ESI
-
ఈఎస్ఐ కిందకు కొత్తగా 16 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే బీమా పథకం ‘ఈఎస్ఐ’ కిందకు 2024 నవంబర్ నెలలో కొత్తగా 16.07 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఒక శాతం అధికంగా సభ్యులు చేరినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్లో కొత్త సభ్యుల నమోదు 15.92 లక్షలుగా ఉంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. గతేడాది నవంబర్లో 20,212 సంస్థలు ఈఎస్ఐసీలో చేరాయి. తద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ రక్షణ లభించినట్టయింది. 16.07 లక్షల మందిలో 7.57 లక్షల మంది (47.11 శాతం) 25 ఏళ్లలోపు వయసున్నవారు కావడం గమనార్హం. 3.28 లక్షల మంది మహిళలు కాగా, 44 మంది ట్రాన్స్జెండర్లు కూడా కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. -
ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులు
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) పథకంలో ఈ ఏడాది మేలో 23 లక్షల మంది కొత్త ఉద్యోగులు చేరారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వీరి సంఖ్య 13.9% పెరిగింది. నెలవారీగా ఈఎస్ఐసీలో చేరే సరాసరి ఉద్యోగులు 16.4 లక్షల మందితో పోలిస్తే 39.9% వృద్ధిని నమోదు చేసింది. ఈమేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది.ఈఎస్ఐసీ తాజాగా విడుదల చేసిన పేరోల్ డేటా ప్రకారం..2024 ఏప్రిల్లో ఈఎస్ఐసీ పరిధిలో 18,490 మంది చేరారు. అదే మేలో మాత్రం ఆ సంఖ్య 20,110 కు చేరింది. మే నెలలో నమోదైన మొత్తం 23 లక్షల ఉద్యోగుల్లో 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 11 లక్షల మంది, మహిళలు 44 వేలు, 60 మంది ట్రాన్స్జెండర్ ఉద్యోగులు ఈఎస్ఐ పథకం కింద నమోదు చేసుకున్నారు. నెలవారీ వేతనం రూ.21,000 వరకు ఉంటే వారి జీతాల్లో 0.75% ఈఎస్ఐ కింద జమ చేస్తారు. సంస్థ యాజమాన్యం మరో 3.25% విరాళంగా అందిస్తుంది. మొత్తం 4% నగదు ఈఎస్ఐలో జమ అవుతుంది. ఇది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య, నగదు ప్రయోజనాలను అందించేందుకు ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: వీడియో స్ట్రీమింగ్ రంగంలో 2.8 లక్షల మందికి ఉపాధి -
ఈఎస్ఐసీ కిందకు 16.47 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కింద ఏప్రిల్ నెలలో 16.47 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసింది.ఇందులో 47.60 శాతం అంటే 7.84 లక్షల మంది వయసు 25 ఏళ్లలోపే ఉందని, కొత్త ఉద్యోగాల కల్పనను ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని కార్మిక శాఖ పేర్కొంది. మొత్తం కొత్త సభ్యుల్లో 3.38 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈఎస్ఐసీ కింద 53 మంది ట్రాన్స్జెండర్లు కూడా నమోదు చేసుకున్నారు.సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించడమే ఈ పథకం లక్ష్యంగా కార్మిక శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్లో 18,490 కొత్త సంస్థలు ఈఎస్ఐసీ కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వచ్చినట్టయింది. -
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికులకు న్యాయం చేయాలి. కానీ అచ్చెన్నాయుడు రూటే సెప‘రేటు’. శ్రామిక సోదరుల కోసం కొనాల్సిన మందుల్లోనూ దందా నడిపారు. వైద్యపరికరాలు ఎక్కువ ధరకు కోట్ చేసి, బినామీలను తెర మీదకు తెచ్చి, మందు బిల్లుల్లో మాయలు చేసి రూ.150 కోట్ల అక్రమానికి పాల్పడి అవినీతి మంత్రిగా ముద్ర పడ్డారు. ఈఎస్ఐ స్కామ్లో అరెస్టయ్యి జిల్లా పరువు తీసేశారు. మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దొరికిందే చాన్స్ అంటూ దోచుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్ఐ స్కామ్.. అచ్చెన్నాయుడు ఎన్నటికీ చెరపలేని అవినీతి మరక. మన జిల్లాకు చెందిన నాయకుడు రాష్ట్ర స్థాయిలో భారీ అవినీతికి పాల్పడిన వ్యవహారం మాయని మచ్చగా మిగిలిపోయింది. అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150కోట్లకు పైగా జరిగిన స్కామ్లో సూత్రధారిగా నిలిచారు. కారి్మకుల సొమ్ము కాజేసిన అచ్చెన్న బండారం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్ల పనులు నామినేషన్పై అప్పగించాలని మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖతో మొత్తం గుట్టు రట్టయ్యింది. వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132శాతం అధికంగా చెల్లించి కోట్లు కొట్టేశారు. అచ్చెన్న అవినీతి మార్క్ కారి్మక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్న తన మార్క్ అవినీతిని చూపించారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ను తాను చెప్పిన సంస్థకు నామినేటేడ్ కట్టబెట్టాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వగా ఆర్డర్ జారీ చేశారు. సిఫార్సుకు ముందు వారితో ఏ లాలూచీలు పడ్డారో తెలీదు గానీ తన లెటర్ హెడ్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తూచా తప్పకుండా అధికారులు పాటించారు. నామినేటేడ్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ ఇండెంట్లతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు కూడా చేశారు. అవినీతి జరిగిందిలా... 👉రూ. 293.51కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36కోట్లు విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. 👉శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62కోట్లు మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70శాతం అధికం. 👉ఫ్యాబ్రికేటేడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ. 15.93కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70కోట్లు మేర అదనంగా చెల్లించినట్టు తేలింది. 👉 కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలనపడేశారు. జెర్సన్ ఎంటర్ ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ సీకే రమే‹Ùకుమార్ రూ. 9.50కోట్లు చెల్లించారు. 👉 ఒక్కో బయోమెట్రిక్ పరికరం ధర రూ.16,992 అయితే రూ.70,760చొప్పున నకిలీ ఇండెంట్లు సృష్టించి కొనుగోలు చేశారు. 👉 ఈ క్రమంలో రశీదులు ఫోర్జరీ చేసి కోట్లు కొల్లగొట్టారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేటు కాంట్రాక్ట్లో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ల్యాబ్ కిట్లు, ఫరీ్నచర్, ఈసీజీ సరీ్వసులు, బయోమెట్రిక్ పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయి. 👉 లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. ప్రభుత్వం రూ.89కోట్లు చెల్లిస్తే అందులో రేట్ కాంట్రాక్ట్లో ఉన్న సంస్థలకు రూ. 38కోట్లు చెల్లించారు. మిగతా రూ.51కోట్లను దారి మళ్లించారు. 👉టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దురి్వనియోగమైంది. అవుట్ సోర్సింగ్ దందా సాధారణంగా ఔట్ సోర్సింగ్ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ఏజెన్సీలుగా నియమించి దందా చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి స్థాయిలోనే ఏ శాఖకు, ఏ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉండాలి, ఆ ఏజెన్సీ ఎవరి చేతిలో ఉండాలన్నది ఫిక్స్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగలేదు. బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కో పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. 👉అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. 👉రూ. 975.79కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. 👉ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫరీ్నచర్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ. 975.79కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. 👉నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. మొదటి నుంచీ అదే బాగోతం రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, దివాకర్ ట్రావెల్స్కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను అచ్చెన్న మూటగట్టుకున్నారు. -
జయప్రద జైలు శిక్షరద్దు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసులో సీనియర్ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ థియేటర్లో జయప్రద, ఆమె ఇద్దరు సోదరులు వాటాదారులుగా ఉన్నారు. ఈ థియేటర్ 10 ఏళ్ల క్రితమే మూతపడింది. అయితే ఈ థియేటర్లో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ పేరుతో కోతలు విధించి తమ వద్ద జమ చేయలేదని ఈఎస్ఐకార్పొరేషన్(ఈఎస్ఐసీ) కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఆగస్టులో జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం ఈ కేసులో ఆమె అప్పీల్కు వెళ్లగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇదీ చదవండి..ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి డుమ్మా -
కొత్తగా 18.86 లక్షల మందికి ఈఎస్ఐ.. ఆసక్తికర అంశం ఏంటంటే..
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ESIC ) కిందకు డిసెంబర్ నెలలో 18.86 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదే నెలలో 23,347 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభింనట్లుగా తెలుస్తోంది. కొత్త సభ్యుల్లో 8.83 లక్షల మంది (47 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక నికరంగా నమోదైన మహిళా సభ్యుల సంఖ్య 3.59 లక్షలుగా ఉంది. అలాగే, డిసెంబర్లో 47 ట్రాన్స్జెండర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాజంలోని ప్రతివర్గానికీ ప్రయోజనాలు అందించేందుకు ఈఎస్ఐసీ కట్టుబడి ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మిక శాఖ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం.. ఈఎస్ఐసీ కింద అధికారిక ఉద్యోగ కల్పన నవంబర్లో 1.59 మిలియన్ల కొత్త ఉద్యోగులతో పోలిస్తే, డిసెంబర్లో నెలవారీగా 18.2 శాతం పెరిగింది. ఏప్రిల్లో 17.8 లక్షల మంది, మేలో 20.2 లక్షల మంది, జూన్లో 20.2 లక్షల మంది, జూలైలో 19.8 లక్షలు, ఆగస్టులో 19.4 లక్షలు, సెప్టెంబర్లో 18.8 లక్షలు, అక్టోబర్లో 17.8 లక్షల మంది ఈఎస్ఐసీలో కొత్తగా చేరుతూ వచ్చారు. -
ఈఎస్ఐ కిందకు 18.88 లక్షల మంది కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) నిర్వహించే ఈఎస్ఐ పథకం కిందకు సెప్టెంబర్ నెలలో కొత్తగా 18.88 లక్షల మంది సభ్యులు భాగస్వాములు అయ్యారు. 22,544 సంస్థలు మొదటిసారి ఈఎస్ఐసీ కింద నమోదయ్యాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వర్తించనుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. సెప్టెంబర్లో కొత్త సభ్యుల్లో 9.06 లక్షల మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. మొత్తం కొత్త సభ్యుల్లో 47.98 శాతానికి ఇది సమానం. కొత్త సభ్యుల్లో మహిళలు 3.51 లక్షల మంది ఉన్నారు. అలాగే 61 మంది ట్రాన్స్జెండర్ విభాగానికి చెందిన వారు కూడా ఉన్నారు. -
టిడ్కో ఇళ్లకూ రూ.8,929 కోట్ల ‘టెండర్’
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లోని టిడ్కో ఇళ్లనూ వదిలిపెట్టలేదు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో ఎక్కడా లేనంతగా నిర్మాణ వ్యయాన్ని చూపించి దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివసిస్తున్న ఇళ్లులేని 5 లక్షల మంది పేదలకు ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు. 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, ఎక్కువ ముడుపులు చెల్లించిన కంపెనీకి అధిక ధరకు.. తక్కువ ఇచ్చిన కంపెనీకి ఆ మేర తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. ఎంతగా అంటే.. ఆనాడు మార్కెట్లో ఏ ప్రైవేటు బిల్డర్ కూడా వసూలుచేయనంత ధర నిర్ణయించారు. ఇచ్చుకున్నోడికి ఇచ్చుకున్నంత.. నిజానికి.. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.వెయ్యి కంటే తక్కువే ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలు ఇచ్చుకున్న ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2,034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ఇలా టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులిచ్చి చంద్రబాబు సర్కారు రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. వ్యాట్ నుంచి గడ్డి వరకు.. సాక్షి, అమరావతి: చంద్రబాబు జమానా అంతా అవినీతి, అక్రమాలే. రాష్ట్ర విభజన నాటికి రైసు మిల్లర్లకు బకాయి పడిన రూ.500 కోట్ల వ్యాట్ బకాయిలను మాఫీ చేస్తూ 2015లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వెనుక లోకేశ్ హస్తం ఉందని బహిరంగంగానే ఆరోపణలు విన్పించాయి. మిల్లర్లతో లోకేశ్ రాయబేరాలు సాగించి బకాయిలు రద్దు చేయాలంటే రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో బియ్యం ఎగుమతులపై కూడా వ్యాట్ రద్దు చేస్తే, అడిగింది ఇచ్చేందుకు సిద్ధమని మిల్లర్లు చెప్పారు. దీంతో మిల్లర్ల వ్యాట్ బకాయిల మాఫీ అతి వేగంగా జరిగిపోయింది. పత్తి రైతుల పేరిట రూ.200 కోట్లు స్వాహా నాసిరకం పత్తిని సీసీఐకు అమ్మేసి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు రూ.200 కోట్లు తినేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో సగభాగం చంద్రబాబుకు ముట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. పుల్లారావు ఓ వ్యాపారితో కలిసి రైతుల పేరిట నాసిరకం పత్తిని కొన్నారు. దీనిని బంధువులు, దళారుల పేర్లతో సీసీఐకు అమ్మేశారు. అంతేకాదు సీసీఐ సేకరించిన పత్తిలో 80 శాతం బోగస్ రైతుల నుంచి కొన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా తేల్చింది. పచ్చిగడ్డిలోనూ పచ్చ నేతల మేత పశువుల గడ్డిలోనూ టీడీపీ నేతల మేత బాగానే ఉంది. సైలేజ్ (పాతర గడ్డి) పేరిట ‘కోట్లు’ స్వాహా చేశారు. ప్రభుత్వం ఏటా 75 శాతం సబ్సిడీపై రైతులకు పశుగ్రాసం సరఫరా చేస్తుంటుంది. అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె సాయికృపా పేరిట ఏర్పాటు చేసిన కంపెనీ పేరుతో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు సబ్సిడీ సొమ్మును కాజేశారు. రైతులు చెల్లించాల్సిన వాటాను బినామీల పేరిట చెల్లించి 75 శాతం సబ్సిడీ సొమ్మును స్వాహా చేశారు. ఈ వ్యవహారంపై జరిగిన విజిలెన్స్ విచారణను సైతం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. చంద్రన్న కానుక పేరిట కోట్లు స్వాహా 2015 సంక్రాంతి పండుగ వేళ చంద్రన్న కానుక పేరిట నాణ్యత లేని రేషన్ సరుకులను కార్డుదారులకు పంచిపెట్టారు. ఈ పథకం కింద ఒక్కో కార్డుదారునికి కానుక కోసం రూ.270 చొప్పున కాంట్రాక్టర్లకు రూ.430 కోట్లు ఇచ్చారు. అయినా ఎందుకూ పనికిరాని రేషన్ సరుకులు సరఫరా చేశారు. పురుగులు పట్టిన కందిపప్పు, పనికిరాని బెల్లం, దుర్వాసన కొట్టే గోధమ పిండి పంచి పెట్టి రూ.100 కోట్లకు పైగా వెనకేసుకున్నారు. కార్మికుల సొమ్మూ తినేశారు సాక్షి, అమరావతి: నెలనెలా జీతం నుంచి ఈఎస్ఐ కోసం డబ్బులు చెల్లించే కార్మికుల సొమ్మునూ కాజేశారు టీడీపీ నేతలు. 2014 – 2019 మధ్య రూ.150 కోట్లకు పైగా కార్మికుల సొమ్మును తినేశారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లేఖలతో నామినేషన్పై ఆర్డర్లు ఇచ్చి ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ దోపిడీకి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఈ అవినీతి బాగోతంపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు 2020లో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు డాక్టర్ సీకే రమేష్కుమార్, డాక్టర్ జి.విజయ్కుమార్ సహా పలువురిని కూడా అప్పట్లో అరెస్టు చేశారు. ఈ కుంభకోణం దర్యాప్తు తుది దశకు చేరింది. త్వరలో ఏసీబీ చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేయనుంది. కార్మికుల సొమ్ము తినేశారిలా.. నిబంధనల ప్రకారం ఏ కాంట్రాక్టు అయినా రూ.10 లక్షల విలువ దాటితే ఈ–టెండర్లు నిర్వహించాలి. ఇందుకు విరుద్ధంగా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎవరికి ఏ కాంట్రాక్టు ఇవ్వాలో అధికారులను ముందే ఆదేశించారు. ఈమేరకు లెటర్హెడ్పై సిఫార్సులు చేస్తూ అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్కు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా ఆయన సూచించిన కంపెనీలకు మందులు, వైద్య పరికరాల సరఫరా, ఇతర కాంట్రాక్టులు అప్పజెప్పారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాల్ సెంటర్, టోల్ఫ్రీ, ఈసీజీ కాంట్రాక్టు ఇచ్చారు. ఎక్కడైనా రూ.200 మాత్రమే ఉండే ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించారు. కాల్ సెంటర్లో కాల్స్కి కాకుండా సర్వీస్ ప్రొవైడర్ మొత్తం రిజిస్టర్ ఐపీ, ఫేక్ కాల్ లాగ్స్కి కూడా రూ.1.80 చొప్పున బిల్ క్లెయిమ్ చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ ప్రాతిపదికన రూ.89.58 కోట్ల విలువైన మందులు కొన్నారు. లెజెండ్ ఎంటర్ప్రై జెస్, ఎవెంటార్, ఓమ్ని మెడి తదితర సంస్థలకు భారీ లబ్ధి చేకూర్చారు. ఆయా సంస్థల నుంచి అచ్చెన్న, కొందరు అధికారులు భారీగా ప్రయోజనం పొందారు. లేబొరేటరీ కిట్ల కోసం రూ.237 కోట్లు ఖర్చు చేశారు. రూ.16 వేలు విలువ చేసే బయోమెట్రిక్ మెషీన్లను రూ.70 వేలకు కొన్నారు. ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్ల ద్వారా మందులు, శస్త్రచికిత్సల పరికరాలు, ఫర్నీచర్, ఈసీజీ మెషీన్లు కొన్నారు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంటు పనులు ఎలాంటి టెండరు లేకుండా జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు అప్పగించారు. కార్మికులకు షాంపూలు, క్రీముల పేరుతో రూ.10.50 కోట్లు ఖర్చు చేశారు. ఏటా బడ్జెట్టే రూ. 300 కోట్లు ఉండగా, రూ.500 కోట్లకు పైగా ఆర్డర్లు పెట్టి దోచేశారు. -
ఈఎస్ఐ స్కామ్లో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ అభియోగపత్రాలనుసమర్పించారు. ఈఎస్ఐలో మందులు, మెడికల్ కిట్ల కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు దేవికారాణిపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఇన్ వాయిస్ సృష్టించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు తేలింది. మెడికల్ క్యాంపు ల పేరుతో నిధులు గోల్మాల్ చేసి, అక్రమ సంపాదనతో 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని దేవికరాణి ,ఫార్మసిస్ట్ నాగలక్ష్మి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్లోనూ నిందితులుపెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులు. ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ షాప్లను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈస్ఐ కొనుగోళ్ల కుంభకోణం నిందితుల్లో దేవికారాణితోపాటు మాజీ జేడీ పద్మజ, షార్మాసిస్టు కే.నాగమణి, ఇద్దరు కాంట్రాక్టర్లు కే.శ్రీహరిబాబు, పీ.రాజేశ్వరరెడ్డి నిందుతులుగా ఉన్నారు. -
ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్తో పాటు ఉన్నతాధికారులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈఎస్ఐలో వందల కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ గుర్తించింది. రూ.వందల కోట్ల నిధుల దారి మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ గతంలో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే.. -
ఈఎస్ఐలో కొలువుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య కొలువుల భర్తీకి ఈఎస్ఐసీ ఉపక్రమించింది. వివిధ కేటగిరీల్లో ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన డాక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. నాలుగు కేటగిరీల్లో 40 పోస్టులు భర్తీ కానున్నాయి. సీనియర్ రెసిడెంట్ కేటగిరీలో 29 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్)/ సీనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 5 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్)/జూనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 3 ఖాళీలు, స్పెషలిస్ట్ కేటగిరీలో 3 ఖాళీలున్నాయి. రోస్టర్, రిజర్వేషన్ వారీగా పోస్టులను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ కొలువుల భర్తీ పూర్తిగా మెరిట్, ఇంటర్వ్యూల పద్ధతిలో జరుగుతుంది. సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్/ఎంట్రీలెవల్) గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలుగా ఖరారు చేయగా.. స్పెషలిస్ట్కు 66 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్కు 45 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూరించాలి. నిర్దేశించిన డాక్యుమెంట్లతో ఆయా తేదీల్లో ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే ప్రాధాన్యత ఇస్తారు. ఫలితాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. అర్హత సాధించిన వైద్యులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా వేతనాలు సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్) / సీనియర్ కన్సల్టెంట్ రూ.2,40,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్) / జూనియర్ కన్సల్టెంట్ రూ.2,00,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) స్పెషలిస్ట్ రూ.1,27,141/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సీనియర్ రెసిడెంట్ రూ.67,000/– + డీఏ, ఎన్పీఏ, హెచ్ఆర్ఏ, ఇతరాలు -
గుడ్న్యూస్! శంషాబాద్లో ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రం ఆమోదం
కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగాను రాష్ట్రంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు ఏడాదిన్నరకు మోక్షం లభించింది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 190వ ఈఎస్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలోని శంషాబాద్లో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించనున్నామని అధికారికంగా ప్రకటించారు. దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారులో గగన్పహాడ్, కాటేదాన్, సాతంరాయి పారిశ్రామికవాడలతోపాటు కొత్తూరు, నందిగామ, బాలా నగర్, షాద్నగర్ పారిశ్రామిక వాడలకు శంషాబాద్ చేరువలో ఉంది. దీనికితోడు నగర శివారులోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగు రోడ్డు వంటి అనువైన అనుసంధాన రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. (చదవండి: నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు) -
ఈఎస్ఐ ‘కార్పొరేట్’ సేవలు మరింత చేరువలో!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ (ఉద్యోగ రాజ్య బీమా) చందాదారులకు వైద్య సేవలను మరింత చేరువలోకి తెచ్చే దిశగా డీఐఎంఎస్ (డైరెక్టర్ ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్) చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ, మూడు జనరల్ ఆస్పత్రులతోపాటు 71 డిస్పెన్సరీల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రెండు జనరల్ ఆస్పత్రులు హైదరాబాద్ సమీపంలో ఉండగా.. మరో రెండు ఆస్పత్రులు వరంగల్, సిర్పూర్లో ఉన్నాయి. మిగతా డిస్పెన్సరీలు జిల్లాల్లో ఉన్నప్పటికీ అక్కడ కేవలం అవుట్ పేషెంట్ విభాగాల సేవలతోనే సరిపెడుతున్నాయి. ఈక్రమంలో శస్త్ర చికిత్సలు, మేజర్ చికిత్సల కోసం హైదరాబాద్లోని ఆస్పత్రులకు రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చందాదారులకు మరింత మెరుగైన సేవలను వేగంగా అందించేందుకు కొత్తగా ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులను ఎంపిక చేయాలని డీఐఎంఎస్ భావిస్తోంది. ఈమేరకు ప్రతిపాదనలను రూపొందించింది. జిల్లాకో ఆస్పత్రి చొప్పున... రాష్ట్రంలో ఈఎస్ఐ కార్పొరేషన్ 21 కార్పొరేట్ ఆస్పత్రులను ఎంప్యానెల్ చేసింది. ఇందులో మెజార్టీ ఆస్పత్రులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అలాకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఎంప్యానెల్ ఆస్పత్రులు ఉండేలా డీఐఎంఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లాకొక కార్పొరేట్ ఆస్పత్రిని ఎంప్యానెల్ చేస్తే సంబంధిత జిల్లా పరిధిలోని చందాదారులకు అత్యవ సరంగా మెరుగైన సేవలు అందుతాయనే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 40 ఆస్పత్రులను ఎంప్యానెల్ చేయాలని భావిస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతోనూ ఇటీవల సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన ఈఎస్ఐ ప్రాంతీయ బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించారు. డీఐఎంఎస్ ప్రతిపాదనలను త్వరలో ఈఎస్ఐ కార్పొరేషన్కు పంపా లని నిర్ణయించారు. అక్కడ ఆమోదం వచ్చాక ఆస్పత్రుల తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇదంతా వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. -
ఈఎస్ఐ డిస్పెన్సరీలకు శాశ్వత భవనాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ కార్యాచరణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలకు అన్ని రకాల వసతులతో శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71 డిస్పెన్సరీలున్నాయి. ఇవిగాకుండా కొత్తగా 14 డిస్పెన్సరీలను ఈఎస్ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ప్రస్తుతమున్న డిస్పెన్సరీల్లో 65 డిస్పెన్సరీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె కాంట్రాక్టు గడువు ముగియడంతో కొన్నింటిని పలుమార్లు మార్పు చేసిన సందర్భాలున్నాయి. డిస్పెన్సరీల మార్పులతో అటు రోగులకు, ఇటు వైద్యులు, సిబ్బందికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాశ్వత భవనాల నిర్మాణానికి కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి డిస్పెన్సరీకి శాశ్వత భవనంకోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు అనువైన స్థలాల గుర్తింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. స్థలాలు గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణం.. ప్రస్తుతం స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఈ దిశగా చర్యలు వేగవంతం చేసింది. స్థలాలను గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణాలను చేపట్టేందుకు కార్మిక శాఖ సిద్ధంగా ఉంది. గతవారం ఈఎస్ఐసీ ప్రాంతీయ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిస్పెన్సరీలకు శాశ్వత నిర్మాణాలపైనా చర్చించారు. ఈ క్రమంలో ఈఐఎస్ఐసీ ఉన్నతాధికారులు స్పందిస్తూ శాశ్వత భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు ఒక్కో భవనానికి రూ.50 లక్షలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలను తీసుకుంటామని వివరించారు. చందాదారుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. -
కొత్తగా 14 ఈఎస్ఐ డిస్పెన్సరీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 14 ఈఎస్ ఐ డిస్పెన్సరీలను ఈఎస్ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ఇందులో ఐదు డిస్పెన్సరీల్లో ఒక్కో డాక్టర్ పోస్టును, మరో ఎనిమిది డిస్పెన్స రీలకు ఇద్దరు డాక్టర్ల చొప్పున పోస్టులు మంజూ రు చేసింది. కొత్త డిస్పెన్సరీలను మంచిర్యాల, ఖమ్మం, అదిలాబాద్, హన్మకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కార్మిక శాఖ చర్యలు వేగవంతం చేసింది. బుధవారం ఆదర్శ్ నగర్లోని ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్. మల్లారెడ్డి ఆధ్వర్యంలో రీజనల్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామగుండం, శంషాబాద్లో వంద పడకల ఆస్ప త్రులను కేంద్రం మంజూరు చేయగా... వీటి ఏర్పా టుకు సంబంధించిన అనుమతులను ఈఎస్ఐ కార్పొ రేషన్ జారీ చేసిందని చెప్పారు. శంషాబాద్ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎక రాల స్థలాన్ని కేటాయించినట్లు వివరించారు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ పరికరాల ఏర్పాటుకు కార్పొరే షన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. వీటిని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 71 డిస్పెన్సరీలు ఉన్నాయని, మరిన్ని కొత్త డిస్పెన్స రీల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించా లని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఈఎస్ఐ సేవలు విస్తృతం చేసేందుకు కార్పొరేట్ ఆస్పత్రు లను ఎంప్యానల్ చేసి సర్వీసులు అందించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు కార్పొరేషన్కు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఈఎస్ఐసీ ప్రాంతీయ సంచాలకులు రేణుక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భారీ మెడికల్ స్కాం.. కాలం చెల్లిన మందులతో..
మదురై డివిజన్లోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల అక్రమ కొనుగోలు వ్యవహారం వెలుగు చూసింది. నిబంధనలను అతిక్రమించి రూ. 27 కోట్లకు కాలం చెల్లిన మందులు, వైద్య సామగ్రిని కొనుగోలు చేసిన అధికారుల బండారం తాజాగా బయట పడింది. వైద్యవిభాగం మాజీ డైరెక్టర్ సహా నలుగురిపై శనివారం కేసు నమోదైంది. వీరిని ప్రశ్నించేందుకు ఏసీబీ పావులు కదుపుతోంది. సాక్షి, చెన్నై: గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతి వ్యవహారాలపై ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా శాఖల మంత్రులను టార్గెట్ చేసి.. ఏసీబీ సోదాలు చేస్తోంది. అదే సమయంలో ఆరోగ్య శాఖలో భారీస్థాయిలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో డివిజన్ల వారీగా ఏసీబీ వర్గాలు విచారణను వేగవంతం చేశాయి. ఇందులో మదురై డివిజన్ పరిధిలో కాలం చెల్లిన మందులను కొనుగోలు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. మాయాజాలం.. ఏసీబీ విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు.. 2017లో మదురై డివిజన్ ఈఎస్ఐలకు మందుల కొనుగోలుకు రూ.13.12 కోట్లు కేటాయించారు. అయితే, కొన్ని నెలల వ్యవధిలో ఈ మొత్తం రూ. 40 కోట్ల 29 లక్షలకు చేరింది. అంచనా వ్యయం పెరగడమే కాకుండా, ఆగమేఘాలపై మందులను కొనుగోలు చేయడంలో అక్రమాలు వెలుగు చూసినట్లు తేలింది. 2018లో గణంకాల మేరకు రూ. 27 కోట్లు విలువైన మందులు కాలం చెల్లినవిగా తేలింది. ఉద్దేశపూర్వకంగానే వీటిని కొనుగోలు చేసినట్లు స్పష్టం కావడంతో ఏసీబీ కన్నెర్ర చేసింది. ప్రభుత్వాన్ని మోసం చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ మేరకు అప్పటి తమిళనాడు వైద సేవల విభాగం డైరెకర్ట్(ఈఎస్ఐ) ఇన్భశేఖర్, మదురై డివిజన్ ఈఎస్ఐ నిర్వాహక అధికారి జాన్ఆండ్రూ, పర్యవేక్షణాధికారి అశోక్కుమార్తో పాటు నలుగురిపై ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ ఐదుగురిని విచారించేందుకు కసరత్తులు చేపట్టారు. అదే సమయంలో పేద కార్మికులు, సిబ్బందికి ఈఎస్ఐ ద్వారా కాలం చెల్లిన మందులు పంపిణీ జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం రూ. 27 కోట్లు విలువైన కాలం చెల్లిన మందులు గోడౌన్లకే పరిమితమై ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా, శివగంగై జిల్లాలో 2020లో కరోనాకాలం వైద్య సామగ్రి కొనుగోలులో రూ. 60 లక్షలు అక్రమాలు జరిగినట్లుగా ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. చదవండి: Viral Video: జస్ట్ మిస్....చిన్నారిపై మూకుమ్మడిగా కుక్కలు ఎటాక్! -
చాటింగ్ చేయొద్దన్నందుకు... మెట్రో స్టేషన్ పైనుంచి దూకి
సాక్షి అమీర్పేట్: నగరంలోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సార్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ శ్రీరామ్నగర్ సమీపంలోని సంజయ్ నగర్కు చెందిన అన్వర్ఖాన్ ఆటో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, కూతురు షబ్నం బేగం (22) ఉన్నారు. షాదాన్ కాలేజీలో షబ్నం బేగం ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా షబ్నం బేగం ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో మందలించారు. మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం సాయంత్రం ఈఎస్ఐ మెట్రో స్టేషన్కు చేరుకుంది. మొదటి అంతస్తు పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. (చదవండి: భర్తపై విషప్రయోగం చేసి హత్య) -
ఈఎస్ఐ మెట్రోస్టేషన్ పైనుంచి దూకిన యువతి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమ విఫలమైందని ఓ యువతి ఈఎస్ఐ మెట్రోస్టేషన్ పైనుంచి కిందకు దూకింది. మెట్రోస్టేషన్ నుంచి దూకడంతో తీవ్రగాయాలైన ఆ యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలను కోల్పోయింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. చదవండి: కూతురి ఉసురు తీసిన తండ్రి.. అదృశ్యమైందంటూ.. -
ప్రతీ కార్మికుడికి హెల్త్ ప్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారుల ఆరోగ్య భద్రత విషయంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈఎస్ఐ పరిధిలో ఉన్న ప్రతీ కార్మికుడి హెల్త్ ప్రొఫైల్ను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డ కార్మికులకు వైద్య చికిత్స, మందుల పంపిణీ వరకు పరిమితమైన ఈఎస్ఐసీ... ఇకపై కార్మికుడి ఆరోగ్య చిట్టా మొత్తాన్ని నిక్షిప్తం చేయనుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సదరు కార్మికుడికి హెచ్చరికలు సైతం ఇవ్వనుంది. దీంతో భవిష్యత్ ఆరోగ్య పరిస్థితిపై కొంత అంచనా వస్తుందని, సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే కార్మికుడికి ఆరోగ్యకర జీవితం అందుతుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 63వేల సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలున్నాయి. వీటి పరిధిలో 21 లక్షల మంది చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 80 లక్షలు అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఏటా సగటున 3.5 లక్షల మంది ఐపీ (ఇన్పేషెంట్) కేటగిరీలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. వీటికి అదనంగా మరో 20 శాతం మంది ఓపీ సేవలు కూడా పొందేవారున్నట్లు ఈఎస్ఐసీ చెబుతోంది. ఆరోగ్య పరీక్షలు కీలకం కార్మికుల హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో ఆరోగ్య పరీక్షల ప్రాత కీలకం. దీంతో ఏడాదికోసారి కార్మికులకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఈఎస్ఐసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు మాత్రమే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు. ఇకపై హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో భాగంగా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం ఫలితాలను ఈఎస్ఐసీ వెబ్సైట్లో కార్మికుడి డేటాలో నిక్షిప్తం చేసి, ప్రతి సంవత్సరం ఈ వివరాలను అప్డేట్ చేస్తారు. పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సంబంధిత లక్షణాలు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ఆస్పత్రికి రిఫర్ చేసి చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలను అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో చేపట్టేలా చర్యలు మొదలు పెట్టారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల పనితీరుతోపాటు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు చందాదారులందరికీ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని కూడా సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
ఈఎస్ఐ కుంభకోణం: దూకుడు పెంచిన ఈడీ..
హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఈఎస్ఐ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి.. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మజ ఆస్తులతోపాటు ఫార్మసిస్టు కె. నాగమణి, కాంట్రాక్టర్లు కె. శ్రీహరిబాబు, పి. రాజేశ్వర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది. బీమా, వైద్య సేవలకు సంబంధించి రూ. 144 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఈడీ దర్యాప్తులో తెలింది. రాష్ట్ర ఏసీబీ అధికారుల కేసుల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
ఈఎస్ఐ కుంభకోణం కేసులో నలుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ బాలరవికుమార్ సహా ఓమ్ని ఎంటర్ ప్రైజెస్ యజమాని కంచర్ల శ్రీహరి, ఓమ్ని హెల్త్ కేర్ యజమాని కంచర్ల సుజాత, మేనేజర్ వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. వైద్య పరికరాలు, మెడికల్ కిట్లను 50 నుంచి 400 శాతం అధిక రేట్లకు విక్రయించినట్లు సీబీఐ నిర్థారించింది. ప్రభుత్వ ఖజానాకు రూ.35 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సీబీఐ అధికారులు నిర్థారించారు. అరెస్ట్ చేసిన నలుగురునీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
గప్ చుప్గా ఈఎస్ఐ నిధులను సర్దేశారు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో కేటాయించిన నిధులు ఆయా శాఖలకు పూర్తిస్థాయిలో రాకపోవడం సాధారణంగా జరిగేదే. అత్యంత ప్రాధాన్యరంగాలుగా ప్రభుత్వం గుర్తించిన వాటికి లేదా ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేటాయింపుల కంటే ఎక్కువ నిధులివ్వడం జరుగుతుంది. అయితే ఈఎస్ఐకి అదనంగా నిధులు రావడం, అవి పక్కదారి పట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈఎస్ఐ విభాగానికి అదనపు నిధులు కావాలని కార్మికశాఖ ప్రభుత్వాన్ని కోరడం.. ప్రభుత్వం కూడా అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేయడం వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకునే పనిలో పడ్డారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు. 2015 నుంచి 2019 వరకు ఈఎస్ఐకి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి రూ.1278.22 కోట్లు కేటాయించింది. కానీ ఈ నాలుగేళ్లలో మొత్తంగా రూ.1616.93 కోట్ల నిధులు మంజూరు చేసింది. అంటే బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రూ.338.71 కోట్లు విడుదల చేసిందని ఈఎస్ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం అదనంగా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయనే సందేహాలు, మంత్రి కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానాలు ఇదివరకే వ్యక్తమయ్యాయి. గతంలో కార్మికశాఖ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుందరెడ్డి, ఆ మాజీ మంత్రి అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. బిల్లులు ఇవ్వకుండా సతాయించి... వాస్తవానికి ఈఎస్ఐకి చెంది ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కార్మికుల కోసం ఏటా మందులు కొనుగోలు చేస్తుంది. నిబంధనల ప్రకారం.. ప్రొక్యూర్మెంట్ కమిటీ ముందు ఆసుపత్రికి ఎన్ని మందులు కావాలి? ఏయే మందులు, పరికరాలు కావాలి? అన్న విషయాలపై నివేదిక ఇస్తుంది. దాని ప్రకారం.. ఆర్సీ (రేటెడ్ కంపెనీలు) కంపెనీల నుంచి బహిరంగ టెండర్లు ఆహ్వనించాలి. వచ్చిన టెండర్లలో మార్కెట్ రేటు కంటే తక్కువకు ఎవరు కోట్ చేస్తే వారికి టెండర్ అప్పగించాలి. కానీ, ఐఎంఎస్ అధికారులు ఈ ప్రక్రియను పాటించలేదు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్ పద్మలు సరఫరా అయిన మందుల్లో 30 శాతం ఆర్సీ కంపెనీల నుంచి, మిగిలిన 70 శాతం ఎన్ఆర్సీ (నాన్ రేటెడ్ కంపెనీ)ల నుంచి తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి ఆర్సీ కంపెనీల నుంచి సింహభాగం మందులు కొనుగోలు చేయాలి. కానీ, ఉద్దేశపూర్వకంగా ఆర్సీ కంపెనీలకు బిల్లులు చెల్లించేవారు కాదని, దీంతో సదరు కంపెనీలు మందుల సరఫరా నిలిపివేయగానే.. ఆ సాకుతో ఎన్ఆర్సీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఈఎస్ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఎన్ఆర్సీకి ఎప్పుడు వెళ్లాలి? జీవో నెం 51 ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో, ఆర్సీ కంపెనీలు సరఫరా చేయలేని మందుల కోసం మాత్రమే ఎన్ఆర్సీ కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలి. దానికి సైతం ప్రొక్యూర్ కమిటీ నివేదిక, బహిరంగ టెండర్లు, కంపెనీల ఎంపిక నిబంధనలు తప్పకుండా పాటించాలి. కానీ, ఐఎంఎస్లో ఇవేమీ జరగలేదు. టెండర్లు లేకుండా కాంట్రాక్టులు అప్పగించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. రేటెడ్ కంపెనీలు అధికారులకు ఎలాంటి ముడుపులు, కమీషన్లు ఇవ్వవు. అదే, ఎన్ఆర్సీ కంపెనీలైతే అడిగినంత ఇస్తాయి. అందుకు బదులుగా కాంట్రాక్టు దక్కించుకున్నవారు ధరలు పెంచుకునే వీలును గతంలో అధికారులు కల్పించారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇష్టానుసారంగా అప్పగించిన టెండర్లకు ప్రొక్యూర్ కమిటీని ఏర్పాటు చేయనేలేదని ఈఎస్ఐ కార్మికులు ఆరోపిస్తున్నారు. వారే డొల్ల కంపెనీలను సృష్టించి, తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుని కథ నడిపారని, అందుకే అదనపు నిధులు విడుదల అయినా కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మండిపడుతున్నారు. అదృశ్య శక్తులపై ఈడీ ఆరా వాస్తవ బడ్జెట్ కంటే అధికంగా నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనలు చేయాల్సి వచ్చింది? అందుకు, ఐఎంఎస్ అధికారులు ఏం కారణం చూపారు? ఆ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు ఏ పరిస్థితుల్లో ఆమోదించారు? దీని వెనక అదృశ్య రాజకీయశక్తులు ఏమైనా ఉన్నాయా? అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఐఎంఎస్ ఆడిట్ పుస్తకాలు, ప్రభుత్వానికి విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక తదితరాలపై ఈడీ అధ్యయనం చేస్తోంది. నాలుగేళ్లలో కేటాయింపుల కంటే రూ.338 కోట్లు అధికంగా తీసుకొని ఖర్చుపెట్టి ఏం సేవలు అదనంగా అందించారు? ఎక్కడ సేవలు మెరుగుపరిచారు? అన్న విషయాలపైనా ఈడీ తవ్వడం మొదలుపెడుతోంది. ( చదవండి: ఐఎంఎస్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం ) -
ESI కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
ఈడీ సోదాలు: నాయిని అల్లుడి ఇంట్లో కళ్లు చెదిరే నగదు
-
ఈడీ సోదాలు: నాయిని అల్లుడి ఇంట్లో కళ్లు చెదిరే నగదు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కేసులో సుదీర్ఘకాలం తరువాత ముందడుగు పడింది. తాజాగా ఈ కేసు లో నిందితుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ప్రధాన నిందితులు మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి, కాంట్రాక్టర్ కంచర్ల శ్రీహరిబాబు, మాజీ కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లతో కలిపి దాదాపు ఏడు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచే నిందితుల ఇళ్లలో ఏకకాలంలో మొదలైన తనిఖీలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిశాయి. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి, మాజీ పీఎస్ ముకుందరెడ్డి, అతని బావమరిది వినయ్రెడ్డి, ఏడు డొల్ల ఫార్మా కంపెనీల అధినేత బుర్రా ప్రమోద్రెడ్డి ఇళ్లల్లో భారీగా నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.3 కోట్ల నగదు లభించిందని ఈడీ పేర్కొంది. ఇందులో శ్రీనివాసరెడ్డి ఇంట్లో రూ.1.50 కోట్లు, ప్రమోద్రెడ్డి ఇంటి నుంచి రూ.1.15 కోట్లు, ఎం.వినయ్రెడ్డి ఇంటి నుంచి రూ.45 లక్షలు, రూ.కోటి విలువైన నగలు, ఖాళీ చెక్కులు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా కారణంగా మందకొడిగా సాగిన విచారణ ఈ దాడులతో మళ్లీ వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముగ్గురు కీలక నిందితులను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2015–2019 మధ్యకాలంలో దాదాపు రూ.700 కోట్ల మందుల కొనుగోళ్లలో సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అవినీతితోపాటు మనీలాండరింగ్ కూడా జరిగిందన్న ఏసీబీ నివేదిక(8 ఎఫ్ఐఆర్లు)తో ఈడీ రంగంలోకి దిగింది. అసలేమిటీ కేసు.. ఈఎస్ఐలోని ఐఎంఎస్లో మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా 2019, సెప్టెంబర్లో ఏసీబీ రంగంలోకి దిగింది. అప్పటి డైరెక్టర్ దేవికారాణిని విచారణకు పిలిచి ఆమెతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 2015 నుంచి 2019 దాకా.. దాదాపు రూ.700 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అప్పటి డైరెక్టర్ దేవికారాణి, మాజీ డైరెక్టర్ పద్మ ఎక్కడా నిబంధనలు పాటించలేదని, మందుల సరఫరాకు టెండర్లు పిలవకుండా, అర్హతలేని కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఏసీబీ ఆరోపించింది. మందుల కొనుగోలుకు స్పష్టమైన మార్గదర్శకాలతో 2012లోనే ప్రభుత్వం జీవో నంబర్ 51ని విడుదల చేసింది. దాని ప్రకారం రిజిస్టర్డ్ కంపెనీలను మాత్రమే టెండర్లకు పిలవాలి. అత్యవసర సమయాల్లో మాత్రమే నాన్ రిజిస్టర్డ్ కంపెనీలకు టెండర్లు ఇవ్వాలి. కానీ ఈ ఒక్క లొసుగును అడ్డంపెట్టుకుని దేవికారాణి, పద్మ, ఓమ్మీ ఫార్మా ఎండీ కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీలు కథ నడిపారని ఏసీబీ గుర్తించింది. అర్హతలేని కంపెనీలకు చెందిన మందులను అధిక ధరలకు శ్రీహరిబాబు కోట్ చేయగా, వాటిని వీరిద్దరూ అంగీకరించేవారు. బదులుగా వీరిద్దరి ఖాతాల్లో రూ.కోట్లు వచ్చి చేరాయి. శ్రీహరిబాబుతో పాటు నిందితులంతా దాదాపుగా 100కు పైగా డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి సైతం కాంట్రాక్టులు దక్కించుకుని ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. చాలాసార్లు ఖాళీ ఇండెంట్లపై దేవికారాణి, పద్మ సంతకాలు చేయించుకుని తమకు నచ్చిన ధర వేసుకునేవారని ఏసీబీ గుర్తించింది. ఫలితంగా నిందితులంతా అనతికాలంలో అనేక చోట్ల భూములు, ప్లాట్లు, నగలు, నగదు కూడబెట్టారు. ఏసీబీ వారందరి చిట్టాను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరించిన వారు, బినామీలు అంతా కలిసి దాదాపు 40 మంది నిందితుల జాబితాను ఏసీబీ రూపొందించింది. ఇందులో డైరెక్టర్ నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్ వరకు ఉండటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో విచారణ జరపాలని ఈడీకి ఏసీబీ లేఖ రాసింది. అవినీతి డబ్బుతో ఆస్తులు, జల్సాలు.. సాధారణంగా మార్కెట్ ధరకంటే ఏ సంస్థ తక్కువకు కోట్ చేస్తే వారికి టెండర్ ఇస్తారు. ఇక్కడ అసలు టెండర్లే లేవు. నచ్చిన వ్యక్తికి టెండర్లు లేకుండా అందులోనూ ఏకంగా మార్కెట్ రేటు కంటే 200 శాతం అదనపు ధరకు మందులు, మెడికల్ కిట్లను సరఫరా చేసే పనులను అప్పగించడం చూసి ఏసీబీ అధికారులే విస్మయం చెందారు. అలా ప్రభుత్వ సొమ్మును నచ్చిన కాంట్రాక్టరుకు దోచిపెట్టడం, వారిచ్చిన కమిషన్లతో వీరు ఆస్తులు కొన్నారు. విందులు–వినోదాలు, జల్సాలు, విదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం చేశారు. వీరి జీతాలెంత, కొన్న ఆస్తుల విలువెంత, ఐటీ ఎంత కట్టారనే వివరాలన్నింటినీ ఏసీబీ గతంలోనే సేకరించింది. ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ ఖాతాలో 2018లో ఏకంగా రూ.54 కోట్లు వచ్చి పడ్డాయి. అతనికి రూ.99 కోట్ల విలువైన షేర్లు, రూ.24 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 2017–18లో అతను ఆదాయపు పన్నుశాఖకు రూ.19 కోట్లు పన్ను రూపంలో చెల్లించడం గమనార్హం. ఇతను లెజెండ్ అనే డొల్ల కంపెనీని సృష్టించి దానికి కృపాసాగర్ రెడ్డి అనే బినామీని కూడా పెట్టాడు. ఇక దేవికారాణి తనకు వచ్చిన డబ్బును ఏకంగా రియల్ ఎస్టేట్లో పెటుబడులు పెట్టింది. ఆమె అనుచరులు కూడా రూ.కోట్లాది విలువైన విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2020, సెప్టెంబర్లో దేవికారాణి దాదాపు రూ.4.47 కోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులను తిరిగి స్వాధీనం చేసుకుంది. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు మూడు ఫార్మా కంపెనీలు ప్రారంభించేందుకు గతంలో ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం భూమి కూడా కొనుగోలు చేశారు. ఇక మరో కీలక నిందితుని ఇంట జరిగిన పెళ్లికి నిందితుడైన మరో పెద్దమనిషి దాదాపు కిలో బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించడం వీరి మధ్య అవినీతి బంధాన్ని చాటిచెబుతోంది. అంతేకాదు మరో నిందితుడు ఏకంగా కన్స్ట్రక్షన్స్ కంపెనీని కూడా మొదలుపెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. మరి ఐఏఎస్ అధికారి సంగతేంటి? ఈ కేసులో అప్పట్లో ఓ ఐఏఎస్పై చర్యలు తీసుకోవాలని ఈఎస్ఐ సిబ్బంది గట్టిగా డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతున్నా సదరు అధికారి వీటిని తొక్కిపెట్టారని ఆరోపించారు. అంతేకాదు విజిలెన్స్ నివేదికలు బయటికి రాకుండా.. అవినీతి అధికారులకు సదరు అధికారి వత్తాసు పలికాడని, అసలు ఆయనే వీరిని చాలాకాలంగా కాపాడాడని ధ్వజమెత్తారు. నిందితులను సదరు అధికారి పరోక్షంగా సమర్థిస్తూ రాసిన లేఖలు లీకవడం కలకలం రేపింది. అదే సమయంలో ముకుందరెడ్డి, శ్రీనివాస్రెడ్డిలతోపాటు సదరు ఐఏఎస్ అధికారిని కూడా విచారించాలన్న డిమాండ్ వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. డిసెంబర్లో నిందితులను విచారించిన ఈడీ వారు చెప్పిన వివరాల ఆధారంగానే ముకుందరెడ్డి, శ్రీనివాస్రెడ్డి మధ్య ఏమైనా లావాదేవీలు జరిగాయా? అన్న కోణంలో విచారణ సాగిస్తోందని సమాచారం. ఇదే సమయంలో సదరు ఐఏఎస్ విషయంలో ఈడీ ఎలా ముందుకెళుతుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. చదవండి: ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు -
ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది. ఉదయం నుంచి ఒకేసారి 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్రెడ్డి, నాయిని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చదవండి: ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు! కన్నీరు తుడవంగ.. సొంతింట్లోకి సగర్వంగా -
హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసు
-
73 కోట్లతో విజయనగరంలో ఈఎస్ఐ ఆస్పత్రి
సాక్షి, న్యూఢిల్లీ: విజయనగరంలో 73.68 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కార్మిక బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆమోదించినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బుధవారం రాతపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య సేవలతోపాటు ఔట్ పేషెంట్, ఇన్ పేషంట్లకు ప్రత్యేక వైద్య సదుపాయాలను కల్పించబోతున్నట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసులు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, డయాగ్నోస్టిక్స్ సేవలు, మందుల పంపిణీతో వంటి సకల సదుపాయాలను అందుబాటులోకి తీసురానున్నట్లు తెలిపారు. అదే విధంగా.. ఈ ఆస్పత్రిలో ఆయుష్ కింద కూడా రోగులకు సేవలు అందిస్తారని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణాన్ని 2023 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.(చదవండి: బడ్జెట్ 2021: రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ) గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ పథకం పొడిగింపు మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రవేశపెట్టిన గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ చెల్లింపు పథకం (సీఎల్ఎస్ఎస్)ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. రాజ్యసభలో బుధవారం వఘెస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద అర్హులైన మధ్య తరగతి ప్రజలు గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని అన్నారు. అదే విధంగా అర్హులైన లబ్దిదారులు రుణం పొందిన వెంటనే వడ్డీ మొత్తాన్ని వారి అకౌంట్ ద్వారా రుణం తీసుకున్న సంస్థలకు ప్రభుత్వం బదలాయిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కింద గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ పథకాన్ని గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. 2020-21 మధ్యకాలంలో ఈ పథకం కింద 1.67 లక్షల మంది లబ్ది పొందారు. పథకం ప్రారంభిన నాటి నుంచి ఇప్పటి వరకు 4.93 లక్షల మంది ప్రయోజనం పొందారని మంత్రి చెప్పారు. -
ఈఎస్ఐ కేసు: కోటి 99 లక్షలు సీజ్!
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన కోటి 99 లక్షలను బుధవారం ఏసీబీ సీజ్ చేసింది. తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో దేవికారాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రతి నెల చిట్ ఫండ్ కంపెనీకి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఏసీబీ అధికారులు సదరు చిట్ఫండ్ కంపెనీనుంచి కోటి 99 లక్షల రూపాయల డీడీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే దేవికారాణికి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల నగదుతో పాటు రెండు కోట్ల 29 లక్షల రూపాయలను డీడీల రూపంలో స్వాధీనం చేసుకున్నారు. -
ఏబీవీకేవైతో నిరుద్యోగ భృతి
సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన ప్రవీణ్ కుమార్ స్టీల్ పాత్రలు తయారు చేసే సంస్థలో ఉద్యోగి. లాక్డౌన్తో ఉపాధిని కోల్పోయారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆధ్వర్యంలోని పథకం ద్వారా నిరుద్యోగ భృతిని పొంది కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇలా రాష్ట్రంలో వేలాది మంది ‘అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఏబీవీకేవై)’తో లబ్ధి పొందారు. విపత్కర పరిస్థితుల్లో ఉపాధిని కోల్పోయిన కార్మికవర్గం కోసం కేంద్రం ఈ పథకాన్ని ఈఎస్ఐ ద్వారా అమలు చేస్తోంది. ఎవరైనా లబ్ధి పొందాలనుకుంటే డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఎస్ఐ పరిధిలోని కార్మికులకే ఇది వర్తిస్తుంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలంటే.. esic. in/ employee పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఏబీవీకేవై క్లెయిమ్ పొందేందుకు ఉద్దేశించిన విభాగంపై క్లిక్ చేయాలి. ఆ దరఖాస్తులో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనుకుంటున్నారో నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. నిరుద్యోగ కాల వివరాలను నమోదు చేసిన ఏబీ–1 ఫారం ప్రింట్ తీసుకొని అందులో ఉన్న విషయాన్ని రూ.20 స్టాంప్ పేపర్పై టైపు చేయించి నోటరీ చేయించాలి. దానిపై దరఖాస్తుదారు సంతకం చేయాలి. ఏబీ–2 అనే ఫారంనూ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై సంబంధిత కంపెనీ యాజమాన్యం సంతకం తీసుకోవాలి. యాజమాన్యం ధ్రువీకరించకపోతే పీఎఫ్ నంబర్ను దరఖాస్తుపై వేసి ఈఎస్ఐ కార్యాలయంలో సమర్పించాలి. ఈఎస్ఐ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అఫిడవిట్కు జత చేయాలి. నిరుద్యోగ భృతి కావాలనుకున్న సమయంలో సంబంధిత దరఖాస్తుదారు ఉద్యోగం లేకుండా ఉండాలి. ఉద్యోగం పోగొట్టుకోవడానికి ముందు కనీసం రెండేళ్లపాటు ఆయా సంస్థల్లో పని చేసి ఉండాలి. ఏదో ఒక కారణంతో ఉద్యోగం పోగొట్టుకున్న వారు దీనికి అనర్హులు. ఉద్యోగులను తీసివేసినట్టు యాజమాన్యాలు ధ్రువీకరించకపోతే సమీపంలోని ఈఎస్ఐ కార్యాలయంలో అధికారిని సంప్రదించాలి. -
అవినీతి నేతకు అధ్యక్ష పదవా?
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయి బెయిల్పై బయట ఉన్న అచ్చెన్నాయుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అవినీతిలో కూరుకుపోయిన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వడం ఏమిటని పార్టీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి వ్యవహారంలో పక్కాగా దొరికిన వ్యక్తిని అందలం ఎక్కించడం దేనికి సంకేతమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోకేష్ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో అచ్చెన్నకు పదవిపై చంద్రబాబు చాలా రోజులు నాన్చుతూ వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు అధ్యక్షులను ప్రకటించడం, బీసీల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుండటంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు హడావుడిగా అచ్చెన్న పేరు ప్రకటించినట్లు పేర్కొంటున్నారు. కాగా, పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీలో సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం ఇవ్వడం, ఒక్కరికే రెండు పదవులు ఇవ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. -
'నీకు కరోనా రాను'
సాక్షి, సిటీబ్యూరో : కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈఎస్ఐ మెడికల్ కాలేజీ డీన్ శ్రీనివాస్ను టార్గెట్గా చేసుకున్నారు. నకిలీ ఈ–మెయిల్ ఐడీలు సృష్టించిన నేరగాళ్లు ఆయనకు బెదిరింపులు, శాపనార్థాలతో కూడిన మెయిల్స్ పంపుతున్నారు. కొన్నింటిలో ‘నీకు కరోన రాను’తో పాటు మరికొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో డీన్ తరఫున ఆ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ బబ్డే గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు ప్రారంభించారు. హైదరబాద్ : యూట్యూబ్ చానల్లో తాను చేసిన కామెంట్ల ఆధారంగా తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు పోస్టు చేస్తున్న వారిపై ఓ మహిళా న్యాయవాది సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో మరో కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రాయల్ సుందర్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఆయన వినియోగిస్తున్న ఓల్వో కారుకు రూ. 20 వేల రాయితీతో బీమా చేస్తామని చెప్పారు. ఇలా ఆ యజమానిని నమ్మించి ఆయన నుంచి రూ. 98 వేలు కాజేశారు. ఛత్రినాక ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన స్థలంలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పేరుతో ఆరు నెలల కాలంలో రూ. 1.09 లక్షలు కాజేసి మోసం చేశారు. మరో ఉదంతంలో బేగంపేట ప్రాంతానికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు షేర్ మార్కెట్లో పెట్టుబడులంటూ ఎర వేశారు. అతడి నుంచి రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఈ ఉదంతాలపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. -
ఈఎస్ఐ స్కాంలో దేవికారాణికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న దేవికారాణికి ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసీస్ట్ వసంత, మరో ఇద్దరు ఫార్మా ఉద్యోగులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఐటీతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అవతవకల ద్వారా వచ్చిన సొమ్ముతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ తదితరులు భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన విషయాన్ని ఏసీబీ తన దర్యాప్తులో వెల్లడించింది. దేవికారాణిపై దాడుల సమయంలో ఇందుకు సంబంధించిన పలు రసీదులు దర్యాప్తు అధికారులకు లభించడంతో ఈ విషయం వెలుగుచూసింది. -
'పదవుల్లేక వారికి మతి భ్రమించినట్టయింది'
సాక్షి, అమరావతి : కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శనివారం టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించింది.. బుద్దా వెంకన్నకు బుద్ధిలేదు. అడ్డదారిలో రాజకీయాలు చేసే వ్యక్తి ట్విటర్ లోకేష్.. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం పనికిరాడు. కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు ఆదేశించా. విచారణలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు 2014-18 మధ్య అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాం.(చదవండి : ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి) అయితే తెలకపల్లి కార్తిక్ 2019 డిసెంబర్లోనే బెంజ్ కారును కొనుగోలు చేశాడు. అయితే కారుకు సంబంధించిన కంతులు కట్టకపోవడంతో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ బెంజ్ కారును సీజ్ చేసింది. 2020 జూన్లో ఈఎస్ఐ కుంభకోణం కింద కార్తిక్పై కేసు నమోదయింది. కారు తీసుకొని ఉంటే.. ఈఎస్ఐ స్కాంలో A14 ముద్దాయిగా ఉన్న కార్తిక్ను కేసులో నేనేందుకు పేరు తొలగించలేదో చెప్పాలి. టీడీపీ నాయకులు పదవులు లేక మతిభ్రమిచ్చింది.నేను భూమి కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నందుకే కొన్నా,, ఎక్కడా భూకజ్జాకి పాల్పడలేదు. 'అంటూ చురకలంటించారు. -
ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి
సాక్షి, కర్నూలు : ఈఎస్ఐ స్కాంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకుంటే మనదే అవుతుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జయరాం మాట్లాడారు. టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. (మాకెలాంటి సంబంధం లేదు: మంత్రి జయరాం) చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమైనా పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాయల ఫకీర్ లాంటివారని అన్నారు. ఎవరిని ఏఏ శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని వాటాలు వసూలు చేశారని మండిపడ్డారు. కాగా, ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రిఅచ్చెన్నాయుడు ఇదివరకే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. ఈఎస్ఐ స్కాంపై విచారణ కొనసాగుతోంది. -
దేవికారాణి నగలపై ఈడీ ఆరా!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ఏసీబీ విచారణ మొదలుపెట్టింది. ఈ కేసును ఐటీతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఈడీ తన దర్యాప్తులో భాగంగా దేవికారాణి భర్త గురుమూర్తి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. దేవికారాణి హైదరాబాద్లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో రూ.7 కోట్లకు పైగా విలువ చేసే బంగారం కొనుగోలు చేసినట్లు తేలింది. సదరు నగల షాపు యజమానుల వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది. అయితే తమ బంధువుల డబ్బుతో ఈ బంగారం కొనుగోలు చేశామని గురుమూర్తి స్టేట్మెంట్లో పేర్కొన్నారు. (దేవికారాణి ‘రియల్’ దందా!) ముడుపుల మళ్లింపు..! ఈ అవతవకల ద్వారా వచ్చిన సొమ్ముతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ తదితరులు భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన విషయాన్ని ఏసీబీ తన దర్యాప్తులో వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితులంతా ఎక్కువగా భూములే కొన్నారు. వీరిలో దేవికారాణి మాత్రం భూములతో పాటు నగలపైనా దృష్టి సారించారు. అందుకే తనకు ముడుపులుగా అందిన నగదును నగరంలోని ప్రముఖæ నగల షాపులో అభరణాలు కొనేందుకు మళ్లించినట్లు గుర్తించారు. (ఈఎస్ఐ స్కాం: నిందితులకు 14 రోజుల రిమాండ్) చాలా సందర్భాల్లో ఆమెకు అందాల్సిన ముడుపులను తాను తీసుకోకుండా తన మనుషుల ద్వారా జ్యువెలరీస్కు మళ్లించి నగలకు ఆర్డర్ ఇచ్చేదని సమాచారం. ఈ క్రమంలోనే దాదాపు రూ.7 కోట్ల డబ్బును దేవికారాణి నగల కోసం చెల్లించింది. పూర్తి మొత్తం చెక్కులు, ఆన్లైన్ కంటే అధికంగా నగదు రూపంలో వచ్చినప్పటికీ.. నగల షాపు యాజమాన్యం కూడా ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం. దేవికారాణిపై దాడుల సమయంలో ఇందుకు సంబంధించిన పలు రసీదులు దర్యాప్తు అధికారులకు లభించడంతో ఈ విషయం వెలుగుచూసింది. -
ఈఎస్ఐ స్కాం.. కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతివ్వాలంటూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఏసీబీ ఆస్తుల జప్తునకు తాత్కలిక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి ఆస్తులు జప్తు చేశారు.పద్మ, ఆమె కుటుంబసభ్యుల పేరు మీదున్న 8.55 కోట్ల రూపాయల ఆస్తులు.. నాగలక్ష్మీకి చెందిన 2.72 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేయనున్నారు. -
ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్
-
ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మెడికల్ కిట్ల కొనుగోళ్లలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో సహా 9 మందిని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. మెడికల్ కిట్ల కొనుగోలులో వాస్తవ ధర కన్నా అనేక రెట్లు పెంచి ప్రభుత్వా నికి దాదాపుగా రూ.6.5 కోట్లు నష్టం కలిగించా రన్న అభియోగాలపై తాజాగా ఈ కేసు నమోదైంది. ఓమ్ని ఫార్మా ఎండీ కంచర్ల హరిబాబు, ఐఎంస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మతో సహా 9 మందిని శుక్రవారం అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. -
ఈఎస్ఐ స్కాంలో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈఎస్ఐ స్కాంలో మరో 6.5 కోట్ల అక్రమాలను గుర్తించినట్లు గురువారం ఏసీబీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది.వారిలో కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్ తదితరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీంతో పాటు నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఈ కేసులో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కె.వసంత ఇందిరాలపై కేసు నమోదు చేశారు. కాగా కేసుకు సంబంధించి ఏసీబీ తన విచారణను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. -
ఈఎస్ఐ స్కామ్: ఏసీబీ దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఈ స్కామ్లో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. సైబరాబాద్లో కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చిన రూ. 4 కోట్ల 47 లక్షల రూపాయలను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం బంగారపు ఆభరణాలు ఎక్కడికి తరలించారు అన్న అంశాలపై ఏసీబీ విచారణ చేస్తోంది.ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా 10 కోట్ల బంగారు ఆభరణాలు రహస్య ప్రాంతంలో దాచిపెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తుంది. స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్ల ఉందంటున్న ఏసీబీ భావిస్తోంది. దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసింది. ఒక పక్క విచారణ కోనసాగుతుండగానే నిందితులు తమ ఆస్తులను, బంగారపు ఆభరణాలను పక్క ప్లాన్ తో దారి మళ్లించినట్లు ఏసీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితులకు సంబంధించిన వందల కోట్ల ఆస్తులను ఏసీబీ సీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నిందితులకు సంబంధించి కోట్ల రూపాయలు బయట పడడంతో ఏసీబీ షాక్ గురైంది. దేవికారానికి నోటీసులు ఇచ్చి మరోసారి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, ఫార్మా సిస్ట్ నాగలక్ష్మి భారీ స్కామ్కు పాల్పడిన విషయం తెలిసిందే. గతేడాది ఈ కేసు మెడికల్ డిపార్ట్మెంట్లో పెను సంచలనాన్ని రేపింది. చదవండి: దేవికారాణి ‘రియల్’ దందా! -
దేవికారాణి ‘రియల్’ దందా!
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో మందుల కొనుగోళ్లలో జరిగిన అవినీతి జాడలు తవ్వినకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆమె రియల్ ఎస్టేట్ లావాదేవీ లను సైతం మంగళవారం వెలుగులోకి తెచ్చింది. దేవికారాణి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ వెంచర్లో చదరపు అడుగుకు రూ.15 వేల విలువ కలిగిన 6 ఫ్లాట్లను కుటుంబ సభ్యుల పేరిట కొనేందుకు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలిసి రూ.4.47 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలని ఏసీబీ తేల్చింది. ఈ మొత్తం.. లెక్కల్లోలేని నగదుగా గుర్తించింది. ఈ పెట్టుబడుల్లో రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట దేవికారాణి ఇన్వెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు రూ.2,29,30,000 మొత్తాన్ని చెక్కులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆమె చెల్లించినట్టు చెప్పారు. బయటపడిన నోట్ల కట్టలు ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు సంబంధిత వెంచర్ డెవలపర్కు నోటీసులు అందజేశారు. ఆస్తులు అటాచ్ చేస్తామంటూ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ఖాతాకు దేవికారాణి, నాగలక్ష్మి పంపిన మొత్తం డబ్బును సదరు డెవలపర్ డ్రా చేసి ఏసీబీకి తిరిగి అప్పగించాడు. భారీ మొత్తం కావడంతో రూ.500, రూ.2,000 నోట్లకట్టలు నాలుగు టేబుళ్లను ఆక్రమించాయి. తాజా ఉదంతంలో రూ.4.47 కోట్లు దొరకడంతో కీసర తహసీల్దార్ వద్ద లభించిన రూ.కోటీ పది లక్షల రికార్డును తిరగరాసినట్లైంది. -
అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా, అనారోగ్యం బారినపడ్డ అచ్చెన్నాయుడుకు రమేష్ ఆస్పత్రి, ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో చేర్పించి ప్రభుత్వం చికిత్స అందించింది. ఇదిలాఉండగా.. ఈఎస్ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. (చదవండి: సిఫార్సు వేరు.. ఆర్డర్ వేరు) -
ఎన్నారై ఆసుపత్రికి అచ్చెన్నాయుడు
సాక్షి, గుంటూరు : ఈఎస్ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును శనివారం రాత్రి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈఎస్ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు.(చదవండి : ‘ఈఎస్ఐ స్కామ్లో ఎవరి వాటా ఎంతో తేలుస్తాం’) ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా కాల్ సెంటర్లో చూపించిన కాల్స్ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. -
ఎన్నారై ఆసుపత్రికి అచ్చెన్నాయుడు
-
‘ఈఎస్ఐ స్కామ్లో ఎవరి వాటా ఎంతో తేలుస్తాం’
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన 150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ ఇంకా కొనసాగుతోందని ఏసీబీ జేడీ రవికుమార్ గురువారం తెలిపారు. రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కాంలో ఎవరి వాటా ఎంతో త్వరలోనే తేలుస్తామని, గుర్తించిన నిందితులంతా రింగ్గా ఏర్పడి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. కాగా డబ్బుల పంపకాలకు సంబంధించిన వాటాలపై నిందితుల నుంచి వివరాలు రాబట్టనున్నామని పేర్కొన్నారు. ఈఎస్ఐ స్కామ్లో టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు డబ్బులు చేరలేదని ఏసీబీ చెప్పినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసిన ఎవరినీ వదిలి పెట్టమని, నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తప్పుడు వార్తలతో కేసును తప్పుదారి పట్టించే యత్నం సరికాదని రవికుమార్ పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: అరకొర జవాబులు.. ఆపై దాటవేత -
సిఫార్సు వేరు.. ఆర్డర్ వేరు
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వడం వేరు, కచ్చితంగా చేయాలని ఆర్డర్ లెటరు ఇవ్వడం వేరు.. అని అవినీతి నిరోధక శాఖ సంయుక్త సంచాలకులు రవికుమార్ వెల్లడించారు. ఈఎస్ఐ స్కాములో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఫలానా కంపెనీకే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారని, దీంతో మంత్రి, ఆయనతోపాటు ఆ సర్వీసు ప్రొవైడరూ ఇద్దరూ నిందితులేనన్నారు. టెలీహెల్త్ సర్వీసెస్కు సంబంధించి అచ్చెన్నాయుడు మొత్తం మూడు లేఖలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏమన్నారంటే... ► మొత్తం రూ.975 కోట్ల కొనుగోళ్లలో రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు నిర్ధారించాం. ► రూ.లక్ష విలువ దాటితే ఈ–ప్రొక్యూర్మెంట్కు వెళ్లాలి. కానీ, నామినేషన్ కింద ఇచ్చారు. ► కడప ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ జనార్దన్ ఇందులో కీలకపాత్ర పోషించారు. ► అధిక ధరలతో బడ్జెట్కు మించి కొనుగోళ్లు జరిపారు. కొన్ని మందులు 140% ఎక్కువ రేటుకు కొన్నారు. ► డ్రగ్స్కు రూ.293.51 కోట్లు కొనుగోలు అవకాశం ఉండగా, రూ.698.36 కోట్లకు కొన్నారు. ► డిస్పెన్సరీల నుంచి ఇండెంట్లు లేకుండానే కొన్నారు. ఆ మందులు కూడా ఆస్పత్రులకు చేరలేదు. ► అమరావతి, తిరుమల వంటి మెడికల్ ఏజెన్సీలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఆ తర్వాత మాయమయ్యాయి. ► ఈ కేసులో 12మందిని అరెస్టు చేశాం. మరో 8 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరో 5 మంది నిందితులను గుర్తించాం. వారికోసం ఏసీబీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి పితాని కుమారుడు వెంకటసురేష్ కూడా ఉన్నారు. ► ఈ కేసుపై త్వరలోనే చార్జిషీట్ వెయ్యబోతున్నాం. -
ఈఎస్ఐ స్కాం: త్వరలోనే చార్జ్షీట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన 150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా కాల్ సెంటర్లో చూపించిన కాల్స్ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. ఈ విషయం గురించి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ కాల్స్ని లిస్ట్లో చూపించి బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో తొమ్మిది మందికి సంబంధించి ఈ కేసులో ఆధారాలు సేకరించామని తెలిపారు. త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని , నిందితుల సంఖ్య కూడా ఇరవై ఐదుకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో మందులు, సర్జికల్, ల్యాబ్, మెడికల్, ఫర్నిచర్ కొనుగోలులో జరిగిన అవినీతిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. మందులు కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలను పాటించలేదని తేలింది. నిర్ణీత ధర కంటే ఎక్కువ రేట్లకు మందులను కొన్నట్టు గుర్తించాం. రూ.103 కోట్లు విలువ చేసే మందులు నాన్ కాంట్రాక్టులో కొన్నారు. లక్ష పైన కొనే వాటిని ఈ ప్రోక్యూర్లో కొనాలి, అయితే డైరెక్టర్స్ అలా కాకుండా కొన్ని సంస్థలతో కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారు. ఈ టెండర్లు పక్కన పెట్టి 400 కోట్లకు కొనుగోళ్లు జరిపారు. ధనలక్ష్మి అనే ఉద్యోగిని కుమారుడు అమరావతి మెడికల్స్, తిరుమల మెడికల్స్ ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. వాటిని 2019 తర్వాత మూసేసిన్నట్లు గుర్తించాం’’ అని రవికుమార్ తెలిపారు. కింద ఆసుపత్రి నుంచి స్టాక్ ఆడిగితేనే మందుల సరఫరా జరగాలని.. అయితే డాక్టర్ జనార్దన్ అనే వ్యక్తి మాత్రం 4 కోట్లు విలువైన మందులు అవసరం లేకుండా కొన్నారని పేర్కొన్నారు. కొన్న మందులను ఏం చేశారో తెలీయదని, స్టాక్ బోర్డు లెక్కలు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రమోద్ రెడ్డి, నీరజ్ రెడ్డి అనే వ్యక్తులకు మంత్రి అచ్చెన్నాయుడు టెలీ సర్వీసెస్ పేరుతో కాంట్రాక్టు ఇప్పించారని రవికుమార్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు ముందస్తు బెయిల్ తీసుకొని విచారణ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసులో నిందితులందరినీ పట్టుకొని త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. -
ఈఎస్ఐ స్కామ్లో కొత్తగా ముగ్గురుపై కేసు నమోదు
-
అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టివేత
-
అచ్చెన్నాయుడికి మరోసారి చుక్కెదురు
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్నాయుడు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా తిరస్కరణకు గురయ్యాయి. ఇక అచ్చెన్నాయుడుతోపాటు ఈఎస్ఐ స్కామ్లో అరెస్టయిన ఏ1 రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ పీఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. (ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేటు దందా) -
కరోనా బూచి చూపి ఇతర రోగులపై నిర్లక్ష్యం
అమీర్పేట: కరోనా బూచి చూపి ఇతర రోగుల పట్ల ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వవ్యవహరిస్తున్నారని, అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను సైతం వాయిదా వేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సనత్నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కళాశాల బోధనా ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్–19 వార్డులు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని కూడా కేటాయించి సేవలందిస్తున్నారు. మిగతా విభాగాల ద్వారా ఈఎస్ఐ కార్డు లబ్ధిదారులకు చికిత్సలు అందించాల్సి ఉండగా.. వైద్యులు, అధికారులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసరంగా ఆసుపత్రికి వస్తున్న రోగులకు నామమాత్రంగా సేవలందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని రోగులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రోగాలతో వచ్చే వారికి మందులతో సరిపెడుతూ కావాల్సిన వైద్య పరికరాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన ఆనంద్కిషోర్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం ఆసుపత్రిలో చేరాడు. కాలుకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఇప్పట్లో శస్త్ర చికిత్స చేయలేమని, కొంత కాలం పాటు వాకర్ సాయంతో నడవాలని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే వాకర్ కోసం ఆసుపత్రి చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని కిషోర్ వాపోయాడు. దీంతో బెడ్డుకే పరిమితమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. పడుకుంటే ఆయాసం వస్తోందని, ఇటీవల ఆసుపత్రి వెళ్లగా బెల్టు పెట్టుకోవాలని సూచించారన్నారు. వాకర్ ఇవ్వాలని కోరితే సరైన సమాధానం ఇవ్వడంలేదని, ఇక బెల్టు కోసం ఎవరిని అడగాలో అర్థం కావడం లేదన్నాడు. 15 ఏళ్లుగా ఈఎస్ఐకి డబ్బులు కడుతున్నామని, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరిన తమకు సకాంలో వైద్యం ఇవ్వకుంటే కార్డు ఉండి లాభం ఏమిటని కిషోర్ వాపోయాడు. ఆసుపత్రికి వచ్చే అనేక మంది రోగులు ఇదే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ బూచిని చూపి అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను వేయిదా వేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తవ్వినకొద్దీ..
-
పితానీ.. ఇదేం పని!
సాక్షి, అమరావతి : ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)లో కార్మికుల కడుపు కొట్టి రూ.కోట్లు కొట్టేసిన అప్పటి నేతలు, అధికారుల అవినీతి ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. నాణ్యతను గాలికొదిలేసి, ఏజెన్సీల నుంచి వచ్చే కమీషన్ల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టిన తీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలోని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో జరిగిన అవినీతి తాజాగా బయటికొచ్చింది. ఒక ఏజెన్సీ కోసం ఏకంగా ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన నివేదికనే తొక్కిపెట్టి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. మరోవైపు ఆయన కుమారుడు వెంకట సురేష్ స్లిప్పులు రాసిచ్చి నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఔషధ నియంత్రణ శాఖ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు ►2019 ఫిబ్రవరిలో ఈఎస్ఐ ఆస్పత్రులకు సరఫరా చేసిన పారాసెటిమాల్ మాత్రలు డొల్ల అని, సరఫరా చేసిన ఏజెన్సీని రద్దుచేయండని ఔషధ నియంత్రణ శాఖ నివేదిక ఇచ్చింది. ►ఆ నివేదికను మంత్రి పితాని ఒత్తిడి మేరకు చెత్తబుట్టలో వేశారు. ఏజెన్సీపై కనీస చర్యలూ తీసుకోలేదు. ఏజెన్సీతో ఉన్న లావాదేవీలే కారణం ►2016లో తయారైన ఈ మందులు 2019 ఆగస్ట్తో ఎక్స్పెయిరీ అవుతాయన్న ఉద్దేశంతో ఆదరాబాదరాగా సరఫరా చేశారు. ►ఈ మందులను తిరుమల మెడికల్ ఏజెన్సీస్ సరఫరా చేసింది. ప్రస్తుతం ఈ ఏజెన్సీ అధినేత కార్తీక్ జైల్లో ఉన్నారు. ►2019 ఫిబ్రవరిలో ఈఎస్ఐ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందులు నాసిరకమైనవని తిరుపతి డ్రగ్ ఇన్స్పెక్టర్ నివేదిక ఇచ్చారు. ► ఈ నివేదికను జేడీ జగదీప్ గాంధీ.. అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్కు పంపి చర్యలు తీసుకోమన్నారు. అప్పటి మంత్రి పితాని ఒత్తిళ్ల మేరకు డైరెక్టర్ చర్యలు తీసుకోలేదు. ►తిరుమల ఏజెన్సీస్ విజయవాడలోని భవానీపురంలో ఓ అపార్ట్మెంట్ చిరునామా ఇచ్చారు. ►పోలీసుల విచారణలో ఆ చిరునామాలో ఇలాంటి ఏజెన్సీనే లేదని తేలింది. ►మాత్రలు నాసిరకం అని తేలిన మరుసటి రోజునే ఆ చిరునామా ఇంటికి నోటీసు అతికించగా.. ఎవరూ స్పందించలేదు. ► సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టకపోవడంతో మంత్రి స్వయానా ఏజెన్సీని కాపాడేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. స్లిప్పులు రాసి పంపించేవారు ►మంత్రి పితాని కుమారుడు వెంకట సురేష్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా నొక్కేశారు. ►రేటు కాంట్రాక్టులో లేని ఏజెన్సీల నుంచి కొనుగోళ్లు చేయడమే కాదు, ఎక్కువ రేటుకు తీసుకోవాలని సిఫార్సు చేసేవారు. మంత్రి కొడుకు చేసిన ఈ వ్యవహారాలను ఈఎస్ఐ అధికారులు కొంతమంది ఏకరువు పెట్టారు. వాళ్లు ఏమంటున్నారంటే.. ►మంత్రి కొడుకు స్లిప్పులు రాసి తమకు పంపించేవారు. వాటి ఆధారంగా ఇచ్చాం. స్లిప్పు రాసిచ్చాక మళ్లీ ఫోన్లు చేసేవారు. స్లిప్పులను తర్వాత చించేసేవాళ్లం. ► మంత్రి కొడుకు సిఫార్సు చేసిన వాటిలో రేటు కాంట్రాక్టులో లేని సంస్థలే ఉన్నాయి. ► బిల్లుల చెల్లింపుల్లోనూ స్లిప్పులు రాసి పంపించేవారు. -
ఈఎస్ఐ స్కాం : మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్
-
అచ్చెన్నాయుడు లేఖతో సంబంధం లేదు
తెనాలి: ఈఎస్ఐ పరికరాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి ఆరోపణల కేసులో జైలులో ఉన్న మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు రాసిన లేఖతో బీసీలకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. హత్యానేరంలో జైలుకెళ్లిన మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విషయంలోనూ బీసీలకు సంబంధం లేదని తెలిపారు. బీసీ నేతలు ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటే అవి స్వయంకృతాపరాధాలు మినహా బీసీ హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసం చేసే త్యాగాలుగా బీసీలు భావించవద్దని పేర్కొన్నారు. -
కుక్కలకు ఆహారంగా కరోనా మృతదేహాలు
అమీర్పేట: కరోనా బారినపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక రోగులు విలవిల్లాడుతుండగా పాజిటివ్ మృతదేహాల దాహన సంస్కారంలోనూ జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈఎస్ఐ హరిశ్చంద్ర శ్మశాన వాటికలో మృతదేహాలు పూర్తిగా కాలిపోకముందే వాటిని వదిలేసి వెళ్లిపోతున్నారు. దీంతో కుక్కలకు పాజిటివ్ మృతదేహాల విడిభాగాలు ఆహారంగా మారుతులన్నాయి. ఆదివారం వీధి కుక్కలు పాజిటివ్ మృతదేహాల విడిభాగాలను పీక్కుతుంటుండటాన్ని గుర్తించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీని వల్ల కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదముందని వారు వాపోతున్నారు. ప్రతి రోజు 10 నుంచి 18 కరోనా మృతదేహాలు శ్మశానవాటికకు వస్తున్నట్లు సమాచారం. శ్మశాన వాటిలో పనిచేసే కాటికాపరి కాకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది చేత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి తరువాత మృతదేహాలను తీసుకు వస్తుండటం, ఆ సమయంలో విద్యుత్ దహనవాటిక పనిచేయకపోవడంతో కట్టెలు పేర్చి చితి మంటలు వెలిగించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఉదయం అక్కడికి చేరుకుంటున్న కుక్కలు కాలకుండా ఉన్న శరీర భాగాలను లాక్కెళుతున్నాయి. ఇళ్ల మధ్య తిగిగే కుక్కలు వాటిని మనుషుల్ని కరిస్తే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి విద్యుత్ దాహన వాటికలోనే పాజిటివ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతున్నారు. -
ఈఎస్ఐ స్కాంలో పదికి చేరిన అరెస్టుల సంఖ్య
-
ఈఎస్ఐ స్కాంలో మరో వ్యక్తి అరెస్ట్..
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కాంలో అరెస్టుల సంఖ్య పదికి చేరింది. తాజాగా మరో వ్యక్తిని ఏసీబీ అరెస్ట్ చేసింది. విజయవాడ భవానీపురంలో తిరుమల మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న తెలకపల్లి కార్తీక్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను విజయవాడ సబ్జైలుకు తరలించారు. నకిలీ కొటేషన్లతో అధిక ధరలకు ఆర్డర్లు పొందినట్టు ఏసీబీ నిర్ధారించింది. ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడితో సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.(అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ తిరస్కరణ) -
‘ఈసీజీల పేరుతో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం’
-
‘ఈసీజీల పేరుతో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం’
సాక్షి, విజయవాడ: టెలీ హెల్త్ సర్వీస్ ద్వారా భారీగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి అన్నారు. టెలీ హెల్త్ సర్వీస్తో ఎంవోయూ చేసుకోవాలని, ఈఎస్ఐ డైరెక్టర్లను ఆదేశిస్తూ అచ్చెన్నాయుడు లేఖ రాశారని ఆయన తెలిపారు. తెలంగాణకు చెందినవారిని ఏపీ రికార్డుల్లో నమోదు చేయించారని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘రూ.లక్షకు మించి కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఆ నిబంధనలను కూడా పట్టించుకోలేదు. టెలీ హెల్త్ సర్వీసెస్కు రూ.3కోట్లు అక్రమంగా చెల్లించారు. ఈసీజీలకు చెల్లించే మొత్తాన్ని కూడా రూ.480కి పెంచారు. దీని వల్ల రూ.280 అదనంగా చెల్లించిన పరిస్థితి. ఈసీజీల పేరుతో మరో రూ.4వేల కోట్లు దుర్వినియోగం జరిగింది. మందుల కొనుగోళ్లలో కూడా ఈఎస్ఐ నిబంధనలను పాటించలేదు. ఈ- ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలవకుండా.. తమకు నచ్చినవారికి కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు. మార్కెట్లో ధర కంటే 50 శాతం అదనంగా చెల్లించి మందులు కొనుగోలు చేశారు. ఫేక్ కొటేషన్లను కూడా కొనుగోళ్ల ప్రక్రియలో ఉపయోగించారు. ఈ మొత్తం రూ.160 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆధారాలున్నాయి’అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: అచ్చెన్నాయుడుకు చుక్కెదురు) -
అచ్చెన్నాయుడుకు చుక్కెదురు
-
అచ్చెన్నాయుడుకు చుక్కెదురు
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు శుక్రవారం కొట్టేసింది. కాగా, ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్తో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసే దిశగా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడితోపాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఏసీబీ ఆయనతో సహా 9 మందిని అరెస్ట్ చేసింది. (‘మనసా, వాచా ఆయన వైఎస్సార్సీపీతో లేరు’) -
ఈఎస్ఐ స్కాంతో సంబంధం లేదని చెప్పగలరా ?
సాక్షి, శ్రీకాకుళం : మాజీమంత్రి అచ్చెన్నాయుడుకి ఈఎస్ఐ కుంభకోణంతో సంబంధం లేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన..బాబాయ్ అచ్చెన్నాయుడి అక్రమాలు టీడీపీ ఎంపి రామ్మోహన్కి కూడా తెలుసని అన్నారు. 35 లక్షలమంది కార్మిక కుటుంబాల డబ్బును అక్రమంగా తరలించారని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమాలు, అవినీతి ఎవరూ అడగకూడదన్నట్లు నారా లోకేష్ మాట్లాడటం హస్యాస్పదం అన్నారు. అంతేకాకుండా అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై మొట్టమొదటిసారి స్పందించింది సీఎం వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. వైద్య బృందం నివేదిక ప్రకారమే ఆయనను జైలుకి తరలించారని అప్పలరాజు పేర్కొన్నారు. కాగా, ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. (టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి ) -
ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
-
ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసుల అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. కాగా, ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా గుంటూరు జీజీహెచ్కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు జీజీహెచ్లోనే మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడును విచారించారు. తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.(చదవండి : ఈఎస్ఐ స్కామ్లో ఆచితూచి అడుగులు) -
ఈఎస్ఐ స్కామ్లో ఆచితూచి అడుగులు
సాక్షి, అమరావతి: ఈఎస్ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్తో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసే దిశగా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడితోపాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఏసీబీ అచ్చెన్నాయుడు సహా 9 మందిని అరెస్ట్ చేసింది. టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కాల్ సెంటర్, ఈసీజీ సేవల్లో జరిగిన దోపిడీపై ఒక కేసు.. మందులు, పరికరాలు, వైద్య సామగ్రి కొనుగోలులో చోటుచేసుకున్న అక్రమాలపై మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారాలతో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ల నుంచి ఆశాజనక సమాచారం ► కుంభకోణం వెనుక చీకటి కోణాలను గుర్తించిన ఏసీబీ కీలక విషయాలను రాబట్టేందుకు అచ్చెన్నను 3 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది. ► విచారణకు అచ్చెన్నను సహకరించకుండా దాటవేత ధోరణి అవలంబించినట్టు సమాచారం. ఇదే సమయంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లతోపాటు పలువుర్ని 2 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన ఏసీబీకి ఆశాజనకమైన సమాచారం వచ్చినట్టు తెలిసింది. ► ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఏంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్లను ఏసీబీ లోతుగా ఆరా తీసినట్టు సమాచారం. ► కుంభకోణంలో తమ పాత్రను నర్మగర్భంగా అంగీకరించిన మాజీ డైరెక్టర్లు, కొందరు ఉద్యోగులు.. ఇదంతా అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో చేశామనే విషయాన్ని గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. ► వారిచ్చిన కీలక సమాచారం అచ్చెన్నతోపాటు మిగిలిన వారికీ బలంగా చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ► స్కామ్లో ఎవరి పాత్ర ఉంది? ఎవరి వాటా ఎంత? అనే కోణాల్లో కొంత క్లారిటీకి వచ్చిన ఏసీబీ మరింత ముందుకు సాగేందుకు నిర్ణయించింది. ► ఇప్పటికే ఏసీబీ సేకరించిన సమాచారం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక, కస్టడీలో నిందితులు ఇచ్చిన వివరాలను క్రోఢీకరించుకుని కార్యాచరణ చేపట్టనుంది. ► నిందితులందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వారినుంచి మరింత కీలక సమాచారం రాబట్టి ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న మిగిలిన వారి ఆట కట్టించేందుకు ఏసీబీ స్కెచ్ వేసింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ► టెలీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రమోద్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ బృందాలు హైదరాబాద్, కోదాడ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. ► ఏపీ సచివాలయంలో టీడీపీ హయాంలో చేతివాటం ప్రదర్శించిన ఓ ఉద్యోగి గురించి ఏసీబీ ఆరా తీస్తోంది. ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసి విచారిస్తే మరికొందరి కీలక వ్యక్తుల బాగోతం బయటకు వస్తుందంటున్నారు. -
అరకొర జవాబులు.. ఆపై దాటవేత
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ–2 నిందితునిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఏసీబీ విచారణకు సహకరించలేదని, అరకొర సమాధానాలు.. ఆపై దాటవేత ధోరణిని అవలంబించినట్టు సమాచారం. ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం(సీఐయూ) డీఎస్పీలు పీఎస్ఆర్కే ప్రసాద్, చిరంజీవితో కూడిన బృందం గుంటూరు జీజీహెచ్లో 25, 26, 27 తేదీల్లో విచారణ నిర్వహించింది. తొలిరోజు మూడు గంటలు, రెండోరోజు ఐదు గంటలు, మూడోరోజైన శనివారం నాలుగున్నర గంటలు చొప్పున మొత్తంగా మూడు రోజుల్లో 12.30 గంటలపాటు విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విచారణకు అచ్చెన్నాయుడు ఏమాత్రం సహకరించలేదు. లేఖ రాసినట్టు మినహా మిగిలిన విషయాల్లో స్పష్టత ఇవ్వలేదు. సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని సమాచారం. ► లేఖ మాత్రమే రాశానని, మాటమాత్రంగా సిఫారసులు చేశానని అంగీకరించిన అచ్చెన్నాయుడు ఆ తర్వాత జరిగిన ఒప్పందాలు, సంతకాలు తదితర అంశాల్లో తన ప్రమేయం లేదని దాటవేత ధోరణితో మాట్లాడినట్టు తెలిసింది. పరికరాలు, కొనుగోళ్ల కాంట్రాక్టును తాను సూచించిన సంస్థకే కట్టబెట్టాలి అన్నట్టుగా సిఫార్సు లేఖలో ‘ఇన్ మై ఆర్డర్’ అని పేర్కొనడాన్ని ఏసీబీ అధికారులు ప్రస్తావిస్తూ.. సాధారణంగా సాధ్యాసాధ్యాలను బట్టి నిబంధనలకు లోబడే కాంట్రాక్టు ఇవ్వాలని సూచిస్తారని, మీరెందుకు ‘ఇన్ మై ఆర్డర్’ అని రాశారని అడిగిన ప్రశ్నకు అచ్చెన్నాయుడు నీళ్లు నమిలినట్టు సమాచారం. ► టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన టోల్ ఫ్రీ, ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, పరికరాల కొనుగోళ్లపై ఎన్ని ప్రశ్నలు వేసినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ముగిసిన కస్టడీ.. రిమాండ్ పొడిగింపు అచ్చెన్నాయుడుకు ఏసీబీ కస్టడీ శనివారం సాయంత్రంతో ముగిసింది. అయితే విచారణ సమయంలో సరైన సమాధానాలు రాకపోవడంతో లోతైన దర్యాప్తుకోసం మరోసారి ఆయన్ని ఏసీబీ కస్టడీకి కోర్టును కోరే అవకాశముంది. అచ్చెన్నాయుడి జ్యుడీషియల్ రిమాండ్ శనివారం సాయంత్రంతో ముగియగా.. వచ్చే నెల 10 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఏంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్లను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు 2 రోజుల విచారణ అనంతరం శుక్రవారమే వారిని జైలుకు తరలించారు. -
‘మై ఆర్డర్’ వెనుక ఉన్న ఉద్దేశాలేమిటి?
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ స్కామ్లో మూడో రోజు ఏసీబీ విచారణ ముగిసింది. జీజీహెచ్లో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, ఈ రోజు కూడా ఆయన విచారణకు సహకరించలేదని తెలిసింది. టెలీహెల్త్ సర్వీసెస్కు కాంట్రాక్ట్ ఇవ్వమని ఆదేశించిన లెటర్ను ఏసీబీ బయటపెట్టింది. ఆ లెటర్ లో ‘మై ఆర్డర్’ అనే పదాన్ని వాడటం వెనుక ఉద్దేశాన్ని ఏసీబీ ప్రశ్నించింది. టెలీ హెల్త్ సర్వీసెస్ కాంట్రాక్టర్ తో అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. కోట్ల రూపాయలు ఒకే సంస్థకు చెల్లించడంపై ప్రశ్నించారు. కాల్ సెంటర్ కు వచ్చిన కాల్స్ పై కూడా ఏసీబీ అధికారులు విచారించారు. ఆ ఫోన్ నెంబర్లన్నీ తెలంగాణవేనని నిర్ధారణ అయినట్టు సమాచారం. ఈసీజీ పేరుతో డబుల్ రేట్లు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే చేసి నిధులు కొల్లగొట్టినట్లు తేలింది. కాగా, అచ్చెన్నాయుడు సహా 8 మంది పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. వారికి జులై 10 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (‘ఎందుకలా చేశారు.. మీ ఇంట్రెస్ట్ ఏమిటి’) -
ఏసీబీ విచారణ.. సహకరించని అచ్చెన్న
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణంలో మూడో రోజు ఏసీబీ అధికారులు విచారణ ముగిసింది. ఈఎస్ఐ స్కామ్లో ఏ–2 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును జీజీహెచ్లో ఏసీబీ అధికారులు ప్రశ్నించగా, నేడు కూడా ఆయన విచారణకు సహకరించలేదని తెలిసింది. నేటితో కస్టడీ ముగియడంతో కీలక అంశాలపై ఏసీబీ ఆరా తీసినట్లు సమాచారం. పదిన్నర గంటల పాటు కొనసాగిన విచారణలో కొన్ని ప్రశ్నలకు అసంపూర్తిగా, మరికొన్నిటికి అబద్దాలు చెప్పినట్లు సమాచారం. మూడో రోజు కూడా అచ్చెన్నాయుడు విచారణకు సహకరించకపోవడంతో ఏసీబీ బృందం జీజీహెచ్ నుంచి తిరిగి వెళ్లిపోయింది. (‘ఎందుకలా చేశారు.. మీ ఇంట్రెస్ట్ ఏమిటి’) నిన్న (శుక్రవారం) రెండోరోజు ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు పీఎస్ఆర్కే ప్రసాద్, చిరంజీవి నేతృత్వంలో 5 గంటల పాటు విచారణ జరిపారు. విచారణ సమయంలో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేసినట్టు సమాచారం. టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన టోల్ ఫ్రీ, ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, ఇతర పరికరాల కొనుగోళ్లపై ఏసీబీ ప్రశ్నించినట్టు తెలిసింది. (ఈఎస్ఐ స్కాం మూలాలపై కన్ను) -
‘ఎందుకలా చేశారు.. మీ ఇంట్రెస్ట్ ఏమిటి’
సాక్షి, అమరావతి/గుంటూరు: ‘ఎందుకలా చేశారు.. లేఖలు, సిఫారసులతో ఈఏస్ఐ అధికారులపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు.. ఈ వ్యవహారాల్లో మీ ఇంట్రెస్ట్ ఏమిటి’ అంటూ ఈఎస్ఐ స్కామ్లో ఏ–2 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కుంభకోణంలో అరెస్టయి రిమాండ్లో ఉన్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ శుక్రవారం కూడా విచారణ చేసింది. ఐదు గంటలపాటు విచారణ ► రెండో రోజు విచారణకు ముందు అచ్చెన్నకు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కొపి అయిన తర్వాత ఆయనను ప్రత్యేక వార్డుకు తరలించిన ఏసీబీ అధికారులు అక్కడే విచారణ చేశారు. ► ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు పీఎస్ఆర్కే ప్రసాద్, చిరంజీవి నేతృత్వంలో 5 గంటల పాటు విచారణ జరిపారు. ► విచారణ సమయంలో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేసినట్టు సమాచారం. ► టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన టోల్ ఫ్రీ, ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, ఇతర పరికరాల కొనుగోళ్లపై ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. కీలకాంశాలివీ..: ‘మీరు ఇచ్చిన లేఖలు, సిఫారసులతోనే ఈఎస్ఐ స్కామ్కు తెరలేచింది. ఇందులో రూ.150 కోట్లకుపైగా ప్రజాధనం దుర్వినియోగమైంది. మీరు లేఖలు, సిఫారసులు చేయడానికి గల కారణాలు ఏమిటి. కొన్ని కంపెనీలకు మీరు ఎందుకు సిఫారసులు చేశారు. ఆ కంపెనీల వాళ్లు మీకు ముందే తెలుసా? గుర్తింపు కలిగిన కంపెనీలు ఉన్నా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. నామినేషన్ పద్ధతులు, నకిలీ కొటేషన్లు, బిల్లులు వంటి వాటితో జరిగిన అవినీతి, అక్రమాలు గురించి మీకు తెలుసా. ఇందులో మీ పాత్ర ఎంత?’ అనే ప్రశ్నలతోపాటు వివిధ కోణాల్లోనూ ప్రశ్నించినట్లు సమాచారం. తాను లేఖలు ఇచ్చినట్టు, సిఫారసులు చేసినట్టు అంగీకరించిన అచ్చెన్న ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. అచ్చెన్న ఒత్తిడితోనే చేశాం: మాజీ డైరెక్టర్లు కోర్టు అనుమతితో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జేడీ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్లను కస్టడీకి తీసుకున్న ఏసీబీ.. శుక్రవారం విచారణ జరిపారు. అచ్చెన్న లేఖలు, సిఫారసుల వల్లే తాము నామినేషన్ పద్ధతిలో టెలీ హెల్త్ సర్వీసెస్ సేవలు, మందులు, పరికరాలకు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నట్టు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు అంగీకరించినట్టు తెలిసింది. వారిని వేర్వేరుగా ప్రశ్నించగా.. అచ్చెన్న లేఖలు, సిఫారసులు ఒత్తిళ్లపై వాస్తవాలను వారు ఏసీబీ అధికారుల వద్ద కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం. -
ఈఎస్ఐ స్కామ్ : ముగిసిన రెండో రోజు విచారణ
సాక్షి, విజయవాడ/గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసులో నిందితుల రెండో రోజు విచారణ ముగిసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విచారించారు. ఉదయం నుంచి రెండు దఫాలుగా 5 గంటల పాటు అధికారులు అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. డొల్ల కంపెనీలకు ఆర్డర్లు, పరికరాల కొనుగోలు గోల్మాల్పై అధికారులు ప్రశ్నలు సంధించారు. సిఫార్స్ లేఖపై కూడా ఆయనను ప్రశ్నించారు. ఈ స్కామ్ వెనక ఎవరి ఒత్తిడి ఉందనే అంశంపై కూడా అధికారులు విచారణ చేపట్టారు. 150 కోట్ల రూపాయల అవినీతిలో వాటాలపై కూడా సమాచారం సేకరించేందకు ప్రయత్నించారు. కాగా, శనివారం కూడా అధికారులు అచ్చెన్నాయుడును ప్రశ్నించనున్నారు. మరోవైపు ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు రమేష్కుమార్, విజయ్కుమార్, చక్రవర్తి, జనార్దన్లను కూడా ఏసీబీ అధికారులు విజయవాడలో ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలో ఒక్కొక్కరిని ఏసీబీ బృందం విడివిడిగా ప్రశ్నించింది. రూ. 150 కోట్లలో ఎవరి వాటా ఎంత?, ఎవరి ఒత్తిడితో తప్పు చేశారు?, స్కామ్లో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది?.. వంటి ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన రెండు ఎఫ్ఐఆర్లపై విచారణ కొనసాగించారు. విచారణ సందర్భంగా అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్టు సమాచారం. ఇక, నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కామ్కు సంబంధించి పరారీలో ఉన్న మరో 10 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. -
ఈఎస్ఐ స్కాం: కూపీ లాగుతున్న ఏసీబీ
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కాం నిందితుల విచారణ రెండో రోజు ప్రారంభమయ్యింది. రాజమండ్రి జైలు నుంచి కస్టడీకి తీసుకొన్న ఏసీబీ బృందం.. ప్రధాన నిందితుల నుంచి కీలక ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. డొల్ల కంపెనీలకు ఆర్డర్లు, పరికరాల కొనుగోలు మాల్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలిసింది. ఈ కుంభకోణం వెనుక ఎవరెవరి ఒత్తిడి ఉందన్న కోణంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. రూ.150 కోట్ల అవినీతిలో ఎవరికి ఎంత ముట్టిందన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. (ఎవరి వాటా ఎంత?) ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 12న అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. (ఆంధ్రాలో కుంభకోణం.. కోదాడలో కలకలం!) -
ఎవరి వాటా ఎంత?
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం క్రైం/సాక్షి, గుంటూరు: చంద్రబాబు జమానాలో చోటు చేసుకున్న కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐ) స్కామ్లో ఎవరి వాటా ఎంత అనే లెక్కలు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ స్కామ్లో 19 మంది ప్రమేయాన్ని గుర్తించిన ఏసీబీ ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేయడం, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాలకోసం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉందన్న ఏసీబీ వినతి మేరకు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును మూడు రోజులపాటు, మిగిలిన నిందితుల్ని రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారుల బృందం గురువారం సాయంత్రం అక్కడే విచారించింది. మరోవైపు రాజమహేం ద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు జి.విజయకుమార్, సీకే రమేష్కుమార్, సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్లను ఏసీబీ అధికారులు గురువారం తమ కస్టడీలోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిందితులను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కొక్కరికి 14 నుంచి 19 ప్రధాన ప్రశ్నలు సంధించి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? ఈఎస్ఐలో మందులు, పరికరాల కొనుగోళ్లలో నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారంటూ ఈ కేసులో మాజీ డైరెక్టర్ విజయ్కుమార్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన డైరెక్టర్గా వ్యవహరించిన 02–11–2017 నుంచి 07–05–2019 వరకు జరిగిన అనేక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ► మీ పదవీకాలంలో సర్జికల్, ల్యాబ్ కిట్స్, ఫర్నిచర్, వైద్య పరికరాలు, బయోమెట్రిక్ మిషన్లు, మందులు ఎంత పరిమాణంలో కొనుగోలు చేశారు? వాటి కొను గోళ్లకు అధికారిక బడ్జెట్ ఎంత కేటాయించారు? వాటి కొనుగోళ్లలో బిల్లు చెల్లింపులు ఎలా చేశారు? ఓపెన్ టెండర్, ఇ–ప్రొక్యూర్మెంట్, స్మాల్ టెండర్ కొటేషన్స్ వంటి విధానాలు ఎందుకు అనుసరించలేదు? ► కొనుగోళ్లకు ముందు ఈఎస్ఐ యూనిట్లలో ఎంత మేరకు మందులు అవసరమనేది నిర్ధారించారా? ► కడప, విజయవాడ జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఈఎస్ ఐలలో అవసరానికి మించి నిల్వ ఉంచిన మందుల విలువ రూ.6.9 కోట్లా, రూ.8.9 కోట్లా? అవసరం లేకుండా అంత విలువైన మందులెందుకు కొన్నారు.. వాటిని నిరుపయోగంగా ఎందుకు వదిలేశారు? ► రూ.లక్షకు మించి వైద్య పరికరాలు కొనుగోలు చేయాలంటే ఈ–టెండర్ పిలవాలనే నిబంధన ఎందుకు పాటించలేదు? నామినేషన్ పద్ధతిపై కొనుగోళ్లు ఎందుకు జరపాల్సి వచ్చింది? లెజెండ్, అవన్టర్, ఒమేని సంస్థల వద్ద ల్యాబ్ కిట్ల కొనుగోలులో విధానపరమైన నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? అంటూ ప్రశ్నించారు. మూడు గంటలపాటు విచారణ.. ► ఏసీబీ డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి, ఎం.సూర్యనారాయణరెడ్డిల నేతృత్వంలోని అధికారుల బృందం గురువారం సాయంత్రం గుంటూరు జీజీహెచ్కు వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ను కలిసి అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించిన పత్రాలను సమర్పించారు. అనంతరం అచ్చెన్న ఉన్న పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్లోని గదికి చేరుకున్న అధికారులు.. డాక్టర్ రాజ్యలక్ష్మి, న్యాయవాది హరిబాబు సమక్షంలో విచారణ ప్రక్రియను చిత్రీకరిస్తూ అచ్చెన్నను సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు విచారించారు. ► అధికారులు వరుసగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన అచ్చెన్న, మరికొన్ని ప్రశ్నలకు సమాధానం దాటేసినట్టు సమాచారం. టెలీ హెల్త్ సర్వీసెస్ ఇచ్చిన సిఫార్సు లేఖపైనే విచారణంతా కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణకు అచ్చెన్న సహకరించారని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అక్రమాలకు పాల్పడేలా మీపై ఎవరు ఒత్తిడి తెచ్చారు? ► నిబంధనలకు విరుద్ధంగా మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు ఆస్కార మిచ్చేలా మీపై ఎవరు ఒత్తిడి తెచ్చారు? మీ పాత్ర ఎంత? మీకు కలిగిన లబ్ధి ఎంత? అంటూ ఈ కేసులో ఎ–6 అయిన సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, ఎ–8 అయిన రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్లను ప్రశ్నించారు. ► నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున మందుల సరఫరా డీల్ను ఎలా సాధించారు? ఇందుకు రాజకీయ నేతలను ఎలా ప్రసన్నం చేసుకున్నారు? మందుల కొనుగోళ్ల ఆర్డర్ మీకే దక్కేలా ఎవరె వరికి ఎంతిచ్చారు అంటూ ఎ–15 నిందితుడైన మందుల ఏజెన్సీ నిర్వాహకుడు వెంకట సుబ్బారావును ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. -
తొలిరోజు ముగిసిన అచ్చెన్నాయుడు విచారణ
సాక్షి, గుంటూరు : ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తొలి రోజు విచారణ కొద్ది రోజుల కిందట ముగిసింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అచ్చెన్నను విచారించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. అయితే అచ్చెన్నాయుడు విచారణకు సహకరించారని అధికారులు తెలిపారు. అచ్చెన్న ఆరోగ్యం బాగానే ఉందని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు రాజమండ్రి నుంచి విజయవాడ తరలించి విచారణ చేపట్టారు. ఈ స్కామ్కు సంబంధించి మరికొన్ని కీలక ఆధరాలు సేకరించనున్నారు. కాగా, మరో రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు ఈ కేసులో నిందితులను విచారించనున్న సంగతి తెలిసిందే. -
ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు
సాక్షి, గుంటూరు : ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 12న అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ఆయనను ఏసీబీ విచారణ చేయనుంది. కాగా ఈ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ను మూడు రోజుల పాటు, విజయ్కుమార్, జసదన్, చక్రవర్తి, వెంకట సుబ్బారావులను రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇన్ఛార్జ్ న్యాయమూర్తి వెంకటరమణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.(ఈఎస్ఐ స్కామ్ : ఏసీబీ కస్టడీకి అనుమతి) కాగా రాజమండ్రి జైలులో ఉన్న డైరెక్టర్లు రమేష్ కుమార్, విజయ్ కుమార్, వేణుగోపాల్, వెంకట సుబ్బారావు, మరో వ్యక్తిని పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో విజయవాడకు తరలించారు. రెండు రోజుల విచారణ అనంతరం మళ్ళీ వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు ఏసీబీ హెడ్ క్వార్టర్స్లో ఏసీబీ డీజీతో అధికారులు భేటీ అయ్యారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన నిందితుల నుంచి రాబట్టాల్సిన అంశంపై చర్చలు జరిపారు. -
ఈఎస్ఐ స్కామ్ : ఏసీబీ కస్టడీకి అనుమతి
సాక్షి, విజయవాడ : ఈఎస్ఐ కుంభకోణం కేసులో నిందితులను మూడు రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేశ్కుమార్, ఏ2గా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటుగా మరో ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అక్కడే విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో మిగతా నలుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. (చదవండి : అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్) కాగా, ఈ కేసులో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడిని అధికారులు ఈ నెల 12న అదుపులోకి తీసుకుని.. ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి తెలిపారు. -
ఆంధ్రాలో కుంభకోణం.. కోదాడలో కలకలం!
కోదాడ : ఆంధ్రాలో ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం కోదాడలో కలకలం రేపుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) మందుల సరఫరా కుంభకోణానికి పాల్పడిన వారిలో కోదాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో అక్కడి ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్యంగా విచారణ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కోదాడకు చెందిన ప్రమోద్రెడ్డి ఏ–3 నిందితుడిగా అక్కడి ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. (అదే జరిగితే చినబాబు, పెదబాబు పరిస్థితి ఏమిటో? ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్గా ప్రమోద్రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కుంభకో ణంలో ఏ–1 నిందితుడిగా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్కుమార్ను, ఏ–2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రమోద్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను సెల్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి తల్లిదండ్రులు కోదాడలో ఉండడంతో ఆంధ్రా ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్య విచారణ చేశారు. అతని బంధువులు, స్నేహితులు ఎవరో ఆరా తీశారు. అతడి స్వగ్రామమైన అనంతగిరి మండలంలో కూడా విచారణ చేసి అక్కడ నిఘా పెట్టినట్లు తెలి సింది.(‘అచ్చెన్నాయుడు అప్రూవర్గా మారితే..’) -
ఈఎస్ఐకి నవ‘గ్రహణం’
సాక్షి, అమరావతి: చంద్రబాబు జమానాలో జరిగిన ఈఎస్ఐ స్కామ్లో కీలక కోణాన్ని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుర్తించింది. ఈఎస్ఐలో నిబంధనలకు విరుద్ధంగా రూ. 988.77 కోట్లు ఖర్చు చేయగా, వాటిలో అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి రూ.150 కోట్లకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ► 19 మంది ప్రమేయం ఉన్న ఈ కేసులో కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు 8 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. మరో 11 మంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ► ఈ భారీ స్కామ్లో తొమ్మిది అంశాలను గుర్తించారు. తప్పుడు కొటేషన్లు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు, మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ ఐటెమ్స్, ఫర్నిచర్, బయో మెట్రిక్ పరికరాల కొనుగోళ్లలో, టోల్ ఫ్రీ–ఈసీజీ సర్వీసులు, సీవరేజ్ ట్రీట్మెంట్ వంటి 9 అంశాల్లో అవినీతిని గుర్తించారు. ► ఈ–టెండర్ల బదులు నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయలను దారి మళ్లించారు. లేని కంపెనీలు ఉన్నట్టు నకిలీ లెటర్ ప్యాడ్లు, కొటేషన్లు, ఓచర్లు, బిల్లులు సృష్టించి సొమ్ము కాజేసినట్లు గుర్తించారు. ► ఈఎస్ఐ ఉద్యోగులు కొందరు తమ కుటుంబ సభ్యుల పేరుతో బినామీ మందుల కంపెనీలు పెట్టి అక్రమంగా మందుల కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకున్నారు. ► మందులు, సర్జికల్ ఐటెమ్స్ విషయంలో మార్కెట్ ధర కంటే 50 నుంచి 136 శాతం అదనంగా అక్రమ చెల్లింపులకు పాల్పడ్డారు. ► మందుల కొనుగోళ్లలో రూ.51.2 కోట్లు, ల్యాబ్ కిట్ల కొనుగోళ్లలో రూ.85.32 కోట్లు, సర్జికల్ ఐటెమ్స్కు రూ.10.43 కోట్లు, ఫర్నిచర్లో రూ.4.63 కోట్లు ఇలా మొత్తం రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ► రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మా సంస్థల నుంచి కొనుగోళ్లు, ఇన్వాయిస్లను సోదాలు చేస్తే రూ.5.70కోట్లు వ్యత్యాసం కనిపించింది. ► ఈఎస్ఐ ఫార్మసిస్ట్గా ఉన్న కె.ధనలక్ష్మి కోడలు రావిళ్ల రవి తేజస్వి పేరుతో ఏర్పాటు చేసిన జెర్కాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు రూ.9.50కోట్ల మందుల ఆర్డర్లు ఇచ్చారు. ఇవన్నీ రమేశ్కుమార్, విజయకుమార్లు డైరెక్టర్లుగా ఉన్నప్పుడే జరిగాయి. ► జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లలోనూ అవకతవకలున్నాయి. ప్రొడిజి సంస్థ నుంచి ఒక్కొక్కటి రూ.17వేల ఖరీదు చేసే బయో మెట్రిక్ మెషీన్లను రూ. 70 వేలు చొప్పున వంద మెషీన్లు కొన్నారు. -
అదే జరిగితే చినబాబు, పెదబాబు పరిస్థితి ఏమిటో?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబూ.. ఈ అంకెలు చూడు అర్థమవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కట్టుబడింది వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే. కులాలను రెచ్చగొట్టి, అహింసాగ్నిలో చలికాచుకునే చరిత్ర చంద్రబాబుదే..! బడ్జెట్లో కేటాయింపులో బీసీలకు 68.18 శాతం, కాపులకు 42.35 శాతం మైనార్టీలకు 116శాతం పెంపు' అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: 'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు' కాగా మరో ట్వీట్లో.. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు అచ్చెన్న బెదిరింపుల వల్ల రూల్స్కు విరుద్ధంగా కొనుగోలు చేస్తామని చెప్పారంట. వార్నింగులిచ్చి తప్పు చేయించాడని ఇన్సైడ్ స్టోరీలు బయటపెట్టారంట. వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదు. అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో? అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: ‘లోకేశ్ను మాలోకం అనేది అందుకే’