బంగ్లాదేశ్తో మంగళవారం జరిగిన రెండో సన్నాహక మ్యాచ్లోభారత్ సత్తా చాటింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ (99 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్స్లు), వెటరన్ ధోని (78 బంతుల్లో 113; 8 ఫోర్లు, 7 సిక్స్లు) శతకాలు బాదడంతో టీమిండియా 95 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా 49.3 ఓవర్లలో 264 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది.