రంగారెడ్డి కడ్తాల్ మండలం మైసిగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టిప్పర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలోఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు.