Top Stories
ప్రధాన వార్తలు

లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు!
పచ్చ పత్రిక ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని అనిపిస్తుంది!. కానీ, బాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వీళ్లు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే!. ఈ మధ్య కాలంలోనే రూ.33వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వీటితో 34 వేల మందికి ఉపాధి దొరికేసినట్లు ఈనాడు ఒక కథనాన్ని వండి వార్చింది.రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటికి జగన్ హయాంలోనే ఒప్పందాలు కుదిరినా వాటిని బాబు గారి ఖాతాలో వేసేసి తరిస్తున్నాయి ఎల్లో పత్రికలు!. తప్పులేదు కానీ.. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే రోత పుట్టిస్తున్నాయి. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది’ అని చంద్రబాబు అన్నట్టు.. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు బాబు చెప్పారని రాసుకొచ్చింది ఈనాడు!. మొత్తం రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపిందని, 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కూడా బాబు చెప్పినట్లు ఈ కథనం చెబుతోంది. విచిత్రం ఏమిటంటే బోర్డు సమావేశం జరగడానికి ముందు రోజు టీడీపీ పాలిట్బ్యూరో సమావేశంలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. వీటిలో దేనిని నమ్మాలి?.తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టులలో కొన్ని గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందాయన్నది వాస్తవమా? కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలో బీఈఎల్ యూనిట్, అనకాపల్లి వద్ద టైర్ల ప్యాక్టరీ, శ్రీసిటీలో డైకిన్ సంస్థలన్నీ ఇవన్ని గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకువెళుతున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ హయాంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏమి ఉంటుంది!. అలాగే, లోకేష్ ఈ మధ్య శంకుస్థాపనలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినవే అన్నది వాస్తవం.ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ కాంప్లెక్స్కు బేతపల్లిలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా జగన్ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతోంది. ఓర్వకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్లింది. అదానీకి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు కూడా కేటాయించారు.ఆ రోజులలో ఎల్లోమీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. రామాయంపట్నం వద్ద శిర్డిసాయి కంపెనీకి చెందిన ఇండో సోలార్ ప్రాజెక్టు వస్తుంటే ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డిపై ఎన్ని అసత్య కథనాలు వండివార్చారో లెక్కలేదు. జగన్ బినామీ అని కూడా ఎల్లో మీడియా ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్ ఇస్తోందంటూ విషపు రాతలు రాసింది. తదుపరి ఏమైందో కానీ, ఆ సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనను ఆనందంగా ప్రచురించుకుంది. అంటే, ఆ కంపెనీ యజమానిని ఈ మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని అనుకోవాలా? ఆయా కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేవు.మరో ఉదాహరణ కూడా చెప్పాలి. విజయవాడ సమీపంలోని మల్లవల్లి వద్ద అశోక్ లేలాండ్ సంస్థ 2022లోనే బస్సుల తయారీని ఆరంభించింది. ఆ విషయం ఆ కంపెనీ సెబీకి కూడా తెలిపింది. కానీ, కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ఆరంభమైనట్లు, లోకేశ్ ప్రారంభోత్సవం చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా యుగంలో ఏదో మాయ చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతామన్న సంగతిని నేతలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి?. కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని పరిశ్రమలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు?. కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి తెస్తున్నది పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్దమా?. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, ఇలాగైతే తాము పని చేయలేమని ఒక సిమెంట్ కంపెనీ హెచ్చరించడమూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా అన్నీ టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపేవే కదా?.ఆది నారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏకంగా జిల్లా కలెక్టర్కే ఫిర్యాదు చేశారే!. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని దందాలకు రెండు సిమెంట్ కంపెనీలు కొన్నాళ్లపాటు మూతపడ్డాయి కదా?. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక కూటమి నేతలు కింగ్ ఫిషర్ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కదా?. రెడ్బుక్ కారణంగా జిందాల్ సంస్థ ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులను కాస్తా మహారాష్ట్రకు తరలించిందే!. గత ఫిబ్రవరి 12న ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏపీలో పారిశ్రామికాభివృద్ది ‘-2.94 శాతం’గా ఉందని, పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా! దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా?. దావోస్కు వెళ్లి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి, చివరికి ఒక్క రూపాయి కూడా తేలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానిని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్ బాగా ప్రచారమైందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేశ్లు ఎందుకు చెప్పారు?. చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా?. వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని శంకుస్థాపన చేసుకుని ప్రారంభమయ్యాయి కూడా. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ను చూడవచ్చు.అంతేకాదు.. ఎన్టీపీసీ లక్ష పదివేల కోట్ల వ్యయంతో హైడ్రో పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ దీనికే శంకుస్థాపన చేశారు. కాకపోతే దీన్ని టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. వాటిలో కొన్నిటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల కోల్పోయాయన్న విమర్శలు ఉన్నాయి.ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయనను చూసే వస్తున్నాయని లోకేష్ చెబుతుంటారు. కానీ, అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు ఎకరా 99పైసలకే కట్టబెట్టవలసిన దుస్థితిలో రాష్ట్రం ఉంది. లీజుకు ఇవ్వాలని టీసీఎస్ సంస్థ కోరినా దాదాపు ఉచితంగా విక్రయించడం ఎందుకో?. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కారుచౌకగా అరవై ఎకరాల భూమిని కట్టబెడ్టడంలోని ఆంతర్యం ఏమిటి? ఏది ఏమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తకాదు.2014 హయాంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో పదోవంతు కూడా వచ్చినట్లు స్పష్టంగా తెలియలేదు! నిరుద్యోగ భృతి ఎగవేయడానికి ఇలా చేస్తుండవచ్చు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని, గత ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్ను పాడు చేయకుండా చిత్తశుద్దితో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుందాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

బియ్యం బండి ఆగింది.. మీ రేషన్ మీరే తెచ్చుకోండి
సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్’ను చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్ డోర్ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్ అక్రమ రవాణాకు కేరాఫ్ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్ ప్రచారం సాగించారు. రేషన్ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్ డీలర్ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ చేరవేసింది. ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. రేషన్ పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్(అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. పేదల ఇంటికి రేషన్ వద్దు... మద్యం ముద్దుపేదల ఇంటికి రేషన్ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.2027 వరకు ఒప్పందం గడువు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు. రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోముఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి. – రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాంఇంటి ముందుకే రేషన్ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది? – దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా గిరిజనులకు ఎంతోమేలు జరిగింది గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. –పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా మాగ్రామంలో రేషన్ షాపు లేదు మా గ్రామంలో రేషన్ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. – రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్ మండలం, కర్నూలు జిల్లా

కమిషన్ నోటీసులకు భయపడేది లేదు: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్కు పీసీ ఘోష్ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఈటల రాజేందర్ సాక్షితో మాట్లాడుతూ..‘నోటీసులకు భయపడేది లేదు. ఇంకా నోటీసులు అందలేదు. కాళేశ్వరం కమిషన్ విచారణకు సహకరిస్తాను. చట్టాలు, కోర్టులు, కమిషన్పై నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. విచారణకు భయపడేది లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్గా ఉన్నారని చెప్పారు. పీసీ కమిషన్ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. కాళేశ్వరంపై జూన్ ఐదో తేదీన విచారణకు రావాలని కేసీఆర్కు, జూన్ ఆరో తేదీన హరీష్ రావు, జూన్ తొమ్మిదో తేదీన ఈటల రాజేందర్ను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో భేటీ అయ్యారు. అయితే, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తొలి మూడు స్థానాలను ఆక్రమించి టాప్-4కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన మరొక్క బెర్తు కోసం ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) పోటీపడుతున్నాయి.ఇరుజట్ల మధ్య ముంబైలోని వాంఖడే మైదానంలో బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్లో అడుగుపెడుతుంది. ఫలితంగా.. ఢిల్లీ గనుక ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మాత్రం తప్పక ఈ మ్యాచ్లో నెగ్గాల్సిందే. అయితే, ‘క్వార్టర్ ఫైనల్’ను తలపిస్తున్న ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.వర్షం ముప్పు.. ఆక్యూమీటర్ నివేదిక ప్రకారం.. రానున్న నాలుగు రోజుల్లో ముంబైలో వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యెల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు. వాన పడేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నట్లు ఆక్యూమీటర్ వెదర్ రిపోర్టు వెల్లడించింది. అయితే, రాత్రి వేళ ఇందుకు కేవలం 25 శాతం మాత్రమే ఆస్కారం ఉందని పేర్కొంది. కానీ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదని.. ఈ నాలుగు రోజుల్లో కచ్చితంగా వర్షం పడే అవకాశం తప్పక ఉందని తెలిపింది.మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం పడి.. మ్యాచ్ రద్దైతే మాత్రం ఢిల్లీకి తిప్పలు తప్పవు. వరుణుడి కారణంగా మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే.. నిబంధనల ప్రకారం ముంబై- ఢిల్లీ జట్లకు చెరో పాయింట్ వస్తుందన్న విషయం తెలిసిందే. తద్వారా ఇక ఇప్పటికే పన్నెండింట ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉన్న ముంబై ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది.మరోవైపు.. పన్నెండింట ఆరు గెలిచి.. ఒకటి వర్షం వల్ల రద్దైన కారణంగా పదమూడు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఖాతాలో మొత్తంగా పద్నాలుగు పాయింట్లు చేరతాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ముంబై, ఢిల్లీలకు లీగ్ దశలో చెరో మ్యాచ్ మిగులుతాయి.అయితే, ఈ రెండు జట్లు తమ ఆఖరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తోనే తలపడనున్నాయి. మే 24న ఢిల్లీ, మే 26న ముంబై పంజాబ్ జట్టును ఢీకొడతాయి. ఒకవేళ బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే.. ఢిల్లీ పంజాబ్పై తప్పక గెలవాలి. అప్పుడు అక్షర్ సేన ఖాతాలో పదహారు పాయింట్లు చేరతాయి.అయితే, పంజాబ్పై గెలవడంతో పాటు.. ముంబై పంజాబ్ చేతిలో ఓడితేనే ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పంజాబ్ చేతిలో ముందుగానే ఓడినా.. లేదంటే పంజాబ్పై ముంబై గెలిచినా అక్షర్ సేన కథ కంచికే! ఎలా చూసుకున్నా ముంబైతో మ్యాచ్లో నెగ్గితేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్

ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,300 (22 క్యారెట్స్), రూ.97,420 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.2,200, రూ.2,400 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,400 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,420 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,200 పెరిగి రూ.89,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,400 పెరిగి రూ.97,570 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. నంబాల మృతి?
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 25 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపూర్లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 25 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మృతుల్లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు బసవరాజుపై కోటిన్నర రివార్డు ఉంది. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివిన వ్యక్తి. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు ఉన్నారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి బసవరాజు.

