రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్య, రెండేళ్ల కుమారుడిని హత్యచేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి ఇంట్లో నుంచి వ్యక్తి వెళ్లిపోయాడు. దుర్వాసన రావడంతో ఇంటి యజమాని మంగళవారం రాత్రి వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగి ఉండవచ్చునని మృతురాలి భర్త హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.