మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనికి కోపమొచ్చింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో శనివారం చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఈ చెన్నై కెప్టెన్ యువ బౌలర్ దీపక్ చాహర్పై గుస్సా అయ్యాడు. ధోని ఆగ్రహాన్ని చూసిన దీపక్ అతనితో భయంగానే మాట్లాడాడు. పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 39 పరుగుల కావాల్సిన పరిస్థితుల్లో బంతిని అందుకున్న చహర్ వరుసగా రెండు నోబాల్స్ వేసాడు. తద్వారా పంజాబ్కు రెండు ఫ్రీ హిట్స్ లభించాయి.