ఈఎస్ఐ కుంభకోణంలో మరొకరిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదివారం అరెస్ట్ చేసింది. ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్రెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్గా పని చేస్తున్న నాగలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఎనిమిదిన్నర కోట్ల రూపాయల మందుల కొనుగోలు వ్యవహారంలో ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది.