విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసేలా రెండు రోజుల పాటు ఆర్కే బీచ్లో నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. సీఎం రాకతో సాగర తీరం జనసందోహంలా మారింది. థాంక్యూ సీఎం నినాదం హోరెత్తింది. వేదికపైకి వచ్చిన సీఎం జగన్కు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి శాలువా కప్పి సత్కారం చేశారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. లేజర్ స్పెషల్ షో ప్రదర్శించారు.