విజయవాడ గుణదలలో అమ్మాయిల అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. అదృశ్యమైన వారిలో ఒకరు మైనర్గా ఉన్నట్టు సమాచారం. ఈ నెల 4న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కలవడానికి వెళ్లినప్పటి నుంచి తమ పిల్లలు కనిపించడం లేదని ఆ అమ్మాయిల తల్లి కోటా జ్యోతి మాచవరం పోలీసులను ఆశ్రయించింది.