175 బిలియన్ డాలర్లతో ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’.. చైనా, రష్యా ఆందోళన..
వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధం వాతావరణం కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వార్.. ఇక, ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రక్షణ వ్యవస్థల గురించి చాలా చర్చలు జరిగాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. ఈ ‘గోల్డెన్ డోమ్’ కోసం ఏకంగా దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా( 175 బిలియన్ డాలర్లు)ఖర్చు చేస్తామని వెల్లడించారు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలోనే ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి 25 బిలియన్ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, అంతిమంగా 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అత్యంత సాంకేతికతతో కూడిన మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా ఇది తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికాకు ఏమీ కాదన్నారు. మన దేశం విజయంలో.. మనం భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.🚨 #BREAKING: President Trump and Secretary Hegseth have announced the GOLDEN DOME missile defense system for the U.S."Golden Dome will be capable of catching missiles from across the world or even SPACE.""We'll be completing the job Reagan started 40 years ago!"Trump also… pic.twitter.com/MX1URx1fa0— Nick Sortor (@nicksortor) May 20, 2025యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తిని చూపినట్లు తెలిపారు. డోమ్ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీని ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.చైనా, రష్యా ఆందోళన..ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్.. ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. ప్రత్యర్థుల క్షిపణులు దూసుకొచ్చినా.. ఉక్కు కవచంలా వాటిని అడ్డుకునేందుకు టెల్అవీవ్ ఈ డోమ్ను ఉపయోగిస్తుంది. దీని నిర్మాణానికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో అటువంటి గోల్డెన్ డోమ్ను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా (USA) సైతం సిద్ధమయ్యింది. అయితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాయి. . @SecDef "The Golden Dome for America’s game changer. A generational investment in security in America and Americans..." pic.twitter.com/uazlPcCytR— DOD Rapid Response (@DODResponse) May 20, 2025

రామ్ చరణ్తో సినిమా.. ‘రంగస్థలం’ మించిపోతుంది: సుకుమార్
మలికిపురం: తన తదుపరి చిత్రం ‘గ్లోబల్ స్టార్’ రామ్చరణ్తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో స్వగ్రామమైన మట్టపర్రుకు కుటుంబ సమేతంగా మంగళవారం ఆయన విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... హీరో రామ్చరణ్తో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తామిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిందని, ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయికి రామ్చరణ్ ఎదిగారన్నారు. ఆయనతో తాను చేయబోయే చిత్రం ఆ స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్తో తీసిన ‘పుష్ప’ జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. పుష్ప–1కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి రెండో భాగాన్ని మరింత ఫోకస్ పెట్టి తీశామన్నారు. స్వగ్రామం మట్టపర్రులోని తన ఇంట్లో చిన్నారితో ముచ్చటిస్తున్న దర్శకుడు సుకుమార్ ప్రేక్షకుల అభిరుచి ఏం మారలేదు సినిమాపై ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం మారలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందని సుకుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రేక్షకుల్లో కొంత భాగం ఓటీటీ ప్లాట్ఫామ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు సుకుమార్ రైటింగ్స్ వంటి సంస్థల్ని స్థాపించానన్నారు. ఈ సంస్థల ద్వారా చాలామందికి ప్రోత్సాహం, టాలెంట్ను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఆ దిశగానే ఫలితాలు ఉంటున్నాయని చెప్పారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమేరెండేళ్లకు పైగా చాలా బిజీ షెడ్యూల్స్లో ఇరుక్కుపోయానని, షూటింగ్స్ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల స్వగ్రామానికి రాలేకపోయానని సుకుమార్ చెప్పారు. లేదంటే ఏటా సంక్రాంతి పండుగను ఇక్కడే చేసుకునే వాళ్లమన్నారు. ఇకపైనా ఏటా ఇదే సంప్రదాయం కొనసాగిస్తానన్నారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమే అన్నారు. కోనసీమలో గోదారి గట్లూ.. కాలువ చెంత, పొలాల మధ్య స్నేహితులతో తిరిగిన క్షణాలు, కాలేజీ రోజులు చాలా బాగుంటాయన్నారు.

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్లోని ఆస్టిన్లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Rajiv death anniversary: ఆ రోజు ఏం జరిగింది? గంధపు దండే ప్రాణాలు తీసిందా?
అది 1991, మే 21.. తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో యావత్దేశం కంటతడిపెట్టే ఉదంతం చోటుచేసుకుంది. నాటి దేశ యువ ప్రధాని రాజీవ్గాంధీ విద్రోహుల ఘాతుకానికి బలయ్యారు. ఈ రోజు (మే 21, 2025) రాజీవ్గాంధీ 34వ వర్థంతి. ఇంతకీ నాడు రాజీవ్ హత్య ఎలా జరిగింది? ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీ ఎలా ప్రాణాలు కోల్పోయారు? వివరాల్లోకి వెళితే..మరకతం చంద్రశేఖర్కు మద్దతుగా..శ్రీ పెరంబుదూర్.. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. నాడు రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయాల్సిన ప్రాంతం ఇదే. ఇందిరాగాంధీకి సన్నిహిత మిత్రురాలైన మరకతం చంద్రశేఖర్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో ఆమె తరఫున ప్రచారం చేయడానికి రాజీవ్గాంధీ ఒప్పుకున్నారు. దీంతో పెరంబుదూర్లోని ఒక మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకులు రాజీవ్ వచ్చేవరకు ప్రజలను ఉత్సాహపరిచేందుకు సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. జరగబోయే దారుణం తెలియని ప్రజలు రాజీవ్ను చూడడానికి తండోపతండాలుగా తరలి వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్కే రాఘవన్ సభాస్థలి వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.పటిష్టంగా లేని బారికేడ్లు..దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు రాఘవన్కు సంతృప్తి కలిగించలేదు. రాజీవ్ నడిచే ఎర్ర తివాచీకి ఇరు వైపులా కట్టిన బారికేడ్లు గట్టిగా లేవన్నారు. ఈ వాదనను స్థానిక నేతలు పట్టించుకోలేదు. జనాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను మరకతం అసిస్టెంట్ ఏజే దాస్కు అప్పగించారు. రాజీవ్ వద్దకు ఎవరిని అనుమతించాలనే జాబితాను ఆయనే చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లతా కణ్నన్.. తన కుమార్తె కోకిలను ఆ లిస్ట్లో చేర్చాలంటూ దాస్పై ఒత్తిడి తెచ్చారు. లతా కణ్నన్ మరకతం కుమార్తె లతా ప్రియకుమార్ దగ్గర పని చేస్తుండేవారు. అయితే లతా కణ్నన్ ఎంత బతిమాలినా దాస్ ఒప్పుకోలేదు. చివరకు లతా ప్రియాకుమార్ చెప్పడంతో రాజీవ్కు అభివాదం చేసే 24మందిలో కోకిలను చేర్చడానికి ఒప్పుకున్నాడు.ఫ్లైట్ రిపేర్ కాకుంటే..ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజీవ్గాంధీ వైజాగ్ నుంచి బయల్దేరడానికి రెడీ అవుతున్నారు. అయితే విమానంలో లోపం ఏర్పడినట్లు కెప్టెన్ చందోక్ గుర్తించారు. కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేయడం లేదని కనుక్కున్నారు. స్వతహాగా పైలట్ అయిన రాజీవ్ దానిలోని లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. ఇక ప్రయాణం లేదని అనుకుంటూ రాజీవ్ హోటల్కు వెళ్లిపోయారు. పరిస్థితి అలాగే ఉంటే రాజీవ్ బతికే ఉండే వారేమో కానీ కాసేపటికే ఫ్లైట్ రిపేర్ అయిందంటూ సమాచారం రావడంతో రాజీవ్ తిరిగి విమానం వద్దకు వచ్చేశారు.స్వయంగా ఫ్లైట్ నడుపుతూ..సాయంత్రం 6.30కి రాజీవ్ స్వయంగా ఫ్లైట్ నడుపుతూ రాత్రి 8.20 నిమిషాలకు మద్రాస్లోని మీనంబాకం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారులో మరకతం చంద్రశేఖర్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు వాళప్పాడి రామ్మూర్తి, పర్సనల్ సెక్యూరిటీ అధికారులతో కలసి రాజీవ్ బయల్దేరారు. న్యూయార్క్ టైమ్స్, గల్ఫ్ న్యూస్ పత్రికలకు కారులో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన దారిలో పోరూరు, పూనమల్లిల్లో ప్రసంగించారు. అలా పెరంబుదూర్ వైపు ఆయన ప్రయాణం సాగింది. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో రాజీవ్ పెరంబుదూర్ చేరుకున్నారు.జనం మధ్యకు కళ్లద్దాల యువతిరాజీవ్ రాకతో సభా ప్రాంగణం సందడిగా మారిపోయింది. ముందుగా సభా స్థలి దగ్గర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసిన రాజీవ్ అక్కడి నుంచి సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. రాజీవ్ను చూడడానికి ప్రజలు పోటీపడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో లతా కణ్నన్ తన కూతురుతో సహా స్టేజీ దగ్గరకు చేరుకున్నారు. అయితే ఇంతలో ఊహించని విధంగా కళ్లద్దాలు పెట్టుకున్న ఓ యువతి.. గంధపు దండ చేతిలో పట్టుకొని లోపలికి వచ్చేసింది. మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభలతో కలసి మహిళా విభాగంలో కూర్చుంది.అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తూ..రాజీవ్ చకచకా నడుస్తున్నారు. ఆయన వెంట మరకతం చంద్రశేఖర్ కార్యకర్తలను అదుపు చేస్తూ, పరుగులు పెడుతున్నారు. స్టేజి వద్దకు వచ్చిన రాజీవ్ అభిమానుల నుంచి అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తున్నారు. లత కణ్నన్ కూడా తన కూతురు కోకిలని పరిచయం చేసింది. ఇదే అదనుగా కోకిల వెనన నిలుచున్న కళ్లద్దాల యువతి.. రాజీవ్ ముందుకు రావడానికి ప్రయత్నించింది. ఐతే మహిళా ఎస్ఐ అనసూయ ఆమెను ఆపేయడంతో ఆ యువతి నిరాశ చెందింది.20 అడుగుల ఎత్తున మంటలుఎస్ఐ వద్దన్నప్పటికీ రాజీవ్ అంగీకరించడంతో కళ్లద్దాల యువతి రాజీవ్ వద్దకు చేరింది. తాను తీసుకొచ్చిన గంధపు పూలమాలను రాజీవ్ మెడలో వేసే ప్రయత్నం చేసింది. ఆ దండని స్వీకరించడానికి రాజీవ్ కొద్దిగా తల వంచారు. ఆయన మళ్లీ తల ఎత్తేలోపే ఆ యువతి పాదాభివందనం చేయడానికి అన్నట్లు కిందకు వంగింది. అంతే చెవులు బద్దలైపోయేంత శబ్దంతో మైదానం మారుమోగిపోయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్జేజ్ చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్మకుంది. హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అప్పటి వరకు చిరునవ్వులు చిందించిన రాజీవ్ను మృత్యువు కబళించింది. ఇది కూడా చదవండి: జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన వివరాలు
ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
తెలుగు సినిమా కోసం ‘కమిట్మెంట్’ అడిగారు: నాగార్జున హీరోయిన్
ఈ వీధి పేరు ‘సిందూర్ స్ట్రీట్’
నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..!
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?
కమిషన్ నోటీసులకు భయపడేది లేదు: ఈటల
కాళ్లకు పెట్టిన పారాణితోనే వరుడు పాడె ఎక్కాడు..
‘మూడు నిముషాల్లో 13 శత్రు స్థావరాలు నేలమట్టం’
ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
సారూ.. మా ఊరు పేరు మార్చండి
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
'భగవంత్ కేసరి' రీమేక్.. ఆ ఒక్క సీన్ కోసం పట్టుబట్టిన విజయ్
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
తెలుగు సినిమా కోసం ‘కమిట్మెంట్’ అడిగారు: నాగార్జున హీరోయిన్
ఈ వీధి పేరు ‘సిందూర్ స్ట్రీట్’
నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..!
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?
కమిషన్ నోటీసులకు భయపడేది లేదు: ఈటల
కాళ్లకు పెట్టిన పారాణితోనే వరుడు పాడె ఎక్కాడు..
‘మూడు నిముషాల్లో 13 శత్రు స్థావరాలు నేలమట్టం’
ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
సారూ.. మా ఊరు పేరు మార్చండి
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్తో దెబ్బకి 62 కిలోలకు!
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
'భగవంత్ కేసరి' రీమేక్.. ఆ ఒక్క సీన్ కోసం పట్టుబట్టిన విజయ్
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
లేఆఫ్ తప్పు తెలిసొచ్చిందీ కంపెనీకి...
సినిమా

తమన్నాకు ఛాన్సులు తగ్గడం వెనుక కారణం ఇదేనా..?
పాన్ ఇండియా కథానాయకి నటి తమన్న. తన 15వ ఏటనే నటిగా రంగ ప్రవేశం చేసిన ఈమె తొలుత హిందీ చిత్రంలో నటించారు. ఆ వెంటనే తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వరుసకట్టాయి. అయితే మొదట్లో గ్లామర్నే నమ్ముకున్న ఈ బ్యూటీ చివరి వరకూ ఆ గ్లామర్తోనే తమన్నాను స్టార్ హీరోయిన్ను చేసింది. మధ్యలో తనలోని నటనకు పదును పెట్టే పాత్రలు వచ్చినా అవి చాలా తక్కువగా పరిమితం అయ్యాయి. తమన్నా కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇక అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్తో అందాలను వెండితెరపై ఆరబోస్తూ కుర్రకారు హాట్ బీట్ను పెంచేస్తూ తన క్రేజ్ను మరింతగా పెంచుకున్నారు. అలా ఐటమ్ సాంగ్స్కు స్పెషలిస్ట్గా ముద్ర వేసుకున్నారు. ఐతే కథానాయకిగా తమన్నా రెండు దశాబ్దాల మైలు రాయిని అవలీలగా టచ్ చేశారు. ఇప్పటికి ఈ బ్యూటీ వయసు జస్ట్ 35 ఏళ్లే. మొన్న జైలర్ చిత్రం, ఆ తరువాత హిందీ స్త్రీ2 వంటి చిత్రాలలో తమన్నా స్పెషల్ సాంగ్స్తో ఇరగదీశారు. అలాంటిది ఇప్పుడు దక్షిణాదిలో ఈ భామకు ఒక్కటంటే ఒక్క సినిమా లేక పోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇటీవల సుందర్ సీ దర్శకత్వంలో నటించిన అరణ్మణై – 4 చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కోలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇదే విధంగా తెలుగులో విభిన్న పాత్రలో నటించిన ఓదెల – 2 చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో అక్కడ మరో అవకాశం రాలేదు. అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ తమన్నాను పూర్తిగా పక్కన పెట్టేసిందా? అన్న చర్చ జరుగుతోంది.ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారీ భామ. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా తమన్నా కన్నా వయసులో పెద్దవారైన నయనతార, త్రిష వంటి తారలు నాలుగు పదుల వయసు దాటేసినా ఇప్పటికీ అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్నారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల నటి తమన్నా విజయ్ వర్మ అనే హిందీ నటుడి ప్రేమలో పడడం, అది కొద్ది కాలానికే వికటించడం వంటి ఘటనలు ఈమె కెరీర్ కు ఎఫెక్ట్ అయ్యాయా? అనే చర్చ కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఏదేమైనా మిల్కీ బ్యూటీ మళ్లీ అవకాశాల వేటలో పడ్డారు. తన గ్లామరస్ ఫొటోలతో నెట్టింట్లో సందడి చేస్తున్నారు.

ముంబైలో మిరాయ్
ముంబై గుహల్లో తేజా సజ్జా సాహసాలు చేస్తున్నారు. ఎందుకంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మిరాయ్’ కోసం. తేజా సజ్జా, రితికా నాయక్ జంటగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూపర్యోధగా తేజ కనిపిస్తారు.తాజాగా ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ , ఇతర ప్రధాన పాత్రధారులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు.‘‘మిరాయ్’ కోసం తేజా సజ్జ పూర్తీగా మేకోవర్ అయ్యారు. 2డీ, 3డీ ఫార్మాట్స్లో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్ప్రోడ్యూసర్: కృతీ ప్రసాద్.

మాయాబజార్ని థియేటర్స్లోనే చూడండి: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘ఎన్టీఆర్గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ‘మాయాబజార్’ సినిమాని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ రోజున చూసేందుకు రెండు టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్స్లోనే చూడండి’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయాబజార్’.కేవీ రెడ్డి దర్శకత్వంలో విజయాప్రోడక్షన్స్పై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ సినిమా 1957 మార్చి 27న విడుదౖలñ ంది. ఈ నెల 28న ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ‘మాయాబజార్’ చిత్రాన్ని బలుసు రామారావు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాయాబజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన ‘ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ’ చైర్మన్ టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘రీ రిలీజ్లోనూ ‘మాయాబజార్’ గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ–‘‘మా నాన్న ఎల్వీ ప్రసాద్, రామారావుగారు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు’’ అని తెలిపారు. ‘‘అలనాటి క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల చేయడం మన బాధ్యత’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. ఈ వేడుకలో వీర శంకర్, భగీరథ, త్రిపురనేని చిట్టి, బలుసు రామారావు తదితరులు పాల్గొన్నారు.

కాన్స్లో భారతీయత
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ నటీనటుల సందడి మొదలైంది. సత్యజిత్ రే దర్శకత్వంలో సౌమిత్రా ఛటర్జీ, శుభేందు ఛటర్జీ, సమిత్ బంజా, అపర్ణా సేన్ , షర్మిలా ఠాగూర్, సిమి గరేవాల్ ప్రధాన పాత్రల్లో నటించిన బెంగాలీ చిత్రం ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ (ఇంగ్లిష్లో ‘డేస్ అండ్ నైట్స్ ఇన్ ది ఫారెస్ట్’). 1970లో విడుదలైన ఈ సినిమాను ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కాన్స్ క్లాసిక్స్’ విభాగంలో ప్రదర్శించారు. ది ఫిల్మ్ ఫౌండేషన్స్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ , గోల్డెన్ గ్లోబ్ ఫౌండేషన్ సంస్థల నేతృత్వంలో ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా 4కే వెర్షన్ రీ స్టోర్ చేయబడింది.ఈ వెర్షన్ చేసిన తర్వాత తొలిసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ షోకి షర్మిలా ఠాగూర్, సిమి గరేవాల్తో పాటుగా ఈ సినిమాని 4కే వెర్షన్ ను రీ స్టోర్ చేయడంలో కీలక పాత్ర వహించినవారు కూడా హాజరై, రెడ్ కార్పెట్పై నడిచారు. అలాగే షర్మిలా ఠాగూర్ కుమార్తె, జ్యువెలరీ డిజైనర్ సబ అలీఖాన్ కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ‘‘ఈ సినిమాకు సంబంధించి నేను, సిమి మాత్రమే ఇంకా జీవించి ఉన్నాం’’ అన్నారు షర్మిలా ఠాగూర్.స్పెషల్ నెక్లెస్భారతీయ నటి, మోడల్ రుచి గుజ్జర్ తొలిసారిగా కాన్స్ రెడ్ కార్పెట్పై నడిచారు. ఆమె ధరించిన నెక్లెస్ ఈ ఫెస్టివల్లో హాట్టాపిక్గా అయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది బొమ్మలు ఉన్న నెక్లెస్ను ఆమె ధరించడం చర్చనీయాంశం అయింది. మరోవైపు తన నెక్లెస్పై ఆమె మోది బొమ్మను డిజైన్ చేయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.డెంజల్ వాషింగ్టన్ కి జీవిత సాఫల్య పురస్కారంఅమెరికన్ నటి, గాయని స్కార్లెట్ జోహన్సన్ ‘ఎలియనోర్ ది గ్రేట్’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఈ సినిమాని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా ఐదు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. అలాగే ప్రముఖ ఇండియన్ ఫిల్మ్మేకర్ శేఖర్ కపూర్తో స్కార్లెట్ కొంతసేపు మాట్లాడారు. అలాగే స్పైక్ లీ దర్శకత్వం వహించిన ‘హయ్యస్ట్ 2 లోయెస్ట్’ మూవీని ప్రదర్శించారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అమెరికన్ నటుడు, దర్శక–నిర్మాత డెంజల్ వాషింగ్టన్ కు ‘పామ్ డీ ఓర్’ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ పురస్కారం దక్కడం తనకు చాలా సర్ప్రైజింగ్గా ఉందని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు డెంజల్ వాషింగ్టన్ . ఇంకా జూలియా డుకోర్నౌస్ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ మూవీ ‘ఆల్ఫా’ ప్రీమియర్ అయ్యింది. ఈ చిత్రానికి 12 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కింది.కాన్స్లో తెలుగు చిత్రం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్) స్క్రీనింగ్ జరిగినట్లు యూనిట్ పేర్కొంది. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో జో శర్మ ప్రధాన పాత్ర పోషించారు. వడ్లపట్ల మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జో శర్మ, వడ్లపట్ల మోహన్ కాన్స్లో పాల్గొన్నారు. ‘ఎమ్ 4 ఎమ్’ త్వరలో విడుదల కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్గా..
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఓ సీజన్లో అత్యంత పిన్న వయసులోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీని రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ గాయం కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.విధ్వంసకర శతకంతొలి మ్యాచ్లో 20 బంతుల్లో 34 పరుగులతో అలరించిన పద్నాలుగేళ్ల వైభవ్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించి.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆ తర్వాతి మ్యాచ్లో డకౌట్ అయిన వైభవ్.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. తాజాగా సీఎస్కేపై చితక్కొట్టిన ఈ హర్యానా కుర్రాడు 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఏడు మ్యాచ్లు ఆడి ఓ శతకం, ఓ అర్ద శతకం సాయంతో 252 పరుగులు సాధించాడు.తద్వారా ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అది కూడా 18 ఏళ్ల వయసులోపే ఈ ఘనత సాధించి.. తన పేరిట చెక్కు చెదరని రికార్డు లిఖించుకున్నాడు. ఇక ఐపీఎల్-2025లో తమ ఆఖరి మ్యాచ్లో చెన్నైతో తలపడ్డ రాజస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఓవరాల్గా సీజన్ మొత్తంలో పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలుపొందింది.18 ఏళ్ల వయసు నిండక ముందే ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు👉వైభవ్ సూర్యవంశీ- మొత్తం పరుగులు- 252 (రెండు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు)👉ఆయుశ్ మాత్రే- మొత్తం పరుగులు- 206 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉రియాన్ పరాగ్- మొత్తం పరుగులు- 160 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉సర్ఫరాజ్ ఖాన్- మొత్తం పరుగులు- 111 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0)👉అభిషేక్ శర్మ- 63 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0).చదవండి: ఆ యంగ్ క్రికెటర్కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటాNo fear and pressure 🙅Just pure finesse 😎Vaibhav Suryavanshi with a scintillating fifty in the chase 🔥Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/YUsYYeCQC0— IndianPremierLeague (@IPL) May 20, 2025

ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆటలోనే కాదు.. పెద్దలను గౌరవించడంలోనూ ముందే ఉంటానని నిరూపించాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పాదాలకు నమస్కరించడం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సీజన్లో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా రాజస్తాన్ సీఎస్కేతో మంగళవారం తలపడింది.ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొంది.. విజయంతో ముగించింది. మరోవైపు.. ధోని జట్టుకిది పదో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.ఆయుశ్ మాత్రే (20 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (25 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్, యుద్వీర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మరోసారి మెరిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (31 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా ధాటిగా ఆడాడు. ఆరంభంలో కుదేలైనా... చెన్నై ఆరంభంలోనే కాన్వే (10), ఉర్విల్ పటేల్ (0) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే బౌండరీలతో అలరించాడు. పవర్ప్లేలో జట్టు పుంజుకుంటున్న తరుణంలో... ఆయుశ్ దూకుడుకు తుషార్ చెక్ పెట్టాడు. స్వల్ప వ్యవధిలో అశ్విన్ (13), జడేజా (1) వికెట్లను కోల్పోయిన చెన్నై 78/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రెవిస్, శివమ్ దూబే (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఇన్నింగ్స్ను నిలబెట్టారు.వైభవ్ ధనాధన్లక్ష్య ఛేదనలో మొదట యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే దంచేశాడు. అతను అవుటైనప్పడు జట్టు స్కోరు 37/1. అందులో 36 జైస్వాల్వే! శాంసన్ వచ్చాకే వైభవ్ బ్యాట్కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడి 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే అశ్విన్ ఒకే ఓవర్లో శాంసన్, వైభవ్లను అవుట్ చేశాడు. పరాగ్ (3)ను నూర్ అహ్మద్ బౌల్తా కొట్టించాడు. అయితే చెన్నై పట్టుబిగించకుండా జురేల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేయడంతో ఇంకా 2.5 ఓవర్లు మిగిలుండగానే రాజస్తాన్ గెలిచింది. మిస్టర్ కూల్ రియాక్షన్ ఇదీఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం చెన్నై- రాజస్తాన్ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, వైభవ్ మాత్రం ఇందుకు భిన్నంగా.. చెన్నై సారథి ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మిస్టర్ కూల్ కూడా వైభవ్ వెన్నుతట్టి బాగా ఆడావు అన్నట్లుగా ప్రశంసించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్కు చేదు అనుభవాలే మిగిలినా.. వైభవ్ రూపంలో ప్రతిభ గల ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్లో ఓ సెంచరీ సాయంతో ఈ హర్యానా కుర్రాడు 252 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లలో రాజస్తాన్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్లు 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 😊This is what #TATAIPL is all about 💛🩷#CSKvRR | @ChennaiIPL | @rajasthanroyals pic.twitter.com/hI9oHcHav1— IndianPremierLeague (@IPL) May 20, 2025

శ్రీకాంత్ ముందంజ
కౌలాలంపూర్: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ప్రపంచ మాజీ నంబర్వన్, భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మొదలైన మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 65వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ తొలి రౌండ్లో 21–8, 21–13తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. అనంతరం రెండో రౌండ్లో 9–21, 21–12, 21–6తో హువాంగ్ యి కాయ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి ప్రవేశించాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఆరో సీడ్, చైనా ప్లేయర్ లు గ్వాంగ్ జుతో శ్రీకాంత్ తలపడతాడు. 2021 ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం నెగ్గిన 32 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది ఎనిమిది టోర్నీల్లో ఆడినా ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. మరోవైపు గతవారం థాయ్లాండ్ ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు దూసుకెళ్లిన హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లికి ఈ టోర్నీలో నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే తరుణ్ వెనుదిరిగాడు. తరుణ్ 13–21, 21–23తో పనిత్చఫోన్ తీరారత్సకుల్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయాడు. భారత్కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి 20–22, 20–22తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. అన్మోల్ 14–21, 18–21తో హుంగ్ యి టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మోహిత్–లక్షిత జగ్లాన్ ద్వయం 15–21, 16–21తో మింగ్ యాప్ టూ–లీ యు షాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు నేడు మొదలవుతాయి.

MI vs DC: ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ లక్ష్యంగా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’కు చేరగా... ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ముంబై జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్ బెర్త్’ను ఖరారు చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్ను అభిమానులు క్వార్టర్ ఫైనల్గా అభివర్ణిస్తున్నారు.తాజా సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లాడిన ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 7 విజయాలు, 5 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో ఉండగా... ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 5 పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య గత నెలలో జరిగిన పోరులో ముంబైనే విజయం వరించింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో సమతూకంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై జరగనున్న పోరులో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలాంటి పోరాటం కనబరుస్తుందో చూడాలి! అన్ని రంగాల్లో పటిష్టంగా... సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత రాకెట్లా దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గత ఏడు మ్యాచ్ల్లో ఆరింట నెగ్గిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు ఆల్రౌండర్లతో దట్టంగా ఉంది. సీజన్లో 63.75 సగటుతో 510 పరుగులు చేసిన సూర్యకుమార్ జట్టు తరఫున టాప్ స్కోరర్ కాగా... రికెల్టన్ 336, రోహిత్ శర్మ 300, తిలక్ వర్మ 246 పరుగులు చేశారు.గత మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై... తిరిగి పుంజుకుని సమష్టిగా సత్తాచాటాలని చూస్తోంది. రోహిత్ శర్మతో కలిసి రికెల్టన్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. వీరిద్దరూ కలిసికట్టుగా కదంతొక్కితే ఢిల్లీ బౌలర్లకు చిక్కులు ఖాయమే. ఇక సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్తో మిడిలార్డర్ బలంగా ఉంది. లీగ్ దశ ముగియగానే రికెల్టన్, జాక్స్, బాష్ జట్టును వీడనున్నారు. బౌలింగ్లోనూ ముంబైకి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా పేస్ భారం మోయనుండగా... కరణ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఈ మ్యాచ్లో ఓడినా... ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ అవి ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి. స్టార్క్ లోటుతో! అక్షర్ పటేల్ సారథ్యంలో ఈ సీజన్ ఆరంభంలో ఆశలు రేపిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత లయ కోల్పోయింది. ఆరంభంలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట నెగ్గిన క్యాపిటల్స్... ఆ తర్వాత ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. 11 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ 61.63 సగటుతో 493 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అభిషేక్ పొరెల్ 295, ట్రిస్టన్ స్టబ్స్ 280, అక్షర్ పటేల్ 263 పరుగులు చేశారు. ఆరంభంలో మెరిపించిన అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ ప్రభావం చూపలేకపోతుండగా... బౌలింగ్లో ఆ జట్టు స్టార్క్పై అతిగా ఆధారపడుతోంది. చావో రేవో మ్యాచ్లో అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారనుంది. గత మ్యాచ్లో చూసుకుంటే వికెట్లు చేతిలో ఉన్నా... ఆశించిన వేగంతో ఆడలేకపోయిన ఢిల్లీ జట్టు కేఎల్ రాహుల్ సెంచరీ సాయంతో 199 పరుగులు చేసింది.అయితే బౌలింగ్లో ఢిల్లీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. స్పిన్ త్రయం అక్షర్, కుల్దీప్, విప్రాజ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనే దానిపైనే ఢిల్లీ ‘ప్లే ఆఫ్స్’ భవితవ్యం ఆధారపడి ఉంది. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కరణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, అశ్వని కుమార్. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్, చమీరా.
బిజినెస్

బ్లూచిప్స్లో లాభాల స్వీకరణ
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 873 పాయింట్లు పతనమై 81,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 261పాయింట్లు కోల్పోయి 24,684 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఫైనాన్స్, రక్షణ రంగ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 906 పాయింట్లు క్షీణించి 81,154 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు కోల్పోయి 24,670 వద్ద కనిష్టాన్ని తాకాయి.⇒ భారీ పతనంతో మంగళవారం ఒక్కరోజే రూ.5.64 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.438 లక్షల కోట్లకు దిగివచ్చింది. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 85.58 వద్ద స్థిరపడింది.పతనం ఎందుకంటే...⇒ ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ⇒ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెట్టాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ⇒ వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రేతలుగా మారారు. అనూహ్యంగా మే 19న డీఐఐలూ అమ్మకాలకు పాల్పడ్డారు. మంగళవారం ఎఫ్ఐఐలు రూ.10,016 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

హిందాల్కో లాభం జూమ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 66 శాతం జంప్చేసి రూ. 5,284 కోట్లను తాకింది. దేశీ అమ్మకాలు పుంజుకోవడం, ముడివ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 55,994 కోట్ల నుంచి రూ. 64,890 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,155 కోట్ల నుంచి రూ. 16,002 కోట్లకు జంప్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 2,15,962 కోట్ల నుంచి రూ. 2,38,496 కోట్లకు బలపడింది. ఈఎంఐఎల్ మైన్స్కు ఓకే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. ఇందుకు నిలకడైన నిర్వహణ సామర్థ్యం, వ్యయ నియంత్రణకుతోడు అన్ని బిజినెస్లకు నెలకొన్న డిమాండ్ దోహదపడినట్లు తెలియజేశారు. ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ సొంత అనుబంధ సంస్థ ఈఎంఐఎల్ మైన్స్ మినరల్ రిసోర్సెస్ కొనుగోలుకి బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు హిందాల్కో పేర్కొంది. బంధా కోల్ బ్లాకు లీజ్ హక్కులు కలిగిన ఈఎంఐఎల్ మైన్స్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది.హిందాల్కో షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 663 వద్ద ముగిసింది.

