Development programs
-
ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్గా సిద్దిపేట: హరీశ్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో నెలకొల్పిన శిక్షణ కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులపై గురుతర బాధ్యత ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్ పాల్గొన్నారు. యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యచంద్ర తేజతో కలసి శంకుస్థాపన చేశారు. హరీశ్ మాట్లాడుతూ సిద్దిపేట ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్గా మారిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా కాళేశ్వరం ద్వారా గోదావరి నీటి వసతి వచ్చిందని తెలిపారు. త్వరలో రైల్వే సౌకర్యం రానుందని, ప్రముఖ కోకాకోలా కంపెనీ కొండపోచమ్మ సాగర్ వద్ద భారీ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పా టు చేయనుందని హరీశ్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ రైస్ మిల్లు వర్గల్లో రానుందన్నారు. బెజ్జంకి దాచా రం వద్ద భారీ గ్రానైట్ హబ్ వస్తుందని తెలిపారు. కాగా, పొన్నాల వద్ద నిర్మించిన ప్లైఓవర్ బ్రిడ్జిని హరీశ్ ప్రారంభించి బుల్లెట్ బండిపై బ్రిడ్జి మీదుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. -
పల్నాడు జిల్లా: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు
సాక్షి, పల్నాడు జిల్లా: అమరావతి మండలం మల్లాదిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, సీసీరోడ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, సచివాలయాలు ద్వారా వేగంగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. చదవండి: ‘అప్పుడు అవహేళన చేశారు.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు’ మూడేళ్లలో విప్లవాత్మక మార్పు: అంబటి రాంబాబు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, పులిచింతల నుంచి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా గురజాల, నరసరావుపేట ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఈ మూడేళ్ల పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చామన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలతో సుపరిపాలన అందిస్తున్నామని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
నిర్దేశిత లక్ష్యం మేరకు సిమెంట్ అందించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా జరుగుతున్న నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అందించాలని సిమెంట్ కంపెనీలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ సూచించారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తగిన సహకారం అందించాలని కోరారు. మంగళవారం సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులిద్దరూ సమావేశమయ్యారు. నిర్దేశించిన మొత్తంలో 30 శాతం సిమెంట్ కూడా కొన్ని కంపెనీలు అందించలేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సీఎం జగన్ లక్షలాది మందికి ఇళ్ల స్థలాలిచ్చారని, మొదటి దశలో దాదాపు 16 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు సహా ప్రభుత్వ విభాగాలకు పక్కా భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. నాడు–నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వీటన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సిమెంట్ కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ.. నిర్దిష్ట కాలవ్యవధిలో సిమెంట్ సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు -
సంచార జాతులకు ‘సంక్షేమం’
సాక్షి, అమరావతి: ఆకర్షించే వింత ఆహార్యం.. రోడ్డు పక్కన ప్రమాద భరితమైన సర్కస్ విన్యాసాలు.. వనమూలికలు, పూసలు అమ్మకం, ఎలుకలు పట్టడం లాంటి వాటి ద్వారా బతుకు నెట్టుకొచ్చే సంచార జాతులకు నవశకం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలస బతుకులకు భరోసా ఇస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి చేరువ చేస్తున్నారు. సంచార జాతుల పిల్లల చదువులు, సంక్షేమ పథకాలకు కీలకమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘దేవరవాండ్లు’కు చెందిన నాలుగు సంచార జాతుల కుటుంబాలకు రెవెన్యూ అధికారులు గత బుధవారం కుల ధ్రువీకరణ పత్రాలు (బీసీ –ఏ) జారీ చేయడం గమనార్హం. దాదాపు యాభై ఏళ్ల క్రితం 1970లో అనంతరాము కమిషన్ చేసిన సిఫారసులు ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. బ్రిటీష్ కాలం నుంచి దుర్భరం.. దేశంలో సుమారు 500 సంచార జాతులను బ్రిటీష్ ప్రభుత్వం 1871లో క్రిమినల్స్ యాక్ట్ పరిధిలోకి తెచ్చి అణిచివేసింది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ సంచార జాతులను 1952 ఆగస్టు 31న విముక్త జాతులుగా ప్రకటించారు. వీరి అభివృద్ధి కోసం 1947లో క్రిమినల్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ, 1949లో అనంతశయనం అయ్యంగార్ కమిటీ, 1961–62లో వెన్నెలగంటి రాఘవయ్య ట్రైబల్ ఎంక్వైరీ, 2008లో బాలకృష్ణా రేణికే జాతీయ కమిషన్, 2015లో బిక్కు రామ్జీ ఇదాత్జీ కమిషన్లు వేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో 2 లక్షల మందికిపైనే రాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన దాదాపు 2 లక్షల మందికిపైగా ఉన్నారు. ఒకే చోట నివాసం ఉంటూ కాస్త అభివృద్ధి చెందిన వారిని విముక్తి జాతులుగా వ్యవహరిస్తున్నారు. ఒక చోట నివాసం ఏర్పాటు చేసుకుని బతుకుదెరువుకు వేర్వేరు ప్రాంతాలు తిరిగి వచ్చే వారిని అర్థ సంచార జాతులుగా పిలుస్తున్నారు. సొంత ఊరు, గూడు లేకుండా ఉపాధి కోసం ఊరూరా తిరిగేవారిని సంచార జాతులుగా విభజించారు. అత్యంత వెనుకబడిన జాతులు రాష్ట్రంలో 32 ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ఇటీవల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ సంచార జాతుల బతుకులు మెరుగుపరుస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దేవరవాండ్లకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదు. నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పాలకొల్లు తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలను అందచేశారు. ప్రభుత్వం తమను గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం పట్ల సంచార జాతులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. –పెండ్ర వీరన్న, ఏపీ ఎంబీసీ చైర్మన్ అమ్మ ఒడితో బిడ్డను చదివిస్తున్నా వలస బతుకులతో మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలవతో నా బిడ్డ రమేష్ చదువులకు అమ్మ ఒడి ఆసరాగా నిలిచింది. లేదంటే మా మాదిరిగానే కూలి పనికి వెళ్లాల్సి వచ్చేది. నా బిడ్డ చదువుకు అండగా నిలిచిన సీఎం జగన్ మేలు ఎప్పటికీ మరిచిపోలేం. –పి,లక్ష్మీ, సిరిపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లా. ‘చేయూత’ అందించారు భిక్షాటనతో జీవనం గడిపే మాకు చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున ఇస్తున్నారు. దీంతోపాటు రోజువారీ పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నా. గతంలో మమ్మల్ని మనుషులుగా గుర్తించలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసుతో మాకు గుర్తింపు వచ్చింది. –వాడపల్లి పెద్దింట్లు, సీతారామపురం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అత్యంత దుర్భర జీవనాన్ని గడుపుతున్న సంచార జాతులకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇప్పుడు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయి. అమ్మ ఒడితో పాటు చేయూత తదితర పథకాలను వర్తింపజేస్తున్నారు. ఉపాధి కోసం ఊరూరా తిరుగుతూ రోడ్ల పక్కన, మురికి కాల్వల గట్లుపై, రైల్వే ట్రాక్ల వెంట పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో సంచార జాతుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్య శకం మొదలైంది. -
‘దీపావళికి స్థానిక ఉత్పత్తులే కొనండి’
వారణాసి: సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ దీపావళి పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందని, అలాగే, వాటిని తయారు చేసినవారి ఇళ్లల్లో దీపావళి వెలుగులు నింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఎస్సీఓ సమావేశాలకు మోదీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నడుమ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్ అధినేతలతో ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ వేదికగా భేటీకానున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాదికి ఎజెండాను ఖరారు చేస్తారు. కరోనా కారణంగా ఎస్సీఓ అధినేతల వార్షిక సమావేశం తొలిసారిగా ఆన్లైన్లో జరగనుంది. భారత్ చైనా సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో ఎస్సీఓ ఈ నెలలో ఐదు సమావేశాలను నిర్వహించనుంది. ఈ వార్షిక సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అధ్యక్షత వహిస్తారు. సమావేశాల్లో రాజకీయాలు, భద్రత, ఆర్థిక వాణిజ్యం లాంటి విషయాలపై దృష్టి సారించి, ప్రపంచ పరిస్థితులపై మాస్కో డిక్లరేషన్ను రూపొందించనున్నారు. -
అభివృద్ధి పథంలో గురజాల
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేపడుతున్న పనులకు విశేష ఆదరణ లభిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గానికి ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల, పిడుగురాళ్లలో ప్రతి ఇంటికీ త్రాగునీరు, గ్రామాల్లో సీసీ రోడ్లు.. వంటి పథకాలు మంజూరు అయ్యేలా చేశారు. ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న జననేత సీఎం వైఎస్ జగన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సొంత ఇల్లు లేని 19 వేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ► రూ. 350 కోట్లతో ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల.. తన అదే బాట కార్యక్రమంలో భాగంగా కాసు మహేష్రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక గర్భిణీ కాన్పు కొరకు సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది. ఆ సమయంలో ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఆసుపత్రి తో కూడిన వైద్య కళాశాల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పల్నాడు లోని ఏ ఒక్కరూ వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే కృత నిశ్చయంతో తన మొదటి ప్రాధాన్యత క్రింద ఈ విషయాన్ని జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్.. మొదటి బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయడమే కాక, పరిపాలనా పరమైన అన్ని ఆమోదాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి శ్రావణ మాసంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► రూ. 2650 కోట్లతో 7 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్రెడ్డి ఆయన తాత దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నమ్మిన జలం జనానికి జీవనమనే సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల కోసం బ్రహ్మానందరెడ్డి సాధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాగునీరు అందించే విషయంలో సఫలీకృతం అయింది. అయితే త్రాగునీరు విషయంలో పల్నాడు నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలతోపాటు వినుకొండ, చిలకూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంపై మహేష్రెడ్డి దృష్టిసారించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ.. మహేష్రెడ్డి ఇందుకు సంబంధించి తానే స్వయంగా ఒక ప్రణాళిక రూపొందించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలతోపాటు మిగిలిన ఆరుగురు శాసససభ్యులను కలుపుకుని ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను వివరించి సీఎం జగన్ అభినందనలు కూడా పొందారు. అలాగే తాను కోరిన పథకానికి కావాల్సిన ఆర్థిక, పరిపాలన పరమైన అన్ని అనుమతులు అందుకున్నారు. ► రూ. 34 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణం.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రహదారుల తర్వాత మురుగు కాల్వల నిర్మాణం ప్రధానమైనది. ఈ నేపథ్యంలో మురుగు నీటి వ్యవస్థ క్రమబద్దీకరణ ఆవశ్యకతను మహేష్రెడ్డి గుర్తించారు. రహదారి నిర్మాణం జరిగే ప్రతి చోటా రహదారి ఇరువైపుల మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వల నిర్మాణం కొరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వారితో అంచనాలు తయారు చేయించారు. రూ. 34 కోట్లతో అవసరమైన ప్రతి గ్రామంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నారు. ► రూ. 140 కోట్లతో పిడుగరాళ్ల పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో పిడుగురాళ్ల నగర పంచాయతీగా మార్పు చెందింది. అయితే పిడుగరాళ్ల పట్టణంలోని ప్రజలు త్రాగునీరు కొరకు విపరీతమైన ఇబ్బందులు పడటాన్ని తన అదే బాట కార్యక్రమంలో మహేష్రెడ్డి ప్రత్యక్షంగా గమనించారు. ఈ విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ముఖ్యంగా తాగునీరు తెచ్చుకునే సమయంలో మహిళలు పడుతున్న అవస్థలను సీఎం వైఎస్ జగన్కు మహేష్రెడ్డి వివరించారు. దగ్గరలోని బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నేరుగా పిడుగురాళ్ల పట్టణానికి త్రాగు నీరందించే పథకానికి యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారు చేయించి వాటికి సీఎం జగన్ను మెప్పించారు. రెండవ అసెంబ్లీ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయించడమే కాకుండా త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభ కార్యక్రమం జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ► రూ. 55 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం.. గత ప్రభుత్వం గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అందించటం లో పూర్తిగా విఫలమైన విషయాన్ని తన అదే బాట కార్యక్రమంలో కాసు మహేష్రెడ్డి నిశితంగా గమనించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ అంతర్గత రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ప్రతి గ్రామంలో.. కులాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా 55 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి అంకురార్పణ చేయటం జరిగింది. ► మున్సిపాలిటీలుగా గురజాల, దాచేపల్లి గ్రామాలు గురజాల, దాచేపల్లి ప్రజల చిరకాల కోరిక ఆ రెండు గ్రామాలు మున్సిపాలిటీలుగా మార్పు చెందటం. ఈ మేరకు తన ఎన్నికల ప్రచారంలో కాసు మహేష్రెడ్డి ఆ రెండు గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తానని వాగ్దానం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో గురజాల, దాచేపల్లి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చటం ద్వారా కాసు మహేష్రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ రెండు గ్రామాల ప్రజల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమయ్యారు. -
అభివృద్ధిపైనే దృష్టి: కేటీఆర్
సాక్షి, ఖమ్మం: పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనదేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, స్పెషల్ ఆఫీసర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి పైనే ప్రభుత్వం దృష్టి సారించిందని నిబద్ధత,చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా రాష్ట్రంలో ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.487 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో విరివిగా మొక్కలు నాటి, సంరక్షించాన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాల్వలు శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. విద్యుత్ సమస్యలను ఎప్పుడో అధిగమించామని.. తాగునీటి సమస్య పరిష్కరించడానికే మిషన్ భగీరథను చేపట్టామని కేటీఆర్ తెలిపారు. -
ముగిసిన సీఎం జగన్ విశాఖ పర్యటన
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం పర్యటన ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్కు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు గన్నవరం నుంచి బయలుదేరిన సీఎం జగన్.. మధ్యాహ్నం 3.50గంటలకు విశాఖ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువులు మంత్రులు, వైఎస్సార్సీపీ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు. (చదవండి : విశాఖలో సీఎం జగన్కు ఘనస్వాగతం) తమ అభిమాన నేతను చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి రోడ్డుపై నిల్చోని తమ అభిమాన నేత జగనన్న కోసం ఎదురు చూశారు. ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. కారులో ఉన్న సీఎం జగన్లో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. కైలాసగిరి నుంచి సెంట్రల్పార్క్కు, సెంట్రల్ పార్క్ నుంచి ఆర్కేబీచ్కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో సీఎంకు థాంక్స్ చెప్పారు. (చదవండి : విశాఖ ఉత్సవ్ను ప్రారంభించిన సీఎం జగన్) దాదాపు రెండు గంటల పాటు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించిన సీఎం జగన్.. కైలాసగిరికి చేరుకొని పలు అభివృద్ధి కార్యాక్రమాలను ప్రారంభించారు. ఒకేసారి ఏకంగా రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కైలాసగిరిలో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కైలాసగిరిపై రూ.37 కోట్లతో నిర్మించనున్న ప్లానెటోరియానికి శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి బయలుదేరి నేరుగా వైఎస్సార్ సెంట్రల్ పార్క్కు వెళ్లి జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆర్కే బీచ్కు చేరుకుని విశాఖ ఉత్సవ్ను ప్రారంభిచారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ కమిటీ నుంచి జగన్కు వారు సన్మానం చేశారు. అనంతరం సాయంత్రం 7.40 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. -
విశాఖలో సీఎం వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతం..
-
విశాఖ ఉత్సవ్ను ప్రారంభించిన సీఎం జగన్
-
విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
-
విశాఖ ఉత్సవ్ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసేలా రెండు రోజుల పాటు ఆర్కే బీచ్లో నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. సీఎం రాకతో సాగర తీరం జనసందోహంలా మారింది. థాంక్యూ సీఎం నినాదం హోరెత్తింది. వేదికపైకి వచ్చిన సీఎం జగన్కు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి శాలువా కప్పి సత్కారం చేశారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. లేజర్ స్పెషల్ షో ప్రదర్శించారు. స్థానికత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ‘మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ రోజు విశాఖ ఉత్సవాలను ఇప్పేడే ఇక్కడే ప్రారంభిస్తున్నాం’ అని సీఎం జగన్ అనగానే లేజర్ షో ద్వారా విశాఖ ఉత్సవ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ కమిటీ నుంచి జగన్కు వారు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమాని జనం భారి ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సుమ కనకాల యాంకర్గా వ్యవహరించనున్నారు. మొదటి రోజు శాస్త్రీయ నృత్యం, లేజర్ షో, పాప్ సింగర్ అనుదీప్ ప్రత్యక్ష కచేరీ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమాలు జరగనున్నాయి. రెండవ రోజు, 'త్రీరీ' లైవ్ బ్యాండ్, ఆర్చరీ షో, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కచేరీ, లేజర్ షో మరియు బాణసంచా తదితర ప్రోగ్రామ్లతో విశాఖ ఉత్సవ్ కార్యక్రమం ఘనంగా ముగియనుంది. -
వీఎంఆర్డీఏ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నంపై ఆది నుంచీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి .. రాజధాని ప్రతిపాదన తర్వాత విశ్వ నగరాన్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి ఏకంగా రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. శనివారం విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ర్యాలీగా నేరుగా కైలాసగిరికి వెళ్లిన సీఎం అక్కడ వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కైలాసగిరిపై రూ.37 కోట్లతో నిర్మించనున్న ప్లానెటోరియానికి శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి బయలుదేరి నేరుగా వైఎస్సార్ సెంట్రల్ పార్క్కు వెళ్లి జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మీ, గుడివాడ అమర్నాథ్ రెడ్డి, అదీప్ రాజ్, విశాఖ ఎంపీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్చంద్, పీఎన్ఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో సీఎం జగన్కు ఘనస్వాగతం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) విశాఖలో సీఎం జగన్కు ఘనస్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో ఘన స్వాగతం లభించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్కు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం జగన్కు దారిపొడవునా కృతజ్ఞత పూర్వక స్వాగతం లభించింది. సీఎం కాన్యాయ్పై పూల వర్షం కురిపించారు. బెలూన్లను గాల్లోకి విసిరి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి రోడ్డుపై నిల్చోని తమ అభిమాన నేత జగనన్న కోసం ఎదురు చూశారు. ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. ‘జై జగన్.. జయహో జగనన్న’ అనే నినాదాలతో విశాఖపట్నం మార్మోగింది. కారులో ఉన్న సీఎం జగన్లో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. కైలాసగిరి నుంచి సెంట్రల్పార్క్కు, సెంట్రల్ పార్క్ నుంచి ఆర్కేబీచ్కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో సీఎంకు థాంక్స్ చెప్పారు. కాన్వాయ్ వాహనంలో ముఖ్యమంత్రి ఎడమవైపున ఉంటారు. దీంతో రోడ్డుకు ఒకవైపున మాత్రమే నిలబడి ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధానిగా ప్రతిపాదించిన కొద్ది రోజుల్లోనే విశాఖ అభివృద్ధికి బీజం వేస్తూ ఏకంగా రూ.1285.32 కోట్ల పనులు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకోనున్నాయి. -
నేడు విశాఖకు సీఎం జగన్ పర్యటన
-
నేడు విశాఖకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో రూ.905.50 కోట్లు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పరిధిలో రూ.379.82 కోట్ల మేర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖ ఉత్సవ్ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ కేపిటల్)గా విశాఖ నగరం కావొచ్చంటూ సీఎం ఇటీవల అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యలు చేసిన అనంతరం తొలిసారిగా నగరానికి వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించనున్నారు. సీఎం పర్యటన సాగేదిలా.. సీఎం వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 3.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి 3.50 గంటలకు కైలాసగిరి వెళ్తారు. వీఎంఆర్డీఏ తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక అక్కడినుంచి బయల్దేరి డాక్టర్ వైఎస్సార్ సెంట్రల్ పార్కుకు చేరుకుంటారు. అక్కడ జీవీఎంసీ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను ప్రారంభిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5.30 గంటలకు ఆర్కే బీచ్కు చేరుకుని విశాఖ ఉత్సవ్ను ప్రారంభిస్తారు. -
మీ రుణం తీర్చుకుంటున్నా..
సాక్షి ప్రతినిధి కడప: ‘నాన్నను మీరు అమితంగా ప్రేమించారు.. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనుక మేమంతా ఉన్నామని కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డగా నన్ను దీవించారు.. ఆశీర్వదించారు. ఇవాళ మీ బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున మీ రుణం తీర్చుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు బుధవారం ఉదయం ఆయన పులివెందుల ధ్యాన్చంద్ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున హాజరైన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పలు గ్రామాల్లో కొత్త చెరువుల తవ్వకం.. ‘‘గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు సర్వే చేశారు. రాబోయే రోజుల్లో ఈ డ్యామ్కు శంకుస్థాపన చేస్తాం. దీంతో జిల్లాలో కరువు పరిస్థితిని అధిగమిస్తాం. ముద్దనూరు – కొడికొండ చెక్పోస్టు (పులివెందుల–బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తాం. పెండింగ్లో ఉన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), లింగాల బ్రాంచ్ కెనాల్, గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో చెరువులు లేని గ్రామాల్లో కొత్త చెరువులు తవ్వుతాం. సర్వే చేయించి.. ఆ చెరువులకు దగ్గరలో ఉన్న కాలువలతో అనుసంధానం చేసి పూర్తిగా నింపే కార్యక్రమం చేస్తాం. ఆ చెరువులకు మైక్రో ఇరిగేషన్తో లింక్ చేసి ఆయకట్టుకు నీరందిస్తాం. మొత్తం పీబీసీ ఆయకట్టును మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి డీపీఆర్లు సిద్ధమవుతున్నాయి. రాబోయే పర్యటనల్లో వాటికి శంకుస్థాపనలు చేస్తాను. ఇవాళ 24 పనులకు (జాబితా చదివారు) శంకుస్థాపన చేస్తున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎంలు ఎస్బీ అంజద్బాష, ఆళ్ల నాని, మంత్రులు శంకర నారాయణ, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ మేయర్, కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. సీఎం శంకుస్థాపన చేసిన పనుల వివరాలు.. ►పులివెందులలో రూ.347 కోట్లతో వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు. ►గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా వేముల, వేంపల్లె మండలాల్లోని 15 వేల ఎకరాల స్థిరీకరణ. రూ.58 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కొత్తగా అలవలపాడు, పెండ్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి) నుంచి నీళ్లందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివర ఉన్న వి.కొత్తపల్లె, గిడ్డంగివారిపల్లె, టి.వెలమవారిపల్లె, ముచ్చుకోన చెరువులకు నీరందుతుంది. (తర్వాత ఈ నీళ్లు పాపాగ్నిలో కలుస్తాయి) తద్వారా నందిపల్లి, ఉప్పాలపల్లె, ముసల్రెడ్డిపల్లె గ్రామాలకు సైతం ప్రయోజనం చేకూరుతుంది. ►చిత్రావతి నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపి, వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వల్ల ప్రభావితమయ్యే ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం. రూ.350 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కోమన్నూతల, ఎగువపల్లి, మురారిచింతల, అంబకపల్లె, ఎర్రబల్లి చెరువు, మోటూన్నూతలపల్లె వంక, తదితర గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. గిడ్డంగివారిపల్లెలో 1.1 టీఎంసీ రిజర్వాయర్ నిర్మించి యూసీఐఎల్ పల్లెలకు నీటి సరఫరా చేయొచ్చు. ►పులివెందులలో రూ.100 కోట్లతో 55.36 కిలోమీటర్లు భూగర్బ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందులలో రూ. 65 కోట్లతో 142.56 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం పైపులైన్ నిర్మాణం. ►వేంపల్లె గ్రామ పంచాయతీలో రూ.63 కోట్లతో 85.50 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.114 కోట్ల పాడా నిధులతో సీసీ రోడ్లు, పులివెందుల పట్టణ సుందరీకరణ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, పీబీసీ, సీబీఆర్ పరిధిలో వివిధ చెరువులకు సాగునీటి సరఫరా, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. దీంతోపాటు పీబీసీ నుంచి దొండ్లవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువు నుంచి వనం బావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయనిచెరువు నుంచి బత్తెనగారి చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల బ్రాంచ్ కెనాల్ కింద రామట్లపల్లె చెరువు, గుణకనపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కెనాల్ కింద సోత్రియం ఎత్తిపోతల పథకం నుంచి నల్లపురెడ్డిపల్లె, కమ్మాయిగారిపల్లె కుంటకు నీళ్లందిస్తారు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.13.21 కోట్లతో ఏడు మార్కెట్ గిడ్డంగులతోపాటు పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల కల్పన ►పులివెందులలో హార్టికల్చర్ పంటల కోసం రూ.13 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రీకూలర్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు. ►నల్లచెరువుపల్లె గ్రామంలో రూ.27 కోట్లతో 132 కేవీ విద్యుత్ ఉప కేంద్రం ద్వారా 14 గ్రామాలకు లబ్ధి కలిగేలా పనులు. ►రూ.10 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం.. 10 గ్రామాల్లోని 2,100 వ్యవసాయ, 10,200 గృహ విద్యుత్ సర్వీసులకు లబ్ధి. ►రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.19.60 కోట్లతో కడప – పులివెందుల రోడ్డులోని వేంపల్లె పట్టణం నుంచి నూలివీడు, పందికుంట, కోళ్లకుంట రోడ్డు పనులు. ►రూ.11.52 కోట్లతో పులివెందులలో ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి. ►రూ.9.30 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకు వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విస్తరణ. ►రూ.17.50 కోట్లతో పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటు. తద్వారా 14 రకాల స్పోర్ట్స్కు అన్ని రకాల వసతులతో శిక్షణ. ►రూ.20 కోట్లతో ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.16.85 కోట్లతో 51 దేవాలయాల పునరుద్ధరణ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 18 కొత్త దేవాలయాల నిర్మాణం. ►పులివెందులలో రూ.10 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (మినీ సచివాలయం) ఏర్పాటు. ►రూ.11.20 కోట్లతో నియోజకవర్గంలో 32 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం. ►రూ.4.50 కోట్లతో వేంపల్లెలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణం. ►రూ.20 కోట్లతో వేంపల్లెలో కొత్తగా డిగ్రీ కళాశాల నిర్మాణం. ►పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రూ.20 కోట్లతో లెక్చర్ కాంప్లెక్స్, నైపుణాభివృద్ది కేంద్రం ఏర్పాటు. ►రూ.4 కోట్లతో వేంపల్లెలో బీసీ బాలురు, బాలికల వసతి గృహాల నిర్మాణం. ►పులివెందులలో రూ.3.64 కోట్లతో మోడల్ పోలీసుస్టేషన్ నిర్మాణం. ►పులివెందులకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నాం. నాన్నగారి హయాంలో నిర్మించిన.. ప్రస్తుతం దైన్యస్థితిలో ఉన్న ఐజీ కార్ల్ భవనాల్లో ఈ కళాశాలలను ఏర్పాటు చేస్తాం. త్వరలో వీటికి పునాది రాయి వేస్తాం. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లిస్తాం. దేవుడి ఆశీర్వాదంతో మరిన్ని గొప్ప పనులు చేసేలా దీవించాలని పేరుపేరునా ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. – సీఎం వైఎస్ జగన్ -
మహిళల అభివృద్ధికి మైక్రో క్రెడిట్ ప్లాన్
సాక్షి, సంగారెడ్డి: మహిళల అభివృద్ధి కోసం ‘మైక్రో క్రెడిట్ ప్లాన్’అమలు చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో శనివారం ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే దే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని చెప్పారు. మహిళలకు రుణాలివ్వడానికి మైక్రో క్రెడిట్ ప్లాన్ ను అమలు చేస్తామని తెలిపారు. వ్యాపారాలు చేసుకోవడానికి ఈ ప్లాన్ ద్వారా విరివిగా రుణాలివ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా, కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. గతంలో వీరికిచ్చే ప్రోత్సాహకం రూ.50 వేలు ఉండగా, ప్రస్తుతం దానిని రూ.లక్షకు పెంచామని తెలిపారు. వీరికి కల్యాణలక్ష్మి సైతం వర్తిస్తుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీలు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళితే వారికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం 35 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 500 పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
జీఎస్టీ పరిహారం..ఎన్నాళ్లీ జాప్యం?
సాక్షి, అమరావతి: జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్) పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. ఇప్పటికే ఆర్థిక మందగమనం వల్ల ఆదాయాలు తగ్గి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం చర్య ఆందోళన కలిగిస్తోంది. జీఎస్టీ పరిహారంగా ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ మధ్యకాలంలో రాష్ట్రానికి రూ.1,966.33 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 529 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.1,437.33 కోట్ల పరిహారం కేంద్రం నుంచి రావాలి. జీఎస్టీ వసూళ్లు భారీగా పడిపోవడంతో పరిహారం సకాలంలో చెల్లించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయం తగ్గితే కేంద్రం చెల్లించాల్సిందే జీఎస్టీ అమలు చేసినప్పుడు రాష్ట్రాల ఆదాయం తగ్గితే దాన్ని పరిహారం రూపంలో చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇందుకు 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని ఆధారంగా తీసుకున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయం కంటే 14 శాతం వృద్ధి లేకపోతే.. ఎంత మేర తగ్గితే ఆ మొత్తాన్ని పరిహారంగా కేంద్రం చెల్లిస్తుంది. జీఎస్టీ అమలు సంవత్సరంలో మన రాష్ట్రానికి 2017–18 సంవత్సరానికి కనీస ఆదాయం లక్ష్యాన్ని నెలకు రూ.1,502.48 కోట్లుగా నిర్ధారించారు. ఇప్పుడు 2019–20 సంవత్సరానికి కనీస ఆదాయ మొత్తం నెలకు రూ.1,952.62 కోట్లకు చేరింది. దీని ప్రకారం ఈ ఏడాది మొదటి ఏడు నెలల కాలానికి రాష్ట్రానికి రూ.13,668.35 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.11,702.02 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈ ఏడు నెలలకు కేంద్రం రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా రూ.1,966.33 కోట్లు చెల్లించాలి. జాప్యంపై వివిధ రాష్ట్రాల ఆందోళన జీఎస్టీ పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యంపై పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఆర్థిక మందగమనంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఆ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వాపోయారు. జీఎస్టీ పరిహారంగా రాజస్థాన్కు రూ.4,400 కోట్లు, ఢిల్లీకి రూ.2,355 కోట్లు, పంజాబ్కు రూ.2,100 కోట్లు, కేరళకు రూ.1,600 కోట్లు, పశ్చిమ బెంగాల్కు రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది నెలాఖరులోగా చెల్లిస్తామన్నారు ఈ ఏడు నెలల కాలానికిగాను రూ.1,437.33 కోట్ల పరిహారం చెల్లింపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. నెలాఖరులోగా చెల్లిస్తామని కేంద్రం నుంచి హామీ వచ్చింది. ఇది కాకుండా డిసెంబర్ నాటికి మరో రూ.500 కోట్లు పరిహారం కోరాల్సి ఉంటుంది. - పీయూష్ కుమార్, రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ చీఫ్ కమిషనర్ -
బల్దియాకు బహుమానం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సేకరించినందుకు ప్రోత్సాహకంగా రూ.26 కోట్ల చెక్కును ప్రధాని మోదీ.. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్రెడ్డికి అందజేశారు. లక్నోలో శనివారం 2 రోజుల ‘ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేపింగ్’ సదస్సు ముగింపు సందర్భంగా అమృత్ పథకం కింద ఈ బహుమతిని, ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మేయర్, కమిషనర్.. ప్రధానికి స్వచ్ఛ నమ స్కారం అంటూ గౌరవిస్తూ ప్రత్యేకత చూపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మం త్రులు రాజ్నాథ్ సింగ్, హరిదీప్సింగ్, గవర్నర్ రాంలాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘సింగం చెరువు’ లబ్ధిదారుతో ప్రధాని భేటీ హైదరాబాద్లోని సింగం చెరువు తండా డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఇల్లు పొందిన గిరిజన మహిళ జ్యోతితో ప్రధాని సమావేశమయ్యారు. కూలి చేసుకునే తమకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఉచితంగా ఇచ్చిందని తెలిపింది. గుడిసెలో ఉన్నప్పుడు ఎండ, వానలకు ఇబ్బందులను ఎదుర్కొనేవారమని.. ఇప్పుడు తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పింది. సూచన పాటించారు.. బహుమతి పొందారు స్థానిక సంస్థలు.. ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు స్వయం సమృద్ధికి బాండ్ల జారీ ద్వారా నిధు లు సమీకరించుకోవాలని, దీనికి తెలంగాణ ప్రభు త్వం చొరవ చూపాలని మెట్రోరైలు ప్రారంభోత్స వానికి నగరానికి వచ్చిన ప్రధాని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు సూచించారు. దీంతో మంత్రి బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని జీహెచ్ఎంసీ ని ఆదేశించారు. నగరంలో చేపట్టనున్న ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెయ్యి కోట్లు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేసి సఫలమయ్యారు. పుణే తర్వాత జీహెచ్ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి. జీహెచ్ఎంసీలోని ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తులు, వనరులు తదితరమైన వాటిని పరిగణనలోకి తీసుకున్న పలు సంస్థలు వెయ్యి కోట్లకు పైగా నిధులిచ్చేందుకు ముంబై స్టాక్ ఎక్సే్ఛంజ్లో పోటీలు పడ్డాయి. తొలిదశలో ఎస్సార్డీపీ పనులకు రూ.200 కోట్లు సేకరించారు. సొంతంగా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకంగా బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తానికి వడ్డీని కేంద్రమే అందజేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. సుముఖత వ్యక్తం చేసిన కేంద్రం జీహెచ్ఎంసీని ఇందుకు ఎంపిక చేసింది. ప్రజోపయోగానికి రూ. 26 కోట్లు... జీహెచ్ఎంసీ బాండ్ల రూపంలో నిధులను సేకరించినందున కేంద్రం ప్రోత్సాహకంగా అందజేసిన రూ.26 కోట్లను వినూత్న కార్యక్రమాలకు ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు. దీంతో ప్రత్యేక ప్రజోపయోగ కార్యక్రమానికి ఈ నిధులు వినియోగించాలని, దీనికి ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు కమిషనర్ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
మీద్వారా అభివృద్ధి జరక్కపోవచ్చు
సాక్షి, అమరావతి: అన్ని నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నయి... కానీ అవి మీ ద్వారా జరక్కపోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడంలేదని పరోక్షంగా స్పష్టం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన 13 నిమిషాలపాటు వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమపై జరుగుతున్న కక్షసాధింపు, నిధుల విడుదల చేయకపోవడంపై గట్టిగా ప్రశ్నించడంతో సీఎం ఆచితూచి స్పందించారు. తాను రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నానని, నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. మీ నియోజకవర్గాల్లో మీరు అడిగినవి జరగకపోయినా, తమ వారి ద్వారా నిధులు పంపిస్తున్నానని తెలిపారు. ఓడిపోయిన వారికి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించినా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. నియోజకవర్గాలకు నిధులిచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నానని చెప్పారు. రేషన్ వ్యవస్థను గాడిన పెట్టామని అందరికీ సక్రమంగా సరుకులు అందిస్తున్నామని సీఎం చెప్పగా... రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని వైఎస్సార్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాంటివేం ఇప్పుడు జరగడంలేదని, కాంగ్రెస్ హయాంలోనే అవన్నీ జరగాయని సీఎం బుకాయించారు. తన నియోజకవర్గంలో తానే స్వయంగా బియ్యం లారీని పట్టించానని రామకృష్ణారెడ్డి చెప్పగా మారుమాట్లాడలేదు. రాష్ట్రమంతా అభివృద్ధి జరిగిపోతుందని సీఎం చెబుతున్నప్పుడు... మన సొంత గ్రామం చంద్రగిరిలో ఏం అభివృద్ధి జరిగిందో ఇద్దరం వెళ్లి చూద్దామని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నప్పుడు స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. ఎమ్మెల్యేలంతా తమకూ నిధులివ్వాలని కోరినా ఆయన మాట్లాడలేదు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలంతా కలిసి తమ సమస్యలను వినిపించినప్పుడు వారికివ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తరచూ పిలుపునిచ్చే ముఖ్యమంత్రి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు గొడవ చేస్తారేమోననే ఆందోళన అటు అధికారవర్గాల్లోనూ, పోలీసుల్లోనూ కనిపించింది. -
నిధులున్నా... నిర్లక్ష్యం!
విజయనగరం మున్సిపాలిటీ: మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న రూ. కోట్లది నిధులు ఖర్చు చేయటంలో పాలకవర్గాలు విఫలమవుతున్నాయి. 13వ ఆర్ధిక సంఘం పద్దు కింద 2010-11 సంవత్సరం నుంచి 2014-15 సంవత్సరం వరకు ఐదు విడతల్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి రూ. 23.47 కోట్లు మంజూరు చేయగా... అధికారిక లెక్కల ప్రకారం 2016 మార్చి నెలాఖరు నాటికి రూ. 8.67 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నిబంధనల మేరకు ఈ నిధులతో సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్నిర్వహణ లో భాగంగా ఔట్ ఫ్లో డ్రైన్స్తో పాటు ప్రధాన డ్రైన్ల నిర్మాణం, తాగు నీటి సరఫరాకు వినియోగించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి నిధుల వినియోగం గడువు ముగిసిపోగా... రూ14.80 కోట్లు వెనక్కిమళ్లిపోయే ప్రమాదం దాపురించింది. అయితే ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించడంవల్ల ఈ మొత్తాన్ని ఏడునెలల్లో ఖర్చుచేయాలి. నిధుల వినియోగంలో వెనుకబడ్డ విజయనగరం ప్రభుత్వం విడుదల చేసిన 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ విజయనగరం వెనకబడింది. ఈ పద్దు కింద రూ. 12 కోట్లు మంజూరు చేయగా.. కేవలం రూ. 3కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే వివిధ పద్దుల కింద మున్సిపల్ ఖజానాలో రూ. కోట్లాది నిధులు మూలుగుతుండగా... వాటిని ఖర్చు చేయటం ఎలాగో తెలీక సతమతమవుతున్న పాలకులు, అధికారులకు ఆర్ధిక సంఘం నిధులు వినియోగం కత్తిమీద సాములా మారింది. బొబ్బిలి మున్సిపాలిటీకి రూ2.75కోట్లు విడుదల చేయగా.. రూ. 1.67 కోట్లు ఖర్చు చేశారు. సాలూరు మున్సిపాలిటీకి రూ. 3.56 కోట్లు కేటాయించగా రూ. 1.80కోట్లు, పార్వతీపురం మున్సిపాలిటీకి రూ. 3.59 కోట్లు మంజూరు చేయగా... రూ. 2.39 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. అసలు నిధులు లేక అనేక చోట్ల పనులు నిలిచిపోతుంటే.. నిధులుండీ ఖర్చుచేయలేని చేతకాని తనంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గడువులోగా వినియోగిస్తాం: విజయనగరం కమిషనర్ మూలుగుతున్న నిధుల విషయమై విజయనగరం మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా... 13వ ఆర్థిక సంఘం నిధులు వినియోగానికి గడువు పొడిగిస్తూ ఉత్తర్వలు జారీ అయినట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో మిగిలి ఉన్న నిధులను వినియోగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నిర్దేశించిన గడువులోగా నిధులు వినియోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
ముఖ్య మంత్రి కార్యక్రమం రద్దు
నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వెంకటాచలం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. ఆలస్యం అవ్వడంతో.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. వెంకటాచలంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లి హ్యాండీక్యాప్డ్ కోసం ఏర్పాటు చేసిన నూతన భవన శంకుస్థాపన ముఖ్యమంత్రి చేయాల్సి ఉండగా.. ఆయన లేకపోవడంతో.. కేంద్ర మంత్రే ప్రారంభించారు. అనంతరం ఆయన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ శిక్షణ సంస్థకు శంకుస్థాపన చేశారు. -
విశాఖపై మమకారం
అభివృద్ధి కోసం తాపత్రయం ప్రగతికి అర్థం.. వైఎస్ హయాం సాక్షి, విశాఖపట్నం: అరకొరగా రేషన్ కార్డులు.. అదృష్టవంతులకే పింఛన్లు..ఏ కొందరికో ఇళ్లు..ఇదంతా 2004కు ముందు దుస్థితి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు వంటివి మంజూరయ్యాయి. ఆయన హయాంలో విశాఖపట్నం జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ దుర్మరణం చెంది ఆరేళ్లవుతున్న సందర్భంగా ఆయన హయాంలో విశాఖలో చేపట్టిన వివిధ పనులు, పథకాలపై ఈ కథనం.. వైఎస్ తన ఐదేళ్ల పదవీ కాలంలో జలయజ్ఞం పథకం కింద విశాఖ జిల్లాలో భారీ గా నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ రిజర్వాయర్ల ఆధునికీకరణ పనులకు రూ. 42 కోట్లు కేటాయించారు. తాండవ రిజర్వాయర్ ఆధునికీకరణకు రూ. 55 కోట్లు, తాండవ నదిపై మినీ ఆనకట్ట నిర్మాణానికి, రావణాపల్లి ప్రాజెక్టుకు రూ. 18 కోట్లు వెచ్చించారు. ఇలా వివిధ సాగునీటి ప్రాజెక్టులతో వేలాది ఎకరాల కు అదనపు ఆయకట్టు పెంచారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అత్యంత ప్రధానమైన ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. అంతేకాదు.. జిల్లాలో భారీగా గృహ నిర్మాణం చేపట్టారు. ఐదేళ్లలో మొత్తం 3,20,621 ఇళ్లు నిర్మించారు. పెద్దసంఖ్యలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత అభయహస్తం తదితర పింఛన్లు ఇచ్చారు. ఇలా మొత్తం 3,20,123 మందికి లబ్ది చేకూర్చారు. ఇందుకోసం ఏడాదికి మొత్తం రూ. 8.24 కోట్లు ఖర్చు చేశారు. ఇక నగరం విషయానికొస్తే.. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద విశాఖకు అధిక నిధులు వచ్చేలా కృషి చేశారు. ఈ పథకంలో విశాఖ నగరానికి రూ.2200 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో విలీన గ్రామాలను కలుపుతూ వేసిన బీఆర్టీఎస్ రోడ్లకు రూ.450 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.250 కోట్లు, 15 వేల జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లకు రూ.450 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.23 కోట్లతో ఎండాడ వద్ద మంచినీటి పథకం, విశాఖ నగర దాహార్తిని తీర్చే తాటిపూడి పైప్లైన్కు రూ.95 కోట్లు ఖర్చు చేశారు. మధురవాడ, రుషికొండ ఐటీ సెజ్ల ఏర్పాటుతో విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దారు. అలాగే 1130 పడకలు, 21 సూపర్స్పెషాలిటీ బ్లాకులతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక విమ్స్ ఆస్పత్రికి రూ. 250 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ వరకూ రూ.87 కోట్లు వెచ్చించి విశాఖలోనే తొలి ఫ్లైఓవర్ను నిర్మించారు. విశాఖ విమానాశ్రయం విస్తరణ, ఆధునీకరణకు రూ.100 కోట్లు, విమానాశ్రయం ముంపుబారిన పడకుండా కాలువ నిర్మాణానికి రూ.60 కోట్లు వెచ్చించారు. ప్రస్తుత పరిస్థితి.. : వై.ఎస్. మరణాంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం భారీగా కోత విధించింది. జలయజ్ఞం ప్రాజెక్టులపై క్షక్ష కట్టింది. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం అప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చేసి పక్కన పెట్టేసింది. విమ్స్ ఆస్పత్రి అతీగతీ లేకుండా అక్కరకు రాకుండా నిరుపయోగంగా ఉంది. పైగా 1130 పడకలను 250కి కుదించాలని చూస్తోంది. అర్హులైన లబ్దిదార్లు పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సర్కారు రకరకాల నిబంధనలతో సంక్షేమ పథకాలకు వీరిని దూరం చేస్తోంది. ఈ నేపథ్యంలో నాటి వైఎస్ హాయాంకు, నేటీ చంద్రబాబు పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వర్థంతి సందర్భంగా విశాఖ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
ప్రజల్లోకి మోదీ పథకాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధార్ధనాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. సీతమ్మధారలోని కేఎన్ఎస్ ఫంక్షన్ హాలులో శనివారం పార్టీ కమిటీల సమావేశం జరిగింది . ఈ సందర్భంగా మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరినీ పార్టీ క్రియాశీలక కార్యకర్తగా మలుచుకు నేందుకు నాయకులు కృషి చేయాలని సిద్ధార్ధనాథ్ కోరారు. - పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయండి - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్దార్ధనాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. సీతమ్మధారలోని కేఎన్ఎస్ ఫంక్షన్ హాలులో శనివారం జరిగిన పార్టీ కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కర్ని పార్టీ క్రియాశీలక కార్యకర్తగా మలుచుకు నేందుకు నాయకులు కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పథకాలను రక్షాబంధన్ రోజున ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం నిర్ణయించిందని..ఇప్పటికే తొమ్మిది సభ్యులతో ఒక కమిటీని కూడా నియమించిందన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం 11వేల మంది లబ్దిదారులకు ఈపథకాల ఫలాలను అందించేందుకు అసెంబ్లీ స్థాయిలోనూ తగిన ప్రణాళికలను రూపొందించాలన్నారు. ఈ కమిటీలను ఆగస్టు నెలాఖరు కల్లా మండల, జిల్లాస్థాయిల్లో ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడు గున ఉన్న లబ్దిదారులందరికి చేరవేయడం ద్వారా పార్టీని పటిష్ట పర్చు కోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ విశాఖలోనే కాదు..రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని.. ఇందుకు ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదే నిదర్శనమన్నారు. పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీచేసే స్థాయికి పార్టీ కేడర్ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ర్టమంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్,ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రులు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నగరాధ్యక్షుడు పివి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
దిశానిర్దేశం
- అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి - ఆరోపణలు తిప్పికొట్టండి - టీడీపీ విస్తృత సమావేశంలో పార్టీశ్రేణులకు చంద్రబాబు పిలుపు - క్రమశిక్షణపై నేతలకు క్లాస్ సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని శేషసాయి కల్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, పార్టీ ఎన్నికల కన్వీనర్ కళావెంకట్రావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితర నేతలు ప్రసంగించారు. గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీలు, అనుబంధ కమిటీల ఏర్పాటు, ప్రజాప్రతినిధులు, పార్టీ మధ్య సమన్వయం, సంస్థాగత కమిటీలకు శిక్షణ-కార్యాచరణ ప్రణాళిక, కార్యకర్తల సంక్షేమం, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ఏడు మిషన్లు - ఐదు గ్రిడ్లు - ఐదు క్యాంపెయిన్లు, సంక్షేమ కార్యక్రమాలు, పింఛన్లు, డ్వాక్రా రైతు రుణమాఫీ తదితర 15 అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా సెక్షన్-8 అమలుపై ప్రజల్లో చర్చ తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. కొంతమంది కావాలని బురద జల్లుతున్నారని, సమర్థవంతంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఇక నుంచి తాను విజయవాడలోనే ఎక్కువగా ఉంటానని, బస్సులోనే నిద్రపోతానని, ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తానని వివరించారు. నాయకులకు క్లాస్ ఉదయం 10.45 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం కాగా, సమావేశ మందిరంలో సగం కుర్చీలు ఖాళీగా కనిపించాయి. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు క్రమశిక్షణ నేర్చుకోవాలంటూ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. ఎంపీ కేశినేనికి అభినందనలు టాటా ట్రస్టు ద్వారా 264 గ్రామాల్లో సూక్ష్మ ప్రణాళిక తయారు చేయడం, రైతులకు లాభదాయకమైన వెదురు చెట్ల పెంపకంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చేపట్టడం అభినందనీయమని, మిగిలిన నేతలు అదే తరహాలో పనిచేయాలని సూచించారు. నిరాశగా వెనుదిరిగిన లంబాడీలు ఎ.కొండూరుకు చెందిన సుమారు 70 మంది లంబాడీలు ముఖ్యమంత్రిని కలిసేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నారు. తమ ఆధీనంలో ఉన్న అటవీ భూములకు పట్టాలు ఇప్పించాలని కోరేందుకు వచ్చారు. అయితే, వారిని కనీసం ప్రాంగణం లోపలకు కూడా రానీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో నిరాశతో వెనుదిరిగారు. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ నిరుద్యోగులు సీఎంను కలిసి తమకు ఉద్యోగాలు ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చారు. హెల్త్ కార్డుల పంపిణీ రాత్రి 9 గంటలకు సీఎం జర్నలిస్టులకు హెల్త్కార్డులు పంపిణీ చేశారు. వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలను ఇప్పించాలని జర్నలిస్టులు కోరగా, మీ మేనేజ్మెంట్ను కోరాలని సూచించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూరగాయల గజమాలతో చంద్రబాబును సత్కరించారు. -
‘స్మార్ట్’ అంతంతే
గ్రామాల దత్తతకు స్పందన కరువు అభివృద్ధి చేసే విషయంలో దూరం ఏలూరు :గ్రామాల అభివృద్ధిపై సర్కారు శీతకన్ను వేస్తోంది. ‘స్మార్ట్ విలేజ్’ పేరిట గ్రామాలను దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆచరణలో మాత్రం చతికిలపడుతోంది. గ్రామాల దత్తతకు ప్రవాస భారతీయులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాకపోవడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో మొత్తం 902 గ్రామాలున్నాయి. గడచిన నాలుగు నెలల్లో 425 గ్రామాలను దత్తత తీసుకోవడానికి ప్రవాస భారతీయులు, దాతలతోపాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకువచ్చాయి. అయితే, అధికారికంగా 355 గ్రామాలను మాత్రమే దత్తత ఇచ్చారు. వీటిలోనూ ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇదిలావుంటే, మిగిలిన 547 గ్రామాలను ఎవరికి దత్తత ఇవ్వాలో తెలియక అధికారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాకు చెందిన 700 మంది విదేశాల్లో స్థిరపడినట్టు గుర్తిం చారు. వారిలో 45 మంది మాత్రమే గ్రామాల దత్తతకు ముందుకు వచ్చినట్టు సమాచారం. వీరంతా ఆయా గ్రామాల్లో గతంనుంచీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నవారే. స్వగ్రామాల్లో ఎంతోకొంత అభివృద్ధి చేస్తున్న ప్రవాస భారతీయులు తాము చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించేందుకు ఆ గ్రామాలను దత్తత తీసుకున్నట్టు చెబుతున్నారు. కొత్తగా గ్రామాల దత్తతకు ఎవరూ ముం దుకు రావడం లేదు. పట్టణాల్లో స్మార్ట్ వార్డుల విషయానికి వస్తే నిడదవోలు మిన హా జిల్లాలో ఎక్కడా ఆశాజనకమైన పరిస్థితి లేదు. గ్రామాల దత్తతపై జిల్లా స్థాయిలో కలెక్టర్, రాజధాని స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడి యో కాన్ఫరెన్స్లు, సమీక్షలు నిర్వహించినా పురోగతి కనిపించడం లేదు. 20 అంశాల మాటేమిటి! గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. ఆర్థిక సంఘం నిధులే గ్రామాలను ఆదుకుంటున్నాయి. ఇందులో సగం విద్యుత్ బకాయిలకు పోతోంది. మిగిలిన సగం నిధులు మంచినీరు, పారిశుధ్య పనులకు సరిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన 20 అంశాల పురోగతి గాలిలో దీపంలా ఉంది. ప్రభుత్వం నిర్ధేశించిన 20 అంశాల్లో గృహ నిర్మాణం, శిశు సంక్షేమం, పిల్లలకు పౌష్టికాహారం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నిర్వహణ, పారిశుధ్యం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల అభివృద్ధి, అక్షరాస్యత శాతం పెంపు వంటివి ఆచరణకు నోచుకోవడం లేదు. -
పొత్తు.. ఇక చిత్తు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : టీడీపీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జిల్లాలో రోజురోజుకీ టీడీపీ-బీజేపీల మధ్య దూరం పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శల వేడిని పెంచాలని జిల్లా బీజేపీ నేతలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఎంతో సహాయం చేస్తోందని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ టీడీపీ చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని తమ నేతలకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలపై బీజేపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శల వర్షం ప్రారంభించారు. మొత్తం మీద జిల్లాలో టీడీపీ- బీజేపీల మధ్య రోజురోజుకీ అంతరం పెరిగిపోతోంది. ఈ వ్యవహారం కాస్తా చివరికి చినికి చినికి గాలివానలా మారి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తుకు బ్రేకులు పడే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న దూరం...! వాస్తవానికి ఎన్నికల సమయంలో బీజేపీకి జిల్లాలో పెద్దగా కేడర్ బలం లేదు. కేవలం అక్కడక్కడా కార్యక్రమాలు చేయడం మినహా పార్టీ నిర్మాణం బలంగా లేని పరిస్థితి. అయితే, ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి రావడంతో జిల్లాలో పలువురు నేతలు బీజేపీ వైపు చూడడం ప్రారంభించారు. ఇందులో భాగంగా సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి చేరారు. ఆయన చేరికతో జిల్లాలో బీజేపీ క్రమంగా బలపడటం ప్రారంభించింది. అయితే, ఆయనతో పాటు బీజేపీలో చేరుతున్న పలువురు మండలస్థాయి, గ్రామస్థాయి నేతలకు టీడీపీతో మొదటి నుంచీ అంతగా సఖ్యత లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని అటు రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయి నేతలు పరోక్షంగా విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. దీంతో టీడీపీ వైఖరి బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. టీడీపీ నేతల వైఖరిపై జిల్లాలో కిందిస్థాయి కార్యకర్తల మనోభావాలను రాష్ట్ర నేతలకు జిల్లాస్థాయి బీజేపీ నేతలు వివరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జిల్లా బీజేపీ నేతలకు రాష్ట్ర బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఇందులో భాగంగానే క్రమంగా టీడీపీపై బీజేపీ నేతల విమర్శల బాణాలు ఎక్కుపెట్టడం ప్రారంభమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదలైన విమర్శల వేడి...! రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో టీడీపీపై బీజేపీ నేతలు విమర్శల బాణాలను ఎక్కుపెట్టడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా పాణ్యంలో జరిగిన సమావేశంలో బీజేపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ‘టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. తమ జోలికి వస్తే ఖబడ్డార్’ అని పాణ్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తీవ్రస్థాయిలో ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ పథకంలో క్రెడిట్ అంతా కేంద్రానిదేనని ఆయన తేల్చి చెప్పారు. కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ.. తమ పార్టీపైనే నిందలు వేస్తే సహించేది లేదని ఆ పార్టీ కిందిస్థాయి నేతలు కూడా మండిపడుతున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం చివరకు పొత్తు విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. మునిసిపోల్స్లో పొత్తు చిత్తేనా? కర్నూలు కార్పొరేషన్కు ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. మే నెలలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ-బీజేపీల మధ్య ముదురుతున్న పోరు చివరకు కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తు అయ్యేందుకు దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ముస్లింలు, క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నందున.. బీజేపీతో పొత్తు నష్టం చేకూరుస్తుందనేది జిల్లా టీడీపీ నేతల అంతర్గత అభిప్రాయంగా ఉంది. అందువల్లే కార్పొరేషన్ ఎన్నికల వరకు బీజేపీపై పైపై విమర్శలు కురిపిస్తున్నారన్న అభిప్రాయమూ ఉంది. మొత్తం మీద రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కష్టమేననేది ఇరు పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
అది బూర్జ..తమ్ముళ్లదే దర్జా!
అక్కడి ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీపీ ఉన్నారు. పాలకవర్గం ఉంది. అది తీసుకునే నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కానీ వీరెవరి మాటలు చెల్లుబాటు కావడంలేదు. స్థానిక ప్రజలు తిరస్కరించిన టీడీపీ నేతలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న దర్పంతో ఇక్కడా తమ మాటే వేదం కావాలని పంతం పట్టారు. అధికార యంత్రాంగంపై స్వారీ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతూ తమ మాట నెగ్గించుకుంటున్నారు. ఫలితం..మండల పరిషత్ పాలన గాడి తప్పింది. ఏ పని చేయాలన్నా యంత్రాంగం భయపడుతోంది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు సెలవులపై వెళ్లిపోతున్నారు. బూర్జ మండల కార్యాలయంలో నెలకొన్న ఈ దుస్థితిపై ప్రజలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బూర్జ: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పక్షపాతం, అనుచిత రాజకీయ జోక్యం పెరిగిపోయాయి. ఈ పరిస్థితికి భయపడి కార్యాలయంలో అధికారులు ఉండటం లేదు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రజలు నిరసనబాట పట్టారు. మండలపరిషత్ కార్యాలయం వద్ద ధర్నా కూడా చేశారు. అధికార టీడీపీ ఆగడాలకు ఈ కార్యాలయం వేదికగా మారడమే ఈ దుస్థితి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో బూర్జ మండలంలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలతోపాటు జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుంది. ఎంపీటీసీల బలంలో ఎంపీపీ పదవి కూడా ఆ పార్టీకే దక్కింది. మండలంలో అధికారం పోయినా రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం నేతలు ఎన్నికైన ప్రజాప్రతినిధులను కాదని.. తమ పెత్తనమే సాగేలా అధికారులపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. మండల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తాము చెప్పినట్లే అన్నీ జరగాలని పట్టుబట్టి మరీ చేయించుకుంటున్నారు. తాము చెప్పినట్లే చేయాలని.. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికార యంత్రాంగం మెడపై కత్తి పెడుతున్నారు. తమ చేష్టలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పేరును వాడుకుంటున్నారు. దీంతో మండల పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు కావడంలేదు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరుగుతోందని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దినదిన గండంగా ఇక్కడ ఉద్యోగం చేయలేమని భావిస్తూ సెలవులు పెట్టేస్తున్నారు. ఇప్పటికే ఎంపీడీవో సీహెచ్ లక్ష్మీబాయి, జూనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, టైపిస్టు కిశోర్ సెలవులు పెట్టేశారు. ఇన్చార్జి ఎంపీడీవో ఈవోఆర్డీ సుదర్శన్ కూడా సెలవు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా మద్యానికి బానిస అయిన సీనియర్ అసిస్టెంట్ ఎప్పుడు విధుల్లో ఉంటారో ఎవరికీ తెలియదు. సూపరింటెండెంట్ సత్యం ఒక్కరే పనులన్నీ చక్కబెట్టాల్సి వస్తోంది. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు కార్యాలయానికి వచ్చి నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఇక పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కార్యదర్శుల ప్రమేయం లేకుండానే పింఛన్ల మంజూరు, తొలగింపు వంటివన్నీ టీడీపీ కార్యకర్తలే చేసేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అర్హులైన లబ్ధిదారులు నిలదీస్తూ, శాపనార్థాలు పెడుతున్నా వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇటీవల ఇక్కడికి వచ్చిన జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రవీంద్రకు ఇదే విషయమై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ సమావేశానికి హాజరైన ప్రభుత్వ విప్కు జెడ్పీటీసీ ఆనెపు రామక్రిష్ణ జరుగుతున్న తంతును వివరించారు. మీ పేరు వాడుకుంటూ టీడీపీ కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని సభలో అందరి సమక్షంలోనే ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదు. అల్లకల్లోలం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ మండల పరిషత్ కార్యాలయాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీనైన నాకు ఎటువంటి విలువ, గౌరవం ఇవ్వటం లేదు. ఇక ప్రజలకు ఏం న్యాయం చేయగలం. -బొడ్డేపల్లి సూర్యారావు, ఎంపీపీ పనులేవీ జరగడం లేదు మండల పరిషత్ కార్యాలయం చుట్టూ గత వారం రోజులుగా తిరుగుతున్నా మా పనులు జరగటంలేదు. ఎప్పుడొచ్చినా ఎంపీడీవో సెలవులో ఉన్నారు, సిబ్బంది సెలవులో ఉన్నారని చెబుతున్నారు. ఇలా అయితే మా పరిస్థితి ఏమిటి. -కొరగంజి శ్రీనివాసరావు, రైతు -
‘ఎమ్మెల్యేనైన నాకు చెప్పరా?’
ఆలమూరు :‘‘నియోజకవర్గంలో ఏం జరుగుతుంతో ముందుగా నాకు తెలియాలి... అటువంటిది నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అభివృద్ధి కార్యక్రమాల షెడ్యూల్ను ఎలా రూపొం దించారు. మీకసలు ప్రొటోకాల్ పద్ధతులు తెలుసా? తెలియకపోతే నేర్చుకోండి’’ అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఒకానొక దశలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమ షెడ్యూల్ను నిర్ణయించిన తర్వాత తనను సంప్రదించడాన్ని ఆయన తప్పుబట్టారు. వివరాల్లోకి వెళితే... నియోజకవర్గంలోని కొత్తపేట, ఆలమూరు మండలాల్లో మంగళవారం జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పలు గ్రామాల్లో సుమారు రూ.రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఉన్నత పాఠశాలల్లోని అదనపు భవనాలు, గ్రంథాలయాలకు శంకుస్థాపనలు చేశారు. అయితే ఈ కార్యక్రమ షెడ్యూల్ను రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీ సీ) అధికారులు ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఖరారు చేశారు. దీంతో ఆయన హైదరాబాద్ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని హడావుడిగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రొటోకాల్ నిబంధనలపై అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎవరిని అడిగి ఈ కార్యక్రమాల షెడ్యూల్ను రూపొందించారని ఏపీడబ్ల్యూఐడీసీ డీఈ ఎం.మంజూష, ఏఈ జి.నాగేంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అంతిమంగా నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. జెడ్పీ చైర్మన్ రాంబాబు సమక్షంలో ఈ ప్రొటోకాల్ రగడ జరిగినా ఆయన స్పందించకపోవడం గమన్హారం. వైఎస్సార్సీపీ నాయకురాలు కొల్లి నిర్మలకుమారి, మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు, నెక్కంటి వెంకట్రాయుడు, చల్లా ప్రభాకరరావు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ నిర్మిద్దాం
ఉప్పునుంతల/అమ్రాబాద్: రాష్ట్ర ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. రాష్టానికి దక్కాల్సిన 54 శాతం విద్యుత్వాటా అందకపోవడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యను అధిగమిస్తామన్నారు. ఆదివారం మండలంలోని ఉప్పునుంతల వె ల్టూరు గ్రామరైతు మధన్మోహన్రెడ్డి పొలంలో ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ.. ఆంధ్రా పా లకులు విభజన ఒప్పందాలను ఉల్లఘించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీచేశారని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే బ్యాంకులకు రూ.4250 కోట్లు బ్యాంకులకు చెల్లించి మిగతా డబ్బులకు హామీఇచ్చినట్లు తెలిపారు. ఐదేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోరుునా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 480 కోట్ల పంట నష్టపరిహారం అందించామన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు సెరికల్చర్, హార్టికల్చర్, గ్రీన్కల్చర్కు 75 శాతం సబ్సిడీని అందిస్తున్నామని, ఇందుకోసం బడ్జెట్లో రూ. 200కోట్లు కేటాయించినట్లు చెప్పారు. సోలార్ విద్యుదుత్పత్తిని ప్రోత్సహించి మొదటగా 20వేల పంపుసెట్లు సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో 45వేల చెరువులుండగా, ఈ ఏడాది 9వేల గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూ. రెండువేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించి రైతులు ఆర్థికాభివృద్ధ్ది సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మె ల్యే గువ్వల బాల్రాజు, జేడీఏ భగవత్ స్వరూప్, ఏడీఏ సరళకుమారి, ఆర్డీఓ వీరారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్రావుఆర్యా తదితరులు పాల్గొన్నారు. మిగులు విద్యుత్ను సాధిస్తాం 60 ఏళ్ల ఆకాంక్ష.. 14ఏళ్ల పోరాటం.. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ కల సకారమైందని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం రాజయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమ్రాబాద్కు వచ్చిన ఆయన ఇప్పలపల్లి గ్రామంలో రూ.రెండుకోట్ల వ్యయంతో నూతనంగా నిర్మంచిన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలన అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ను సాధిస్తామన్నారు. దీంతో రైతాంగానికి ఏడు గంటల విద్యుత్ను తప్పకుండా ఇచ్చి తీరుతామన్నారు. బడు గు, బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులందరికీ ఆసరా, కల్యాణలక్ష్మి పథకాలను వర్తింపజేస్తామని, ఆహార భద్రతాకార్డులు అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు, ఇతర ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి సహకరించండి
అపాచీ జీఎంను కోరిన ఎమ్మెల్యే కిలివేటి తడ: సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మాంబట్టులోని పరిశ్రమల ప్రతినిధులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. శనివారం ఆయన మాంబట్టులోని అపాచీ కంపెనీ జీఎం ఆండ్రూ ఫిలిప్చెన్తో భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అధ్వాన స్థితిలో ఉన్న మార్చురీ గది స్థానంలో నూతన భవనం చేపట్టాలన్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు సమకూర్చాలని కోరారు. రోగుల కోసం ఆస్పత్రిలో కొన్ని పడకలను కూడా సమకూర్చాలని ప్రతిపాదించారు. అపాచీ జీఎం స్పందిస్తూ ఈ ప్రతిపాదనలను తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రయత్నించాలని సూచించారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఆస్పత్రి నిర్మాణానికి నిధులు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని కిలివేటి చెప్పారు. ఇరకందీవి వాసుల కోసం కలెక్టర్ శ్రీకాంత్ ఇటీవల మంజూరు చేసిన రెండు బోట్లకు మోటార్లు ఏర్పాటు కోసం రూ.1.25 లక్షలకు ప్రతిపాదనలు పంపాలని అపాచీ కంపెనీ ప్రతినిధులు సూచించారన్నారు. అనపగుంట మార్గంలోని కస్తూరిబా విద్యాలయంలో 25 లైట్లు, 25 ఫ్యాన్లు పనిచేసేలా ఇన్వర్టర్ ఏర్పాటు చేసేందుకు కూడా అపాచీ ముందుకొచ్చిందని ఎమ్మెల్యే కిలివేటి వెల్లడించారు. ఇన్వర్టర్కు సోలార్ అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్యానళ్లను అందించేందుకు తడకు చెందిన ఓ దాత ముందుకొచ్చారని వివరించారు. ఈ సమావేశంలో ఆపాచీ పీఆర్ఓ సుధీర్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, నాయకులు గండవరం సురేష్రెడ్డి, తిరుమూరు రవిరెడ్డి, కామిరెడ్డి నందారెడ్డి, కోట నరేంద్రరెడ్డి, గండవరం జగదీష్రెడ్డి, సీహెచ్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
సభ సజావుగా సాగేలా సహకరించాలి
టీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి గద్వాల: అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలు, అభివృద్ధి చర్చలకు వేదికయ్యేలా సభ్యులందరూ సహకరించాలని స్పీకర్ మధుసూదనాచారి కోరారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగుతాయని చెప్పారు. ఈ సమావేశాల్లో సభ్యులందరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలే ప్రధానంగా చర్చించి, గతంలో జరిగిన సమావేశాలకు భిన్నంగా ప్రజలు మెచ్చుకునేలా సభ్యులందరూ సహరించాలని ఆయన సూచించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సహకరిస్తే సమయం వృథా కాకుండా అన్ని అంశాలు చర్చించే అవకాశం వస్తుందన్నారు. ఎన్నిరోజుల పాటు సమావేశాలు జరిగాయన్నది కాదని, ఎన్నిగంటల పాటు సమావేశాలు ఫలవంతంగా సాగాయన్నది ముఖ్యమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమకు న్యాయం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజాభిప్రాయాలకు అసెంబ్లీ వేదిక య్యేలా సహకరించాలని ఆయన కోరారు. మీడియా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగదని, ఇందులో అపోహలు పెట్టుకోవద్దని స్పీకర్ స్పష్టం చేశారు. -
అభివృద్ధికే పట్టం కట్టండి
సంగారెడ్డి క్రైం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు.. కేంద్రానికి రెండు కళ్లు లాంటివని, రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర ప్రసార, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాష్జవదేకర్ అన్నారు. గతంలో అటల్ బీహారీ వాజ్పాయ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. సంగారెడ్డిలోని గంజ్మైదాన్లో గురువారం జరిగిన బీజేపీ-టీడీపీ ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నిక ధనం, జన బలానికి మధ్య జరుగుతున్నాయని, జన బలం ఉన్న బీజేపీకే ప్రజలు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి జన్ధన్ ద్వారా బ్యాంకు ఖాతాలు అందజేస్తున్నారని చెప్పారు. ఈ ఖాతా ద్వారా అనేక సౌకర్యాలు పొందే వీలుందన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే జగ్గారెడ్డిని ఎంపిగా గెలిపిస్తే మరిన్ని నిధులు కేంద్రం నుంచి రావడానికి అవకాశం ఉందన్నారు. కాగా ప్రకాష్ జవదేకర్ హిందీలో ప్రసంగించగా బీజేపీ శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ తెలుగులో అనువదించారు. జిల్లాలో రైల్వేలైన్ల మంజూరుకు కృషి: కేంద్ర మంత్రి సదానందగౌడ జిల్లాలో పెండింగ్లో ఉన్న రైల్వే లైన్ పనులన్నీ మంజూరు చేయడానికి కృషి చేస్తానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. కాంగ్రెస్ పదేళ్ల అవినీతిని నరేంద్ర మోడీ కేవలం వంద రోజుల పాలనలో కడిగి పారేశారని అన్నారు. కాంగ్రెస్పాలనంతా అవినీతిమయంగా, లోపభూయిష్టంగా కొనసాగిందని విమర్శించారు. అన్ని దేశాలు మోడీవైపే చూస్తున్నాయని పేర్కొన్నారు. జగ్గారెడ్డిని ఎంపీగా పార్లమెంట్కు పంపితే జిల్లాలో మిగిలిపోయిన రైల్వే లైన్ పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా సదానందగౌడ ఆంగ్లంలో ప్రసంగించగా ఎమ్మెల్సీ దిలీప్కుమార్ తెలుగులో అనువదించారు. బీజేపీ రాష్ర్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల బంగారు తెలంగాణ కోసం ఏ విధంగా అడుగులు వేశారో ప్రకటించాలని కేసీఆర్ను ప్రశ్నించారు. ప్రజల కాళ్లకు ముళ్లు దిగితే నోటితో తీస్తానన్న కేసిఆర్ రైతుల ఆత్మహత్యలపై, మాసాయిపేట ప్రమాదంలో చిన్నారులు మృతి చెందిన ఘటనలో కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు స్వేచ్ఛగా పనిచేయడం లేదన్నారు. టీఆర్ఎస్ది చేతగాని, అసమర్థ పాలనగా అభివర్ణించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ను ఖాసిం చంద్రశేఖర్ రిజ్విగా ఉదహరించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైల్ తెస్తానని హామీ ఇచ్చారు. కేసిఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. టీడీపీ శాసన సభా పక్ష నేత రేవంత్రెడ్డి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో బీజేపీ, టీడీపీ నాయకులు ఆచారి, సత్యనారాయణ, బుచ్చిరెడ్డి, కె.జగన్, విష్ణువర్దన్రెడ్డి, విష్ణువర్దన్, తీగల కృష్ణారెడ్డి, శశికళా యాదవ్రెడ్డి, మాణిక్యం, బీరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
దశ తిరుగుతుందా..!
నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రకటన వెలువడింది. జిల్లా పరిస్థితి ఏమిటని ఆత్రుతతో ఎదురుచూసిన ప్రజల్లో చంద్రబాబు ఆశలు రేకెత్తించారు. అంతలోనే అనుమానాలూ పుట్టించా రు. దీంతో ఓ కంట కన్నీరు, మరో కంట పన్నీరు అన్నట్టుగా పరిస్థితి మా రింది. బాబు ప్రకటించిన పది వరాలతో జిల్లా ‘దశ’ తిరుగుతుందా....? లేదంటే ఆయన గత ప్రకటనల వలే హామీలుగా మిగిలిపోతాయా అన్న దానిపై ప్రజల్లో చర్చసాగుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. నవ్యాంధ్రప్రదేశ్ కొత్తరాజధాని ప్రకటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు తన ప్రణాళికను అసెంబ్లీలో చదివి విని పించారు. అభివృద్ధిలో భాగంగా 10 హామీలను గుప్పించారు. అయితే కార్యరూపం దాల్చేదెలాగో చెప్పలేదు. పది వరాలు ఇవే... గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మెడికల్ కళాశాల, పోర్ట్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్, ఫుడ్ పార్క్, సంగీత, లలితకళల అకాడమీ, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుతో పాటు విజయనగరాన్ని స్మార్ట్ సిటీ, పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే తోటపల్లి ప్రాజెక్టు ను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని వెల్లడించారు. వినడానికి, చెప్పుకోవడానికి బాగున్నా ఆచరణకు నోచుకుంటాయా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే శంకుస్థాపనలుచేసి వదిలేయడంతప్ప పూర్తి చేసి న దాఖలాలు పెద్దగా కన్పించలేదు. గత పనితీరును దృష్టి లో పెట్టుకుంటే వీటి అమలపై అనుమానాలు కమ్ముకుం టున్నాయి. ఇవన్నీ కార్యరూపంలోకి తెచ్చి పూర్తి చేస్తే మాత్రం సంతోషించిదగ్గ విషయమే. అదే జరిగితే జిల్లా అభివృద్ధి పథకంలో పయనిస్తుంది. ఏవేవి...ఎక్కడెక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను భోగాపురంలోనూ, మెడికల్ కళాశాలను విజయనగరంలో, గిరిజన యూనివర్సిటీని పాచి పెంటలో, సంగీత, లలితకళల అకాడమీని విజయనగరం లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే, ఇందులో మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్మిస్తుందా? ప్రైవేటుకు అప్పగిస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.ఇక,పోర్ట్ విషయాని కొస్తే భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరప్రాంతం లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ పార్క్, ఫుడ్ పార్క్లను ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తామంటున్న విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా ఎలా తీర్చిదిద్దుతారన్న దానిపై స్పష్టత కొరవడింది.కాగా, తోటపల్లి ప్రాజెక్టుకు ఇటీవలబడ్జెట్లో రూ.20కోట్లు కేటాయించినసర్కార్ ఈ ఏడాదిలో ఎలా పూర్తిచేస్తారన్న దానిపై అనుమానం ఉంది. -
సీఎం పర్యటన నిరాశ మిగిల్చింది
బుచ్చెయ్యపేట: అభివృద్ధి పథకాలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఒక్క పథకానికీ నిధులు ప్రకటించక పోవడం నిరాశ మిగిల్చిందని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం బుచ్చెయ్యపేటలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం విశాఖ వస్తున్నందున వరాల జల్లు కురిపిస్తారని ఆశించానన్నారు. నిధులు మంజూరుచేయాలని స్వయాన సీఎంకి విన్నవించినా ఒక్క దానికీ ఆమోదం తెలపకపోవడం కార్యకర్తలకు కూడా విస్మయం కలిగించిందన్నారు. వడ్డాది, కొత్తకోట, రోలుగుంటలలో డిగ్రీ కళాశాలలు మంజూరు చెయ్యాలని కోరినట్లు చెప్పారు. బుచ్చెయ్యపేట, చోడవరం మండలాలకు కోనాం రిజర్వాయర్ నీరు తరలించే ఏర్పాట్లు చేయాలని, 30 పడకల ఆస్పత్రులు మంజూరు చేయాలని, మినీ రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ, మహిళ, రైతుల్ని ఆదుకోవాలని వినతులు అందించినట్లు తెలిపారు. ఒక్కదానిపైనా ప్రకటన లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు కలిసి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ దాడి సూరినాగేశ్వరరావు, విశాఖ డెయిరీ డెరైక్టర్ గేదెల సత్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వియ్యపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే మీ లక్ష్యమా..!
జి.సిగడాం, న్యూస్లైన్ : జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ సర్పంచ్లను ఇబ్బంది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పలువురు సర్పంచ్లు ధ్వజమెత్తారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య వారోత్సవాల సందర్బంగా సర్పంచ్లకు, మండల స్థాయి అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు గ్రామాలకు చెందిన సర్పంచ్లు మాట్లాడుతూ పారిశుద్ధ్య సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికిప్పుడే సమాచారం అందించి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం మంచి పద్దతి కాదన్నారు. పంచాయతీల్లో నిధులు లేక డ్రెయిన్లలో పూడికలు కూడా తీయలేని పరిస్థితి నెలకొందన్నారు. సర్పంచ్ తమ సొంత సొమ్ములతో వాటిని నిర్వహిస్తే 50 వేల వరకు ఖర్చు అయితే రికార్డుల్లో మాత్రం 5వేలకు మించి అధికారులు నమోదు చేయడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు. దవలపేట, దేవరవలస, జగన్నాథవలస, బాతువ, మెట్టవలస, పెంట సర్పంచ్లు కంచరాన సూరన్నాయుడు, పంచిరెడ్డి బంగారునాయుడు, తనుబుద్ది దాలినాయుడు, కామోదుల సీతారాం, తిరుమరెడ్డి గౌరీశంకరరావు, మక్క సాయిబాబునాయుడు మాట్లాడుతూ పారిశుధ్య వారోత్సవాల కోసం సర్పంచ్లు సమావేశానికి హాజరైనా పూర్తిస్థాయిలో అధికారులు హాజరవ్వకపోవడంపై నిరసన తెలిపారు. ప్రజా ప్రతినిధులు అంటే మీకొక అలుసా, ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికి మేము వస్తున్నాం, మీ అధికారులు మాత్రం సమావేశానికి హాజరు కావడం లేదంటూ ఎంపీడీవో వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా జిల్లా అధికారులు స్పందించి గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించినప్పుడే వారోత్సవాలకు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ బి. హనుమంతురావులతో పాటు సర్పంచ్లు బత్తుల సన్యాసిరావు, పొగిరి అక్కలనాయుడు, పల్లంటి సురేష్, గోపాలకృష్ణరాజు, వాన ప్రమీల, మర్రిబందల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
ఉడాకు సిబ్బంది కావలెను!
120 మందికిగాను 58 మందే విధుల్లో పదిహేనేళ్లుగా పోస్టులు ఖాళీ రెండున్నర రెట్లు పెరిగిన ఉడా పరిధి కేటాయించిన పోస్టుల భర్తీతోపాటు అదనంగా 300 మంది అవసరం ప్రభుత్వానికి నివేదించిన ఉడా చైర్మన్ వణుకూరి సాక్షి, విజయవాడ : విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా)లో సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. పదుల సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉండడం, ఒకే ఉద్యోగి రెండు, మూడు రకాల విధులు నిర్వర్తించడం ఉడాలో కొన్నేళ్లుగా సాగుతోంది. ప్రభుత్వానికి జీతాలపరంగా ఖర్చు తగ్గినా.. సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఉడా ఆవిర్భావంలో కేటాయించిన సిబ్బందిలో దాదాపు 30 శాతం ఖాళీలను భర్తీచేయకపోవడం, మిగిలిన 30 శాతం మంది పదవీవిరమణ చేసినా వారి స్థానాల్ని భర్తీచేయలేకపోవడంతో సిబ్బంది కొరత సమస్య తీవ్రమయింది. దీనికితోడు ఇప్పుడు ఉడా పరిధి భారీగా పెరగడంతో కొత్త పోస్టుల అవసరం ఏర్పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో వీజీటీఎం ఉడా నూతన రాష్ట్రంలో అతిపెద్దదిగా నిలుస్తుంది. విస్తీర్ణం దృష్ట్యా కూడా పెద్దదే. 1978లో అవిర్భవించిన ఉడా అప్పట్లో గుంటూరు, విజయవాడ, తెనాలి పట్టణాలకే పరిమితమైంది. కాలక్రమేణ విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు రెండు జిల్లాల్లోని తొమ్మిది మున్సిపాలిటీలు, 1400 గ్రామాల పరిధికి విస్తరించింది. 2012 వరకు ఉడా పరిధి కేవలం 1945 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అప్పట్లో ఉడా పరిధి, కార్యకలాపాలను ప్రామాణికంగా తీసుకుని మున్సిపల్ శాఖ 120 మంది సిబ్బంది నియామకాలకు వీలుగా పోస్టులు ఉడాకు కేటాయించింది. వారిలో 80 మందిని మాత్రమే తొలుత నియమించారు. ఆ తర్వాత నియామకాలు జరగకపోవడంతో ఖాళీలు అలాగే ఉన్నాయి. గడిచిన పదేళ్లలో సుమారు 30 మంది వరకు పదవీవిరమణ చేయడంతో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది సంఖ్య 58కు చేరింది. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులే ఇక్కడ అధికంగా పనిచేస్తున్నారు. గతంలో వైస్ చైర్మన్లుగా పనిచేసిన అధికారులు ఉద్యోగుల భర్తీకి ప్రయత్నించకుండా కేవలం కాంట్రాక్టు ఉద్యోగులతోనే నడిపించారు. ప్రస్తుతం ఉడాలో సుమారు 175 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 2012 వరకు కేవలం 1945 చదరపు కిలోమీటర్లకే పరిమితమైన ఉడా పరిధి ఒక్కసారిగా 5113 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో ఉడాకు ఆదాయం కూడా తగ్గిపోతోంది. ప్లానింగ్, ఇంజినీరింగ్, సిటిజన్ చార్టర్, ఎస్టేట్ విభాగం, ల్యాండ్ ఎక్విజేషన్ విభాగం, పరిపాలన విభాగాలు ఉన్నాయి. ఉడా పరిధిలో దాదాపు మూడు వేలకుపైగా ప్రైవేట్ వెంచర్లు ఉన్నాయి. ఇవికాక అనధికారికంగా సుమారు ఐదు వేల ఎకరాల్లో ఉడా అనుమతిలేని వెంచర్లు ఉన్నాయి. ఉడా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుని వారికి అపరాధరుసం విధించాల్సి ఉంటుంది. సిబ్బంది లేకపోవడంతో ఆ పని జరగడం లేదు. నూతన ప్రాజెక్టులు కాని, రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం చేయడానికి సిబ్బంది లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. హుడాను పరిగణనలోకి తీసుకోండి.. హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా)ను పరిగణనలోకి తీసుకుని, దానికి సిబ్బందిని కేటాయించిన విధంగానే వీజీటీఎం ఉడాకు కేటాయించాలని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలిసి సిబ్బంది పెంపు ఆవశ్యకతను వివరించి మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరి వినతిపత్రం అందజేశారు. దీనిపై మున్సిపల్ శాఖ కొంత కసరత్తు ప్రారంభించిన తరుణంలో రాష్ట్ర విభజన జరగడం, ప్రభుత్వం మారడం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారానికి బ్రేక్ పడినట్లయింది. నూతన రాష్ట్ర రాజధాని కచ్చితంగా వీజీటీఎం ఉడా పరిధిలోని ప్రాంతంలోనే ఏర్పాటవుతుందని అందరు విశ్వసిస్తున్నారు. ఈ తరుణంలో సిబ్బంది కొరత తీరకపోతే రాజధాని నిర్మాణంలో ఉడా క్రియాశీలక పాత్ర పోషించలేని పరిస్థితి తలెత్తుతుంది. గతంలో కంటే విస్తీర్ణం రెండున్నర రెట్లు పెరిగినందున.. కేటాయించిన సిబ్బంది సంఖ్యను రెండు రెట్లు పెంచాలని చైర్మన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. అంటే ప్రస్తుతం ఉన్న సిబ్బందితో కలుపుకొని 420 వరకు పోస్టులు కావాలన్నమాట. నూతన సీఎంకు విన్నవిస్తాం నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఉడాకు పోస్టులు పెంచాలని కోరతాను. ముఖ్యమంత్రిగా పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతాను. ఉడాను సీమాంధ్రలో అన్ని అంశాల్లో అగ్రగామిగా నిలపటమే నా ఎజెండా. ఆ దిశగా పనిచేస్తున్నాను. -వణుకూరి శ్రీనివాసరెడ్డి, చైర్మన్, వీజీటీఎం ఉడా -
‘అభివృద్ధి’ లక్ష్యాలు సాధించండి : కలెక్టర్
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్లైన్ : జిల్లాలోని వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఎం.రఘునందన్రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం అధికారులతో ఆయా శాఖల పరిధిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2013-14 సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు ఈ నెల 25లోగా లక్ష్యాలు సాధించేలా చూడాలన్నారు. గృహనిర్మాణం, హాస్టల్ భవనాల నిర్మాణం, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు నిర్మాణ దశలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. సంక్షేమశాఖకు సంబంధించి వసతి గృహాల్లోని విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ వెంటనే పంపిణీ చేయాలని చెప్పారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు 35 శాతం రెన్యువల్ చేసినట్లు, కొత్తగా వచ్చిన దరఖాస్తులకు వెంటనే స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి లక్ష్యాలు సాధిస్తామని అధికారులు కలెక్టర్కు వివరించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం అమలు చేస్తున్న జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం రెండో దశ పాఠశాలల్లో వేసవి సెలవులు ఇవ్వకముందే అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు. సర్పంచులకు శిక్షణ ఇప్పుడే పూర్తయ్యిందని, వార్డు సభ్యులకు మాత్రం షెడ్యూలు ప్రకారం మార్చి ఏడో తేదీలోగా పూర్తి చేయాలని తెలిపారు. కల్యాణమస్తు కార్యక్రమం కింద సామూహిక వివాహాలు కార్యక్రమం, నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు. ఈవీఎం గోడౌన్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి... కలెక్టరేట్లో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీలం తుపాను పంట నష్టపరిహారం రైతులకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. సొంత భవనాలు లేని 15 సీడీపీవో కార్యాలయాలకు స్థలాల సేకరణ త్వరగా చేయాలని చెప్పారు. పీహెచ్సీల భవన నిర్మాణాలు, ప్రారంభించిన వాటిని పూర్తి చేయాలన్నారు. మత్స్యశాఖ ద్వారా మత్స్యకారులకు వివిధ పథకాల కింద పంపిణీ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో మెరైన్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించామని, స్థలాల సేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, జెడ్పీ సీఈవో సుబ్బారావు, డ్వామా పీడీ అనిల్కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, సీపీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, డీపీవో కె.ఆనంద్, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, డీఎంఅండ్హెచ్వో సరసిజాక్షి, ఆర్వీఎం పీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలకు రూ.1100 కోట్లు
మంత్రి బాలరాజు పాడేరు, న్యూస్లైన్: ఏజెన్సీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1100 కోట్లు మంజూరు చేసినట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వంతాడపల్లి నుంచి అడ్డుమండ వరకు రూ.కోటి 79 లక్షలతో నిర్మించే తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తుంపాడ, గుత్తులపుట్టు గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలు, రూ.13.50 లక్షలతో నిర్మించిన గుత్తులపుట్టు జీసీసీ గిడ్డంగిని ప్రారంభించారు. పాడేరులోని పంచాయతీ కార్యాలయం వెనుక సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుంపాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఒక్క పాడేరు మండలం అభివృద్ధికే రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. గిరిజనులకు విద్య, వైద్య కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. తాగునీటి సౌకర్యాల కల్పనకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గిరిజన యువత ఉపాధికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వి.వినయ్చంద్, ఆర్డీవో ఎం.గణపతిరావు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఈఈలు సుబ్బారావు, మురళీకృష్ణ, ఎం.ఆర్.జి.నాయుడు, జీసీసీ డీఎం ప్రతాప్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, పలు శాఖల అధికారులు, డీసీసీ కార్యదర్శి సతీష్వర్మ, పలు పంచాయతీల సర్పంచ్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి పాడేరు: కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులంతా గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి బాలరాజు కోరారు. స్పెషల్ డీఎస్సీ 2013 ద్వారా ఎంపికైన 56 మంది ఉపాధ్యాయులకు శనివారం రాత్రి ఐటీడీఏ కార్యాలయంలో ఆయన నియామకపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వసతి, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది చలి కాలానికి ముందే గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లోని విద్యార్థులందరికీ రగ్గులు పంపిణీ చేశామని చెప్పారు. ఉపాధ్యాయులంతా సాటి గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేసి మంచి గిరిజన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వినయ్చంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తా
సింధనూరు టౌన్, న్యూస్లైన్ : ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతంగా పని చేసి స్వచ్ఛమైన పాలన అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఆయన ఆదివారం సింధనూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. గతంలో పాలన సాగించిన పార్టీల దుష్పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు తమను ఆశీర్వదించారన్నారు. అందువల్ల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఇప్పటికే 60 శాతం నిధులను హైదరాబాద్-కర్ణాటక ప్రాంత అభివృద్ధికి కేటాయించామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక రూపాయికే కిలో బియ్యం అందించే అన్నభాగ్య పథకాన్ని ప్రకటించానన్నారు. వెనుకబడిన, మైనార్టీ వర్గాల రుణాల మాఫీ చేశామన్నారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమన్నారు. అన్నభాగ్య పథకం జారీపై ఎన్నో రకాల ఆటంకాలు ఎదురైనా పథకం అమలుకే కట్టుబడ్డామన్నారు. తక్కువ ధరకు బియ్యం పంపిణీ చేసినంత మాత్రాన ఎవరూ సోమరులు కారన్నారు. పిడికెడు అన్నానికి కూడా నోచుకోలేని అభాగ్యులు ఎందరో ఉన్నారన్నారు. అలాంటి వారి కడుపు నింపేందుకు ఈ పథకం ఎంతో సహాయకారి కానుందన్నారు. పాడి రైతులకు సహాయధనం, విద్యార్థులకు అపౌష్టికత నివారణకు క్షీరభాగ్య పథకం అమలు చేశామన్నారు. రైతుల శ్రేయస్సు కోసం రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందించే పథకం జారీ చేశామన్నారు. ఈ పథకం వల్ల తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించలేని దుస్థితి ఎదుర్కొంటున్న రైతుల జీవితాలు బాగుపడతాయన్నారు. మహిళలకు పలు రకాల సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాకి ఓటర్లు స్వస్తి పలికారన్నారు. ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సామాజిక న్యాయం లభించని, అణచివేతకు గురైన వర్గాల రక్షణకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. హైదరాబాద్-కర్ణాటక వాసుల చిరకాల వాంఛ కూడా నెరవేరిందని, ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఇది తోడ్పడనుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ హెచ్సీ మహదేవప్ప, శివరాజ్ తంగడిగి, ఎంపీ శివరామగౌడ, ఎమ్మెల్యేలు హంపనగౌడ, ప్రతాప్గౌడ పాటిల్, వెంకటేష్ నాయక్, హంపయ్య నాయక్, రాఘవేంద్ర హిట్నాళ, బీఎం నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ బయ్యాపుర, జెడ్పీ అధ్యక్షురాలు లలితమ్మ, ఉపాధ్యక్షుడు శరణప్ప, డీసీసీ అధ్యక్షుడు ఎ.వసంతకుమార్, బసవరాజ్ ఇటగి తదితరులు పాల్గొన్నారు.