కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఫోన్ హ్యాక్కు గురైందని ఆ పార్టీ ఆరోపించింది. ఇజ్రాయెల్కు చెందిన స్పైవేర్ పెగాసస్ వల్ల ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ఫోన్లు హ్యాక్కు గురైనట్లు వాట్సాప్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని యూజర్లకు తెలిపేందుకు వాట్సాప్ ప్రత్యేక సందేశాలను బాధితులకు పంపింది.