మెడికల్ ఇంప్లాంట్.. ఫుల్ డిమాండ్..!
ముంబై: ఆర్థోపెడిక్, కార్డియాక్ ఇంప్లాంట్ల వ్యాపారం 2027–28 నాటికి 4.5–5 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.42,500 కోట్లు) విస్తరిస్తుందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయంగా బలమైన డిమాండ్కు తోడు, ఎగుమతులు క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. ఆర్థోపెడిక్, కార్డియాక్ ఇంప్లాంట్ల వ్యాపారం (ఎగుమతులు సహా) 2024 మార్చి నాటికి 2.4–2.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్లో తలసరి ఆదాయం పెరుగుతుండడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహనలో మార్పు, వృద్ధ జనాభా పెరుగుతుండడం, ఆరోగ్య సదుపాయాల విస్తరణ, ఆరోగ్య బీమా కవరేజీ విస్తృతి ఇవన్నీ ఈ రంగం వృద్ధికి సానుకూలిస్తాయని కేర్ఎడ్జ్ నివేదిక వివరించింది.ఇటీవలి సంవత్సరాల్లో బహళజాతి ఇంప్లాంట్ కంపెనీల కంటే దేశీ తయారీదారులే ఎక్కువ వృద్ధి చెందుతున్నట్టు పేర్కొంటూ.. పోటీతో కూడిన ధరలకుతోడు సామర్థ్యాలను సమకూర్చుకోవడాన్ని గుర్తు చేసింది. ఇంప్లాంట్లకు సంబంధించి బలమైన టెక్నాలజీ సామర్థ్యాలు అవసరమని.. ఈ విభాగాన్ని ప్రధానంగా విదేశీ ఎంఎన్సీలే శాసిస్తున్నట్టు తెలిపింది.అయితే దిగుమతులను భారత్ క్రమంగా తగ్గించుకుంటున్నట్టు.. దేశీ ఇంప్లాంట్ తయారీదారులు ఏటా 28 శాతం చొప్పున 2023–24 వరకు వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిని సాధించినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో అమ్మకాలు ఏటా 12 శాతం పెరిగినట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రాయోజిత బీమా పథకాల్లో పాల్గొనడంతోపాటు పోటీ ధరల ఫలితంగా విదేశీ ఎంఎన్సీల కంటే భారతీయ కంపెనీలే అమ్మకాల్లో అధిక వృద్ధిని నమోదు చేస్తున్నట్టు వివరించింది.ఎగుమతుల్లోనూ సత్తా..గడిచిన కొన్నేళ్ల నుంచి భారత ఇంప్లాంట్ తయారీ కంపెనీలు విదేశీ ఎంఎన్సీలను స్థానిక మార్కెట్లో సవాలు చేయడమే కాకుండా ఎగుమతుల మార్కెట్లోనూ గట్టి పోటీనిస్తున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక వెల్లడించింది. ఇంప్లాంట్ మార్కెట్లో ఉన్న అవకాశాల నేపథ్యంలో జైడస్ లైఫ్ సైన్సెస్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ తదితర బడా ఫార్మా కంపెనీలు ఇంప్లాంట్ల తయారీ, పంపిణీపై పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న వాణిజ్యం, టారిఫ్ల అనిశ్చితులు, ధరలపై పరిమితుల విధింపు, నియంత్రణలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. గుండెలో స్టెంట్లు, మోకాళ్ల చిప్పలు ఇవన్నీ కూడా ఇంప్లాంట్ల కిందకే వస్తాయి.

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: భారతీయ మ్యూచువల్ ఫండ్ (MF) పరిశ్రమ 2025 ఆర్థిక సంవత్సరాన్ని అద్భుతమైన పనితీరుతో ముగించింది. మార్చి 2025 నాటికి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (AUM) రికార్డు స్థాయిలో రూ. 65.74 లక్షల కోట్లకు చేరుకుంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) సోమవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.సవాళ్లను అధిగమించి వృద్ధిమార్చి 2024లో రూ. 53.40 లక్షల కోట్లుగా ఉన్న AUM, 2025 మార్చి నాటికి 23.11 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. స్టాక్ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాల పట్ల నిబద్ధతతో ఉన్నారని ఈ వృద్ధి స్పష్టం చేస్తుంది.సానుకూల వృద్ధి అంచనాAMFI సీఈఓ వెంకట్ ఎన్ చలసాని మాట్లాడుతూ, "మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు ప్రవేశిస్తుండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు సానుకూల వృద్ధి అంచనా ఉంది. మార్క్-టు-మార్కెట్ (MTM) లాభాలు, సంవత్సరమంతా స్థిరమైన నిధుల ప్రవాహం AUM పెరుగుదలకు దోహదపడ్డాయి" అని తెలిపారు.ఈక్విటీ, డెట్ పథకాలకు నిధుల ప్రవాహం2025 ఆర్థిక సంవత్సరంలో, దేశీయ మ్యూచువల్ ఫండ్లలోకి మొత్తం రూ. 8.15 లక్షల కోట్ల నిధులు వచ్చాయి. ఇందులో ఎక్కువ భాగం ఈక్విటీ-ఆధారిత పథకాలలోకి ప్రవహించాయి, రూ. 4.17 లక్షల కోట్ల నిధులు ఈ పథకాలను ఆకర్షించాయి. దీర్ఘకాలిక వృద్ధి పట్ల పెట్టుబడిదారుల ఆసక్తిని ఇది సూచిస్తుంది. గత మూడేళ్లుగా నిధుల అవుట్ఫ్లోను ఎదుర్కొంటున్న డెట్ పథకాలు, రూ. 1.38 లక్షల కోట్ల నిధులను ఆకర్షించాయి. తక్కువ వడ్డీ రేట్లు, భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు డెట్ ఫండ్లపై ఆసక్తిని పెంచాయని AMFI పేర్కొంది.పెరుగుతున్న రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యంరిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం గణనీయంగా పెరగడం ఈ నివేదికలో మరో ముఖ్యాంశం. మ్యూచువల్ ఫండ్ ఫోలియోల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 17.78 కోట్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 23.45 కోట్లకు 32 శాతం పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈక్విటీ-ఆధారిత పథకాలు అధిక శాతం ఫోలియోలను కలిగి ఉన్నాయి, వాటి సంఖ్య 33 శాతం పెరిగి 16.38 కోట్లకు చేరుకుంది. హైబ్రిడ్ పథకాలు కూడా ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించాయి. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు 48 శాతం ఫోలియోల వృద్ధితో అత్యంత వేగంగా వృద్ధి చెందాయి.సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (SIP) కీలక పాత్రఈ వృద్ధిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (SIP) కీలక పాత్ర పోషించాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో SIPల ద్వారా వచ్చిన విరాళాలు 45.24 శాతం పెరిగి రూ. 2.89 లక్షల కోట్లకు చేరాయి. ఇది పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రతిబింబించడమే కాకుండా, మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUMలో SIP ఆస్తుల వాటాను రూ. 13.35 లక్షల కోట్లకు, అంటే దాదాపు 20 శాతానికి పెంచింది. SIP ఖాతాల సంఖ్య, విరాళాలు రెండూ ఈ సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి.దీర్ఘకాలిక పెట్టుబడి ధోరణిపెట్టుబడిదారులు క్రమశిక్షణతో సంపదను సృష్టిస్తున్నారని సూచిస్తూ, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం SIP ఆస్తులను కలిగి ఉన్న వారి సంఖ్య పెరిగిందని AMFI పేర్కొంది. యువ పెట్టుబడిదారులు మరింత దూకుడుగా పెట్టుబడి విధానాన్ని ఇష్టపడగా, వృద్ధులు రిస్క్ నిర్వహణ, వైవిధ్యీకరణపై దృష్టి సారించినట్లు నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ ప్రాబల్యం ఇంకా తక్కువగా ఉన్నప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ పనితీరు పెట్టుబడిదారులలో పెరుగుతున్న అవగాహన, నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది.
ఫ్యామిలీ

IBD లక్షలమందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి, మొహమాటం వద్దు!
హైదరాబాద్: ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఐబీడీ ( Inflammatory Bowel Disease (IBD)) చాలామంది నోట ఇది వినిపిస్తుంది. దీర్ఘకాల వ్యాధి కావడంతో ఇది జీవనశైలినే మార్చేస్తుంది. దీనికి వెంటనే చికిత్స అవసరం. ప్రపంచవ్యాప్తంగా కోటి మంది, మన దేశంలోనే 15 లక్షల మంది ఈ వ్యాధి బాధితులున్నారు. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ లాంటి సమస్యలతో కలిపి వచ్చే ఐబీడీని వెంటనే గుర్తిస్తున్నా, సామాజిక సమస్యల కారణంగా దీనిపై ఎవరూ పెద్దగా చర్చించడం లేదు. ఈ నెల 19న ప్రపంచ ఐబీడీ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సరిహద్దులు లేవని, అందరం కలిసి సామాజిక అపోహలను తొలగిద్దామని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష సూచించారు.ఐబీడీ చికిత్స కోసం ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఒక ప్రముఖ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అందులో మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, ఐబీడీకి శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు, డైటీషియన్లు, సైకాలజిస్టులు ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా కేటాయించిన 20 పడకలు, అత్యాధునిక సదుపాయాలతో అనేకమంది రోగులకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి అత్యాధునిక చికిత్సలు అందిస్తోంది. పలు జిల్లాల నుంచి వైద్యులు రోగులను ఇక్కడకు పంపుతున్నారు. ముఖ్యంగా ఈఎంఆర్ ఆధారిత ఫాలోఅప్ కార్యక్రమం ఉండడం, అందరికీ వ్యక్తిగత సంరక్షణ కోసం వారానికోసారి ఐబీడీ క్లినిక్ ఏర్పాటుచేయడం ఇక్కడి ప్రత్యేకతలు.“ఐబీడీ అనేది కేవలం కడుపు సమస్యే కాదు. అది మన మొత్తం శరీరం, మనసునూ ప్రభావితం చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు, సమస్య తీరు, దాని లక్షణాలైన.. తరచు విరేచనాలు కావడం, కడుపునొప్పి, మలద్వారం నుంచి రక్తం కావడం, నీరసం వల్ల రోగులు దీని గురించి చివరకు కుటుంబసభ్యులకు కూడా చెప్పరు. మౌనంగా బాధను భరిస్తుంటారు. పేగు సంబంధిత సమస్యలంటేనే సమాజంలో ఉన్న చిన్నచూపు వల్ల ఐబీడీ గురించి కూడా మాట్లాడరు. దీని కారణాల గురించి కూడా అనేక అపోహలున్నాయి. ఇలా చెప్పకపోవడంతో వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది, వారు సమాజం నుంచి దూరమవుతారు, ఆందోళన, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఐబీడీ అనేది ఆహారం వల్లనో, పరిశుభ్రత లేకపోవడం వల్లనో వస్తుందని.. ఇది కేవలం అరుగుదల సమస్య అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐబీడీ అనేది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. దానికి దీర్ఘకాలం పాటు చికిత్స అవసరం” అని డాక్టర్ హర్ష చెప్పారు.ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్తో దెబ్బకి 62 కిలోలకు!“ఐబీడీకి ప్రస్తుతం కచ్చితమైన చికిత్స తెలియదు గానీ, దాన్ని మందులు, ఆహారంలో మార్పులు, మానసిక చికిత్స, నిపుణులతో క్రమం తప్పకుండా సంప్రదించడం ద్వారా దీన్ని చాలావరకు నియంత్రించవచ్చు. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడిని అధిగమించడం, సహచరుల మద్దతు ముఖ్యమైనవి. ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, రిలేషన్లో ఉన్న యువకులకు ఇది అవసరం. ఆహారంపై అవగాహన కూడా ముఖ్యం. మంట వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే అన్నం, అరటిపండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు తినాలి. కారాలు, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఆహారాలు తినకూడదు. ఎవరికి వారికే ఆహారం మారుతుంది కాబట్టి, డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.చదవండి: వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే అంతేగా!అసలు అన్నింటికంటే ముందు మౌనం వీడాలి. బహిరంగంగా చర్చించాలి. అది క్లినిక్లో అయినా, తరగతుల్లో అయినా, కార్పొరేట్ ఆఫీసుల్లో అయినా. ఐబీడీ గురించి మాట్లాడితే అపోహలు పోతాయి. సానుభూతి పెరుగుతుంది. రోగులు చికిత్స పొందడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం వస్తుంది” అని డాక్టర్ హర్ష వివరించారు. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష

వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే నుజ్జు.. నుజ్జేగా!
మనం వాహనాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నామన్నది ఎంత ముఖ్యమో అవతలి వాళ్లు ఎలా వస్తున్నా రన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఎవరో చేసిన పొరబాటుకు మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన సంఘటన చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఒక మహిళ అద్భుతంగా తప్పించుకుంది. కేరళోని కోజికోడ్ మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డు వాలులో ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయింది. దీంతో వెనక్కి దూసుకొస్తోంది. దాని వెనక స్వల్ప దూరంలోనే స్కూటర్ వస్తోంది. అయితే సమయస్ఫూర్తిగా వ్యవహరించి స్కూటర్ నడుపుతున్న మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అదృష్టవశాత్తూ ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. బ్రేక్ ఫెయిల్యూర్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.केरल के कोझिकोड का ये वीडियो आपको विचलित कर देगा, मौत आई और छूकर निकल गई। ढलान होने की वजह से ट्रक पीछे लुढ़क गया और स्कूटी सवार महिला पीछे थी, वो ट्रक की चपेट में आ गई। महिला का बचना किसी चमत्कार से कम नहीं था। pic.twitter.com/QvSjORDb0g— Ajit Singh Rathi (@AjitSinghRathi) May 16, 2025ఈమెను ఓజాయాది నివాసి అశ్వతిగా గుర్తించారు. ట్రక్కు ఆమె స్కూటర్ను ఢీకొట్టి, ఆమెను రోడ్డుపైకి బలంగా విసిరివేసింది. దీంతో రెప్ప పాటులో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో లారీ స్కూటీని నుజ్జు నుజ్జు చేస్తూ వెనక ఉన్న చెట్టుకు గుద్దుకోని అగింది. సీసీటీవీలో రికార్డుల ప్రకారం పెరింగళం పట్టణం , మెడికల్ కాలేజీ మధ్య ఎత్తుపైకి వెళ్లే ప్రాంతంలోని సిడబ్ల్యుఆర్డిఎం సమీపంలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఈ సంఘటన. ఇది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని కొందరు, మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిందని కొందరు, వామ్మో, ఇలా కూడా జరుగుతుందా? డ్రైవింగ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రో... అని మరికొందరు కమెంట్స్ చేశారు. ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్తో దెబ్బకి 62 కిలోలకు!

ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!
వైద్యవిధానం విప్లవాత్మక మార్పులతో పురోగమిస్తుంది. నయం కానీ వ్యాధులను సరికొత్త చికిత్సా విధానంతో నయంచేసి రోగుల్లో సరికొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. తాజాగా వైద్య విధానంలో అలాంటి పరిణామామే చోటు చేసుకుంది. అంతేగాదు మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో కొత్త ఆశలను అందిస్తోంది. ఈ ఘనత సాదించింది లాస్ ఏంజిల్స్లోని యూఎస్ సర్జన్లు. అసలేం జరిగిందంటే..నలుగురు పిల్లల తండ్రి ఆస్కార్ లారైన్జార్ కేన్సర్ కారణంగా రెండు మూత్రపిండాలు, మూత్రశయంలోని దాదాపు సగ భాగాన్ని కోల్పోయాడు. దాంతో అప్పటి నుంచి అతడు డయాలసిస్పైనే ఆధారపడుతున్నాడు. అతడి సమస్యను నయం చేసేలా అమెరికన్ యూరాలజిస్ట్లు అవయవా దాత నుంచి సేకరించిన మూత్రపిండాలు, మూత్రశయంని మార్పిడి చేశారు. ఈ సంక్లిష్టమైన సర్జరీ దాదాపు ఎనిమిది గంటలు పైనే పట్టింది. 41 ఏళ్ల ఆస్కార్ లారైన్జార్కి ఈ శస్త్రిచికిత్స పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అలాగే మార్పిడి చేసి కొత్త మూత్రపిండాల సాయంతో మూత్ర విసర్జన చేయగలిగాడు కూడా. అతనికి ప్రస్తుతం మూత్రపిండాల పనితీరు మెరుగ్గానే ఉండటంతో డయాలసిస్ అవసరం తగ్గింది కూడా. ఈ సర్జరీ జరిగిన కొన్ని గంటల అనంతరమే..అతడు సాధారణ మూత్ర విసర్జన చేయగలిగాడు. పాపం ఆ వ్యక్తి గత ఏడేళ్లుగా ఈ మూత్ర విసర్జన చేయలేకపోయాడు. ఈ శస్త్ర చికిత్స అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ మేరకు సదరు వైద్య బృందం మాట్లాడుతూ..మూత్రాశయ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్సల గురించి గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే క్లినికల్ ట్రయల్ కోసం మరో నాలుగు శస్త్ర చికిత్సలు చేసేలే ప్లాన్లు ఉన్నాయి. నిజానికి ఈ పద్ధతిలో అవయవ తిరస్కరణకు అడ్డుకట్ట వసేలా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అణిచివేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఇంతవరకు బలహీనమైన మూత్రాశయాలతో బాధపడుతున్న చాలామంది బాధితులకు ప్రేగులోని భాగంతో తిరిగి మూత్రశయం తయారు చేయడం వంటి పరిమిత ఎంపికలే గతంలో ఉండేవని అన్నారు. దీంతో ఆయా వ్యక్తుల్లో తరుచుగా ఈ సమస్యల తిరగబెట్టడమే లేదా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నమవ్వడమో జరిగేదన్నారు. కానీ ప్రస్తుతం తాము చేసిన ఆధునిక మూత్రాశయ మార్పిడి చికిత్సతో అంతకుముందు ఉత్ఫన్నమైన ప్రమాదాలకు తెరపడినట్లయ్యిందన్నారు. అలాగే కేన్సర్ వంటి మహమ్మారి వ్యాధులతో బాధపడే వారిలో కొత్త ఆశలను నింపింది. సదరు బాధితుడు లారైన్జార్ చేసిన శస్త్రచికిత్స వైద్యశాస్త్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచించడమే గాక అతను పూర్తిస్థాయిలో కోలుకుంటే గనుక చాలామంది రోగులకు జీవితంపై కొత్త ఆశను అందిస్తుంది.(చదవండి: ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్ )

Ananya Nagalla : అలరించిన ఫ్యాషన్ స్ట్రీట్ వాక్
సాక్షి, సిటీబ్యూరో: ’లెగ్దా డిజైన్ స్టూడియో’ వేదికగా నిర్వహించిన ‘ఫ్యాషన్ స్ట్రీట్ వాక్’లో నగరంలోని టాప్ మోడల్స్ అధునాతన ఫ్యాషన్ డిజైన్లతో అలరించారు. మహిళల ట్రెండీ డిజైన్స్తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కలర్ఫుల్గా మార్చుతున్న లెగ్దా డిజైన్ స్టూడియో నూతన బ్రాంచ్ను హబ్సిగూడలో సోమవారం టాలీవుడ్ తార అనన్య నాగళ్ల ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి అనన్య నాగళ్ల మాట్లాడుతూ ఈ తరం అమ్మాయిల అందాలను ఇనుమడింపజేసే డ్రీమ్ డిజైన్లను సృష్టించడానికి లెగ్దా డిజైన్ స్టూడియో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలకు ఉపాధిని కల్పిస్తూ, వారి సృజనాత్మకతకు మద్దతుగా నిలుస్తున్న డిజైనర్ దివ్య కర్నాటి సేవలు మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్లో ఫ్యాషన్ స్టూడియో ఏర్పాటు చేయడం ఇక్కడి ష్యాషన్ హంగులకు, ఆదరణకు తార్కాణాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పేషెంట్ను పరిక్షించి డాక్టర్ మందులు ఇచ్చినట్టే, శరీర రూపురేఖలను బట్టి ఫ్యాషన్ దుస్తులను రూపొందించడం వినూత్న కళ అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.ఇదీ చదవండి: బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!గ్లోబల్ డిజైన్స్.. వైవిధ్యాన్ని కోరుకునే ఈ తరం యువతకు అధునాతన సృజనాత్మకతను జోడిస్తూ డిజైనింగ్ చేస్తున్నాం. ఇద్దరితో మొదలైన మా ప్రయాణం 30 మందికిపైగా ఫ్యాషన్ డిజైనర్లకు అవకాశాలను కలి్పస్తున్న ఫ్యాషన్ సెంటర్గా ఆవిష్కృతమైంది. గ్లోబల్ ట్రెండ్స్కు అనుగుణంగా డిజైన్స్ను రూపొందిస్తున్నాం. – దివ్య కర్నాటి, లెగ్దా డిజైన్ స్టూడియో నిర్వాహకులు
ఫొటోలు
అంతర్జాతీయం

యూకే ప్రొఫెసర్ ఓసీఐ హోదా రద్దు
లండన్: భారత సంతతికి చెందిన నితాషా కౌల్ అనే విద్యావేత్త ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదాను కేంద్రం రద్దు చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘పలు అంతర్జాతీయ, సోషల్ మీడియా వేదికల్లో భారత్కు వ్యతిరేకంగా రాస్తున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశంలోని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశంతో, వాస్తవాలను పూర్తిగా విస్మరించి, చరిత్ర పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం పంపిన లేఖను కౌల్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘విద్యా రంగంలో చేసిన కృషికి నన్నిలా శిక్షించారు. అత్యంత దారుణం. మోదీ ప్రభుత్వ మైనారిటీ వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు మరో నిదర్శనం’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. విదేశీ పౌరసత్వమున్న భారత సంతతి వ్యక్తులకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక హోదా ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఇది జీవితకాలపు వీసా. ఇది ఉన్నవారు భారత్ను సందర్శించడానికి ఎలాంటి పరిమితులూ ఉండవు.విమానాశ్రయం నుంచే బహిష్కరణ‘ప్రజాస్వామ్యం– రాజ్యాంగ విలువలు’ అంశంపై ప్రసంగించేందుకు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కౌల్ను బెంగళూరుకు ఆహ్వానించింది. విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఆమెను అడ్డుకుని 24 గంటల్లోనే బ్రిటన్కు తిప్పి పంపారు. ఆరెస్సెస్ను విమర్శి స్తున్నందుకే ఇలా చేశారని ఆమె అప్పట్లో ఆరోపించారు. ‘‘కర్నాటక ప్రభుత్వం ఆహ్వానంపై వస్తే కేంద్రం నాకు ప్రవేశం నిరాకరించింది. నా దగ్గర బ్రిటన్ పాస్పోర్ట్, ఓసీఐ కార్డు, ఇలా చెల్లుబా టయ్యే పత్రాలన్నీ ఉన్నాయి. ఇది నాకు మాత్రమే కాదు, నన్ను ఆహ్వానించిన బీజేపీ యేతర (కాంగ్రెస్) ప్రభుత్వానికి కూడా జరిగిన అవమానం’’ అని ఆక్షేపించారు. భారత్ విచ్ఛి న్నం కావాలని కోరుకునే కౌల్ వంటి ఓ పాక్ సానుభూ తిపరురాలిని ఆహ్వానించడం దారు ణమని బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ఇలాంటి చర్యలతో కర్నాటక కాంగ్రెస్ సర్కారు దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తోందంటూ మండిపడింది.ఎవరీ కౌల్?నితాషా కౌల్ లండన్లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, అంతర్జాతీయ సంబంధాల విభాగంలో అధ్యాపకురాలు. జమ్మూ కశ్మీర్ నుంచి యూపీలోని గోరఖ్పూర్కు వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. 1997లో హల్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేయడానికి 21 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్, ఆర్థిక, తత్వశాస్త్రాల్లో పీహెచ్డీ చేశారు. బ్రిస్టల్ బిజినెస్ స్కూల్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. 2010లో భూటాన్లోని రాయల్ థింఫు కళాశాలలో సృజనాత్మక రచనలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆమె రచయిత్రి, కవయిత్రి కూడా.

పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు.

మాజీ ప్రధానిగా నటనకు ప్రశంసలు, హత్యాయత్నం కేసులో అందాల నటి
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్బర్డ్స్ వీడియో వైరల్గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి. నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది. ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!

అగ్నిపర్వతం బద్దలు.. అధికారుల్లో టెన్షన్.. కారణం ఇదే..
పడాంగ్: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం ధాటికి దాదాపు ఆరు కిలోమీటర్ల ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసి పడింది. దీంతో, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకిలో ఉన్న అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఈ సందర్భంగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అధిపతి ముహమ్మద్ వాఫిద్ పేర్కొన్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రాంతాలకు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అన్నారు.ఇదే సమయంలో అగ్నిపర్వతం నుంచి దాదాపు 6 కి.మీ ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.VIDEO: Indonesia's Mount Lewotobi Laki-Laki -- located on the tourist island of Flores -- erupts again, spewing thick ash up to 6,000 meters above its peak. pic.twitter.com/1afAM1qe3K— AFP News Agency (@AFP) May 18, 2025
జాతీయం

ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా!
చండీగఢ్/న్యూఢిల్లీ: ఇండియన్ అండర్కవర్ ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)(33)ను వాడుకుందా? నిజమేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ హ్యాండ్లర్ అలీ హసన్తో వాట్సాప్లో జ్యోతి చేసిన చాటింగ్లను వెలికి తీశారు. ఇద్దరి మధ్య కోడ్ భాషలో ఈ చాటింగ్లు జరిగాయి. ఒక చాటింగ్ను పరిశీలిస్తే.. భారత అండర్కవర్ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి అలీ హసన్ ఆమెను ప్రశ్నించాడు.భారత్–పాక్ సరిహద్దు అయిన అటారీ బోర్డర్ను సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్ ఉన్న అండర్కవర్ ఏజెంట్లను చూశావా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. ప్రోటో కాల్ అందుకున్నవారే అండర్ కవర్ ఏజెంట్లు కావొ చ్చు అని అలీ హసన్ చెప్పగా, అలాంటి వారిని తాను చూడలేదని పేర్కొంది. భారత నిఘా ఏజెంట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికి జ్యోతిని అస్త్రంగా ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్ఐ కోసమే పని చేస్తున్నట్లు ఆమెకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంటున్నారు. పాకిస్తాన్కు సంబంధించిన భారీ గూఢచార ముఠాలో ఆమె ఒక కీలక సభ్యురాలని నిర్ధారణకు వచ్చారు. జ్యోతి తొలిసారిగా 2023లో బైశాఖి పండుగ సమయంలో పాకిస్తాన్లో పర్యటించింది. ఈ సరిహద్దులు ఇంకా ఎన్నాళ్లో.. జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. ఆమె తన ఆలోచనలు, పర్యటనల గురించి ఇందులో రాసుకుంది. పాకిస్తాన్ ప్రస్తావన సైతం ఉంది. డైరీలో 11 పేజీల్లో రాయగా.. 8 పేజీల్లో సాధారణ అంశాలు, 3 పేజీల్లో పాకిస్తాన్ గురించి హిందీ, ఇంగ్లిష్ భాషలో రాతలు కనిపిస్తున్నాయి. ‘‘పాకిస్తాన్ ప్రజల ఆదరణ, వారి అతిథి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్లో భారతదేశ హిందువుల పర్యటనలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్లోని తమ పూరీ్వకుల గ్రామాలను హిందువులు సందర్శించాలి.అక్కడి హిందూ ఆలయాలు, గురుద్వారాలకు సులువుగా వెళ్లొచ్చే పరిస్థితులు రావాలి. 1947లో దేశ విభజన తర్వాత విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుంది. పాకిస్తాన్లో పది రోజుల పర్యటన పూర్తి చేసుకొని ఈ రోజే ఇండియాకు తిరిగొచ్చా. రెండు దేశాల మధ్య ఈ సరిహద్దులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. బాధపడే హృదయాలకు ఉపశమనం కలగాలి. మనమంతా ఒకే దేశం, ఒకే నేలకు చెందినవాళ్లం’’ అని జ్యోతి తన డైరీలో రాసుకుంది. మరోవైపు ఆమె కశీ్మర్ పర్యటనల వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.అర్ధరాత్రి పొద్దుపోయే దాకా పనిచేయడం ఆమెకు అలవాటు అని గుర్తించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వీడియోలను ఎడిటింగ్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేదని చెప్పారు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి మరోచోటుకి వెళ్లినట్లు గుర్తించారు. జ్యోతి వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. తన బిడ్డ సంగతి తనకు తెలియదని, దీనిపై తనను ఏమీ ప్రశ్నించవద్దని జ్యోతి తండ్రి స్పష్టం చేశారు. నిందితురాలిపై ప్రశ్నల వర్షంయూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం రాబట్టానికి భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆమె పాకిస్తాన్, చైనాతోపాటు ఇతర దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 16న ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్లో గత రెండు వారాల్లో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఆదాయానికి, ఖర్చులకు పొంతనేదీ?ఇదిలా ఉండగా, నిందితురాలు జ్యోతి మల్హోత్రా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరిని కలిసిందీ పూర్తి వివరాలు తెలిస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తామని, దానివల్ల దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారానే తనకు ఆదాయం వస్తోందని నిందితురాలు చెబుతుండగా, అధికారులు విశ్వసించడం లేదు. ఆమెకు వచ్చిన ఆదాయానికి, విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులకు పొంతన లేదని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివరాలు కూపీ లాగుతున్నారు.జ్యోతి ల్యాప్టాప్పై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని అధికారులు చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య నాలుగు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసే ఓ అధికారిని తరచుగా కలిసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. సోషల్ మీడియా ద్వారా జనంలో గుర్తింపు పొందినవారిని నియమించుకొని, దేశ రహస్యాలు కొల్లగొట్టడం ఆధునిక యుద్ధరీతిలో ఒక భాగంగా మారిందని తెలిపారు.

గోల్డెన్ టెంపుల్లోకి ఆయుధాల అనుమతి: కారణం ఇదే..
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి పాకిస్తాన్ వల్ల ముప్పు ఉందని తెలియగానే రక్షణ వ్యవస్థల పటిష్టం చేశారు. ఆలయంలోకి తుపాకులను తీసుకెళ్లడానికి ఆలయ ప్రధాన గ్రంథి (గురుద్వార్ పర్యవేక్షకుడు) అనుమతించారని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ అధికారి సుమర్ ఇవాన్ పేర్కొన్నారు.క్షిపణులను, డ్రోన్లను గుర్తించడానికి గోల్డెన్ టెంపుల్ లైట్లను ఆఫ్ చేయడానికి కూడా ఆలయ పర్యవేక్షకులు అనుమతిచ్చారు. కొన్నేళ్లుగా ఆలయంలో వెలుగుతున్న లైట్లను ఆపివేయడం బహుశా ఇదే మొదటిసారి. ఆలయ రక్షణ విషయంలో మాకు సహకరించిన స్వర్ణ దేవాలయ సిబ్బందికి.. లెఫ్టినెంట్ జనరల్ కృతఙ్ఞతలు తెలిపారు.ప్రతిరోజూ లక్షలాది మంది సందర్శిస్తున్న అంతర్జాతీయ ఖ్యాతి గడించిన స్వర్ణ దేవాలయాన్ని కాపాడుకోవాలి. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ ఈ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం తిప్పిగొట్టి.. దేవాలయం మీద చిన్న గీత కూడా పడకుండా అడ్డుకుంది.పాకిస్తాన్ ఎప్పుడూ.. ఎక్కువ మంది జనాభా ఉన్న ప్రాంతాలను లేదా మతపరమైన ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ విషయాన్ని భారత సైన్యం ముందుగానే గ్రహించిందని లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు. నిఘా వర్గాలు కూడా స్వర్ణ దేవాలయం మీద దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

25 మందిని వివాహం చేసుకున్న యువతి.. 26వ పెళ్లితో
జైపూర్: పెళ్లి పేరుతో అమాయికుల్ని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 25మందిని పెళ్లి చేసుకున్న నిత్యపెళ్లి కూతురు 26వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. పోలీసులకు అడ్డంగా దొరికి పోయింది.వివరాల్లోకి వెళ్లితే.. రాజస్తాన్కు చెందిన యువతి అనురాధా పాస్వాన్ది కడుపేదరికం, ఒంటరి జీవితం, నిరుద్యోగైన తమ్ముడు బాధ్యతను తానే చూసుకోవాలి. పెళ్లి చేసుకునేందుకు చేతిలో డబ్బు లేదు. వెరసీ.. పేదరికం నుంచి బయటపడేందుకు కతర్నాక్ ప్లాన్ వేసింది. తనకున్న అందం, తెలివితేటలతో పెళ్లి పేరుతో వరుస మోసాలకు పాల్పడింది.పెళ్లి చేసుకోవడం. ఆపై అత్తారింట్లో అనుకువగా ఉండటం. వారిని తన మాటలతో నమ్మించి ఇంట్లో ఉన్న బంగారం,డబ్బులు,ఖరీదైన వస్తువుల్ని అందినకాడికి దోచుకోవడం పరారవ్వడం. పేరు మార్చి, మకాం మార్చడం మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇలా తక్కువ సమయంలో 25మందిని వివాహం చేసుకుంది.ఇందుకోసం తానే ఓ గ్యాంగ్ను నడుపుతోంది. అమాయకులు, పెళ్లి కుమార్తె కోసం అన్వేషిస్తున్న వారి ఇంటికి తన గ్యాంగ్లోని మనిషిని పంపిస్తోంది. ఈ గ్యాంగ్ ఆమె ఫోటోలు, ప్రొఫైల్ను పెళ్లి కుమారులకు చూపిస్తారు. అనంతరం, పెళ్లికి ఒప్పిస్తారు. ఇందుకు గాను పెళ్లి కుమార్తెను చూసినందుకు పెళ్లి కుమారుడి కుటుంబం నుంచి రూ.2లక్షలు వసూలు చేస్తారు. పెళ్లి తర్వాత ప్లాన్ ప్రకారం.. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అనురాధా పాస్వాన్ అత్తింటి వారితో అనుకువగా మెసులుతుంది. ఇంట్లో ఉన్న బంగారాన్ని ఉడాయించాలనుకుంటే వెంటనే తన ప్లాన్లో భాగంగా కట్టుకున్న భర్త, ఇతర కుటుంబసభ్యులు తినే ఆహారంలో మత్తు మందు కలుపుతుంది. మత్తు మందు కలిపిన ఆహారం తిన్న కుటుంబ సభ్యులు ఆపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను కాజేస్తుంది.ఇప్పటివరకు 25 మందిని బురిడీ కొట్టించింది. ఈ క్రమంలో అనురాధా పాస్వాన్ చేతిలో మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె రూట్లోనే వెళ్లారు. నిత్యపెళ్లి కుమార్తెను, ఆమె ముఠా గుట్టురట్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

‘ఇవేం రోడ్లు?.. బీబీఎంపీకి రూ.50 లక్షల నోటీస్
బెంగళూరు: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు అనువైన రోడ్లు ఎంతో అవసరం. అయితే భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గుంతలు, గతుకులు, వర్షం పడితే చాలు నీటితో నిండిపోయే రోడ్లు బెంగళూరు వాసులను ఇబ్బందుకు గురిచేస్తున్నాయి. ఈ ఇక్కట్లపై స్పందించిన బెంగళూరుకు చెందిన దివ్య కిరణ్(43) బృహత్ బెంగళూరు మహానగరపాలిక(Greater Bengaluru Metropolitan City) (బీబీఎంపీ)కి నోటీసులు పంపించారు.బెంగళూరు నగరంలోని రోడ్లపై ప్రయాణిస్తున్న కారణంగా తనకు శారీరక బాధలు ఎదురవడమే కాకుండా, మానసిక సమస్యలు కూడా తలెత్తాయని పేర్కొంటూ ఆయన బీబీఎంపీకి రూ. 50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. నగరానికి చెందిన సామాన్య పౌరుడినైన తాను పన్నులను చెల్లిస్తూ, నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నానని కిరణ్ పేర్కొన్నారు. అయితే గతుకుల రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే కదలికల కారణంగా తాను తీవ్రమైన మెడ, వీపు నొప్పులకు లోనయ్యానని పేర్కొన్నాడు. ఈ నొప్పుల నుంచి ఉపశమనానికి ఐదు సార్లు ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్(Orthopedic specialist)లను సంప్రదించాల్సి వచ్చిందని కిరణ్ ఆ నోటీసులో పేర్కొన్నాడు.నగర రోడ్లపై ప్రయాణిస్తున్న కారణంగా తన క్లయింట్ కిరణ్ పలు ఇబ్బందుకు ఎదుర్కొంటున్నాడని ఇంజక్షన్లు, చికిత్సలు, నొప్పి నివారణ మందులు.. అతని రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయాయని అడ్వకేట్ కేవీ లవీన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దివ్య కిరణ్ ఆటోలు, టూ-వీలర్లలో ప్రయాణించడం అసాధ్యంగా మారిందని, క్యాబ్లు కొంచెం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, రోడ్ల దుస్థితి కారణంగా అవి కూడా అతని బాధను తప్పించలేకపోతున్నాయని లవీన్ పేర్కొన్నారు. నగరంలోని రోడ్ల పరిస్థితి అతని వృత్తిపరమైన జీవితాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు.తాను ఎదుర్కొంటున్న సమస్యలకు బీబీఎంపీ నిర్లక్ష్యమే కారణమని దివ్య కిరణ్ ఆరోపించారు. దీనికి ప్రతిగా తనకు రూ. 50 లక్షల పరిహారాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ దీనిపై స్పందించకుంటే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) కూడా దాఖలు చేస్తాననని కిరణ్ తెలిపారు.ఇది కూడా చదవండి: బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే..
ఎన్ఆర్ఐ

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్నేత్రాలయ ప్రకటించింది.

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్

విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
బయ్యారం/మిరుదొడ్డి (దుబ్బాక)/జగదేవ్పూర్ (గజ్వేల్)/పిట్లం (జుక్కల్)/ తొగుట (దుబ్బాక): విద్యుత్ తీగలు ప్రాణాలు తీశాయి. వేర్వేరుచోట్ల కరెంట్ షాక్కు గురై ఆరుగురు మృతిచెందారు. పెళ్లయిన 48 గంటలకే.. పెళ్లి బాజాలు...డీజే మోతలు మోగిన ఆ ఇంట చావు డప్పు మోగింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా య్యారం మండలం కోడిపుం జుల తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ (26)కు ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన జాహ్నవితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం తండాకు దంపతులిద్దరూ వచ్చారు. మంగళవారం నరేశ్ ఇంటి వద్ద మోటార్ను ఆన్చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గుర య్యా డు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. విద్యుత్ సర్వీస్ వైరుపైపడి.. కౌలు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. జగదేవ్పూర్కు చెందిన మహ్మద్ షాదుల్ (25) మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో మామిడి చెట్టుకు ఇనుప స్టాండ్ వేసుకొని ఎక్కి వలను చుడుతున్నాడు. ఈ క్రమంలో స్టాండ్పై నుంచి జారి కిందున్న విద్యుత్ సర్వీస్ వైర్పై పడటంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి.. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్ఐ హరీశ్ కథనం మేరకు.. మోతె గ్రామానికి చెందిన మంగోరి కృష్ణ హరి (60) తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి వీచిన గాలి వానకు పొలంలో కరెంటు స్తంభం పడిపోయి ఉంది. ఇది గమనించని కృష్ణ హరి వ్యవసాయ పనులు చేస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మోటారు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పొలంలో బోరు మోటారు పని చేయకపోవడంతో మంగళవారం గ్రామానికి చెందిన రాములు (42), హన్మయ్య (59) బోరు మోటారును తీయడానికి వెళ్లారు. మోటారును పైకి తీస్తున్న క్రమంలో మోటార్కు ఉన్న ఇనుప పైప్ పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్షాక్తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మత్తులో ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకుని.. సిద్దిపేట జిల్లా తొగుటకు చెందిన రామారపు రాజు (36) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం కూలి పనికి వెళ్లి.. సాయంత్రం మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకోగా కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు.

వ్యభిచారం కేసులో ఒలింపిక్ చాంపియన్ అరెస్టు
కొలంబస్: అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్ (2016)లో ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్ టోక్యో ఒలింపిక్స్ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్ చాంపియన్గా ఘనతకెక్కిన స్నైడర్ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో స్నైడర్ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. 29 ఏళ్ల స్నైడర్ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు. అతని భార్య మ్యాడీ ఫుట్బాల్ ప్లేయర్! రెండు వరుస ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన స్నైడర్ గతేడాది పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్షిప్లో స్నైడర్ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్గా నిలిచాడు. ఓవరాల్గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్నైడర్ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్లలో నెగ్గి, 21 బౌట్లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్ అమెరికన్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లీగ్లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు.

స్పా ముసుగులో వ్యభిచారం
కర్ణాటక: మండ్య నగరంలోని బెంగళూరు -మైసూరు జాతీయ రహదారిలో క్లౌడ్ -11 పేరుతో నిర్వహిస్తున్న యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పాపై ఒడనాడు సంస్థ సిబ్బంది, పోలీసులు సం యుక్తంగా దాడి చేశారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి సెలూన్ యజమాని ఎలిజబెతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలకు విముక్తి కల్పించారు.ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వారిని వ్యభిచారం ఊబిలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఈ స్పా సమీపంలోనే విద్యా సంస్థలు ఉన్నాయి. స్పాలో చీకటి వ్యవహారాలు జరుగుతున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతో ఒడనాడు సంస్థకు చెందిన స్వాన్లి పరశురామ్, సీఐ నవీన్ లు పోలీసులతో కలిసి దాడి చేశారు.

వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
గుంటూరు: ఈ ఏడాది ఫిబ్రవరిలో నా భర్త సాయిబాబు బల్బు బిగిస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు చేయి మణికట్టు వద్ద విరిగింది. స్థానిక కొత్తపేటలోని హాస్పిటల్కు తీసుకెళితే సర్జరీ చేశారు. చేసిన మరుసటి రోజే ఆయనకు కుడివైపు పక్షవాతం వచ్చింది. కనీసం ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయకపోగా హడావుడిగా మమ్మల్ని బయటకు పంపేశారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబాన్ని నడిపించే నా భర్త అచేతనంగా పడి ఉండడానికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. మెడికల్ వెరిఫికేషన్ పెట్టించాలని మనవి.–జక్కంపూడి శ్రీవల్లి, గుంటూరునా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు