కూడా ఫన్నీవేలో బ్యాటింగ్ కొనసాగించారు. ఇన్నింగ్స్ మూడో బంతికి వార్నర్ను అవుట్ చేసినంత పని చేశాడు. అయితే పూరన్ స్టంపింగ్ మిస్ చేయడంతో గేల్ వార్నర్ దగ్గరకు చెవిలో ఏదో చెప్పి వెళ్లిపోయాడు. ఇక ఓవర్ ఆఖరి బంతికి గేల్ మిచెల్ మార్ష్ను ఔట్ చేసి వికెట్ను ఖాతాలో వేసుకొని టి20 కెరీర్ను ముగించాడు. ప్రస్తుతం గేల్ చేష్టలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక గేల్ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించడమే తరువాయి. చదవండి: T20 WC 2021 AUS Vs WI: చెలరేగిన వార్నర్, మార్ష్.. విండీస్పై ఆసీస్ ఘన విజయం -
సన్ గ్లాసెస్తో బరిలోకి.. క్రిస్ గేల్ రిటైర్మెంట్!
Chris Gayle Retirement From International Cricket.. యునివర్సల్ బాస్.. విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడా? టి20 ప్రపంచకప్ 2021లో విండీస్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడేశాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో టి20 ప్రపంచకప్ 2021 తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పనున్న సంగతి తెలిసిందే. తాజగా గేల్ కూడా విండీస్ తరపున చివరి మ్యాచ్ ఆడేశాడంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. అయితే గేల్ ఎక్కడా అధికారికరంగా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికి అతని చర్యలు చూస్తే అలాగే ఉన్నాయి. చదవండి: Shoaib Akthar: అఫ్గాన్తో మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోయిందో.. ఇక అంతే అందుకు తగినట్లుగానే గేల్ తన చివరి మ్యాచ్ అనుకున్నాడేమో.. బ్యాటింగ్ వచ్చేటప్పుడు సన్గ్లాసెస్తో బరిలోకి దిగాడు. రెండు భారీ సిక్సర్లు కొట్టిన గేల్ 15 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత పెవిలియన్ చేరుతూ తన బ్యాట్ను పైకి లేపి ఫ్యాన్స్కు అభివాదం చేశాడు. అనంతరం డగౌట్లో ఆండీ రసెల్ అతన్ని కౌగలించుకోవడం.. ఆ తర్వాత గేల్ డగౌట్లో తన గ్లోవ్స్పై సంతకం చేసి అభిమానులకు పంచడం.. కెమెరా ముందుకు వచ్చి థాంక్యూ ఫ్యాన్స్ అంటూ గట్టిగా అరిచాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన గేల్ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం. ► ఇప్పటికే వన్డే, టెస్టు కెరీర్కు గుడ్బై చెప్పిన గేల్కు టి20ల్లో ఘనమైన రికార్డు ఉంది. ► తన కెరీర్లో 452 టి20 మ్యాచ్లాడిన గేల్ 145.4 స్ట్రైక్రేట్తో 14,321 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అందులో 87 హాఫ్ సెంచరీలు.. 22 సెంచరీలు ఉన్నాయి. ► ఇక వెస్టిండీస్ తరపున గేల్ 79 మ్యాచ్ల్లో 1884 పరుగులు సాధించాడు. ► టి20 ప్రపంచకప్ల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా గేల్ చరిత్రలో నిలిచిపోయాడు. ► 2012, 2016 టి20 ప్రపంచకప్లను విండీస్ గెలవడంలో గేల్ కీలకపాత్ర పోషించాడు. ► టి20 ప్రపంచకప్ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గేల్(35 మ్యాచ్ల్లో 950 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ► టి20ల్లో వెయ్యికి పైగా సిక్స్లు కొట్టిన తొలి బ్యాటర్గా గేల్ చరిత్ర Last International six of CHRIS HENRY GAYLE 🥺🔥@henrygayle ❤️pic.twitter.com/YkIwVZsyzx — Harshullah Jadran 🇦🇫 (@INVINCIBLE45_) November 6, 2021 Chris Gayle! ❤️#WIvsAUS pic.twitter.com/ZpHN3YkZrm — 'Z (@_NyrraZo) November 6, 2021 -
Chris Gayle: ఏంటి గేల్... ఈ చెత్త రికార్డు...ఇన్ని ఘనతలు ఉన్నా.. శ్రీలంకపై మాత్రం
Chris Gayle Bad Record In T20s Against Srilanka: క్రిస్ గేల్.. యూనివర్సల్ బాస్.. సిక్సర్ల వీరుడు... విధ్వంసకర బ్యాటర్.. టీ20 ఫార్మాట్లో అతడికి తిరుగే లేదు... అంతర్జాతీయ మ్యాచ్లు మొదలు లీగ్ మ్యాచ్ల దాకా పొట్టి క్రికెట్లో గేల్ సాధించిన ఘనతలు అనేకం. టీ20 ప్రపంచకప్-2021 ఆరంభానికి ముందు వరకు క్రిస్ గేల్ 446.. టీ20 మ్యాచ్లు ఆడి.. 14261 పరుగులు సాధించాడు. వీటిలో 22 శతకాలు. అత్యధిక స్కోరు 175(నాటౌట్). అంతేకాదు 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో గేల్ సభ్యుడు. పొట్టి ఫార్మాట్లో ఇన్ని ఘనతలు సాధించిన క్రిస్ గేల్కు శ్రీలంకపై మాత్రం ఓ చెత్త రికార్డు ఉంది. ఇప్పటి వరకు లంకతో ఆడిన 9 టీ20 మ్యాచ్లలో గేల్ అత్యధిక స్కోరు 63(నాటౌట్) కాగా.. మిగిలిన 8 సందర్భాల్లో ఘోరంగా విఫలమయ్యాడు. వరుసగా 5, 2, 3, 3, 0, 16, 13 పరుగులు చేశాడు. తాజాగా టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో భాగంగా నవంబరు 4న షనక బృందంతో మ్యాచ్లో 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఈ జాబితాలో మరో అంకెను పెంచుకున్నాడు. ఇక నవంబరు 4 నాటి మ్యాచ్లో నికోలస్ పూరన్(46), షిమ్రన్ హెట్మెయిర్(81) మినహా డిఫెండింగ్ చాంపియన్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో 20 పరుగుల తేడాతో లంక చేతిలో ఓడిన డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీ20 మ్యాచ్లలో శ్రీలంకపై గేల్ చెత్త రికార్డు: ►వరుసగా 63 నాటౌట్, 5, 2, 3, 3, 0, 16, 13, 1 పరుగులు. చదవండి: AUS VS BAN: టీ20 ప్రపంచకప్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 World Cup: ధోని, కోహ్లికి సాధ్యం కానిది.. రోహిత్ శర్మ అరుదైన ఘనత!
T20 World Cup: Seven players who featured in all editions: 2007- 2016 వరకు ఇప్పటికీ 6 టీ20 వరల్డ్కప్ టోర్నీలు జరిగాయి. తొట్టతొలి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ను ముద్దాడి జగజ్జేతగా నిలిచింది ధోని సేన. ఆ తర్వాత పాకిస్తాన్(2009), ఇంగ్లండ్(2010), వెస్టిండీస్(2012, 2016- రెండుసార్లు), శ్రీలంక(2014) ఈ ఘనత సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్గా విండీస్ జట్టు బరిలోకి దిగనుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో తమ తమ జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఎవరో తెలుసా?! హిట్మ్యాన్ అరుదైన ఘనత టీమిండియా వైస్ కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 2007 నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. తాజా ఈవెంట్లోనూ అతడు కీలక పాత్ర పోషించనున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో 28 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ.. 673 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 79(నాటౌట్). షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్) ఆధునిక క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan). టీ20 వరల్డ్కప్ టోర్నీలో ఇప్పటి వరకు 25 మ్యాచ్లు ఆడిన అతడు... 567 పరుగులు చేశాడు. 30 వికెట్లు పడగొట్టాడు. సూపర్ 12కు బంగ్లాదేశ్ అర్హత సాధించే క్రమంలో షకీబ్ పాత్ర కీలకం కానుంది. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో షకీబ్ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ(107 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును షకీబ్(108) అధిగమించాడు. అయితే, ఈ మ్యాచ్లో బంగ్లా ఆరు పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. డ్వేన్ బ్రావో(వెస్టిండీస్) టీ20 ఫార్మాట్లో తొలి 300, 400, 500 వికెట్లు తీసిన విండీస్ క్రికెట్ స్టార్ డ్వేన్ బ్రావో(Dwayne Bravo). బ్యాటర్గానూ సత్తా చాటిన అతడు మెగా టోర్నీలో 504 పరుగులు చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ట్రోఫీ వేటలో ఈ ఆల్రౌండర్ ప్రముఖ పాత్ర పోషించనున్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహ్మదుల్లా(బంగ్లాదేశ్) టీ20 వరల్డ్కప్-2021లో బంగ్లాదేశ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు మహ్మదుల్లా(Mahmudullah). మిడిలార్డర్ బ్యాటర్గా, ఆఫ్ స్సిన్నర్గా ఉన్న అతడు ఇంతవరకు మెగా ఈవెంట్లో మెరుగ్గా రాణించింది లేదు. 2007-16 వరకు 22 మ్యాచ్లు ఆడిన మహ్మదుల్లా కేవలం 194 పరుగులు చేసి, 8 వికెట్లు తీశాడు. ముష్ఫికర్ రహీం(బంగ్లాదేశ్) వికెట్ కీపర్ బ్యాటర్ రహీమ్(Mushfiqur Rahim)ది కూడా మహ్మదుల్లా లాంటి కథే. ఇప్పటి వరకు టీ20 వరల్డ్కప్ టోర్నీలో 20 ఇన్నింగ్స్ ఆడిన అతడు 258 పరుగులు సాధించాడు. 19 డిస్మిసల్స్ చేశాడు. క్రిస్ గేల్(వెస్టిండీస్) యూనివర్సల్ బాస్, బిగ్ హిట్టర్ క్రిస్ గేల్(Chris Gayle) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫాస్టెస్ట్ సెంచరీ, అత్యధిక సిక్సర్లు, అత్యధిక పరుగులు.. ఇలా ఒక్కటేమిటి.. పొట్టి ఫార్మాట్లో గేల్ సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఇప్పటికే ఆరుసార్లు టీ20 వరల్డ్కప్ టోర్నీలో విండీస్కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. 920 పరుగులు చేశాడు. శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్దనే(1016 రన్స్) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గేల్ కావడం విశేషం. షోయబ్ మాలిక్(పాకిస్తాన్) ఇప్పటికే పాక్ తరఫున ఆరుసార్లు ఈ మెగా టోర్నీలో పాల్గొన్న వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్(Shoaib Malik)కు.. ఈసారి సొహైబ్ మక్సూద్ గాయపడటంతో అవకాశం లభించింది. కాగా 2009లో టీ20 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో షోయబ్ మాలిక్ సభ్యుడు. ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు అతడు 2335 పరుగులు చేయడం సహా 28 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: T20 WC 2021: అరె ఏంట్రా ఇది.. పాపం బంగ్లాదేశ్ కెప్టెన్... అసలు మాట్లాడనిస్తే కదా! -
టీ20 వరల్డ్కప్: ఫాస్టెస్ట్ సెంచరీ.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిందో లేదో మరో టీ20 సమరానికి తెరలేచింది. అది కూడా వరల్డ్కప్ రూపంలో ప్రేక్షకుల్ని కనువిందు చేయడానికి వచ్చేసింది. బ్యాట్కి బాల్కి జరిగే ఈ మెగా టోర్నీలో మరొకసారి సంచలన ప్రదర్శనలు చేయడానికి క్రికెట్ జట్లు సిద్దమైపోగా వీక్షించడానికి ప్రేక్షకులు రెట్టించిన ఉత్సాహం ఎదురుచూస్తున్నారు. నేటి(ఆదివారం, అక్టోబర్ 17) నుంచి క్వాలిఫయింగ్ పోటీలతో టీ20 వరల్డ్కప్ సమరం ఆరంభం అయ్యింది. దీనిలో భాగంగా ఓవరాల్గా ఈ టోర్నీకి సంబంధించి కొన్ని విశేషాలను చూద్దాం. ఫాస్టెస్ట్ సెంచరీ.. టీ20 క్రికెట్లో హార్డ్ హిట్టర్గా పేరుగాంచిన వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ రెండు సందర్భాల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్కప్లో సఫారీలపైనే బ్యాట్ ఝుళిపించాడు గేల్. 50 బంతుల్లోనేసెంచరీ బాదేసి రికార్డు నెలకొల్పాడు. అటు తర్వాత ఆ రికార్డును తనే బ్రేక్ చేశాడు గేల్. 2016లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో గేల్ 48 బంతుల్లో శతకం బాదేశాడు. 11 సిక్స్లు, 5 ఫోర్ల సాయంతో సెంచరీ కొట్టేశాడు. తద్వారా 9 ఏళ్ల తర్వాత తన రికార్డును తానే సవరించుకున్నాడు గేల్. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ టీ20 క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మన్గా గుర్తింపు పొందిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని తన పేరిట లిఖించుకున్నాడు. అది కూడా ఆరంభపు టీ20 వరల్డ్కప్లో కావడం విశేషం. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువీ విశ్వరూపం ప్రదర్శించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం మరొక విశేషం. అత్యధిక పరుగులు టీ20 వరల్డ్కప్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్థనే పేరిట ఉంది. 2007 నుంచి 2014 వరకూ 31 టీ20 వరల్డ్కప్ మ్యాచ్లు ఆడిన జయవర్థనే 1016 పరుగులు సాధించాడు. నేటికీ ఇదే అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. ఈ జాబితాలో గేల్(920-28 మ్యాచ్లు), దిల్షాన్(897-35 మ్యాచ్లు),కోహ్లి(777- 16 మ్యాచ్లు) వరుస స్థానాల్లో ఉన్నారు. అత్యధిక వికెట్లు టీ20 వరల్డ్కప్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ముందు వరుసలో ఉన్నాడు. తన టీ20 వరల్డ్కప్ కెరీర్లో 34 మ్యాచ్లు ఆడిన ఆఫ్రిది 39 వికెట్లు సాధించి ఇప్పటికీ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో లసిత్ మలింగా 31 మ్యాచ్ల్లో 38 వికెట్లతో ఉండగా, సయిద్ అజ్మల్ 23 మ్యాచ్ల్లో 36 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అత్యధిక డిస్మిసల్స్ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచిన ధోని.. టీ20 వరల్డ్కప్లో కూడా పలు రికార్డులను సాధించాడు. తొలి టీ20 వరల్డ్కప్ను సాధించడమే కాకుండా, ఈ మెగా టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్ చేసిన రికార్డును కూడా నమోదు చేశాడు. టీ20 వరల్డ్కప్లో ధోని 32 డిస్మిసల్స్తో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఇక 2007 నుంచి 2017 వరకూ టీమిండియాకు పరిమిత ఓవర్ల కెప్టెన్గా వ్యవహరించిన ధోని.. ప్రతీ టీ20 వరల్డ్కప్లోనూ ఒక జట్టుకు కెప్టెన్గా చేసిన ఏకైక ప్లేయర్గా రికార్డు సాధించాడు. -
ఆ క్రికెటర్పై గౌరవం చచ్చిపోయింది.. గేల్ సంచలన వ్యాఖ్యలు
Chris Gayle Sensational Comments On Curtly Ambrose.. వెస్టీండీస్ మాజీ దిగ్గజ బౌలర్ కర్ట్లీ అంబ్రోస్పై యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్కు సంబంధించి వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతని ఎంపిక తనకు నచ్చలేదని... ఫామ్లో లేకపోయినప్పటికీ గేల్ను అనవసరంగా ఎంపిక చేశారంటూ అంబ్రోస్ వారం క్రితం ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. తనకు అవకాశం ఇస్తే గేల్ను జట్టులోకి తీసుకునేవాడిని కాదని.. ప్రస్తుతం అతని ఎంపిక అనేది ఒక సీనియర్ బ్యాటర్గా పరిగణించడంతోనే ఆటోమెటిక్గా టి20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడంటూ విమర్శలు చేశాడు. చదవండి: Travis Head: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియా క్రికెటర్ సరికొత్త రికార్డు అంబ్రోస్ వ్యాఖ్యలపై గేల్ స్పందింస్తూ.. '' నాకు అంబ్రోస్ ఉన్న గౌరవం చచ్చిపోయింది. జట్టులోకి నేను కొత్తగా వచ్చినప్పుడు అతనికి నేనిచ్చిన గౌరవం వేరుగా ఉండేది. కానీ ఈరోజు నాపై ఆయన చేసిన వ్యాఖ్యలతో చాలా బాధపడుతున్నా. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి వ్యక్తిగతంగా నాపై మాటల యుద్దం చేస్తున్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వ్యాఖ్యలు నా మనసులో నుంచి వచ్చాయి. నాపై నమ్మకముంటేనే కదా జట్టులోకి ఎంపికచేస్తారు. ఫామ్లో లేకపోవచ్చు.. కానీ అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటాను. ఒక యునివర్సల్ బాస్గా ఈరోజుతో కర్ట్లీ అంబ్రోస్తో తెగదెంపులు చేసుకుంటున్నా. ఒకవేళ అతను నాకు ఎదురుపడితే కూడా ఇదే మాట చెబుతా. నాపై నెగెటివ్ ప్రచారం ఆపండి. టి20 ప్రపంచకప్ను వెస్టిండీస్ గెలవాలని కోరుకోండి'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పొట్టి ఫార్మాట్లో వెస్టిండీస్ జట్టుకు ఘనమైన రికార్డు ఉంది. రెండుసార్లు చాంపియన్గా నిలిచిన ఘనత వెస్టిండీస్కు దక్కింది. 2012, 2016లో టి20 ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన వెస్టిండీస్ జట్టులో గేల్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2021 ఏడాది ఆరంభం నుంచి చూసుకుంటే 16 టి20 మ్యాచ్లాడి 227 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ఫేజ్లో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన గేల్ ఆ తర్వాత బయోబబుల్ను వీడాడు. భారీ సిక్సర్లు అలవోకగా బాదే గేల్ ఫామ్లోకి వచ్చేందుకు ఒక్క మ్యాచ్ చాలు. అతను ఫామ్లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించడం ఖాయం. చదవండి: T20 WC 2021: కొత్త లుక్లో టీమిండియా జెర్సీ.. ఆ మూడు చుక్కలు ఎందుకంటే -
రైనా సహా 'ఆ ముగ్గురి' ఖేల్ ఖతమైనట్టే..!
4 Players Who Might Go Unsold In IPL 2022 Auction: ప్రస్తుత ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫామ్ లేమితో సతమతమవుతున్న నలుగురు విధ్వంసకర ఆటగాళ్ల ఐపీఎల్ కెరీర్లు దాదాపుగా సమాప్తమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరంతా వచ్చేఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించే మెగా ఆక్షన్ అమ్ముడుపోని సరుకులుగా మిగిలిపోయే అవకాశం ఉందని వారు జోస్యం చెబుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే డాషింగ్ ప్లేయర్ సురేశ్ రైనా సహా ముగ్గురు విదేశీ విధ్వంసకర బ్యాటర్లు ఉంటారని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. విదేశీ బ్యాటర్ల లిస్ట్లో యూనివర్సల్ బాస్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ క్రిస్ గేల్ ముందువరుసలో ఉంటాడని, అతని వెనకాలే కోల్కతా నైట్రైడర్స్ సారధి, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆతరువాత రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నలుగురితో పాటు గతేడాది ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన డానియల్ క్రిస్టియన్(ఆర్సీబీ-4.8 కోట్లు), రిలే మెరిడిత్(పంజాబ్ కింగ్స్-8 కోట్లు), జయ్దేవ్ ఉనద్కత్(రాజస్థాన్ రాయల్స్-3 కోట్లు), టామ్ కర్రన్(ఢిల్లీ క్యాపిటల్స్-5.25 కోట్లు), జై రిచర్డ్సన్(పంజాబ్ కింగ్స్-14 కోట్లు)లు కచ్చితంగా అమ్ముడుపోని జాబితాలో ఉంటారని అంచనా వేస్తున్నారు. పైన పేర్కొన్న ఆటగాళ్లనంతా ఆయా ఫ్రాంచైజీలు భారీ ధర వెచ్చింది కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వారిపై వేటు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. చదవండి: మోదీపై అమిత్ షా ప్రశంసలు.. వ్యంగ్యంగా స్పందించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ -
T20 World Cup: పొలార్డ్ టాప్-5 ఫేవరెట్ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా!
Kieron Pollard Top Five T20 Players: టీ20 వరల్డ్కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పొట్టి ఫార్మాట్లో తనకు ఇష్టమైన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించాడు. ఇందులో ఓ విధ్వంసకర ఓపెనర్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్, ఆల్రౌండర్, మాజీ స్పిన్నర్, మాజీ పేసర్కు చోటిచ్చాడు. మరి.. కీరన్ పొలార్డ్ ఫేవరెట్ టాప్-5 టీ20 క్రికెటర్స్ ఎవరంటే..! క్రిస్ గేల్(వెస్టిండీస్), లసిత్ మలింగ(శ్రీలంక), సునిల్ నరైన్(వెస్టిండీస్), ఎంఎస్ ధోని(ఇండియా), కీరన్ పొలార్డ్(వెస్టిండీస్). అవును.. తనకు ఇష్టమైన జాబితాలో ముగ్గురూ విండీస్ ఆటగాళ్లు.. ముఖ్యంగా అందులో తన పేరును కూడా పొలార్డ్ పేర్కొనడం విశేషం. క్రిస్గేల్(Chris Gayle) విధ్వంసకర ఇన్నింగ్స్తో యూనివర్స్ బాస్గా పేరొందిన క్రిస్ గేల్.. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 446 మ్యాచ్లు ఆడి... 14261 పరుగులు చేశాడు. సగటు 36.94. స్ట్రైక్రేటు.. 145.87. ఇందులో 22 శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 175(నాటౌట్). రెండుసార్లు టీ20 వరల్డ్కప్(2012, 2016) గెలిచిన విండీస్ జట్టులో ఈ సిక్సర్ల వీరుడు సభ్యుడిగా ఉన్నాడు. లసిత్ మలింగ(Lasith Malinga) యార్కర్ల కింగ్గా పేరొందిన లసిత్ మలింగ... తనదైన శైలిలో బంతులు సంధించి ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లను పెవిలియన్కు పంపిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీ20 ఫార్మాట్లో 295 మ్యాచ్లలో 390 వికెట్లు తీసిన మలింగ.. 2014లో టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు. ఇక ఆటకు స్వస్తి పలికిన మలింగ.. తాను అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు సెప్టెంబరు 15న ప్రకటించాడు. సునిల్ నరైన్(Sunil Narine) స్పిన్ మాయాజాలంతో ఎంతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన విండీస్ ఆటగాడు సునిల్ నరైన్... పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇమ్రాన్ తాహిర్, డ్వేన్ బ్రావో తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇటీవలి కాలంలో బ్యాటర్(లీగ్)గా కూడా సత్తా చాటుతున్నాడు. ఇక విండీస్ 2012లో టీ20 వరల్డ్కప్ గెలవడంలో నరైన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్లలో 5.63 ఎకానమీతో 9 వికెట్లు తీశాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఎంఎస్ ధోని(MS Dhoni) టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, బెస్ట్ ఫినిషర్, అత్యుత్తమ వికెట్ కీపర్.. ఇలా ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిపెట్టిన సారథి. ముఖ్యంగా తొట్టతొలి టీ20 వరల్డ్కప్-2007 గెలిచిన జట్టుకు కెప్టెన్. అన్ని ఫార్మాట్లలోనూ సారథిగా తనదైన ముద్ర వేసిన ధోని... టీ20 క్రికెట్లో 185 క్యాచ్లు, 84 స్టంపింగ్లు చేసిన వికెట్కీపర్గా పేరొందాడు. 6861 పరుగులు(స్ట్రైక్ రేటు- 134.82) చేసి బ్యాటర్గానూ సత్తా చాటాడు. కీరన్ పొలార్డ్(Kieron Pollard) ఆరంభంలో తడబడినా.. రానురాను తనదైన విధ్వంసకర ఇన్నింగ్స్తో టీ20 క్రికెట్కే పర్యాయపదంగా మారాడు పొలార్డ్. గేల్ తర్వాత అంతటి హిట్టర్గా పేరొందాడు. టీ20 ఫార్మాట్లో 298 వికెట్లు తీసిన ఈ ఆల్రౌండర్.. 2012లో టీ20 వరల్డ్కప్ గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిగా, 2016లో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్గా ప్రశంసలు అందుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్గా ఈసారి బరిలోకి దిగనున్న వెస్టిండీస్ జట్టుకు అతడే సారథి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విండీస్ టీ20 జట్టు ఇదే: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్, లెండెల్ సిమన్స్, ఒస్నేన్ థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్ స్టాండ్ బై ప్లేయర్లు: జాసన్ హోల్డర్, డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, ఏకేల్ హోసిన్. -వెబ్డెస్క్ చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. గేల్, కోహ్లి రికార్డులు బద్దలు
Babar Azam Scores Fastest 7000 T20 Runs: టీ20ల్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో వేగంగా 7000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును బాబర్ ఆజమ్ తిరగరాశాడు. పొట్టి క్రికెట్లో గేల్ 192 ఇన్నింగ్స్ల్లో 7000 పరుగుల మార్కును చేరుకోగా.. బాబర్ కేవలం 187 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని క్రాస్ చేశాడు. పాక్లో జరుగుతున్న నేషనల్ టీ20 కప్లో భాగంగా సదరన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సెంట్రల్ పంజాబ్ తరఫున 59 పరుగులు చేసిన బాబర్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(212)ని మూడో స్థానానికి, ఆరోన్ ఫించ్(222), డేవిడ్ వార్నర్(223)లను నాలుగు, ఐదు స్థానాలకు వెనక్కు నెట్టాడు. పొట్టి ఫార్మాట్లో పాక్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్గా నిలిచిన బాబర్.. ఓవరాల్గా 7000 పరుగుల మార్కును అందుకున్న 30వ బ్యాటర్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో 56 ఇన్నింగ్స్ల్లో 2204 పరుగులు చేసిన బాబర్.. అత్యధిక పరుగుల జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు. చదవండి: రిషబ్ పంత్కు శుభాకాంక్షల వెల్లువ.. -
Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా...
Chris Gayle leaves Bio Bubble: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున మిగిలిన మ్యాచ్లనుంచి తప్పుకుంటున్నట్లు క్రిస్ గేల్ ప్రకటించాడు. సుదీర్ఘ కాలంగా బయో బబుల్లో ఉంటూ రావడంతో మానసికంగా బాగా అలసిపోయానన్న గేల్.. టి20 ప్రపంచకప్లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు విరామం కోరుకుంటున్నానని అతను వెల్లడించాడు. ఈ మేరకు... ‘‘గత కొన్ని నెలలుగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ బబుల్.. ఆ తర్వాత ఐపీఎల్ బబుల్లో ఉంటున్నాను. మానసిక పునరుత్తేజాన్నిపొందడానికి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో గేల్ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదనే చెప్పాలి. పేలవంగా ఆడిన అతడు.. పంజాబ్ తరఫున 10 ఇన్నింగ్స్లలో 193 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్లో గేల్ అత్యధిక స్కోరు 46 మాత్రమే!. కాగా గేల్ ప్రకటనపై స్పందించిన పంజాబ్ కింగ్స్ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది. టీ20 వరల్డ్కప్ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తూ.. ఈ వెస్టిండీస్ క్రికెటర్కు విషెస్ తెలిపింది. చదవండి: IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్ చరిత్రలో అత్యధికం Chris Gayle: వయసు మీద పడుతున్న సింహం లాంటివాడే.. కానీ #PBKS respects and supports the decision of @henrygayle. Wishing him all the success for the upcoming #T20WorldCup!#SaddaPunjab #IPL2021 #PunjabKings https://t.co/QmTqhd8w6k — Punjab Kings (@PunjabKingsIPL) September 30, 2021 -
Chris Gayle: వయసు మీద పడుతున్న సింహం లాంటివాడే.. కానీ
Irfan Pathan Comments On Chris Gayle: పంజాబ్ కింగ్స్ మెరుగ్గా రాణించాలంటే స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ బ్యాట్ ఝులిపించాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అదే విధంగా.. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో రాణించిన నికోలస్ పూరన్.. ఐపీఎల్లోనూ అదే స్థాయి ప్రదర్శన కనబరిస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పంజాబ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్(42) టాప్ స్కోరర్గా నిలవగా... కెప్టెన్ కేఎల్ రాహుల్(21), దీపక్ హుడా(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. సిక్సర్ల వీరుడిగా పేరొందిన క్రిస్ గేల్ మాత్రం ఒక్క పరుగుకే నిష్క్రమించాడు. పొలార్డ్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్చేరాడు. ఇక నికోలస్ పూరన్ సైతం రెండు పరుగులు చేసి.. బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. Photo: PBKS Twitter వేరే ఆప్షన్లు లేవు ఈ నేపథ్యంలో పంజాబ్ ఆట తీరును విశ్లేషిస్తూ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘క్రిస్ గేల్ నుంచి పంజాబ్ మెరుగైన ప్రదర్శన కోరుకోవడం సహజం. అతడు వృద్ధాప్యం మీద పడుతున్న సింహం లాంటివాడే(గేల్ వయస్సు(42)ను దృష్టిలో పెట్టుకుని). కానీ, గేల్ పరుగులు చేయాల్సిందే. జట్టు అతడి నుంచి ఈమాత్రం ఆశించడం సహజం. ఎందుకంటే.. వారికి ప్రత్యామ్నాయం లేదు. ఆప్షన్లు కూడా ఎక్కువగా లేవు. మయాంక్ వస్తేనే ఇక నికోలస్ పూరన్ విషయానికొస్తే... సీపీఎల్లో రాణించిన అతడు ఆ ఫాంను ఐపీఎల్లో కొనసాగించాల్సి ఉంది. మరో ఆటగాడు.. మార్క్రమ్.. ఈ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. హుడా కూడా పర్వాలేదు. కానీ.. ఈ స్కోరు సరిపోదు. మిగతా జట్లన్నీ వరుస విజయాలతో ముందుకు సాగుతూ ఉంటే... మీరు కూడా మీదైన ముద్ర వేసి.. పంచ్తో అదరగొట్టాలి. పంజాబ్ కింగ్స్, ఆ జట్టు బ్యాట్స్మెన్ కచ్చితంగా ఇంకా మెరుగ్గా ఆడాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక గత మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించిందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అతడి మెడకు అయిన గాయం.. జట్టు వెన్నెముకనే విరిచేసిందని, మయాంక్ ఎంత త్వరగా జట్టుతో చేరితో అంత మంచిదని చెప్పుకొచ్చాడు. స్కోర్లు: పంజాబ్- 135/6 (20) ముంబై- 137/4 (19) చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తిక్ -
నేను రేపు పాకిస్తాన్ వెళ్తున్నా.. ఇంతకీ ఐపీఎల్ ఆడుతున్నావా? లేదా?
Chris Gayle Tweet Goes Viral: కేవలం ఆటతోనే కాదు.. తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటాడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. విషయం ఏదైనా సరే.. ఈ సిక్సర్ల కింగ్ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకుంటాడు. అయితే, ఆదివారం అతడు చేసిన ఓ ట్వీట్ మాత్రం మిస్ఫైర్ అయినట్లుగా కనిపిస్తోంది. జోకులు వేయడానికి సమయం, సందర్భం లేదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాగా కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి నుంచి పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్ గేల్ యూఏఈ చేరుకున్నాడు. క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టుతో చేరాడు. ఇదిలా ఉండగా... భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్ రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పాకిస్తాన్ మాజీలు మండిపడుతుండగా.. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కివీస్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో క్రిస్ గేల్ చేసిన ట్వీట్ అభిమానులను గందరగోళానికి గురి చేసింది. ‘‘నేను రేపు పాకిస్తాన్కు వెళ్తున్నాను. నాతో ఎవరెవరు వస్తారు’’ అని అతడు అడిగాడు. ఇందుకు ఓ వర్గం సంతోషం వ్యక్తం చేయగా... కొంతమంది నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘‘ఇంతకీ నువ్వు ఐపీఎల్ ఆడుతున్నావా లేదా?.. అయినా ఒక మనిషి ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల ఎలా ఉండగలడు. నీ మాటలకు అసలు అర్థమేమిటి?’’ అని క్రిస్ గేల్ తీరును విమర్శిస్తున్నారు. ఇంకొంత మంది.. సీరియస్ అంశాలను కూడా ఇలా జోక్ చేయడం తగునా అంటూ అతడి తీరును తప్పుపడుతున్నారు. కాగా ఐపీఎల్ గేల్ విజయవంతమైన ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అతడు 140 మ్యాచ్లు ఆడి 4950 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇక పొట్టి ఫార్మాట్లో గేల్ సిక్సర్ల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదవండి: Shoaib Akhtar: డేట్ గుర్తుపెట్టుకోండి.. దెబ్బకు దెబ్బ తీయాలి How excited are you to see them 🔙 at the den? 😍#SaddaPunjab #IPL2021 #PunjabKings @henrygayle @FabianAllen338 @nicholas_47 pic.twitter.com/GYlaKLMkKe — Punjab Kings (@PunjabKingsIPL) September 16, 2021 I’m going to Pakistan tomorrow, who coming with me? 😉🙌🏿 — Chris Gayle (@henrygayle) September 18, 2021 -
CPL 2021: గేల్ డకౌట్.. కానీ టైటిల్ మాత్రం అతని జట్టుదే
St Kitts and Nevis Patriots CPL 2021 Champions.. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో కొత్త చాంపియన్గా సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ అవతరించింది. సెంట్ లూసియా, సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ మధ్య బుధవారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో విజయం అందుకున్న సెంట్ కిట్స్ తొలిసారి సీపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. టోర్నీ ఆధ్యంతం నిలకడగా రాణించిన సెంట్ కిట్స్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. క్రిస్ గేల్ డకౌట్ అయినప్పటికి.. భీకరఫామ్లో ఉన్న ఎవిన్ లూయిస్ 6 పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. వికెట్ కీపర్ జోషువా డిసిల్వా రాణించగా.. చివర్లో డొమినిక్ డ్రేక్స్ మ్యాచ్ విన్నర్గా నిలిచి తన జట్టుకు తొలిసారి టైటిల్ను అందించాడు. చదవండి: CPL 2021: వికెట్ తీశానన్న ఆనందం.. బౌలర్ వింత ప్రవర్తన మ్యాచ్ విన్నర్ డొమినిక్ డ్రేక్స్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ కార్న్వాల్ 43, రోస్టన్ చేజ్ 43 రాణించారు. సెంట్ కిట్స్ బౌలర్లలో ఫాబియెన్ అలెన్ , నసీమ్ షా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ కిట్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. గేల్ డకౌట్గా వెనుదిరగ్గా.. కాసేపటికే ఎవిన్ లూయిస్ ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జోషుహ డిసిల్వా(37), షెర్ఫెన్ రూథర్ఫోర్డ్(25)లు కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. విజయం దిశగా సాగిపోతున్న సమయంలో సెంట్ కిట్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చదవండి: Chris Gayle: గేల్ బ్యాటింగ్.. బ్యాట్ రెండు ముక్కలు; వీడియో వైరల్ ఈ దశలో డొమినిక్ డ్రేక్ అద్భుతం చేశాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో విజృంభించిన అతను చివరి వరకు నాటౌట్గా నిలిచి జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. అతనికి ఫాబియెన్ అలెన్(20 పరుగులు) నుంచి చక్కని సహకారం లభించింది. ఫైనల్ హీరోగా నిలిచిన డొమినిక్ డ్రేక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. రోస్టన్ చేజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. WHAT A FINISH! Dominic Drakes seals the win with a @fun88eng Magic moment. pic.twitter.com/tvyn72hbmP — CPL T20 (@CPL) September 15, 2021 -
వికెట్ తీశానన్న ఆనందం.. బౌలర్ వింత ప్రవర్తన
Kevin Sinclair Flipout CPL 2021: విండీస్ ఆటగాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ మజా ఇంకో లెవల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రేవో, గేల్, కాట్రెల్ లాంటి ఆటగాళ్లు తన హావభావాలతో ఫ్యాన్స్ను ఎన్నోసార్లు మెప్పించారు. తాజాగా సీపీఎల్ 2021లో భాగంగా కెవిన్ సింక్లెయిర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వికెట్ తీశానన్న ఆనందంలో సింక్లెయిర్ మైదానంలోనే గెంతులు వేశాడు. గయానా అమెజాన్ వారియర్స్, సెంట్ కిట్స్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. చదవండి: Chris Gayle: గేల్ బ్యాటింగ్.. బ్యాట్ రెండు ముక్కలు; వీడియో వైరల్ అప్పటికే గేల్, లూయిస్లు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సింక్లెయిర్ వేసిన రెండో బంతిని గేల్ లాంగాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న హెట్మైర్ ఏ మాత్రం తడబడకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో సింక్లెయిర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గేల్ వికెట్ తీశానన్న ఆనందంలో ఫ్లిప్స్(గెంతులు)తో రెచ్చిపోయాడు. ఈ వీడియోనూ సీపీఎల్ టి20 తన ట్విటర్లో షేర్ చేసింది. చివర్లో హెట్మైర్, పూరన్లు వచ్చి సింక్లెయిర్ను ప్రోత్సహించడం హైలెట్గా నిలిచింది. ఇక ఇదే మ్యాచ్లో గేల్ 42 పరుగులు చేయడం ద్వారా సీపీఎల్లో 2500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్పై విజయం సాధించిన సెంట్ కిట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: వరల్డ్కప్ ఉంది.. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూడడం ఆపండి Kevin Sinclair is literally flipping out over the last wicket 😯 #GAWvSKNP #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/0FhYbfe4nn — CPL T20 (@CPL) September 14, 2021 -
Chris Gayle: గేల్ బ్యాటింగ్.. బ్యాట్ రెండు ముక్కలు; వీడియో వైరల్
జమైకా: యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ బ్యాట్ రెండు ముక్కలవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీపీఎల్ 2021లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్, సెంట్ కిట్స్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. సెంట్ కిట్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్ను ఒడియన్ స్మిత్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్మిత్ లెగ్స్టంప్ దిశగా వేశాడు. గేల్ దానిని ఆఫ్సైడ్ ఆడుదామని భావించాడు. అయితే బంతి బ్యాట్కు బలంగా తగలడంతో రెండు ముక్కలైంది. బ్యాట్ కింద పడిపోగా.. హ్యాండిల్ మాత్రం గేల్ చేతిలో ఉండిపోయింది. ఆ తర్వాత గేల్ పడిపోయిన బ్యాట్ను పరిశీలించి కొత్త బ్యాట్ తెప్పించుకొని ఇన్నింగ్స్ కొనసాగించాడు. చదవండి: Chris Gayle: గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉంటుందా.. చదవండి: SL Vs SA: డికాక్ మెరుపులు.. 10 వికెట్లతో విజయం; దక్షిణాఫ్రికా క్లీన్స్వీప్ ఇక సెమీస్లో సెంట్ కిట్స్ గయానాపై గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. గయానా గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్ కిట్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ లూయిస్ (39 బంతుల్లో 77 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్మైర్ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. చదవండి: Evin Lewis CPL 2021: లూయిస్ సిక్సర్ల విధ్వంసం.. దర్జాగా ఫైనల్కు Batting malFUNction for @henrygayle #GAWvSKNP #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/kuPgIs7DuY — CPL T20 (@CPL) September 14, 2021 -
Chris Gayle: గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉంటుందా..
వెస్ట్రన్పార్క్: యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అంటేనే విధ్వంసానికి మారుపేరు. భారీ సిక్సర్లు అలవోకగా బాదే గేల్ ఎన్నోసార్లు తన పవర్హిట్టింగ్ను రుచి చూపించాడు. ఫాంలో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2021లో గేల్ కొట్టిన భారీ సిక్స్కు స్కోర్కార్డ్ డిస్ప్లే చేసే స్ర్కీన్గ్లాస్ పగిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లీగ్లో సెంట్ కిట్స్ నెవిస్ పాట్రియోట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్.. బార్బడోస్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ను నమోదు చేశాడు. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతిని నేరుగా స్ట్రెయిట్ సిక్స్ సంధించాడు. బంతి నేరుగా ఉన్న స్కోరుబోర్డు స్క్రీన్కు తగిలింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్లు ''గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉండదు కదా.. గ్లాస్ పగిలింది'' అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ మ్యాచ్లో గేల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతులెదుర్కొన్న గేల్ ఒక సిక్సర్, ఒక ఫోర్తో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో సెంట్ కిట్స్ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సెంట్కిట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికి లోయర్ ఆర్డర్లో ష్రెఫాన్ రూథర్ఫర్డ్ 53 నాటౌట్, డ్వేన్ బ్రావో 47 నాటౌట్తో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. షై హోప్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగిలినవారు విఫలమయ్యారు. సెంట్ కిట్స్ బౌలింగ్లో షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్ చెరో రెండు వికెట్లు, ఫాబియన్ అలెన్ ఒక వికెట్ తీశాడు. చదవండి: ENG Vs IND: టీమిండియా చెత్త ప్రదర్శన.. కోహ్లి, రోహిత్లదే బాధ్యత A SMASHING HIT by the Universe Boss @henrygayle sees him with the @OmegaXL hit from match 2. #CPL21 #BRvSKNP #CricketPlayedLouder #OmegaXL pic.twitter.com/8001dFwNWQ — CPL T20 (@CPL) August 27, 2021 -
Chris Gayle: ఐసీసీ వద్దంది, ఇప్పుడు నేను యూనివర్స్ బాస్ కాదు..
Chris Gayle Universe Boss: వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ను ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు ముద్దుగా యూనివర్స్ బాస్ అని పిలుస్తుంటారు. ఈ ట్యాగ్ అతనికెవరూ ఇవ్వకపోయినా తనతంట తానే అలా ఫిక్స్ అయిపోయాడు. అతని బ్యాట్ మీద కూడా యూనివర్స్ బాస్ అనే స్టిక్కర్ ఉంటుంది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో గేల్ బ్యాట్పై యూనివర్స్ బాస్కు బదులు 'ది బాస్' అని రాసుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో గేల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. Chris Gayle's got some fresh stickers after a short conversation with the ICC! 😅 #WIvAUS pic.twitter.com/99nxhrBrGP — cricket.com.au (@cricketcomau) July 13, 2021 తాను యూనివర్స్ బాస్గా చెలామణి కావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి ఇష్టం లేదని, ఐసీసీ అభ్యంతరం తెలపడంతోనే యూనివర్స్ బాస్ను ది బాస్గా మార్చుకున్నానని మ్యాచ్ అనంతరం తెలిపాడు. యూనివర్స్ బాస్పై ఐసీసీకి కాపీరైట్స్ ఉన్నాయని, దానిపై నేను ముందే కాపీరైట్స్ పొందాల్సి ఉండిందని పేర్కొన్నాడు. సాంకేతికంగా క్రికెట్లో ఐసీసీయే బాస్. వాళ్లతో నేను పనిచేయను. ఐసీసీతో సంబంధం లేదు. బ్యాటింగ్లో నేనే బాస్. అంటూ మ్యాచ్ అనంతరం గేల్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో గేల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరస్ను మరో రెండు మ్యాచ్లుండగానే విండీస్ 3-0తో కైవసం చేసుకుంది. ఇక ఇదే మ్యాచ్లోనే గేల్ టీ20ల్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. గేల్ ఇప్పటివరకు 431 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ జాబితాలో గేల్ తర్వాతి స్థానాల్లో పోలార్డ్ 10836 పరుగులు, షోయబ్ మాలిక్ 10741, వార్నర్10017, విరాట్ కోహ్లీ 9235లు ఉన్నారు. -
ఐదేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ; సిరీస్ విండీస్ కైవసం
సెంట్ లూసియా: యునివర్సల్ బాస్.. హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ తుఫాన్ ఇన్నింగ్స్తో మెరవడంతో వెస్టిండీస్ ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా ఆసీస్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ను విండీస్ మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే 142 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. గేల్(38 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడడంతో పాటు కెప్టెన్ నికోలస్ పూరన్ (32, 27 బంతులు; 4 ఫోర్లు, ఒక సిక్సర్) సహకరించాడు. దీంతో విండీస్ 14.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్తో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటింగ్లో హెన్రిక్స్ 33, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 30 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ 3, ఆండీ రసెల్ 2 వికెట్లు తీశారు. ఇక గేల్ ఇదే మ్యాచ్లో మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో 14వేల పరుగులు అందుకున్న తొలి ఆటగాడిగా గేల్ చరిత్ర సృష్టించాడు. ఇక విండీస్ తరపున ఐదేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ సాధించిన గేల్ అదే జోష్లో విండీస్కు సిరీస్ను అందించాడు. కాగా మ్యాచ్లో హ్యాట్రిక్ సిక్సర్లతో గేల్ హ్యాట్రిక్ సిక్సర్లతో అర్థసెంచరీ మార్క్ను అందుకోవడం విశేషం. సిరీస్లో నామమాత్రంగా మారిన మిగిలిన రెండు మ్యాచ్లు జూలై 14, 16న జరగనున్నాయి. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. Chris Gayle falls to Riley Meredith, but not before a trademark fifty, passing 14,000 T20 runs in the process!#WIvAUS | https://t.co/gtzSxh0BjZ pic.twitter.com/VY1N9XPczT — ICC (@ICC) July 13, 2021 -
టీ20 క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ
న్యూఢిల్లీ: టీ 20 క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ నమోదైంది. 79 బంతుల్లో 205 పరుగులు చేసిన ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి సరి కొత్త చరిత్ర సృష్టించాడు. 20 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దేశ రాజధానిలో ఆదివారం జరిగిన ఓ క్లబ్ మ్యాచ్లో ఢిల్లీ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగిన సుబోధ్ భాటి.. ప్రత్యర్థి సింబా జట్టుపై ఈ ఘనత సాధించాడు. ఓపెనర్ వచ్చిన సుబోధ్ అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 17 ఫోర్లు,17 సిక్సర్లు ఉండడం గమనార్హం. తొలి 100 పరుగులను ఈ రంజీ ఆటగాడు కేవలం 17 బంతుల్లో సాధించడం విశేషం. దీంతో ఢిల్లీ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 256 పరుగులు చేసింది. సుబోధ్ భాటితో పాటు సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి ఆరు పరుగులు చేశాడు. అంతకు ముందు టీ 20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు క్రిస్గేల్ పేరున ఉంది. యునివర్సల్ బాస్ 2013 ఐపిఎల్లో పూణే వారియర్స్ పైన 66 బంతుల్లో 175 సాధించాడు. తరువాత ట్రై-సిరీస్లో జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేసి తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇక సుబోధ్ భాటి కెరీర్ విషయానికొస్తే 24 లిస్ట్-ఎ, 39 టీ 20 మ్యాచ్ల్లో ఢిల్లీకు ప్రాతినిధ్యం వహించాడు. -
పొలార్డ్ విధ్వంసం; బంగీ జంప్లు చేసిన గేల్
జమైకా: యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఏం చేసినా ఫన్నీగానే అనిపిస్తుంది. బ్యాటింగ్కు దిగితే భారీ ఇన్నింగ్స్లతో విరుచుకుపడే గేల్ బౌలింగ్ సమయంలోనూ తన చర్యలతో ఆకట్టుకుంటాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో గేల్ వికెట్ తీశానన్న ఆనందంలో బంగీ జంప్స్ చేయడం వైరల్గా మారింది. బ్యాటింగ్లో ఐదు పరుగులు మాత్రమే చేసిన గేల్ ఫీల్డింగ్, బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు. కెప్టెన్ పొలార్డ్ ఇన్నింగ్స్లో రెండో ఓవర్నే గేల్ చేత వేయించాడు. కాగా గేల్ తాను వేసిన ఓవర్ తొలి బంతికే డేంజరస్ ప్లేయర్ రీజా హెండ్రిక్స్ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. తన వ్యూహం ఫలించన్న ఆనందంలో హెండ్రిక్స్ పెవిలియన్ వెళ్లే సమయంలో గేల్ బంగీ జంప్స్ చేశాడు. ఆ తర్వాత ఫీల్డింగ్లోనూ రెండు క్యాచ్లు అందుకున్నాడు. గేల్ తీరుపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు.''41 ఏళ్ల వయసులో గేల్ ఇలాంటి పనులు చేయడం ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడితే.. గేల్కు వయసుతో సంబంధం లేదని.. అతని ఫిట్నెస్ అమోఘం'' అంటూ మరొకొందరు పేర్కొన్నారు. కాగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ విజయం సాధించి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను సమం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (25 బంతుల్లోనే 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించగా.. లెండిన్ సిమన్స్ 47 పరుగులుతో రాణించాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. క్వింటన్ డికాక్ 60 పరుగులతో ఆకట్టుకోగా.. మిగతావారు ఎవరు చెప్పుకోదగ్గ స్కోరుగా చేయలేకపోయారు. కాగా నిర్ణయాత్మకమైన చివరి టీ20 శనివారం జరగనుంది. How do you see this celebration of 41 year old @henrygayle 💪#WIvSA pic.twitter.com/I3Bvh7wfo7 — Diptiman Yadav (@Dipti_6450) July 2, 2021 -
సిక్సర్ల రారాజు రీ ఎంట్రీ..?
ముంబై: యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్తో మెరుపులు మెరిపించడానికి సిద్దంమవుతున్నాడు. మెల్బోర్న్కు చెందిన ‘మల్గ్రేవ్ క్రికెట్ క్లబ్’ తరుపున యువరాజ్ సింగ్ ఆడనున్నట్లు తెలుస్తోంది . యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఆసీస్ గడ్డపై బ్యాట్లు ఝుళిపించే అవకాశాలున్నాయి. వారితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ నంచి ఫిబ్రవరి మధ్య జరిగే టీ20 టోర్నీలో వీళ్లు పాల్గొనే వీలుంది. ఇప్పటికే 90 శాతం చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని మల్గ్రేవ్ క్లబ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయెగమ్ పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీలంక క్రికెటర్లు దిల్షాన్, సనత్ జయసూర్య, తరంగాలు మల్గ్రేవ్ జట్టులో ఆడనున్నారు. ఇంకొంత మంది సమర్థమంతమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు కృషి చేస్తున్నాం. దీంతో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయేగమ్ తెలిపారు. చదవండి: క్రికెట్ సెలబ్రిటీస్ ఫ్యామిలీ ఫొటోలు -
లూయిస్, గేల్ సిక్సర్ల సునామీ.. విండీస్దే తొలి టీ20
సెయింట్ జార్జియా: ఓపెనర్ ఎవిన్ లూయిస్(35 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(24 బంతుల్లో 32; ఫోర్, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్(12 బంతుల్లో 23; ఫోర్, 3 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్(19 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20లో విండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో అతిధ్య జట్టు సఫారీలను మట్టికరిపించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో విండీస్ టాస్ గెలిచి ప్రత్యర్ధిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. వాన్ డర్ డుసెన్ (38 బంతుల్లో 56 పరుగులు), వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ డికాక్ (24 బంతుల్లో 37) రాణించడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఫాబియన్ అలెన్, బ్రావోలకు తలో రెండు వికెట్లు, హోల్డర్, రసెల్లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సఫారీ బౌలర్ షంషికి ఓ వికెట్ దక్కగా, ఫ్లెచర్ రనౌట్గా వెనుదిరిగాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరుగనుంది. కాగా, సఫారీలతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆతిధ్య జట్టు 0-2తేడాతో కోల్పోయింది. చదవండి: WTC Final: ‘ఒక్క గంట ఆట, ఇమేజ్ మొత్తం డ్యామేజీ’ -
న్యూలుక్లో యూనివర్సల్ బాస్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్
జమైకా: విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ న్యూలుక్తో తన ఫ్యాన్స్ను అలరిస్తున్నాడు. తలపాగా చుట్టిన గేల్ కొత్త అవతారంలో మెరిసిపోతున్నాడు. విషయంలోకి వెళితే.. గేల్ ఈ మధ్యన ప్రైవేట్ ఆల్బమ్స్లో పాల్గొంటూ దానికి తగ్గట్టుగా తన డ్రెస్సింగ్, లుక్స్తో అదరగొడుతున్నాడు. తాజాగా ఒక షూట్కు సంబంధించి గేల్ తలపాగా చుట్టుకుంటున్న వీడియోను షేర్ చేశాడు. ''రేపు జరగబోయే షూట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.. ఈ పంజాబీ డాడీ ఫైర్ మీద ఉన్నాడు.. ఎవరు ఆపాలన్నా ఆగను.. నా షూట్ కోసం ఎదురుచూడండి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. గేల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ''గేల్.. నీ లుక్ అదుర్స్'' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 14వ సీజన్ రద్దు కావడంతో గేల్ ఇటీవలే మాల్దీవ్స్లో సముద్రంలో జెట్తో షికారు చేసిన వీడియోలు రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేశాడు. దీంతోపాటు గేల్ ఇటీవలే తాను కొన్న కొత్త కారును ఇన్స్టాలో షేర్ చేయగా.. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. నీ దగ్గర ఉన్న కారు నా దగ్గర కూడా ఉందని.. కొంపదీసి నా కారు పట్టుకుపోలేదుగా అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. గేల్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ తరపున ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన గేల్ 178 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్ ఆస్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూలై 9 నుంచి 24 వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. గేల్ ఆసీస్తో సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక గేల్ విండీస్ తరపున ఇప్పటివరకు 103 టెస్టుల్లో 7214 పరుగులు, 301 వన్డేల్లో 10480 పరుగులు, 61 టీ20ల్లో 1656 పరుగులు చేశాడు. చదవండి: ధనశ్రీ వర్మ డ్యాన్స్.. చాటుగా ఎంజాయ్ చేసిన చహల్ -
IPL 2021: రబడా ట్రాప్లో గేల్..
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఆ జట్టు పేసర్ కగిసో రబడాను టార్గెట్ చేసిన పంజాబ్ కింగ్స్ పించ్ హిట్టర్ క్రిస్ గేల్.. చివరకు అతని ట్రాప్లోనే పడ్డాడు. రబడా వేసిన ఆరో ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టిన గేల్.. ఆ తర్వాత బంతికి అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు. సుమారు 144 కి.మీ వేగంతో వేసిన ఫుల్ టాస్ను అంచనా వేయడంలో విఫలమైన గేల్.. బ్యాట్స్ పెట్టేలోపే క్లీన్బౌల్డ్ అయ్యాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. షార్ట్ బంతిని వేస్తాడని గేల్ ప్రిపేర్ కాగా, రబడా ఫుల్టాస్ వేశాడు. దాంతో గేల్ తేరుకునే లోపే ఆ బంతి కాస్తా వెళ్లి వికెట్లపై పడింది. తన బ్యాక్లెగ్తో బంతిని ఆపుదామని యత్నించినా చివరకు ఔట్ కావడంతో గేల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అంతకుముందు ప్రభ్ సిమ్రాన్ను సైతం రబడానే ఔట్ చేశాడు. నాల్గో ఓవర్ మూడో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్కు వేయగా దాన్ని ప్రభ్ సిమ్రాన్ క్లియర్ చేయడానికి యత్నించాడు. ఆ సమయంలో ఎక్స్ట్రా కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ ఎడమవైపు దూకి మరీ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. తొలుత స్మిత్ పట్టిన క్యాచ్, ఆ తర్వాత గేల్ బౌల్డ్ అయిన విధానం రెండూ కూడా మ్యాచ్లో హైలైట్గా నిలిచాయి. Photo Courtesy: Delhi Capitals Twitter -
IPL 2021: షర్ట్లు విప్పేసి మరీ హంగామా చేశారు!
అహ్మదాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్లో రాణించిన పంజాబ్ కింగ్స్.. ఆపై బౌలింగ్లో మెరిసి ఆర్సీబీని కట్టడి చేసింది. ఆర్సీబీ కీలక ఆటగాళ్లను తొందరగా పెవిలియన్కు పంపడంలో సఫలమైన పంజాబ్ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇది పంజాబ్కు మూడో విజయం కాగా, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ-పంజాబ్ల మ్యాచ్ ముగిసిన తర్వాత క్రిస్ గేల్-యజ్రేంద్ర చహల్లు తమ వంటిపై ఉన్న జెర్సీలు విప్పేసి మరీ హంగామా చేశారు. పంజాబ్ కింగ్స్ ఆటగాడైన క్రిస్ గేల్-ఆర్సీబీ స్పిన్నర్ అయిన చహల్లు మంచి స్నేహితులు. అలానే వీరికి హడావుడి చేయడానికి ఏ అవకాశం వచ్చిన వదులుకోరు. నిన్నటి మ్యాచ్ ద్వారా మరొకసారి వీరిద్దరికీ ఒక అవకాశం దొరికింది. అంతే ఏం చేయాలో తెలియక తమ జెర్సీలను విప్పేసి మరీ వారి కండలను చూపించారు. యూనివర్శల్ బాస్ గేల్ తన కండలను బాడీ బిల్డర్లాగా చూపిస్తే ఫోజు కొడితే, ఆ పక్కనే ఉన్న చహల్ మాత్రం తన కండలను చూపించడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ పిక్ను పంజాబ్ కింగ్స్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక్కడ చదవండి: ‘కోహ్లి, ఏబీలకు నా ప్లాన్ అదే’ హర్ప్రీత్ బ్రార్ భుజం తట్టిన కోహ్లి.. నెటిజన్లు ఫిదా అది ఇంకా బాధించేది: విరాట్ కోహ్లి View this post on Instagram A post shared by Punjab Kings (@punjabkingsipl) -
క్రిస్ గేల్ డైవ్కు రసెల్ నవ్వులే నవ్వులు
అహ్మదాబాద్: క్రికెట్లో కొంతమంది బ్యాటింగ్ వరకే పరిమితమైతే, మరికొంతమంది బౌలింగ్ వరకే ఉంటారు. మరి బ్యాటింగ్కే పరిమితమయ్యే బ్యాటర్స్ కానీ బౌలింగ్కే పరిమితమయ్యే బౌలర్లు కానీ ఫీల్డింగ్లో అసాధారణ విన్యాసాలు కాకుండా సాధారణ విన్యాసాలు చేసినా విపరీతమైన నవ్వు రావడం ఖాయం. అందుకు నిన్న పంజాబ్ కింగ్స్- కేకేఆర్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచే ఉదాహరణ. సాధారణంగా ఫీల్డింగ్లో పెద్దగా ఆకట్టుకోని గేల్.. ఈ మ్యాచ్లో డైవ్ కొట్టి అందరిలో నవ్వులు పూయించాడు. ఫీల్డింగ్ విన్యాసాలు పెద్దగా చేయని గేల్.. ఏకంగా జాంటీ రోడ్స్ తరహాలో డైవ్ కొట్టి మరీ బంతిని ఆపేశాడు. కోల్కతా నైట్రైడర్స్ ఛేజింగ్ చేసే సమయంలో జోర్డాన్ వేసిన ఓ ఫుల్లర్ డెలివరీని స్ట్రైకింగ్లో ఉన్న రాహుల్ త్రిపాఠి మిడ్ వికెట్వైపు ఆడాడు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గేల్ డైవ్ కొట్టి మరీ బంతిని ఆపేశాడు. దీనికి డగౌట్లో ఉన్న ఆండ్రీ రసెల్ తెగ నవ్వుకున్నాడు. అప్పటివరకూ సీరియస్గా ఉన్న రసెల్.. గేల్ డైవ్తో అసలు నవ్వును ఆపులేకపోయాడు. చేతిని అడ్డం పెట్టుకుని మరీ నవ్వుకున్నాడు. కామెంటేటర్లు కూడా రోడ్స్ డైవ్లా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్కు రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే. గేల్ డైవ్, రసెల్ నవ్వులు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత మరో విజయాన్ని కేకేఆర్ సాధించింది.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ 47 పరుగులు నాటౌట్గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. త్రిపాఠి 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక్కడ చదవండి: అక్కడ ఆడటానికి వెళ్లని మీరు.. ఐపీఎల్కు ఎలా వచ్చారు? Gayle diving like Jonty Rhodes and see the epic reaction of Russell 😂😂 pic.twitter.com/FjdbzGJ4ts — msc media (@mscmedia2) April 27, 2021 -
Pragyan Ojha: గేల్, పూరన్.. మీ ఆలోచన తప్పు
అహ్మదాబాద్: కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓటమికి వారి బ్యాటింగ్ అప్రోచ్ సరిగా లేకపోవడమేనని టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా విమర్శించాడు. వారు బ్యాటింగ్కు వచ్చేటప్పుడు భారీ స్కోర్లు నమోదు చేయాలనే లక్ష్యంతో వచ్చి చిత్తు అవుతున్నారని ఓజా అభిప్రాయపడ్డాడు. కనీసం బోర్డుపై ఎంత స్కోరు ఉంచితే బాగుంటుందో అనే విషయంలో క్లారిటీ లేక ఒత్తిడిలో పడిపోతున్నారన్నాడు. ప్రధానంగా క్రిస్గేల్-నికోసల్ పూరన్లు అనవసరపు ఒత్తిడితో ఘోరంగా విఫలమవుతున్నారన్నాడు. వారిపై భారీ అంచనాలు ఉండటంతో ఎక్కువ పరుగులు చేయాలనే ఉద్దేశంతో సహజసిద్దమైన ఆటను వదిలేశారన్నాడు. అసలు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ప్లానింగ్ బాలేదని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నాడు. క్రిక్బజ్ మాట్లాడిన ఓజా.. ‘ ఆ ఇద్దరూ కేవలం భారీ స్కోర్లు చేయాలనే వస్తున్నారు. ఒక మంచి ఆరంభం దొరికిన తర్వాత ఆ ఆలోచన చేయాలి. పరిస్థితుల్ని బట్టి గేమ్ ప్లాన్స్ మార్చడం లేదు. పెద్ద క్రికెటర్లమనే ఆలోచన పక్కన పెట్టండి.. అప్పుడే మీరు పరుగులు చేయగలరు. ముందు 160-170 స్కోరు బోర్డుపై ఉంచాలనే ఆలోచనతో బ్యాటింగ్కు రండి.. వారిద్దరూ 180-190 పరుగులు చేయాలనే లక్ష్యంతో వస్తున్నారు. అదే మీపై ఒత్తిడి పెంచుతుంది. అసలుకే ఎసరు తెస్తుంది. మీ ఆలోచన తప్పు’ అని ఓజా విమర్శించాడు. నిన్న కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 123 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (31), క్రిస్ జోర్డాన్ (30)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. గేల్ గోల్డెన్ డక్గా ఔట్ కాగా, పూరన్(19)లు ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం ఛేదనలో కోల్కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలుపొందింది. మోర్గాన్ (40 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు , 2 సిక్స్లు), రాహుల్ త్రిపాఠి (32 బంతుల్లో 41; 7 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ చదవండి: మీ విదేశీ ఆటగాళ్లను ఇవ్వండి: ఆర్ఆర్ రిక్వెస్ట్ హర్షల్ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు -
మొన్న డ్యాన్స్.. ఈరోజు డైలాగ్.. ఏదైనా నీకు సాధ్యం
చెన్నై: పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఆటగాడు.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఏం చేసినా కొత్తగా అనిపిస్తుంది. ఎంటర్టైన్ చేయడంలో గేల్ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంటుంది. మొన్నటికి మొన్న డ్యాన్స్లతో అలరించిన గేల్ తాజాగా హిందీ సినిమా డైలాగులతో రెచ్చిపోయాడు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్.. దిగ్గజ విలన్ అమ్రిశ్ పురిని ఇమిటేట్ చేస్తూ ఆయన ఫేమస్ డైలాగును గేల్ పలికించిన తీరు వైరల్గా మారింది. అమ్రిశ్ పురి నటించిన మిస్టర్ ఇండియా సినిమాలో ఆయన పలికిన ''ముగాంబో బహుత్ కుష్ హువా'' డైలాగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆయన వేషదారణ.. హావభావాలతో అప్పటి పిల్లలంతా వణికిపోయారు. ఈ సందర్భంగా గేల్ ప్రాక్టీస్ సమయంలో ఆ డైలాగ్ను చెప్పే ప్రయత్నం చేశాడు. మూడు సార్లు ప్రయత్నించగా ఆఖరిసారి అచ్చం అమ్రిశ్ పురి తరహాలో చెప్పేశాడు. ఇంకేముందు ఈ వీడియోనే పంజాబ్ కింగ్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. నెటిజన్లు గేల్ డైలాగ్పై వినూత్న రీతిలో కామెంట్లు చేశారు. కాగా శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించి హాట్రిక్ ఓటముల నుంచి ఉపశమనం పొందింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. రాహుల్ 60*, గేల్ 43* చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు. ఇక పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 26న అహ్మదాబాద్ వేదికగా కేకేఆర్తో ఆడనుంది. చదవండి: వారిద్దరు సూపర్.. పరిస్థితులకు తగ్గట్టు ఆడారు ఫోన్ కోసం ఇంత పని చేస్తావా మ్యాక్సీ.. పాపం చహల్ 𝑀𝑜𝑔𝑎𝑚𝑏𝑜 𝑏𝑜ℎ𝑜𝑡 𝑘ℎ𝑢𝑠ℎ ℎ𝑢𝑎 😎#SaddaPunjab #PunjabKings #IPL2021 #PBKSvMI @henrygayle pic.twitter.com/rTeH6xv33d — Punjab Kings (@PunjabKingsIPL) April 24, 2021 -
వారిద్దరు సూపర్.. పరిస్థితులకు తగ్గట్టు ఆడారు
చెన్నై: ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ను రాహుల్ (60*), గేల్(43*) గెలిపించి హాట్రిక్ ఓటముల నుంచి కాస్త ఉపశమనం పొందారు. కాగా పంజాబ్ ఆటతీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా ప్రసంశలు కురిపించాడు. ''ముంబైతో మ్యాచ్లో పంజాబ్ ఇన్నింగ్స్లో వారి సహజమైన ఆటతీరు కనిపించలేదు. పిచ్ పరిస్థితిని అర్థం చేసుకొని ఇన్నింగ్స్ను నడిపించిన రాహుల్, గేల్లు కడవరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. వాస్తవానికి ఇద్దరు దూకుడుగా ఆడేవాళ్లే.. కానీ అక్కడి పరిస్థితిని అర్థం చేసుకొని ఆడారు.. తమకోసం కాకుండా టీంను గెలిపించాలనేదానిపై ప్రతీ ఆటగాడు దీనిని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. గేల్ ఆటతీరు కూడా నాకు కొత్తగా అనిపించింది. వస్తూనే బాదుడే లక్ష్యంగా పెట్టుకొని నిర్లక్ష్యంగా వికెట్ ఇచ్చుకునే గేల్ నిన్నటి మ్యాచ్లో మాత్రం పరిణితితో ఆడాడు. కానీ ఒకసారి కుదురుకున్నాక తన మార్క్ ఇన్నింగ్స్తో అలరించాడు. అతను చేసిన 43 పరుగుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్కు ఏమాత్రం సహకరించకుండా కనిపిస్తున్న చెన్నై పిచ్పై ఓపికగా ఆడితే పరుగులు వస్తాయనేది మరోసారి నిరూపితమైంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి సూర్య కుమార్ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకారం అందించాడు. పంజాబ్ బౌలర్లు రవి బిష్ణోయ్ (2/21), షమీ (2/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 పరుగులు చేసి గెలుపొందింది. చదవండి: ‘పిచ్లు తయారుచేసే టైమ్ లేదు.. ఇది బాధాకరం’ -
ఆ విధ్వంసానికి ఎనిమిదేళ్లు.. నేడు మళ్లీ రిపీటయ్యేనా
చెన్నై: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు(2013 ఏప్రిల్ 23) విండీస్ యోధుడు క్రిస్ గేల్ ఐపీఎల్లో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. 2013 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన అతను.. పూణే వారియర్స్ ఇండియాపై 66 బంతుల్లో ఏకంగా 175 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. ఈ మ్యాచ్కు ముందు చిరుజల్లులతో తడిసి ముద్దైన బెంగళూరు వేదిక, గేల్ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయింది. అప్పటివరకు నాటి కేకేఆర్ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్(158) పేరిట ఉన్న ఐపీఎల్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును గేల్, ఈ ఇన్నింగ్స్ ద్వారా తుడిచిపెట్టాడు. క్రికెట్ ప్రపంచంలో గేల్ సృష్టించిన ఈ మహా ప్రళయం ధాటికి పలు రికార్డులు కాలగర్భంలో కలిసిపోయాయి. Highest-ever T20 score (175)💥 Fastest T20 century 🔥 Most sixes in an innings 💪#OnThisDay, we all witnessed a #GayleStorm 🤩#SaddaPunjab #PunjabKings #IPL pic.twitter.com/hvUlqvZAOT — Punjab Kings (@PunjabKingsIPL) April 23, 2021 ఈ భాయనక ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీని 17 బంతుల్లో, సెంచరీని 30 బంతుల్లో పూర్తి చేసిన యూనివర్సల్ బాస్.. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన టీ20 శతకాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా శాంతించని ఈ భారీకాయుడు.. మరో 36 బంతులను ఎదుర్కొని మొత్తంగా 175 పరుగులు సాధించాడు. 102 నిమిషాల పాటు క్రీజ్లో ఉన్న అతను.. 13 బౌండరీలు, 17 భారీ సిక్సర్లు బాది క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తండిపోయే కనువిందును అందించాడు. ఈ క్రమంలో అతను టీ20ల్లో వేగవంతమైన శతకం(30 బంతుల్లో), అత్యధిక వ్యక్తిగత స్కోర్(175 నాటౌట్), ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల(17 సిక్సర్లు) రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డులు నేటికీ చెక్కుచెదరకుండా పదిలంగా ఉన్నాయి. గేల్ నాటి విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోర్ చేయగా, ప్రత్యర్ధి జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు130 పరుగుల భారీ తేడాతో పూణేపై ఘనవిజయం సాధించింది. కాగా, నాటి ఆ జి'గేల్' ఇన్నింగ్స్ను గర్తుచేసుకుంటూ, ప్రస్తుతం అతను ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ ట్వీట్ చేసింది. ఎనిమిదేళ్ల క్రితం గేల్ విధ్వంసాన్ని మేమంతా సాక్షులమంటూ క్యాప్షన్ను జోడించింది. నేడు చెన్నై వేదికగా పంజాబ్, ముంబై జట్లు తలపడనున్న నేపథ్యంలో గేల్ విధ్వంసం మరోసారి రిపీట్ కావాలని పంజాబ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: మలాన్ నం.1 టీ20 బ్యాట్స్మెన్ అయ్యుండొచ్చు.. కానీ గేల్తో పోలికా -
మలాన్ నం.1 టీ20 బ్యాట్స్మెన్ అయ్యుండొచ్చు.. కానీ గేల్తో పోలికా
చెన్నై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్ జట్టులో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీలు గళం విప్పుతున్న వేళ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆ జట్టు స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ను వెనకేసుకొచ్చాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తున్న గేల్.. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో(రాజస్థాన్తో మ్యాచ్లో 28 బంతుల్లో 40) కాస్త పర్వాలేదనిపించినా, ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్ల్లో(10, 11, 15 పరుగులు) ఉసూరుమనిపించాడు. ఈ నేపథ్యంలో అతనిపై వేటు వేసి టీ20 నంబర్ ఆటగాడు డేవిడ్ మలాన్కు(ఇంగ్లండ్) అవకాశం ఇవ్వాలని మాజీ ఆటగాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదన గంభీర్ కొట్టిపారేశాడు. మలాన్ ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్ అయ్యుండొచ్చు.. కానీ గేల్తో అతనికి పోలిక ఏంటని ప్రశ్నించాడు. మొదట గేల్ను వన్డౌన్లో బ్యాటింగ్కు పంపే ఆలోచనను పంజాబ్ విరమించుకోవాలని, గేల్ తన అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్లన్నీ ఓపెనర్గా ఆడినవేనన్న విషయాన్ని మరవకూడదని గంభీర్ ప్రస్థావించాడు. ప్రస్తుత సీజన్లో గేల్ వన్డౌన్ బ్యాట్స్మెన్గా 60కిపైగా బంతుల్ని ఎదుర్కొన్నాడని, అదే ఓపెనర్గా ఇన్ని బంతల్ని ఎదుర్కొని ఉంటే కచ్చితంగా సెంచరీ చేసేవాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ బలహీనమైన మిడిలార్డర్ కారణంగా పంజాబ్ మ్యాచ్లను చేజేతులా చేజార్చుకుంటుందని వ్యాఖ్యానించాడు. శుక్రవారం చెపాక్ వేదికగా ముంబైతో జరిగే మ్యాచ్లో యూనివర్సల్ బాస్ను ఓపెనర్గా పంపాలని, వరుసగా విఫలమవుతున్న నికోలస్ పూరన్ స్థానంలో మలాన్కు అవకాశం కల్పించాలని సూచించాడు. ఓపెనర్లుగా రాహుల్, గేల్లు వస్తే పంజాబ్కు బలమైన పునాది లభిస్తుందని, దీంతో పంజాబ్ పరాజయాల పరంపరకు అడ్డుకట్టపడుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా, గేల్.. గతేడాది ఐపీఎల్ సీజన్ నుంచి పంజాబ్ వన్డౌన్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగుతున్నాడు. ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్.. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం ఒక్క గెలుపు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. చదవండి: కపిల్, ధోని, గవాస్కర్లతో వాళ్లను పోల్చకండి.. -
రైనా, కోహ్లిని దాటాడు.. గేల్ను దాటలేకపోయాడు
చెన్నై: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ద్వారా ఒక అరుదైన రికార్డు సాధించాడు. మ్యాచ్లో రాహుల్ 1 పరుగు వద్ద ఉన్నప్పుడు టీ20ల్లో 5వేల పరుగులు వేగంగా పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.అంతేగాక టీమిండియా నుంచి వేగంగా 5వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగాను రాహుల్ రికార్డులకెక్కాడు. అంతకముందు టీమిండియా నుంచి విరాట్ కోహ్లి(167 ఇన్నింగ్స్ల్లో), సురేశ్ రైనా( 173 ఇన్నింగ్స్ల్లో) 5వేల పరుగులు మార్క్ను అందుకున్నారు. ఇప్పుడు వారి రికార్డును తుడిచిపెట్టిన రాహుల్ 143 ఇన్నింగ్స్లో 5వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే 5వేల పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో క్రిస్ గేల్( 132 ఇన్నింగ్స్లు) ఉండగా.. తాజాగా రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఆసీస్ నుంచి షాన్ మార్ష్ టీ20ల్లో 5వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి 144 ఇన్నింగ్స్లు తీసుకొని మూడవ స్థానంలో నిలిచాడు. ఇక ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఫేలవ ప్రదర్శన కనబరిచింది. సన్రైజర్స్ బౌలర్ల దాటికి పూర్తి ఓవర్లు ఆడకుండానే 120 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్ బ్యాటింగ్లో మయాంక్ అగర్వాల్ 22, షారుఖ్ ఖాన్ 22 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడిన పంజాబ్ సన్రైజర్స్ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2, రషీద్ ఖాన్, భువీ, కౌల్లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: వార్నర్ నువ్వు సూపర్.. క్యా రనౌట్ హై 'రోహిత్ నా ఫెవరెట్ ప్లేయర్.. అందుకే ఆ పని చేశా' -
సీజన్ అయ్యేలోపు పంజాబీ నేర్పిస్తాం: షమీ
ముంబై: యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరుకే కరీబియన్ అయినా భారత్తో అనుబంధం మాత్రం ఎప్పటినుంచో కొనసాగుతుంది. ఐపీఎల్ సీజన్ ఆరంభమైన నాటి నుంచి ప్రతీ సీజన్లో ఆడుతూ వస్తున్న గేల్ ఇండియా అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. తన విధ్వంసకర ఆటతీరుతో క్షణాల్లో మ్యాచ్లను మార్చివేసే గేల్కు భారత్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో 29 బంతుల్లోనే 40 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. నేడు సీఎస్కేతో జరగనున్న మ్యాచ్కు సన్నద్దమవుతున్నగేల్ గురించి ఆ జట్టు ఆటగాడు మహ్మద్ షమీ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ''గేల్ కరీబియన్ నుంచి వచ్చినా.. ఇండియాకు ఎప్పుడో దగ్గరయ్యాడు. అతను భారతీయ సంస్కృతి, సంస్కారాన్ని గౌరవిస్తాడు.. అంతేకాదు హిందీలో మాట్లాడడానికి గేల్ చాలా ఇష్టపడతాడు.. మాతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో ఆరంభించినా.. సడెన్గా హిందీలోకి మారిపోతాడు. ఇప్పుడిక పంజాబ్ కింగ్స్కు ఆడుతున్నాడు కాబట్టి గేల్ పంజాబీ కూడా నేర్పాల్సి ఉంటుందేమో.. సీజన్ అయిపోయేలోపు మా జట్టు ఆటగాళ్లమంతా కలసి ఎలాగైనా గేల్కు పంజాబీ నేర్పిస్తాం'' అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో ఇప్పటివరకు 133 మ్యాచ్లాడి 4812 పరుగులు సాధించాడు. చదవండి: క్యాచ్ పట్టినప్పుడల్లా తొడగొట్టావు.. మ్యాచ్ తర్వాత నీ పరిస్థితి పంత్ రనౌట్.. పరాగ్ డ్యాన్స్.. వీడియో వైరల్ అమ్మాయిలతో గేల్ చిందులు.. వీడియో వైరల్ -
ఐపీఎల్ చర్రితలో గేల్ అరుదైన రికార్డు..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో(ఐపీఎల్) విండీస్ విధ్వంసకర యోధుడు, పంజాబ్ కింగ్స్ కీలక సభ్యుడు క్రిస్ గేల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్ బాస్ ఎవరికీ అందనంత ఎత్తుకి వెళ్లిపోయాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బెన్ స్టోక్స్ బౌలింగ్లో అదిరిపోయే సిక్సర్ బాదిన గేల్.. ఐపీఎల్ చరిత్రలో 350 సిక్సర్లు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో అతను తెవాతియా బౌలింగ్లో సైతం మరో సిక్సర్ బాది ఆ సంఖ్యను 351కి పెంచుకున్నాడు. Milestone 🚨 - 3⃣5⃣0⃣ Maximums in the IPL for the Universe Boss 💥💥#VIVOIPL | #RRvPBKS | @henrygayle pic.twitter.com/bhIxAAmq2J — IndianPremierLeague (@IPL) April 12, 2021 ఇదిలా ఉంటే, లీగ్ చరిత్రలో మరే ఇతర బ్యాట్స్మన్ కనీసం 250 సిక్సర్ల మార్క్ కూడా చేరుకోలేకపోవడం విశేషం. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, ఆర్సీబీ కీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 237 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి ధోని 216 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 214, బెంగళూరు కెప్టెన్ కోహ్లి 201 సిక్సర్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 133 మ్యాచ్లు ఆడిన గేల్ 351 సిక్సర్లు బాదాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. పంజాబ్ భారీ స్కోర్ నమోదు చేయడంలో గేల్(28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన వంతు పాత్ర పోషించాడు. -
అమ్మాయిలతో గేల్ చిందులు.. వీడియో వైరల్
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ సందర్భంగా యునివర్సల్ బాస్, పంజాబ్ కింగ్స్ స్టార్ క్రిస్ గేల్ మంచి జోష్లో ఉన్నాడు. ఇటీవలే క్వారంటైన్ పూర్తి చేసుకున్న గేల్ ప్రాక్టీస్తో పాటు వరుస ప్రమోషనల్ వీడియోలతో రెచ్చిపోతున్నాడు. మొన్న మైకెల్ జాక్సన్ మూన్వాక్ స్టెప్స్తో ఇరగదీసిన యునివర్సల్ బాస్.. నిన్న పంజాబీ స్టార్ దలేర్ మెహందీ పాటకు డోలు వాయిస్తూ రిలీజ్ చేసిన వీడియో వైరల్గా మారింది. తాజాగా గేల్ మరో కొత్త రకం మ్యూజిక్ వీడియోతో ముందుకొచ్చాడు. ప్రముఖ ఇండియన్ ర్యాపర్ ఎమివే బాంటాయ్తో కలిసి అతడు ఈ మ్యూజిక్ వీడియో చేశాడు. కాగా ఈ వీడియోలో పలువురు యువతులు బికినీ ధరించి డ్యాన్స్ చేస్తుండగా గేల్ పాట పాడుతూ బాంటాయ్తో కలిసి చిందులేశాడు. ఈ సందర్భంగా గేల్ తనలోని ర్యాప్ సింగింగ్ టాలెంట్ను బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను గేల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. ప్రస్తుతం అది ట్రెండింగ్ లిస్టులో చేరింది. '' జమైకా టు ఇండియా అవుట్ నౌ'' అని కామెంట్ చేశాడు. కాగా గతేడాది ఐపీఎల్ సీజన్లో గేల్ పంజాబ్ కింగ్స్ తరపున తొలి అంచె పోటీలకు దూరమైనా.. రెండో అంచె పోటీల్లో మాత్రం ఇరగదీశాడు. ఆడిన 7 మ్యాచ్ల్లోనే 288 పరుగులు సాధించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్తో తొలి మ్యాచ్ ఆడబోతోంది. View this post on Instagram A post shared by KingGayle 👑 (@chrisgayle333) -
మొన్న మైఖేల్ జాక్సన్ ఇవాళ దలేర్ మెహందీ..
ముంబై: ఇటీవలే క్వారంటైన్ను పూర్తి చేసుకొని జట్టుతో చేరిన పంజాబ్ కింగ్స్ ఆటగాడు క్రిస్ గేల్.. ఓ పక్క ప్రాక్టీస్ చేస్తూనే రోజుకో కొత్త తరహాలో అభిమానులను అలరిస్తున్నాడు. మొన్న మైఖేల్ జాక్సన్ మూన్వాక్కు స్టెప్పులేసి ఇరగదీసిన యూనివర్సల్ బాస్.. తాజాగా పంజాబీ స్టార్ సింగర్ దలేర్ మెహందీ పాటకు డోల్ వాయిస్తూ అదరగొట్టాడు. 90 దశకంలో పాపులర్ అయిన తునుక్ తునుక్ సాంగ్కు తగట్టుగా డోల్ వాయిస్తూ, స్టెప్పులేస్తూ అభిమానులను హుషారెత్తించాడు. గేల్ పర్ఫామెన్స్కు సంబంధించిన వీడియోను పంజాబ్ యాజమాన్యం తమ ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Punjab Kings (@punjabkingsipl) గేల్ పంజాబీ ధమాకాకు ముగ్దులైన అభిమానులు ఈ పోస్ట్కు తెగ లైకులు కొడుతున్నారు. ఎంతగా అంటే పోస్ట్ చేసిన గంటలోనే 18000 లైక్లు కొట్టి గేల్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. గేల్ ఆన్ ఫీల్డ్ ఎంత హుషారుగా ఉంటాడో ఆఫ్ ఫీల్డ్ కూడా అంతే హుషారుగా ఉంటూ అభిమానులను సంతృప్తి పరుస్తుంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు విండీస్ దలేర్ మెహందీ అంటూ, గేల్ బనాయేగా బౌలర్స్కి రైల్ అంటూ సందేశాలు పంపారు. ఇదిలా ఉండగా, గేల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరిగే తమ తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాడు. చదవండి: కొడితే సిక్సే.. సింగిల్స్ అసలు తీయరేమో -
ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్ కాబోతోందా?!
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్తో క్యాష్ రిచ్ లీగ్ టోర్నీకి తెరలేవనుంది. కరోనా భయాల నేపథ్యంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ క్రీడాభిమానులకు వినోదం పంచేందుకు క్రికెటర్లు సిద్ధమైపోయారు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ ఈసారి భారత్లోనే జరగనుండటంతో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. అయితే, కొన్ని ఊహాగానాలు మాత్రం స్టార్ ఆటగాళ్ల ఫ్యాన్స్ను కలవరపెడుతున్నాయి. ఈ సీజన్ తర్వాత తమ ఆరాధ్య క్రికెటర్లు లీగ్కు వీడ్కోలు పలుకనున్నారనే వార్తలు వారి మదిని మెలిపెడుతున్నాయి. తెరమీదకు వచ్చిన ఆ ఆటగాళ్లు ఎవరో పరిశీలిద్దాం. ఎంఎస్ ధోని(2008) టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ సింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని. సీఎస్కేను మూడుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత అతడి సొంతం. అంతేకాదు ఐదుసార్లు రన్నరప్... ఒక్కసారి మినహా ఆడిన ప్రతీ సీజన్లో టాప్–4లో స్థానం... ఐపీఎల్లో అత్యంత నిలకడైన జట్టుగా సీఎస్కే రికార్డు సాధించడంలో ధోని పాత్ర మరువలేనిది. విజయవంతమైన కెప్టెన్గా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్న ధోని ఐపీఎల్లో ఇప్పటివరకు 204 మ్యాచ్లు ఆడి 4632 పరుగులు చేశాడు. ఇక గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్, ఈ సీజన్ తర్వాత సీఎస్కు కెప్టెన్గా రిటైర్ అయి మెంటార్గా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ధోనిలో అత్యుత్తమ క్రికెట్ ఆడగలిగే సత్తా ఇంకా ఉందని, అతను మరిన్ని ఐపీఎల్లు ఆడగలడని, ఐపీఎల్ 2021 కచ్చితంగా అతనికి ఆఖరి ఐపీఎల్ కాబోదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. హర్భజన్ సింగ్(2008) టీమిండియా వెటరన్ ప్లేయర్ చాలాకాలం పాటు ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా, సీఎస్కే తరఫున కూడా మైదానంలో దిగిన భజ్జీ.. ఇప్పటివరకు 160 మ్యాచ్లు ఆడి 150 వికెట్లు తీశాడు. అంతేకాదు, 829 పరుగులు చేశాడు. ఇక సీఎస్కే అతడిని వదులుకోవడంతో మినీ వేలం-2021లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ హర్భజన్ను కొనుగోలు చేసింది. ఇక 38 ఏళ్ల భజ్జీ, ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు స్వస్తి పలుకనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రిస్గేల్(2009) విధ్వంసకర విండీస్ బ్యాట్స్మెన్ క్రిస్గేల్ పేరిట ఐపీఎల్లో ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక సిక్సర్లు (349), ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు(17), అత్యధిక వ్యక్తిగత స్కోరు(175 నాటౌట్), అత్యధిక సెంచరీలు (6), ఫాస్టెస్ట్ సెంచరీ(30 బంతుల్లో) నమోదు చేసిన ఘనత అతడి సొంతం. ఇప్పటివరకు 132 మ్యాచ్లలో 4772 పరుగులు చేసిన 42 ఏళ్ల క్రిస్గేల్, ఐపీఎల్-2021 తర్వాత క్యాష్ రిచ్లీగ్కు గుడ్ బై చెప్పనున్నాడనే ఊహాగానాలు విస్త్రృతమవుతున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ తరఫున గేల్ మైదానంలోకి దిగనున్నాడు. గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. ఏబీ డివిలియర్స్(2011) అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకునే దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్. ఐపీఎల్లో ఇప్పటివరకు 169 మ్యాచ్లు ఆడి, 4849 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్ తర్వాత ఐపీఎల్లో ఏబీడీ మెరుపు విన్యాసాలు చూసే అవకాశం ఉండదనే వార్తలు క్రీడా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగా కనిపిస్తున్న ఆర్సీబీ.. కనీసం ఈసారైనా కప్ గెలిస్తే.. ఏబీడీ సగర్వంగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇమ్రాన్ తాహిర్(2014) 2014లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు సౌతాఫ్రికా ఆటగాడు ఇమ్రాన్ తాహిర్. ఇప్పటి వరకు 58 మ్యాచ్లు ఆడిన ఈ స్పిన్ బౌలర్ 80 వికెట్లు తీశాడు. సీఎస్కు ప్రాతినిథ్యం వహించిన అతడు 2018లో జట్టు టైటిల్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఈ సీజన్ తర్వాత 41 ఏళ్ల తాహిర్ ఐపీఎల్ నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. చదవండి: ఐపీఎల్ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?! -
కెప్టెన్గా ధోని.. ఓపెనర్లుగా రోహిత్, గేల్
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తన ఆల్టైమ్ ఐపీఎల్ ఎలెవెన్ టీమ్ని ప్రకటించాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు జరగనుండగా.. టోర్నీలో ఇది 14వ సీజన్. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో గవాస్కర్ తన టీమ్ని ప్రకటించాడు. ఈ టీమ్కి కెప్టెన్, వికెట్ కీపర్గా మహేంద్రసింగ్ ధోనీ ఎంపికయ్యాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, క్రిస్గేల్ని ఎంపిక చేసిన సునీల్ గవాస్కర్.. డేవిడ్ వార్నర్ని మూడో స్థానానికి ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో.. గత సీజన్కు దూరంగా ఉన్న సురేశ్ రైనాను ఐదో స్థానం కల్పించాడు. మ్యాచ్ ఫినిషర్స్గా ఏబీ డివిలియర్స్, మహేంద్రసింగ్ ధోనిని ఎంపిక చేసిన గవాస్కర్.. జడేజా, నరైన్ రూపంలో ఒక ఆల్రౌండర్.. ఒక స్పిన్నర్ను ఎంపిక చేశాడు. పేస్ బౌలింగ్ కోటాలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్లైన భువీ, బుమ్రాలకు చోటు దక్కింది. ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్ డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య రేపు (ఏప్రిల్ 9న) చెన్నై వేదికగా జరగనుంది ఆల్టైమ్ ఐపీఎల్ ఎలెవెన్ జట్టు: రోహిత్ శర్మ, క్రిస్గేల్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, మహేంద్రసింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా చదవండి: ముందే ఊహించా.. నాకేం ఆశ్చర్యం వేయలేదు ఏంటి సూర్య.. డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెడతారా -
'గేల్ ఫిట్నెస్లో నాకు సగం వచ్చినా బాగుండు'
ముంబై: ఐపీఎల్ 13వ సీజన్లో విండీస్ స్టార్ క్రిస్ గేల్ మొదటి అంచె పోటీలకు దూరమైనా.. రెండో అంచె పోటీల్లో మాత్రం అదరగొట్టాడు. 7 మ్యాచ్ల్లోనే 288 పరుగులతో దుమ్మురేపాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో గేల్పై మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ సారధి కేఎల్ రాహుల్ పవర్ హిట్టర్ గురించి ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ''41 ఏళ్ల వయసులోనూ గేల్ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఇక గేల్తో కలిసి గతేడాది కొన్ని మంచి ఇన్నింగ్స్లు పంచుకున్నా. అప్పుడే మరో ఏడాది వచ్చేసింది.. ఐపీఎల్ కొత్త సీజన్ కూడా వచ్చేసింది. గేల్ కూడా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది మరింత రాటు దేలుతున్నాడు. ఇప్పటికే పంజాబ్తో కలిసిన అతను తన బ్యాటింగ్ పవర్ను మరోసారి చూపించాలని ఉవ్విళ్లురుతున్నాడు. అసలు గేల్ ఇంత ఫిట్నెస్ ఎలా సాధించాడనేది అర్థం కాలేదు. ఏకధాటిగా 3- 4 గంటలు పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా భారీ సిక్సర్లు కొట్టడం అతనికే సాధ్యమైంది. గేల్ ఫిట్నెస్లో నాకు సగమొచ్చినా బాగుండేది'' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఇక పంజాబ్ కింగ్స్ గతేడాది సీజన్లో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగతంగా చూసుకుంటే మాత్రం కేఎల్ రాహుల్ దుమ్మురేపాడు. మొత్తం 14 మ్యాచ్లాడిన రాహుల్ ఒక సెంచరీ.. 5 హాఫ్ సెంచరీల సాయంతో 670 పరుగులు సాధించాడు. ఇక పంజాబ్ కింగ్స్ తన తొలి మ్యాచ్ను ఏప్రిల్ 12న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది. చదవండి: ముందే ఊహించా.. నాకేం ఆశ్చర్యం వేయలేదు: మ్యాక్స్వెల్ ఐపీఎల్ కోసం సిరీస్ మధ్యలోనే పంపిస్తారా: ఆఫ్రిది -
క్వారంటైన్ పూర్తయిన ఆనందంలో గేల్ ఏం చేశాడో తెలుసా..
ముంబై: విండీస్ విధ్వంసకర యోధుడు, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్.. ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా అదిరిపోయిన స్టెప్పులతో అలరించాడు. క్వారంటైన్ పూర్తైన ఆనందంలో అతను మైఖేల్ జాక్సన్ సూపర్ హిట్ 'మూన్ వాక్' సాంగ్కు డ్యాన్స్ చేశాడు. యూనివర్సల్ బాస్ చిందేస్తుండగా తీసిన వీడియోను పంజాబ్ కింగ్స్ ట్విటర్లో షేర్ చేయగా, కొద్ది నిమిషాల్లోనే వైరల్గా మారింది. కాగా, గేల్.. క్వారంటైన్ సమయంలో కూడా పలు పంజాబీ పాటలకు స్టెప్పులేస్తూ కాలక్షేపం చేశాడు. Quarantine da khatam khel, bahar aa gaye tuhadde favourite - Chris Gayle 🕺🥰#IPL2021 #SaddaPunjab #PunjabKings @henrygayle pic.twitter.com/rrDHPZ3lvQ — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2021 అతను క్వారంటైన్ సమయంలో ఎక్కువ శాతం డ్యాన్స్లేస్తూ, జిమ్లో వర్కౌట్లు చేస్తూ గడిపాడు. గతేడాది ఐపీఎల్లో లేట్గా బరిలోకి దిగినా సూపర్ ఫామ్ను కనబర్చిన గేల్.. 7 మ్యాచ్ల్లో 137.14 స్ట్రయిక్ రేట్తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్లో అతను పంజాబ్ కింగ్స్ తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ను ఢీకొంటుంది. చదవండి: వివో బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా కెప్టెన్.. -
రూ. 8 కోట్లు పెట్టి అతడిని కొన్నారు.. వృథానే అంటారా?!
న్యూఢిల్లీ: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ ఓపెనింగ్ జోడీగా కొనసాగితే పంజాబ్ కింగ్స్కు ప్రయోజనకరంగా ఉంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అదే విధంగా మయాంక్ అగర్వాల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాలని సూచించాడు. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ ఐపీఎల్-2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు జట్లు ప్రాక్టీసులో దుమ్మురేపుతూ క్యాష్ రిచ్ లీగ్కు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్ల బలాలు, ఏ ఆటగాళ్లను తుదిజట్టులోకి తీసుకుంటే బాగుంటుందన్న అంశంపై మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తూ, సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో, ఆకాశ్ చోప్రా పంజాబ్ జట్టు గురించి మాట్లాడుతూ... ‘‘ కెప్టెన్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ ఓపెనర్లుగా మైదానంలోకి దిగాలి. మూడో స్థానంలో మయాంక్ అగర్వాల్, నాలుగో స్థానంలో పూరన్, ఐదో స్థానంలో హుడా, మోజెస్ హెన్రిక్స్ ఆరో స్థానంలో రావాలి. బ్యాటింగ్ ఆల్రౌండర్ హెన్రిక్స్ ఉంటే జట్టు సమతూకంగా ఉంటుంది. ఇక ఏడో స్థానం గురించి పెద్దగా ఆలోచించనక్కర్లేదు. షారుఖ్, మణిదీప్, సర్ఫరాజ్.. వీరిలో ఎవరినైనా తీసుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికొస్తే, అశ్విన్, బిష్ణోయి, షమీ, రిచర్డ్సన్ ఉండనే ఉన్నారు. జట్టు కూర్పు ఇలా ఉన్నట్లయితే, ఈ సీజన్లో పంజాబ్ మెరుగ్గా రాణించడం తథ్యమని నా భావన. వీరితో పాటు మరో ఆప్షన్ అర్ష్దీప్ కూడా ఉన్నాడు. కావాలంటే మరో స్పిన్నర్ కావాలంటే తనను తీసుకోవచ్చు ’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, ఆకాశ్ చోప్రా జట్టులో, పంజాబ్ జట్టు యువ ఆటగాడు ఆస్ట్రేలియా టీ20 ఫాస్ట్ బౌలర్ రిలే మెరెడిత్కు మాత్రం స్థానం చోటు దక్కకపోవడం గమనార్హం. మెరెడిత్ను పంజాబ్ ప్రాంఛైజీ రూ. 8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో విదేశీ ఆటగాళ్ల విభాగంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్క్యాప్డ్ ప్లేయర్గా అతడు నిలిచాడు. ఈ నేపథ్యంలో.. ‘‘మీ అభిప్రాయం ప్రకారం మెరెడిత్కు అంతప్రాధాన్యం లేనట్లుగా కనిపిస్తోంది. అంత ధర పెట్టి కొనడం వృథానే కదా. ఇంకో విషయం, ఫాబియన్ అలెన్ను మర్చిపోయారు. అతడిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సింది’’ అంటూ తమకు తోచినవిధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2021 సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో ఏప్రిల్ 12న తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: ఆర్సీబీ నా మాట వినండి.. ఏబీని అలా చేయవద్దు! ఐపీఎల్-2021: పంజాబ్ కింగ్స్ స్క్వాడ్... ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి -
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్ గేల్
-
మోదీకి నా ప్రత్యేక ధన్యవాదాలు : గేల్
జమైకా : జమైకాకు కోవిడ్ -19 వ్యాక్సిన్లను పంపినందుకు విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్గేల్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక వీడియోలో గేల్ మాట్లాడుతూ ‘ కోవిడ్-19 వ్యాక్సిన్ విరాళంగా ఇచ్చినందుకు ప్రధాని మోదీ, భారత ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జమైకన్లు ఈ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేరు. భారత అభిమానులను నేను త్వరలోనే కలుస్తాను’ అని అన్నారు. భారతదేశం గేల్కు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఉండటానికి అతడు చాలా ఇష్టపడతాడని చెప్పిన విషయాన్ని జమైకాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. ‘జమైకన్ వీరుడి సుడిగాలి బ్యాటింగ్ మాకు ఎల్లపుడు ఆనందాన్ని ఇస్తుంది. భారత ప్రజలు గేల్ విధ్వంసకర బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ మైత్రి పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా స్నేహితులకు వ్యాక్సిన్ల్ను పంపడం మాకు ఆనందంగానే ఉంది’’ అంటూ గేల్ మాటలకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ వేదికగా స్పందించారు. కాగా మానవతా దృక్ఫథంతో భారత ప్రభుత్వం ‘ వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా మేడ్ ఇన్ ఇండియా COVID-19 వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందిస్తోంది. ఇక కోవిడ్ వ్యాక్సిన్లను కరేబియన్ దీవులకు పంపినందుకుగానూ గతవారం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు వివియన్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, జిమ్మీ ఆడమ్స్, ఆండ్రీ రసెల్ కూడా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ( చదవండి : 'గేల్.. నీలాగా నాకు కండలు లేవు' ) -
రెండేళ్ల తర్వాత క్రిస్ గేల్
సెయింట్ జాన్స్: ‘యూనివర్సల్ బాస్’ వెస్టిండీస్ డాషింగ్ క్రికెటర్ క్రిస్ గేల్ దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ టి20 జట్టులోకి వచ్చాడు. మార్చి 3, 5, 7 తేదీల్లో శ్రీలంక జట్టుతో జరిగే మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. కీరన్ పొలార్డ్ సారథ్యంలోని 14 మంది సభ్యులతో కూడిన జట్టులో 41 ఏళ్ల గేల్కు, 39 ఏళ్ల పేసర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్లకు చోటు లభించింది. ఇటీవల జరిగిన ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ టి20 టోర్నీలలో గేల్ నిలకడగా రాణించడంతో అతడిని ఎంపిక చేశామని విండీస్ బోర్డు సెలెక్టర్ రోజర్ హార్పర్ తెలిపాడు. గేల్ తన చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ను 2019 మార్చి 8న భారత జట్టుపై ఆడాడు. ఓవరాల్గా టి20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా గేల్ గుర్తింపు పొందాడు. గేల్ ఇప్పటివరకు 413 టి20 మ్యాచ్లు ఆడి 22 సెంచరీలు, 86 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 13,691 పరుగులు సాధించాడు. ఇక్కడ చదవండి: ఒక్క మ్యాచ్ ఆడకుండానే స్వదేశానికి వోక్స్ -
'గేల్.. నీలాగా నాకు కండలు లేవు'
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)2021లో సోమవారం క్వెట్టా గ్లాడియేటర్స్, లాహోర్ క్యూలాండర్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో క్యూలాండర్స్ గ్లాడియేటర్స్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (40 బంతుల్లో 68 పరుగుల)తో టాప్ స్కోర్రగా నిలవగా.. కెప్టెన్ సర్ఫరాజ్ 40 పరుగులతో రాణించాడు. అనంతరం క్యూలాండర్స్ బ్యాట్స్మన్ మహ్మద్ హఫీజ్( 33 బంతుల్లో 73 పరుగులు; 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విజృంభించడంతో లాహోర్ క్యూలాండర్స్ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ 52 బంతుల్లో 82 పరుగులతో రాణించాడు. కాగా మ్యాచ్ అనంతరం మహ్మద్ హఫీజ్, క్రిస్ గేల్ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది. హఫీజ్ మెరుపు బ్యాటింగ్ను మెచ్చుకుంటూ.. 'నీకు ఇంత బలం ఉందా.. లేక నీ బ్యాట్కేమైనా పవర్స్ ఉన్నాయా? బంతిని అంత బలంగా బాదావు.. నీ ఇన్నింగ్స్ సూపర్ 'అంటూ గేల్ ప్రశంసించాడు. దీనికి హఫీజ్ స్పందిస్తూ.. 'థ్యాంక్యూ గేల్.. కానీ నీలాగా నాకు కండలు లేవు. ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే నీకంటే వేగంగా ఆడాలనే లక్ష్యాన్ని మాత్రమే పెట్టుకొని బరిలోకి దిగాను. ఆ తర్వాత నా చేతి నుంచి సిక్సర్లు, ఫోర్లు జాలువారాయి. కానీ ఒకటి మాత్రం నిజం.. నీలాగా మాత్రం ఎప్పటికి బ్యాటింగ్ చేయలేను' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: నాలుగు రోజులు లేటైంది..లేకపోతే కోట్లు పలికేవి! -
సిక్సర్ల హోరు.. యునివర్సల్ బాస్ విధ్వంసం
దుబాయ్: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.40 ఏళ్ల వయసులోనూ మంచినీళ్ల ప్రాయంగా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్లో గేల్ మరోసారి రెచ్చిపోయాడు. కొడితే ఫోర్.. లేదంటే సిక్స్ అన్నట్లుగా సునామీ ఇన్నింగ్స్తో విజృంభించాడు. బుధవారం మరాఠా అరేబియన్స్తో జరిగిన మ్యాచ్లో టీమ్ అబుదాబికి ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ 22 బంతుల్లోనే 9 సిక్స్లు, ఆరు ఫోర్లతో 84 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. చదవండి: బుమ్రాకు 'తొలి' టెస్టు.. ఐసీసీ ఆల్ ది బెస్ట్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గేల్.. టీ10 చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మహమ్మద్ షహజాద్ రికార్డును సమం చేశాడు. 2018 సీజన్లో షెహజాద్ రాజ్పుత్స్ తరఫున 12 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమ్ అబుదాబి జట్టులో ఓపెనర్ గేల్ విధ్వంసంతో 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. గేల్ చేసిన 84 పరుగుల్లో 78 రన్స్ బౌండరీల రూపంలోనే రావడం విశేషం. చదవండి: టీమిండియాకు జో రూట్ వార్నింగ్ -
టి10 లీగ్ను ఒలింపిక్స్లో చేరిస్తే బాగుంటుంది
జమైకా: ఒలింపిక్స్కి టి10 ఫార్మాట్ క్రికెట్ సెట్ అవుతుందని విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రికెట్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. టి 10 ఫార్మాట్ అయితే కేవలం 90 నిమిషాల్లోనే మ్యాచ్ పూర్తయి ఫలితం వస్తుందన్నాడు. అదే టీ20 ఫార్మాట్ అయితే ఒక్కో మ్యాచ్ ముగిసేందుకు కనీసం 3గంటల సమయం పట్టవచ్చన్నాడు. సమయాభావంతోనే క్రికెట్కు ఒలింపిక్స్లో చోటు దక్కలేదని, అమెరికాలోనూ ఇటీవల టి10 లీగ్ జరగడంతో అక్కడా క్రికెట్కు ఆదరణ లభిస్తోందని గేల్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఎనిమిది జట్ల మధ్య అబుదాబి టి10 లీగ్ జనవరి 28నుంచి జరగనుండగా.. క్రిస్ గేల్ అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
ఎల్పీఎల్లో ఇర్ఫాన్ పఠాన్
న్యూఢిల్లీ: ఈ నెలలో ఆరంభం కానున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆడనున్నాడు. కండీ టస్కర్స్ తరఫున ఇర్ఫాన్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్కు ఇర్ఫాన్ గుడ్ బై చెప్పడంతో అతను విదేశీ లీగ్లో ఆడటానికి మార్గం సుగుమం అయ్యింది. దాంతో లంక ప్రీమియర్ లీగ్లో ఆడటానికి కండీ టస్కర్స్తో ఇర్ఫాన్ ఒప్పందం చేసుకున్నాడు. దీనిపై ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..‘ ఈ లీగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. నేను టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాను. కానీ విదేశీ లీగ్లో ఆడాలని నిర్ణయించుకున్నా. నా గేమ్ ఎలా ఉండబోతుందనే దానిపై నాకు ఆసక్తి ఉంది. ఎందుచేత అంటే రెండేళ్ల నుంచి క్రికెట్ ఆడటం లేదు. కానీ ఆడే సత్తా నాలో ఇంకా ఉంది. ఈ లీగ్లను మెల్లగా ఆరంభిస్తా. ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. ఇది నా రీఎంట్రీకి ఒక మార్గమని అనుకుంటున్నా. (ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్ ఇదేనా ?) కరోనా వైరస్ కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) ఈ నెల 14వ తేదీ నుంచి ఆరంభం కానుంది. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్పీఎల్ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కానీ అది నవంబర్ 14కు వాయిదా పడింది. కరోనాతో ఆ లీగ్ను జరపాలా..మానాలా అనే సందిగ్థంలో ఉన్న మేనేజ్మెంట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లీగ్లో గేల్, డుప్లెసిస్లతో పాటు షాహిద్ ఆఫ్రిది, కార్లోస్ బ్రాత్వైట్లు కూడా ఆడనున్నారు. సుమారు 20 మందికి పైగా విదేశీ ఆటగాళ్లు ఆ లీగ్లో ఆడటానికి సుముఖుత వ్యక్తం చేయడం ఆ లీగ్ అదనపు అట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ లీగ్ ఆడే ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్లో ఉండాలి. అక్కడికి చేరుకున్న తర్వాత క్వారంటైన్ నిబంధనను పూర్తి చేసి బరిలోకి దిగాలి. ఈ లీగ్ను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. ఎల్పీఎల్ నిర్వహణకు ముందుగా మూడు వేదికలు అనుకోగా వాటిని రెండుకు కుదించారు. కాండీ, హమ్బాన్తోటలో లీగ్ జరగనుంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకూ ఈ లీగ్ను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ఎల్పీఎల్ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇదే తొలి ఎడిషన్ కావడం గమనార్హం. -
'నేను బౌలింగ్కు వస్తే గేల్ సెంచరీ చేయలేడు'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్చర్ బౌలింగ్లో గేల్ క్లీన్బౌల్డ్ అయి ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఒక్క పరుగు దూరంలో అవుటాయన్న కోపంతో గేల్ అసహనం వ్యక్తం చేస్తూ చేతిలోని బ్యాట్ను విసిరేయడం వైరల్గా మారింది. కాగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు క్రిస్ గేల్పై అంపైర్లు చర్య తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. అయితే గేల్ను ఔట్ చేసిన ఆర్చర్కు ప్రశంసలతో పాటు గేల్ అభిమానుల నుంచి తిట్లు కూడా అందాయి. (చదవండి : తప్పు ఒప్పుకున్న గేల్) తాజాగా గేల్ను 99 పరుగుల వద్ద అవుట్ చేయడంపై జోఫ్రా ఆర్చర్ ట్విటర్లో స్పందించాడు. ఇలాంటివి తాను గతంలోనూ ఎన్నో చూశానని.. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను 99 పరుగుల వద్ద అవుట్ చేస్తే ఆ మజా వేరుగా ఉంటుందని ఆర్చర్ తెలిపాడు. ఈ సందర్భంగా తాను గతంలో గేల్నుద్దేశించి చేసిన ట్వీట్స్ను మరోసారి గుర్తు చేశాడు. ' నేను బౌలింగ్కు వస్తే గేల్ను సెంచరీ చేయనివ్వనని నాకు ముందే తెలుసు'.. ' క్రిస్ గేల్.. కమాన్ మ్యాన్ .. ఇలాంటి విషయాలకు హర్ట్ కావడం ఏంటి' అంటూ ట్వీట్స్ ఉన్నాయి. pic.twitter.com/7OIi92jfCm — Simran (@CowCorner9) October 30, 2020 వాస్తవానికి ఇందులో మొదటి ట్వీట్ 2013.. ఫిబ్రవరి, 22న.. రెండో ట్వీట్ 2016,మార్చి 31న చేశాడు. ఆర్చర్ చేసిన ఈ రెండు ట్వీట్స్ శుక్రవారం గేల్ ఇన్నింగ్స్కు సరిగ్గా సరిపోయాయి. ప్రస్తుతం ఆర్చర్ చేసిన పాత ట్వీట్స్ వైరల్గా మారాయి. ఆర్చర్ ట్వీట్స్పై రాజస్తాన్ యాజమాన్యం స్పందిస్తూ.. ఆర్చర్ చెప్పింది ఈరోజు 100 శాతం నిజమైంది అంటూ ట్వీట్ చేశారు. ఇక చివర్లో గేల్ నువ్వు ఇప్పటికీ యునివర్స్ల్ బాస్వే అంటూ ఆర్చర్ ట్వీట్ చేయడం విశేషం.(చదవండి : బ్యాట్ విసిరేసిన గేల్..) I know if I was bowling I know he wasn't getting da 100 — Jofra Archer (@JofraArcher) February 22, 2013 Cg don't hurt yourself boy — Jofra Archer (@JofraArcher) March 31, 2016 Still the boss @henrygayle pic.twitter.com/bV1y3Azijp — Jofra Archer (@JofraArcher) October 30, 2020 -
ఐపీఎల్: క్రిస్ గేల్కు షాక్
అబుదాబి: క్రిస్ గేల్కు కోపం వచ్చింది. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ కావడంతో ‘యూనివర్సల్ బాస్’ యమ సీరియస్ అయ్యాడు. అసహనంతో బ్యాట్ను నెలకేసి కొట్టాడు. ఐపీఎల్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన లీగ్తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున బరిలోకి దిగిన గేల్ తనదైన శైలిలో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు తర్వాత చెలరేగిపోయాడు. జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న దశలో గేల్ జోరుకు రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బ్రేక్ వేశాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న గేల్ను అద్భుత యార్కర్తో ఔట్ చేశాడు. దిగ్భ్రాంతికి గురైన గేల్ తన బ్యాట్ను కసిగా నేలకేసి విసిరికొట్టాడు. తర్వాత బ్యాట్ హేండిల్కు తన హెల్మెట్ తగిలించి నిరాశగా మైదానం వీడాడు. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించడంతో గేల్ ఇన్నింగ్స్ వృధా అయింది. తప్పు ఒప్పుకున్న గేల్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు క్రిస్ గేల్పై అంపైర్లు చర్య తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. మైదానంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే గేల్.. బ్యాట్ను విసిరికొట్టడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే చేసింది తప్పేనని అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో కోతతో అంపైర్లు సరిపెట్టారు. వెయ్యి సిక్సర్ల మైలురాయి టి20 క్రికెట్లో వెస్టిండీస్ క్రికెట్ స్టార్ క్రిస్ గేల్ సరికొత్త చరిత్ర లిఖించాడు. 1000 సిక్స్ల మైలురాయి సాధించిన తొలి క్రికెటర్గా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో వరుసగా పొలార్డ్ (690), మెకల్లమ్ (485), షేన్ వాట్సన్ (467), ఆండ్రూ రసెల్ (447) ఉన్నారు. ఐపీఎల్లో 349 సిక్స్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు చెక్కు చెదరలేదు. ఇప్పటివరకు ఐపీఎల్లో అతడు 349 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో జరుగుతోన్న మరే టి20 లీగ్లోనూ ఎవరూ ఇన్ని సిక్స్లు కొట్టలేదంటే గేల్ సత్తా ఎలాంటిదో అర్థమవుతోంది. పొట్టి ఫార్మాట్లో అందుకే ‘సిక్సర పిడుగు’గా అతడు వెలుగొందుతున్నాడు. (చదవండి: రాజస్తాన్ రాయల్స్ ఊపిరి పీల్చుకుంది) -
బ్యాట్ విసిరేసిన గేల్..
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ ఓటమి పాలైంది. కాగా, ఈ మ్యాచ్లో గేల్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్లతో 99 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాల్గో బంతికి గేల్ బౌల్డ్ అయ్యాడు. బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో అసహనానికి గురైన గేల్ బ్యాట్ను విసిరేశాడు. సెంచరీ ముందు ఔట్ కావడంతో గేల్ తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఇలా నెర్వస్ నైన్టీస్లో పెవిలియన్ చేరడం, అందులోనే కేవలం పరుగు మాత్రమే కావాల్సిన తరుణంలో బౌల్డ్ కావడంతో గేల్ ఆ కోపాన్ని బ్యాట్పై చూపించాడు. ఆ తర్వాత తేరుకున్న గేల్ బ్యాట్ తీసుకుని వెళ్లి ఆర్చర్ను అభినందించాడు. కింగ్స్ పంజాబ్ నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్ను రాజస్తాన్ 17.3 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్స్టోక్స్(50;26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు), సంజూ శాంసన్((48; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక పాత్ర పోషించగా, రాబిన్ ఊతప్ప(30; 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్ స్మిత్(31 నాటౌట్; 20 బంతుల్లో 5 ఫోర్లు), బట్లర్( 22 నాటౌట్;11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ ఇంకా ఓవర్ ఉండగానే విజయం సాధించింది. దాంతో ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ రాజస్తాన్ విజయం సాధించినట్లయ్యింది. లక్ష్య ఛేదనలో స్టోక్స్, ఊతప్పలు రాజస్తాన్ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 5.3 ఓవర్లలో 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ప్రధానం స్టోక్స్ దూకుడుగా ఆడి విలువైన పరుగులు సాధించాడు. కాగా, హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత స్టోక్స్ ఔట్ కాగా, ఊతప్ప, సంజూ శాంసన్లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. శాంసన్ కీలక ఇన్నింగ్స్తో మెరిశాడు. ప్రతీ వికెట్కు విలువైన భాగస్వామ్యం సాధించడంతో రాజస్తాన్ అవలీలగా గెలిచింది. -
క్రిస్ గేల్ మెరుపులు
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 186 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్లు), కేఎల్ రాహుల్(46;41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు)లు రాణించడంతో పాటు పూరన్(22; 10 బంతుల్లో 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. రాజస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్ను రాహుల్, మన్దీప్ సింగ్లు ఆరంభించారు. కాగా, ఆడిన తొలి బంతికి మన్దీప్ సింగ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి మన్దీప్.. స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం పంజాబ్ ఇన్నింగ్స్ను రాహుల్, గేల్లు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్కు 120 పరుగులు జోడించడంతో కింగ్స్ గాడిలో పడింది. ఈ జోడి తమదైన శైలిలో రాజస్తాన్పై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రధానంగా రాహుల్ ఔటైన తర్వాత గేల్ చెలరేగి ఆడాడు. పూరన్తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం, మ్యాక్స్వెల్తో కలిసి 22 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు గేల్. కాగా, సెంచరీ పరుగు దూరంలో గేల్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్ నాల్గో బంతి గేల్ బ్యాట్ను తాకి వికెట్ల గిరాటేయడంతో పెవిలియన్ చేరాడు. కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. -
కేకేఆర్పై పంజాబ్ ప్రతాపం
పంజాబ్ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్ ఓవర్లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్ తొలి సగం మ్యాచ్ల్లో వరుసబెట్టి నిరాశపరిచింది. కానీ ఈ కింగ్స్... చెన్నై కింగ్స్లా కాదు! మొదటన్నీ ఓడినా... తర్వాతన్నీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. షార్జా: ఈ సీజన్లో పంజాబ్ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం కలుగకమానదు. ఒకదశలో ఏడింట ‘ఆరు’ ఓడిపోయిన జట్టు... వరుసగా విజయబావుటా ఎగరేస్తున్న జట్టు ఇదేనా అని కచ్చితంగా అనిపిస్తుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్రత్యర్థి జట్టపై పంజా విసురుతోంది. ఇది నిజం. అది కూడా వరుసగా! సోమవారం పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై గెలిచింది. మొదట కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. షమీ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించగా... మన్దీప్ (56 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) గెలిపించాడు. షమీ తడఖా... పంజాబ్ కెప్టెన్ రాహుల్ టాస్ నెగ్గగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్కతా ఇన్నింగ్స్ మొదలైన రెండో బంతికే మ్యాక్స్వెల్... నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్ వేసిన షమీ తన తడాఖా చూపాడు. నాలుగో బంతికి రాహుల్ త్రిపాటి (7)ని, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ (0)ను డకౌట్ చేశాడు. ఒక్కసారిగా 10/3 స్కోరుతో కోల్కతా కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ గిల్, కెప్టెన్ మోర్గాన్ నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు. శుబ్మన్ ఫిఫ్టీ... ఆత్మరక్షణలో పడిపోయిన నైట్రైడర్స్ ఇన్నింగ్స్ను శుబ్మన్, మోర్గాన్లే నడిపించారు. ఈ జోడీ ఆడినంతవరకు పరుగులకు ఢోకా లేకుండా పోయింది. అయితే ఈ భాగస్వామ్యం ముగిశాక మళ్లీ తర్వాత వచ్చిన వారు కూడా ముందరి బ్యాట్స్మెన్నే అనుసరించారు. గేల్... మెరుపుల్! కింగ్స్ లక్ష్యఛేదన ఫోర్తో మొదలైంది. కమిన్స్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్ క్రీజ్లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్ మన్దీప్ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్ ఫిఫ్టీ 25 బంతుల్లోనే పూర్తయ్యింది. వీళ్లిద్దరు రెండో వికెట్కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్ ఔటైనా... మిగతా లాంఛనాన్ని పూరన్ (2 నాటౌట్)తో కలిసి మన్దీప్ పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్మన్ గిల్ (సి) పూరన్ (బి) షమీ 57; నితీశ్ రాణా (సి) గేల్ (బి) మ్యాక్స్వెల్ 0; రాహుల్ త్రిపాఠి (సి) కేఎల్ రాహుల్ (బి) షమీ 7; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) షమీ 0; మోర్గాన్ (సి) అశ్విన్ (బి) రవి బిష్ణోయ్ 40; నరైన్ (బి) జోర్డాన్ 6; నాగర్కోటి (బి) అశ్విన్ 6; కమిన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 24; వరుణ్ చక్రవర్తి (బి) జోర్డాన్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149. బౌలింగ్: మ్యాక్స్వెల్ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్‡్షదీప్ సింగ్ 2–0– 18–0, మురుగన్ అశ్విన్ 4–0–27–1, జోర్డాన్ 4–0–25–2, రవి బిష్ణోయ్ 4–1–20–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 28; మన్దీప్ సింగ్ (నాటౌట్) 66; క్రిస్ గేల్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) ఫెర్గూసన్ 51; పూరన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–47, 2–147. బౌలింగ్: కమిన్స్ 4–0–31–0, ప్రసి«ధ్ కృష్ణ 3–0–24–0, వరుణ్ చక్రవర్తి 4–0–34–1, నరైన్ 4–0–27–0, ఫెర్గూసన్ 3.5–0–32–1. -
'గేల్ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్ చేయాలి'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ కింగ్స్ పంజాబ్ తుది జట్టులోకి అడుగుపెట్టాకా ఆ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయిందనే చెప్పొచ్చు. గేల్ రాకముందు ఆరు మ్యాచ్లాడిన పంజాబ్ ఒక విజయం, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది. అయితే గేల్ వచ్చిన తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడం విశేషం. గేల్ వచ్చి పెద్దగా మెరుపులు మెరిపించకపోయినా.. అతను ఆడుతున్న సుడిగాలి ఇన్నింగ్స్లు పంజాబ్ విజయాలను తేలికచేశాయని చెప్పొచ్చు. తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గేల్ 29 పరుగులే చేసినా.. అతను ఆడిన ఇన్నింగ్స్ వల్లే పంజాబ్ సులువైన విజయాన్ని నమోదు చేసింది. (చదవండి : ఐదో ప్లేయర్గా గబ్బర్..) కాగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో గేల్ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్బౌల్డ్ చేశాడు. దీనికంటే ముందు ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గేల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని షూ లేస్ ఒకటి ఊడిపోయింది. ఈ సందర్భంగా అశ్విన్ గేల్ షూలేస్ను కట్టి సరిచేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను అశ్విన్ సరదా క్యాప్షన్తో తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. 'డెవిల్ చూడడానికి భయంకరంగా ఉంటుంది. అది చేసే విధ్వంసం కూడా అలాగే ఉంటుంది. ఇదే తరహా పోలిక నాకు గేల్లోనూ కనబడుతుంది. అందుకే గేల్ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్ చేయాలి. ఢిల్లీ క్యాపిటల్స్కు ఈరోజు కఠినమైన రోజు. కానీ వచ్చే మ్యాచ్లో విజయంతో ఫుంజుకొని తిరిగి బలంగా తయారవుతాం ' అంటూ కామెంట్ చేశాడు. (చదవండి :ఆ ప్రశ్నకు నాకు కోపం వచ్చింది: గేల్) ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శిఖర్ ధావన్ మరోసారి సెంచరీతో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ధావన్ మినహా మిగతా ఎవరు రాణించకపోవడంతో ఢిల్లీ సాధారణ స్కోరునే నమోదు చేసింది. 165 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. మూడో ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ వెనుదిరిగినా.. వన్డౌన్లో బ్యాటింగ్ వచ్చిన గేల్ తుషార్ దేశ్పాండే బౌలింగ్లో 25 పరుగులు పిండుకొని మ్యాచ్ స్వరూపమే మార్చేశాడు. కాసపటికే గేల్ అవుటైనా నికోలస్ పూరన్ 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న పంజాబ్ తన తదుపరి మ్యాచ్లో అక్టోబర్ 24న సన్రైజర్స్ హైదరాబాద్ను ఎదుర్కోనుంది. -
ఎల్పీఎల్లో క్రిస్గేల్, డుప్లెసిస్
కొలంబో: కరోనా వైరస్ కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) వచ్చే నెలలో ఆరంభం కానుంది. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్పీఎల్ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కానీ అది నవంబర్ 14కు వాయిదా పడింది. కరోనాతో ఆ లీగ్ను జరపాలా..మానాలా అనే సందిగ్థంలో ఉన్న మేనేజ్మెంట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లీగ్లో గేల్, డుప్లెసిస్లతో పాటు షాహిద్ ఆఫ్రిది, కార్లోస్ బ్రాత్వైట్లు కూడా ఆడనున్నారు. సుమారు 20 మందికి పైగా విదేశీ ఆటగాళ్లు ఆ లీగ్లో ఆడటానికి సుముఖుత వ్యక్తం చేయడం ఆ లీగ్ అదనపు అట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. (రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే..? ) ఆ లీగ్ ఆడే ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్లో ఉండాలి. అక్కడికి చేరుకున్న తర్వాత క్వారంటైన్ నిబంధనను పూర్తి చేసి బరిలోకి దిగాలి. ఈ లీగ్ను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. ఎల్పీఎల్ నిర్వహణకు ముందుగా మూడు వేదికలు అనుకోగా వాటిని రెండుకు కుదించారు. కాండీ, హమ్బాన్తోటలో లీగ్ జరగనుంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకూ ఈ లీగ్ను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ఎల్పీఎల్ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇదే తొలి ఎడిషన్ కావడం గమనార్హం.(ధోని.. మీరు అవకాశాలు ఇచ్చింది ఏది?) -
ఆ ప్రశ్నకు నాకు కోపం వచ్చింది: గేల్
దుబాయ్: ముంబై ఇండియన్స్-కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. ముందు జరిగిన సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్ ఆడించారు. ఆ సూపర్ ఓవర్లో కింగ్స్ పంజాబ్ను విజయం వరించింది. రెండో సూపర్ ఓవర్లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్ ఛేదించింది. మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్లు బ్యాటింగ్కు దిగారు. బౌల్ట్ వేసిన తొలి బంతిని గేల్ సిక్స్ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్ ఫోర్ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్ పంజాబ్ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇలా ఐపీఎల్ చరిత్రలో డబుల్ సూపర్ ఓవర్లు పడటం ఇదే తొలిసారి. (ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది) కాగా, సెకండ్ సూపర్ ఓవర్ వరకూ మ్యాచ్ను తీసుకొచ్చినందుకు ఆగ్రహంతోపాటు కలత చెందానని యూనివర్శల్ బాస్ గేల్ తెలిపాడు. ఆ సమయంలో తానేమీ ఆందోళనకు చెందలేదని, క్రికెట్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నాడు. కాకపోతే రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు వెళ్తున్నప్పుడు ‘తొలి బంతిని మనిద్దరిలో ఎవరం ఎదుర్కొందాం?’ అని మయాంక్ అడిగిన ప్రశ్నకు గేల్ బాగా కలత చెందాడట. కోపం కూడా వచ్చిందని గేల్ తెలిపాడు. మయాంక్ నువ్వు నిజంగానే ఆ ప్రశ్న అడుగుతున్నావా..? , ఫస్ట్ బాల్ను బాస్ ఎదుర్కొంటాడు అని సమాధానం ఇచ్చాడట. మ్యాచ్ తర్వాత ఆటగాళ్లతో ఇంటరాక్షన్లో సూపర్ ఓవర్ల గురించి గేల్ మాట్లాడాడు. ఈ క్రమంలోనే మయాంక్తో కలిసి బ్యాటింగ్ చేయడానికి వెళ్లేటప్పుడు సంభాషణను వెల్లడించాడు. మరొకవైపు షమీపై ప్రశంసలు కురిపించాడు గేల్. ‘నా వరకు షమీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రోహిత్, డికాక్లకు బౌలింగ్ చేసిన షమీ.. ఆరు పరుగులు కూడా చేయకుండా సమర్థవంతంగా వ్యవహరించాడు. షమీ వేసి యార్కర్లను నేను నెట్స్లో ఎదుర్కొన్నాను. ప్రత్యర్థులకు కూడా షమీ యార్కర్లను రుచి చూపిస్తాడని తెలుసు. నేను అనుకున్నట్టే షమీ బౌలింగ్ చేశాడు’ అని గేల్ కొనియాడాడు. -
‘ఆ స్థితిలో బ్యాటింగ్ వద్దే వద్దు’
షార్జా: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ చివరి బంతికి గెలిచినా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. వరుస ఓటముల తర్వాత కింగ్స్ పంజాబ్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ డౌన్లో వచ్చినా తడబాటు లేకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు గేల్. 45 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్లతో 53 పరుగులు సాధించిన గేల్ తన విలువ ఏమిటో చూపించాడు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన గేల్పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. యూనివర్శల్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే గేల్ను సహచర ఆటగాడు నికోలస్ పూరన్ కొనియాడాడు. (గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?) ‘నా ప్రకారం గేల్ ఒక గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్. గేల్ బ్యాటింగ్ చేస్తుంటే విజయం సాధించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. గేల్ ఒకసారి క్రీజ్లోకి వెళ్లాడంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఆర్సీబీతో మ్యాచ్లో మెల్లగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. చాలాకాలం నుంచి గేల్ క్రికెట్ ఆడటం లేదు. కానీ మళ్లీ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. గేల్ పరుగులు సాధిస్తుంటే అద్భుతంగా ఉంటుంది. చివరి ఓవర్లో మూడు బంతులకు పరుగు మాత్రమే వచ్చింది. దాంతో నాకు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ గుర్తుకొచ్చింది. డగౌట్లో ఉన్న నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అవి చాలా గందరగోళానికి గురి చేశాయి. చివరి బంతికి నాకు బ్యాటింగ్ చేసే అవకాశం చాలా కాలం తర్వాత వచ్చింది. అంత ఉత్కంఠగా ఉన్నప్పుడు ఎప్పుడూ బ్యాటింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకును. అటువంటి స్థితిలో బ్యాటింగ్ వద్దే వద్దు.. కూర్చొని కూర్చొని ఆఖరి బంతికి బ్యాటింగ్కు దిగిన సమయంలో ఏమి చేస్తాననే ఆందోళన ఉంది. ఆ బంతి మ్యాచ్ను డిసైడ్ చేసే కావడంతో టెన్షన్ పడ్డా. మ్యాచ్ను సిక్స్తో ముగించినందుకు ఆనందంగా ఉంది’ అని మ్యాచ్ తర్వాత మయాంక్ అగర్వాల్తో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు పూరన్.(ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి : గేల్) -
ఈ పేరును కొంచెం గౌరవించండి : గేల్
షార్జా : విండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్ 13వ సీజన్లో తన ఆటను ఆరంభించాడు. గురువారం ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ ఆఖరి బంతికి విజయం సాధించి లీగ్లో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో బరిలోకి దిగిన గేల్ 54 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి రెండో వికెట్కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గేల్ ఈ సీజన్ను ఘనంగా ఆరంభించాడు. గేల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అక్కడ ఉండే సరదా వేరుగా ఉంటుంది. తాను చేసే అల్లరితో గ్రౌండ్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి మారిపోతుంది. (చదవండి : ఉత్కంఠ పోరు.. చివరి బంతికి గెలిచారు) తాజాగా కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్లో గేల్ తన అర్థసెంచరీ పూర్తి చేశాక ఒక సన్నివేశం చోటుచేసుకుంది. ఫిప్టీ పూర్తయిన తర్వాత బ్యాట్ పైకెత్తిన గేల్ బ్యాట్పై ఉన్న స్టిక్కర్ను చూపించాడు. ఆ స్టిక్కర్పై ది బాస్ అని రాసి ఉంది. బ్యాట్పై ఉన్న స్టిక్కర్ ద్వారా గేల్ ఒక మెసేజ్ను పాస్ చేశాడు. ' అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను చూపించే ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి' అంటూ పేర్కొన్నాడు. కాగా గేల్ చేసిన పనిపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రస్తావించాడు.(చదవండి : కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై) When he is on the mic, expect nothing less than entertainment and laughs 😅😅#Dream11IPL | @henrygayle pic.twitter.com/I62YPN1pES — IndianPremierLeague (@IPL) October 15, 2020 గేల్ ఒక మంచి గుణం కలిగిన ఆటగాడని.. క్రికెట్లో గొప్పగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఆటగాళ్లలో అతను ముందు వరుసలో ఉంటాడని కొనియాడాడు. అతను ఉన్న చోట ఎంటర్టైన్మెంట్కు కొదువ ఉండదు.. అందుకే గేల్ మంచి మనసున్న ఆటగాడయ్యాడని తెలిపాడు.అనంతరం మ్యాచ్ గురించి ప్రస్తావించగా.. కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడని.. అతనికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. కింగ్స్ పంజాబ్ అసలైతే ఐదు మ్యాచ్లు గెలవాల్సి ఉండేది.. కానీ వారికి అదృష్టం కలిసిరావడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ కూడా ఈజీగా గెలవాల్సినా.. చివరివరకు ఆడి క్లిష్టతరం చేసుకున్నారని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అంతేగాక క్రీడల్లో గొప్ప అథ్లెట్గా కోహ్లితో పాటు ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోలను మొదటి చాయిస్గా తీసుకుంటానని రవిశాస్త్రి ఇంటర్య్వూలో సమాధానమిచ్చాడు. కాగా కింగ్స్ పంజాబ్ 8 మ్యచ్లాడి కేవలం రెండు విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్లో ఇకపై జరిగే అన్ని మ్యాచ్లను పంజాబ్ గెలవడంతో పాటు రన్రేట్ను మెరుగుపరుచుకుంటేనే ఫ్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. -
ఉత్కంఠ పోరు.. చివరి బంతికి గెలిచారు
షార్జా: ఈ ఐపీఎల్ సీజన్లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్ పంజాబ్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్ పంజాబ్కు గేల్ ఓ మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. తన మార్కు స్టైల్ ఆటతో పంజాబ్ ఊపిరి తీసుకునే విజయాన్ని అందించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన గేల్ తర్వాత సిక్స్లతో మంచి జోష్ తీసుకొచ్చాడు. 45 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్లతో 53 పరుగులు సాధించిన గేల్ తన విలువ ఏమిటో చూపించాడు. అతనికి జతగా కేఎల్ రాహుల్(61 నాటౌట్; 49 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్లు) మరోసారి రాణించడంతో కింగ్స్ పంజాబ్ విజయం సాధించింది. కింగ్స్పంజాబ్ జట్టులో మయాంక్ అగర్వాల్(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా బ్యాటింగ్ చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. ఆ తర్వాత గేల్, రాహుల్లు ఓ సొగసైన ఇన్నింగ్స్ ఆడారు. కాగా, చహల్ వేసిన ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్లో కింగ్స్ పంజాబ్కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్ రనౌట్ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. కానీ పూరన్ సిక్స్తో ఇన్నింగ్స్ను ఫినిష్ చేయడంతో కింగ్స్ పంజాబ్కు విజయం దక్కింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్కు మాత్రమే వికెట్ లభించింది. ఈ సీజన్లో ఆర్సీబీతో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ కింగ్స్ పంజాబ్దే పైచేయి అయ్యింది. ఇది పంజాబ్కు రెండో విజయం కాగా, ఆర్సీబీకి మూడో ఓటమి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. అరోన్ ఫించ్(20), దేవదూత్ పడిక్కల్(18)లు నిరాశపరిచారు. మురుగన్ అశ్విన్ బౌలింగ్లో ఫించ్ ఔట్ కాగా, అర్షదీప్ బౌలింగ్లో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఏడు ఓవర్లలోపే పెవిలియన్కు వెళ్లారు. ఆ తరుణంలో కోహ్లి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఆదిలోనే ఆర్సీబీ వికెట్లను చేజార్చుకోవడంతో కోహ్లి మరో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి(48; 39 బంతుల్లో 3ఫోర్లు) జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. అతనికి జతగా శివం దూబే(23; 19 బంతుల్లో 2 సిక్స్)లు కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ ఏబీ డివిలియర్స్(2) విఫలం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. డివిలియర్స్ ఐదో వికెట్గా ఔటైన కాసేపటికే కోహ్లి ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. స్కోరును పెంచే క్రమంలో కోహ్లి ఔటయ్యాడు. దాంతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోహ్లి చేజార్చుకున్నాడు. షమీ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ పట్టడంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో క్రిస్ మోరిస్(25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) బ్యాట్ ఝుళిపించాడు. షమీ వేసిన ఆఖరి ఓవర్లో క్రిస్ మోరిస్ 1 ఫోర్, రెండు సిక్స్లు కొట్టగా, ఉదానా ఒక సిక్స్ కొట్టాడు. చివరి ఓవర్లో ఆర్సీబీ 24 పరుగులు పిండుకుంది. దాంతో ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మిగతా ఆర్సీబీ ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(13), ఉదాన(10 నాటౌట్; 1సిక్స్)లు ఫర్వాలేదనిపించారు. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్లు తలో రెండు వికెట్లు సాధించగా, అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్లు చెరో వికెట్ తీశారు. -
క్రిస్ గేల్ వచ్చేశాడు..
షార్జా: ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్కు మొగ్గుచూపాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఏడు మ్యాచ్లు ఆడి ఐదు విజయాలు సాధించగా, కింగ్స్ పంజాబ్ ఏడు మ్యాచ్లకు గాను ఒకదాంట్లో మాత్రమే గెలుపొందింది. అది కూడా ఆర్సీబీపైనే భారీ విజయం సాధించింది కింగ్స్ పంజాబ్. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది విరాట్ గ్యాంగ్. ఇప్పటివరకూ ఇరుజట్లు 25సార్లు ముఖాముఖి తలపడితే కింగ్స్ పంజాబ్ 13 మ్యాచ్ల్లో విజయం సాధించగా, ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో గెలిచింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గత జట్టుతోనే బరిలోకి దిగుతుండగా, కింగ్స్ పంజాబ్ మూడు మార్పులు చేసింది. క్రిస్ గేల్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు. ప్రబ్సిమ్రాన్, ముజీబ్, మన్దీప్లకు విశ్రాంతి ఇచ్చారు. (కేఎల్ రాహుల్కు కోహ్లి వార్నింగ్!) ఇరుజట్లలో కీలక ఆటగాళ్లు ఉండటంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఆర్సీబీ జట్టులో కోహ్లి, దేవదూత్ పడిక్కల్, అరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్లు బ్యాటింగ్ బలంగా కాగా, బౌలింగ్లో చహల్, ఇసురు ఉదాన, వాషింగ్టన్ సుందర్, సైనీలు కీలకంగా ఉన్నారు. ఇక ఆల్రౌండర్ కోటాలో క్రిస్ మోరిస్ ఉండటంతో ఆర్సీబీ బలం పెరిగింది. ఇక కింగ్స్ పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్లే ప్రధానం, బౌలింగ్లో మహ్మద్ షమీ, రవి బిష్నోయ్, షెల్డాన్ కాట్రెల్లు కీలకం. తాజాగా క్రిస్ గేల్ రావడంతో అతను ఎలా ఆడతాడనే దాని కోసం కింగ్స్ పంజాబ్ అభిమానులు ఆశగా చూస్తున్నారు. గేల్ విరుచుకుపడి పంజాబ్కు విజయాన్ని అందిస్తాడనే ధీమాతో ఉన్నారు ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్. డివిలియర్స్ వర్సెస్ బిష్నోయ్ ఈ మ్యాచ్లో డివిలియర్స్-బిష్నోయ్ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు. బ్యాటింగ్లో విశ్వరూపం ప్రదర్శిస్తున్న డివిలియర్స్కు యువ స్పిన్ అస్త్రం బిష్నోయ్ నుంచి ప్రమాదం లేకపోలేదు. ఈ ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేసిన బిష్నోయ్లో రెట్టించిన ఆత్మవిశ్వాసం కనబడుతోంది. ఒక బంతిని కొట్టినా ఆ తర్వాత ఎటువంటి జంకు లేకుండా బౌలింగ్ చేస్తున్న తీరు శభాష్ అనిపిస్తోంది. ఇప్పటివరకూ బిష్నోయ్ ఎనిమిది వికెట్లు సాధించగా, డివిలియర్స్ 228 పరుగులు సాధించాడు. ఇక్కడ ఏబీడి స్టైక్రేట్ 185. 36 గా ఉండగా, బిష్నోయ్ ఎకానమీ 7.85గా ఉంది. ఇక రాహుల్- క్రిస్ మోరిస్ల మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఈ సీజన్లో రాహుల్ 387 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. అందులో అజేయంగా 132 పరుగులు సాధించాడు. మరొకవైపు మోరిస్ ఆర్సీబీ తరఫున రెండు మ్యాచ్లే ఆడి ఐదు వికెట్లు సాధించాగు. ఇక్కడ మోరిస్ ఎకానమీ 4.50గా ఉంది. ఆర్సీబీ తుదిజట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్, దేవదూత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉదాన, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, చహల్ కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, క్రిస్ గేల్, మ్యాక్స్వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్నోయ్, అర్షదీప్ సింగ్ -
'ఇంత దారుణంగా ఆడుతానని అనుకోలేదు'
షార్జా : ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్.. ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మ్యాక్స్వెల్ 2014లో కింగ్స్ పంజాబ్ తరపున 552 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఐపీఎల్ వేలంలో ఎక్కువ ధర పలికేలా చేసింది. అంతేకాదు.. 2017లో మళ్లీ కింగ్స్ పంజాబ్ జట్టుకు మ్యాక్స్వెల్ కెప్టెన్గానూ బాధ్యతలు నిర్వహించాడు. కానీ ఇప్పుడు అదే మ్యాక్స్వెల్ను కింగ్స్ పంజాబ్ వేలంలో రూ. 10.5 కోట్లు పెట్టి కొంటే ఐపీఎల్ 13వ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. (చదవండి : కోహ్లి బ్యాట్స్ దొంగలిస్తా : డివిలియర్స్) అయితే మ్యాక్సీ ఐపీఎల్కు రాకముందు ఇంగ్లండ్ సీజన్లో తన ప్రదర్శనతో దుమ్మురేపాడు. వన్డే సిరీస్లో కీలక మ్యాచ్లో 90 బంతుల్లోనే 108 పరుగులు చేసి ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తీరా ఐపీఎల్కు వచ్చేసరికి మ్యాక్స్వెల్ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. కింగ్స్ పంజాబ్ తరపున ఏడు మ్యాచ్లాడిన మ్యాక్సీ కేవలం 58 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు మాక్స్వెల్ స్థానంలో క్రిస్గేల్ను ఆడించాలని.. లేకపోతే పంజాబ్ తీవ్రంగా నష్టపోతుదంటూ సీనియర్లు విమర్శించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన మ్యాక్స్వెల్ తనకు పూర్తి క్లారిటీ ఉందని పేర్కొన్నాడు. (చదవండి : ఆ టోపీలకు విలువ ఇవ్వను: అశ్విన్) 'ఐపీఎల్, అంతర్జాతీయ కెరీర్ను ఎప్పుడూ పోల్చుకోకూడదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు నా పాత్రపై పూర్తి స్పష్టత ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు ముందు.. ఎవరు వెనుక అనే దానిపై స్పష్టత ఉంటుంది. ఎందుకంటే అది జాతీయ జట్టు.. అందునా ప్రతీ మ్యాచ్లోనూ దాదాపు ఒకే జట్టును ఆడిస్తారు. కానీ ఐపీఎల్లో అలా ఉండదు. ప్రతీ మ్యాచ్లోనూ బ్యాటింగ్ ఆర్డర్ మారుతూ వస్తుంది. అందువల్లే నా ప్రదర్శనలో తేడా కనిపిస్తుంది. ప్రస్తుత పంజాబ్ జట్టులో మొదటి నాలుగు స్థానాల తర్వాతే నేను బ్యాటింగ్కు దిగుతున్నా.. ఇప్పటికైతే టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం లేదు.. దీంతో ముందున్న నలుగురు బ్యాట్స్మెన్కు మద్దతుగా స్ట్రైక్ రొటేట్ చేయడమే నా పాత్ర. కానీ నేను ఇంత దారుణంగా ఆడుతానని అనుకోలేదు. కానీ యూఏఈ పిచ్లు ప్రస్తుతం నెమ్మదిస్తున్నాయి. ఆసీస్ తరఫున మంచి ప్రదర్శన చేసిన అనంతరం ఇక్కడ అదే ప్రదర్శనను పునరావృతం చేయకపోవడం బాధ కలిగిస్తుంది. కానీ ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని.. గతంతో పోలిస్తే వికెట్లలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని తెలిపాడు. చాలా మ్యాచుల్లో పంజాబ్ గెలుపు దగ్గరికొచ్చి ఓడిపోవడం బాధాకరమే.. అందకు నన్ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం మాత్రం ఒప్పుకోను.' అని చెప్పుకొచ్చాడు. కాగా పంజాబ్ ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. ఇక ఇప్పటినుంచి జరిగే ప్రతీ మ్యాచ్ పంజాబ్కు కీలకమనే చెప్పొచ్చు. గురువారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో క్రిస్ గేల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. (చదవండి : ‘ఈ సీజన్లో ఆ రెండు జట్లే అత్యుత్తమం’) -
క్రిస్ గేల్ వస్తున్నాడు.. రాత మారుస్తాడా?
దుబాయ్: కింగ్స్ పంజాబ్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఫిట్ అయ్యాడు. ఫుడ్ పాయిజిన్ కారణంగా ఆడుతాడనుకున్న గేల్.. కొన్ని మ్యాచ్లకు అనూహ్యంగా దూరమయ్యాడు. అయితే గేల్ కోలుకున్నట్లు కింగ్స్ పంజాబ్ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. దాంతో తదుపరి మ్యాచ్లో గేల్ ఆడటం దాదాపు ఖాయమైంది. సన్రైజర్స్ జరిగిన మ్యాచ్లో గేల్ ఆడతాడని అంతా భావించారు. కాగా, చివరి నిమిషంలో ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన గేల్ ఆ మ్యాచ్కు దూరం కావడంతో పాటు కేకేఆర్తో మ్యాచ్లో కూడా ఆడలేదు. ఆ రెండు మ్యాచ్లను కింగ్స్ పంజాబ్ కోల్పోయింది. (డిఫెన్స్ చెక్ చేయబోయి గోల్డెన్ డక్ అయ్యాడు..) గురువారం ఆర్సీబీతో షార్జాలో జరగబోయే మ్యాచ్లో గేల్ ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. షార్జాలో మ్యాచ్ కాబట్టి పించ్ హిట్టర్ గేల్ను ఆడించడానికి కింగ్స్ పంజాబ్ ఏమాత్రం వెనకాడదు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఇక రాబోవు మ్యాచ్ల్లో గేల్ మెరుపులు మనకు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కింగ్స్ పంజాబ్ రాతను గేల్ మారుస్తాడో లేదో చూడాలి. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఏడు మ్యాచ్లు ఆడి ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి చివరి స్థానంలో ఉంది. -
గేల్.. నువ్వు త్వరగా కోలుకోవాలి
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు ఏది కలిసిరావడం లేదు. శనివారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సులభంగా గెలిచే మ్యాచ్ను కష్టతరం చేసుకొని ఆపై కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టు దారుణ వైఫల్యం గురించి చెబుతుంది. ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోని మిడిలార్డర్ బ్యాట్స్మన్లు దారుణంగా ఫేయిలయ్యారు. చివరి బంతిని మ్యాక్స్వెల్ భారీ షాట్కు ప్రయత్నించినా.. దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండడంతో అది బౌండరీగా మారి వారి పాలిట శాపంగా మారింది. లీగ్లో వరుసగా విఫలమవుతూ వస్తున్న మ్యాక్స్వెల్ స్థానంలో క్రిస్ గేల్ను జట్టులోకి తీసుకోవాలంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. (చదవండి : ‘గేల్ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’) శనివారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోనూ గేల్ను తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే గేల్ను జట్టులోకి తీసుకోకపోవడం వెనుక బలమైన కారణమే ఉంది. నిజానికి ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లోనే గేల్ను తీసుకోవాలని భావించారు. కానీ గేల్కు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరాడని.. అందుకే మ్యాచ్ ఆడలేదని ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉన్నా కాస్త అనారోగ్యం ఉండడంతో కేకేఆర్తో మ్యాచ్లోనూ బరిలోకి దిగలేదని పేర్కొన్నాడు. కాగా గేల్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన అతని అభిమానులు గేల్ నువ్వు త్వరగా కోలుకోవాలంటూ సోషల్మీడియాలో కామెంట్స్ షేర్ చేశారు. దీంతో క్రిస్ గేల్ తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను విడుదల చేశాడు. 'మీ అందరికి ఒక విషయం చెప్పదలచుకున్న. సమస్యలో ఉన్నప్పుడు పోరాటం చేయకుండా నేను వెనుకడుగు వేయను. నేను యునివర్స్ల్ బాస్ను.. నేను ఎన్నటికి మారను. ఎంత కష్టం వచ్చిన దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను తప్ప నా శైలిని మార్చుకోను. బతకడం అనేది ఒక కళ.. అది అందరికి రాదు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. మీ ఆశీర్వాద బలం ఎప్పటికి ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటాన్నా. నా కోసం ప్రార్ధించిన మీ అందరికి ధన్యవాదాలు. అంటూ తెలిపాడు. కాగా పంజాబ్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇకపై పంజాబ్కు ప్రతీ మ్యాచ్కు కీలకంగా మారనుంది. ఇప్పటినుంచి ఆడే ప్రతీ మ్యాచ్లోనూ పంజాబ్ గెలవాల్సి ఉంటుంది. తన తర్వాతి మ్యాచ్ను అక్టోబర్ 15న ఆర్సీబీతో తలపడనుంది.(చదవండి : దినేశ్ కార్తీక్.. ఏం తిన్నావ్: మాజీ క్రికెటర్) -
‘గేల్ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములతో సతమవుతున్నా కింగ్స్ పంజాబ్ తన సెలక్షన్లో పెద్దగా మార్పులేమీ చేయకపోవడంపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా పెదవి విరిచాడు. కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్కు సైతం పించ్ హిట్టర్ క్రిస్ గేల్కు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లకు జతగా క్రిస్ గేల్ కూడా ఉండి ఆ జట్టు బ్యాటింగ్ బలం పెరుగుతుందన్నాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వరుస మ్యాచ్లను చేజార్చుకుంటున్న తరుణంలో గేల్ను ఆడించకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందన్నాడు.(ఎన్నాళ్లకెన్నాళ్లకు దినేశ్ కార్తీక్..) క్రిస్ గేల్ అనేవాడు ప్రత్యర్థి జట్టును భయభ్రాంతులకు గురి చేస్తాడనేది కాదనలేని వాస్తవమన్నాడు. కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్లో పైచేయి సాధించాలంటే గేల్ జట్టులో ఉంటేనే అది సాధ్యమవుతుందన్నాడు. ఈ ఐపీఎల్లో జోర్డాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ అతనికి అవకాశం ఇవ్వడం ఇక్కడ సరైనది కాదన్నాడు. కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ లైనప్లో క్రిస్ గేల్ ఉంటే ఆ బలమే వేరుగా ఉంటుందని లారా అభిప్రాయపడ్డాడు. కేకేఆర్తో మ్యాచ్కు ముందు స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన లారా.. గేల్ను మరొకసారి తీసుకోలేకపోవడం మాత్రం నిరాశకు గురిచేసిందన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ ఆడిన గత మ్యాచ్లో గేల్కు అవకాశం ఉంటుందని చివరి వరకూ ఊరించారు. కానీ ఆఖరి నిమిషంలో గేల్కు ఫుడ్ పాయిజన్ అయిందనే కారణంతో తప్పించామని కోచ్ అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు. కాగా, కేకేఆర్తో మ్యాచ్కు గేల్ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్న మరొకసారి వచ్చింది. కేకేఆర్తో మ్యాచ్లో ఫామ్లో లేని మ్యాక్స్వెల్ స్థానంలో గేల్ను ఆడించాలని విశ్లేషకుల సైతం అభిప్రాయపడ్డారు.