విద్యుత్‌ అధికారులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు | Watch: Villagers Tied Electricity Officers To The Tree In Medak District | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అధికారులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు

Jul 18 2020 4:33 PM | Updated on Mar 22 2024 11:32 AM

సాక్షి, మెదక్‌: జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు చెట్టుకు కట్టెసిన వైనం అల్లదుర్గ మండల పరిధిలో జరిగింది. ముస్లాపూర్‌ గ్రామానికి విద్యుత్‌ బిల్లుల వసూలుకు వెళ్లిన అధికారులను శనివారం అక్కడి గ్రామస్తులు చెట్టుకు కట్టేశారు.

అధిక విద్యుత్‌ బిల్లులు, విద్యుత్‌లో అంతరాయం వంటి సమస్యలను చూసి చూడనంటూ వెదిలేస్తున్న అధికారుల తీరుపై విసుగు చెందిన గ్రామస్తులు ఇలా చెట్టుకు కట్టేసి నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చేంతవరకు వారిని విడిచేది లేదని స్పష్టం చేశారు. రోజులకు రోజులు విద్యుత్‌లో అంతారాయం కలగడం, అధిక కరెంటు బిల్లులు వసూలు చేయడం వంటి విద్యుత్‌‌ సమస్యలను చెప్పటినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement