రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ ప్రకటనతో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి టార్గెట్ అయ్యారా.. ఆ మేరకే రాజకీయంగా దెబ్బకొట్టాలనే ఆలోచన తలెత్తిందా....తన కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పగించాలనే వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంబిస్తున్నారా...తరచూ వివాదాస్పద ఘటనలు కావాలనే తెరపైకి తెస్తున్నారా....ఇన్చార్జిని విస్మరిస్తూ వైరివర్గాన్ని ప్రోత్సహించడానికి కారణం అదేనా? అని ప్రశ్నిస్తే అవుననే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.