పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న ధోని, పంకజ్ అద్వాని | MS Dhoni Receives Padma Bhushan Award At Rashtrapati Bhawan | Sakshi
Sakshi News home page

Apr 2 2018 7:38 PM | Updated on Mar 21 2024 8:58 PM

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు బిలియర్డ్స్‌ చాంపియన్‌ పంకజ్‌ అద్వానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి అవార్డు స్వీకరించారు. ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్‌ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేసారు.   

Advertisement
 
Advertisement

పోల్

Advertisement