‘చంద్రబాబు ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం’ | YSRCP Leader C Rama chandraiah Slams TDP Over Data Breach | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం’

Published Mon, Mar 4 2019 2:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి, ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య విమర్శించారు. సోమవారం జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సమాచారాన్ని టీడీపీ ఐటీ కంపెనీలకు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. టీడీపీ చాలా పెద్ద నేరానికి పాల్పడిందని.. దీనిని ఎన్నికల సంఘం చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఐటీగ్రిడ్స్‌ స్కాంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ హస్తం ఉందన్నారు. ఇది ప్రజస్వామ్యంపై, ప్రజల ప్రాథమిక హక్కులపై జరిగిన దాడి అని అన్నారు. కొత్త పంథాలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయా కంపెనీల ఉద్యోగులకు జీతాలు ఎవరిస్తున్నారో, వారికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో విచారణ చేపట్టాలని కోరారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement