Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

Top Stories

ప్రధాన వార్తలు

Former CM YS Jagan anger against Chandrababu Naidu government1
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండాపోయింది. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్‌ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025

Drinkers Hulchul At Tirumala Alipiri2
టీటీడీ విజి­లె­న్స్‌ వైఫల్యం.. తిరుమలలో మరో అపచారం.. వీడియో

తిరుపతి: తిరుమలలోని అలిపిరి చెక్‌ పాయింట్‌కు సమీపంలోని ఏటీఎం సెంటర్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతున్న వీడి­యో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం తాగిన వ్యక్తులు ఖాళీ సీసాను అలిపిరి మెట్ల మార్గంలో వేయడం శ్రీవారి భక్తులు ఆగ్రహానికి కారణమైంది.అయితే, అలిపిరి తనిఖీ కేంద్రానికి కూతవేటు దూరంలో అలిపిరి నడక మార్గం ప్రారంభం అవుతుంది. ఈ ప్రాంతంలో దాదాపు 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా టీటీడీ నిఘా ఉంచింది. అలిపిరి మెట్ల మార్గం ప్రారంభ ద్వారం వద్ద లగేజీ కౌంటర్‌కు అభిముఖంగా ఏటీఎం సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతా­ల్లో అండర్‌ పాస్‌ ద్వారా అలిపిరి మెట్ల మార్గం ప్రార­ంభమవుతుంది. భక్తులు ఈ అండర్‌ పాస్‌ ద్వా­రా­కాలినడక ప్రారంభిస్తారు. ఏటీ­ఎంకు ఆనుకుని కొంత ఖాళీస్థలం ఉండటంతో మందు­బాబులు రెచ్చిపోతు­న్నారు.టీటీడీ విజిలెన్స్‌ నిఘా వైఫల్యమే ఇందుకు కారణమని భక్తులు ఆగ్ర­హం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజి­లె­న్స్‌ నిద్ర మత్తు­లో తూలుతోందనే విషయం ఇటీవల వరుస ఘట­నలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి ఘట­నలు ఎన్ని జరిగిన ‘మాకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్య ధోరణి వి­జిలెన్స్‌ నిఘా విభాగం సిబ్బందిలో పెరిగిపోయింది. సిబ్బంది పనితీరును నిరంతరా­య­ంగా పర్య­వేక్షించా­ల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవ­హ­రించడంతో వరుస నిఘా వైఫ­ల్యాలు వెలు­గు చూస్తున్నాయి. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి ఘ­ట­న­లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకో­వా­లని డిమాండ్‌ చేస్తున్నారు.🚨 #BRNaiduUnfitForTTDఅలిపిరి మెట్ల మార్గంలో కాకుండా.. మద్యం సీసాలపై నడుచుకుంటూ భక్తులు కొండపైకి వెళ్లాలా @ncbn, @PawanKalyan, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ?శ్రీవారి సన్నిధిలో మద్యాన్ని ఏరులైపారిస్తున్న కూటమి ప్రభుత్వం. మందు తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు… pic.twitter.com/HftbdINhv1— YSR Congress Party (@YSRCParty) June 8, 2025

Phone Tapping Case SIB Prabhakar Rao Returned to Hyderabad3
హైదరాబాద్‌ చేరుకున్న ప్రభాకర్‌ రావు.. ఎయిర్‌పోర్టులో బౌన్సర్ల ఓవరాక్షన్‌!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌ రావు హైదరాబాద్‌కు చేరుకున్నారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్సైబీ) ఓఎస్డీ ప్రభాకర్‌రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు ఓవరాక్షన్‌కు దిగారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాకర్ రావు బౌన్సర్లు హంగామా చేశారు. విమానాశ్రయంలో ప్రభాకర్ రావుకు రక్షణ కవచంగా బౌన్సర్లు రక్షణ కవచంగా నిలబడ్డారు. ఈ సందర్బంగా ప్రభాకర్‌ రావును మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేశారు. కొంతమంది యూనిఫాంలో ధరించి.. మరి కొంత మంది సివిల్ డ్రెస్‌లో ఉన్న బౌన్సర్లు ఓవరాక్షన్‌కు దిగారు. ప్రభాకర్‌ రావు సైతం మీడియాకు ముఖం చాటేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Em Ganakaryam chesinav Ani siggupaduthunav Prabhakar Rao! Khaaki Paruvu Theesindi Kaakunda!🗣️ pic.twitter.com/VMpKSj2OWn— Rishi Karan Reddy (@Rishi_Karan_) June 8, 2025ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌ రావు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమిరేట్స్‌ విమానంలో దుబాయ్‌ మీదుగా ప్రభాకార్‌ రావు ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మిగతా నిందితులైన పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులు అరెస్టయి దీర్ఘకాలం రిమాండులో ఉండి బెయిల్‌ పొందారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో వీరందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్న ప్రభాకర్‌రావు.. ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్‌పోర్టు రద్దు చేయించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రావడంతో విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న దానిపై సిట్‌ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్‌ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. రాజకీయ, సినీ ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థికసాయం చేసినవారి ఫోన్లు ట్యాపింగ్‌ చేసినట్లు బయటకు వచ్చింది. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.

CM Revanth Reddy Delhi Tour Deatils4
ఢిల్లీకి రేవంత్‌.. మంత్రుల శాఖలు ఫిక్స్‌!

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై హైకమాండ్‌తో చర్చించనున్నారు.వివరాల ప్రకారం.. సీఎం రేవంత్‌ రెడ్డి ఈరోజు ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరపనున్నారు. అలాగే, పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే.. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్‌ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్‌ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్‌ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్‌ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్‌లు, చాంబర్‌ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసింది. సీఎం కాకుండా.. కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57 శాతం(8 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. మొత్తం 14 మందిలో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు 4, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు. అడ్లూరి లక్ష్మణ్‌.. మాదిగ, గడ్డం వివేక్‌.. మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజ్‌ వర్గీయుడు.

Illegal activities are rampant on Nagulakonda in Anakapalle5
కొండపై విష‘నాగులు’

నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్‌ మాఫియా కబళిస్తోంది. ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్‌ తవ్వకా­లు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది.నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్‌ మాఫియా కబళిస్తోంది. ఇక్కడ మైనింగ్‌కి అనుమతించింది కేవంలం 60 అడుగుల లోతు వరకే. కానీ ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్‌ తవ్వకా­లు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది. ఇక్కడినుంచి రోజుకు దాదాపు 15 వేల టన్నుల నుంచి 20 వేల టన్నుల లేటరైట్‌ను కూటమి నేతలు వందల టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. టన్ను లేటరైట్‌ రూ.3,800 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తూ రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. అంటే, ఏడాదికి రూ.2,044 కోట్ల నుంచి రూ.2,190 కోట్లు వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడి ఖాతాలోకి టన్నుకు రూ.250 వెళుతుండగా ఓ ఎంపీకి రూ.200 చొప్పున ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. – సాక్షి టాస్క్‌ఫోర్స్‌గిరిజనుడి ముసుగులో అడ్డగోలు దోపిడీకూటమి పార్టీలోని ఓ ఎంపీకి విధేయుడైన గిరిజనుడు లక్ష్మణరావు పేరుతో నాగులకొండపై అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. ప్రభుత్వానికి నామమాత్రంగా లీజు, రాయల్టీ చెల్లిస్తూ మైనింగ్‌ మాఫియా రూ.వందల కోట్లను ఆర్జిస్తోంది. అత్యంత విలువైన లేటరైట్‌ మైన్‌ ని హెక్టార్‌కు ఏడాదికి రూ. 26 వేల నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసిచ్చేశారు. అంటే 119 హెక్టార్లకు గాను ప్రభు­త్వానికి వచ్చే లీజు ఆదాయం కేవలం రూ.30.94 లక్షలు మాత్రమే. ఇక రాయల్టీ మోసానికి అంతేలేదు. ఇక్కడ నుంచి రోజూ 15 వేల టన్నులకు పైగా లైటరైట్‌ను తరలిస్తూ 5 వేల టన్నులను మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. టన్నుకు రూ.150 చొప్పున (అంటే రోజుకు రూ.7.5 లక్షలు) మాత్రమే రాయల్టీ కింద చెల్లిస్తున్నారు. అంటే రాయల్టీ కింద ఏడాదికి రూ.27.67 కోట్లు మాత్రమే చెల్లించి.. మిగతా రూ.2 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావల­సిన ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు.విలువైన హై గ్రేడ్‌ లేటరైట్‌..నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో హై గ్రేడ్‌ (ఉన్నత శ్రేణి) లేటరైట్‌ లభిస్తుంది. ఇందులో 43–44 శాతం వరకు అల్యూమినియం ఉంటుంది. కాగా, లేటరైట్‌ అనేది ఇనుప ఖనిజం (ఐరన్‌ ఓర్‌) ఒక రూపం. ఇంత నాణ్యమైనది కావడంతో సిమెంట్‌ కంపెనీలకు కాకుండా స్టీల్‌ ప్లాంట్లకు తరలిస్తున్నారు. కాకినాడ పోర్టును దీనికి వినియోగించుకుంటున్నారు. మరోవపు ఇక్కడే పెద్ద ట్విస్ట్‌ ఉంది. నాణ్యమైన ఖనిజాన్ని.. నాసిరకంగా చూపించి అనుమ­తులు తీసుకున్నారు. అల్యూమి­నియం 38–40 శాతంలోపే ఉందని నివేదికలు సమర్పిస్తున్నారు. తద్వారా రాయల్టీ తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లీజుదారు లక్ష్మణరావు ద్వారా ఆండ్రూ మినరల్స్‌కు విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు.వర్షంలో సైతం లేటరైట్‌ను తరలిస్తున్న టిప్పర్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదంనిర్ణీత మొత్తానికి మించి తవ్వినందుకు విచారణరూ.5 కోట్ల మేర జరిమానా వసూలునాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో నిర్ణీత మొత్తానికి మించి మైనింగ్‌ చేసేందుకు వీల్లేందంటూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. 68,279 టన్నుల లేటరైట్‌ను ఎక్కువగా తవ్వి­నట్లు తేలడంతో సుమారు రూ.5 కోట్ల మేర పెనాల్టీ విధించారు. 2023 జూన్‌లో మైనింగ్‌ నిలిచిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక లేటరైట్‌ తవ్వకాలకు టీడీపీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో గనుల శాఖ పెనాల్టీని సైతం రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో మళ్లీ మైనింగ్‌ ప్రారంభించారు. అయితే, ఫిబ్రవరి నుంచే లేట­రైట్‌ తరలింపు మొదలైనట్లు చెబుతున్నారు. పర్మిట్ల మంజూరు మొత్తం కాకినాడ జిల్లాలోని రౌతులపూడి నుంచి జరుగుతోంది. లేటరైట్‌ను తవ్వి తరలించే వాహనాలకు జీపీఎస్, మైనింగ్‌ ప్రాంతంలో వే బ్రిడ్జి లాంటివి ఏమీ లేవు. దీంతో యథేచ్ఛగా భారీ లోడ్‌ వాహనాల్లో లేటరైట్‌ తరలిపోతోంది.‘సాక్షి’ బృందాన్ని అడ్డుకున్న మాఫియానాతవరం మండలం సిరిపురం వద్ద మైనింగ్‌ జరుగుతుండగా.. ఇక్కడినుంచి లేటరైట్‌ను కాకినాడ జిల్లా రౌతులపూడికి తరలిస్తున్నారు. ఆ తర్వాత అన్నవరం రవికంపాడు వద్ద ఉన్న రైల్వే సైడింగ్‌ నుంచి ఒడిశాలోని వేదాంత ప్లాంటుకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ ప్రతినిధుల వాహనాన్ని రాఘవపట్నం దాటిన తర్వాత మైనింగ్‌ మాఫియా ఆయుధాలతో అడ్డుకుని బెదిరించింది. వాహనాన్ని వెంటాడింది. సిరిపురం చేరుకునేలోగా మరికొందరిని పోగేసి గిరిజనులతో మాట్లాడకుండా అడ్డుకున్నారు.

Cristiano Ronaldo Wins UEFA Nations Trophy For Portugal, Gets Emotional As Virat Kohli After Winning IPL 20256
UEFA టైటిల్‌ గెలిచిన పోర్చుగల్‌.. కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన క్రిస్టియానో రొనాల్డో

పోర్చుగల్‌ దిగ్గజ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో తన దేశానికి రెండో UEFA నేషన్స్‌ లీగ్‌ టైటిల్‌ను అందించాడు. జర్మనీలోని మ్యూనిచ్‌ వేదికగా ఆదివారం​ (జూన్‌ 8) జరిగిన ఫైనల్లో పోర్చుగల్‌ పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్‌పై 5-3 గోల్స్‌తో నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది. షూటౌట్‌కు ముందు ఇరు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. - Virat Kohli lifting IPL Trophy.- Cristiano Ronaldo lifting UEFA Trophy.TWO GOATs OF SPORTS. 🐐🙇 pic.twitter.com/WKXtmTel70— Tanuj (@ImTanujSingh) June 8, 2025ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో ఓ గోల్‌ చేశాడు. ఇది అతని కెరీర్‌లో 138 గోల్‌. నిర్ణీత సమయంలో తొలుత స్పెయిన్‌కు చెందిన మైఖేల్‌ ఒయార్‌జబాల్‌ గోల్‌ చేయగా.. రొనాల్డో తన గోల్‌తో స్కోర్‌ సమం చేశాడు. అనంతరం స్పెయిన్‌కు చెందిన మార్టిన్‌ జుబిమెండి రెండో గోల్‌ చేయగా.. పోర్చుగల్‌ తరఫున నునో మెండెస్‌ గోల్‌ చేసి స్కోర్‌ సమం చేశాడు.- Virat Kohli after winning the IPL Trophy.- Cristiano Ronaldo after winning the UEFA Nations trophy.TWO GOATS GOT EMOTIONAL..!!!! 🥹❤️ pic.twitter.com/Ms8poAVOQx— Tanuj (@ImTanujSingh) June 8, 2025మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కైలియన్‌ ఎంబపే నేతృత్వంలోని ఫ్రాన్స్‌ ఆతిథ్య దేశం జర్మనీపై 2-0 గోల్స్‌ తేడాతో నెగ్గింది.- Kohli after winning IPL Trophy.- Ronaldo after winning UEFA Trophy.TWO GOATS CRYING AFTER WINNING THE TROPHY. 🥹❤️ pic.twitter.com/8TFasrUWSn— Tanuj (@ImTanujSingh) June 8, 2025కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన రొనాల్డోఆర్సీబీ ఈ యేడు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచాక ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఏ రకంగా భావోద్వేగానికి లోనయ్యాడో, క్రిస్టియానో రొనాల్డో కూడా తన రెండో UEFA నేషన్స్‌ లీగ్‌ టైటిల్‌ గెలిచాక అదే తరహాలో ఎమోషనల్‌ అయ్యాడు. కోహ్లి, రొనాల్డో కంపారిజన్‌ ఇమేజ్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Cristiano Ronaldo got Emotional when he's won the UEFA national league trophy for Portugal. 🥹- What a Video for UEFA history. ❤️pic.twitter.com/LZgq4vVDiP— Tanuj (@ImTanujSingh) June 8, 2025క్రికెట్‌ అభిమానులు కోహ్లి, రొనాల్డోను కీర్తిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే అంటూ ఆకాశానికెత్తుతున్నారు. కోహ్లి, రొనాల్డో లేటు వయసులోనూ అత్యుత్తమ ఫిట్‌నెస్‌ను కలిగి తమతమ క్రీడా విభాగాల్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.

Bangladeshs Muhammad yunus Mutual Respect Letter to PM Modi7
ప్రధాని మోదీకి బంగ్లా యూనస్‌ లేఖ.. ఏమన్నారంటే..

ఢాకా: భారత ‍ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాయగా, దానికి అతను స్పందిస్తూ మరో లేఖ రాశారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమని యూనస్ దానిలో పేర్కొన్నారు. ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయని అన్నారు. యూనస్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ఈ లేఖను పోస్ట్‌ చేశారు.ఈద్-ఉల్-అధా సందర్భంగా బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు, అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. దీనికి స్పందించిన యూనస్‌ ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని పేర్కొన్నారు. pic.twitter.com/gNlLbLv3E6— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) June 8, 2025దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌కు రాసిన లేఖలో భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని పేర్కొన్నారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: రాహుల్‌ ‘ఫిక్సింగ్‌’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్‌ కౌంటర్‌ ఆర్టికల్‌

Irregularities in the construction of the diaphragm wall of the Polavaram project8
‘పోలవరం’లో కమీషన్ల కథ

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. కమీషన్ల కక్కుర్తితో జీవనాడి జీవం తీసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తుండటంపై ఇంజినీరింగ్‌ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజై­న్‌­­ను తుంగలో తొక్కి.. 1.5 మీటర్ల మందంతో కాకు­ండా 0.9 మీటర్ల మందంతో ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌­–2లో పునాది డయాఫ్రం వాల్‌ నిర్మిస్తుండట­ంపై ఇంజినీరింగ్‌ నిపుణులు మండిపడుతు­న్నారు. గతంలో 2016–18 మధ్య ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2­లో డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో అవకత­వ­క­లకు పాల్ప­డటం వల్లే అది కోతకు గురై దెబ్బ­తిన్న విష­యాన్ని గుర్తు చేస్తున్నారు. కమీషన్ల కోసం పోలవ­రాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నా­రని 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఇంజినీరింగ్‌ నిపుణులు గుర్తు చేస్తు­న్నా­రు. గతంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని కట్ట­బె­ట్టిన కాంట్రాక్టు సంస్థ బావర్‌కే కొత్త డయాఫ్రం వాల్‌ పనులను అప్పగించడాన్ని తప్పు పడుతున్నా­రు. టెండర్లు పిలవకుండా కట్టబెట్టేశారురూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయాఫ్రం వాల్‌ పనులకు టెండర్లు పిలవాలి. కానీ.. ఆ పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘాకు అప్పగించి.. ఆ తరువాత ఆ సంస్థపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చి అన­ధికారికంగా బావర్‌ సంస్థకు కట్ట­బెట్టడంపై అనుమా­నాలు వ్యక్తమవుతున్నాయి. డయా­ఫ్రం వాల్‌ మందం తగ్గించడం వల్ల పనుల పరిమాణం తగ్గుతుందని.. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకునేందుకు పథకం రచించారని స్పష్టం చేస్తు­న్నారు. సీపేజీ(ఊటనీరు)ని సమర్థవంతంగా అడ్డు­కట్ట వేయడానికే డయాఫ్రం వాల్‌ నిర్మిస్తు­న్నారు. డయాఫ్రం వాల్‌ ఎంత నాణ్యంగా, పటిష్టంగా ఉంటే ప్రధాన డ్యామ్‌ అంత పటిష్టంగా ఉంటుంది. డయాఫ్రం వాల్‌ మందం తగ్గడం వల్ల పటిష్టత తగ్గుతుందని.. ప్రధాన డ్యామ్‌ బరువు ప్రభావం వల్ల డయాఫ్రం వాల్‌లో చీలికలు ఏర్పడి ఊటనీటి ఉధృతి పెరగడానికి దారి తీస్తుందని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ప్రధాన డ్యామ్‌కు గండ్లుపడి ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తితో జీవనాడి భద్రతను ప్రశ్నార్థకంగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూ.వందల కోట్లు కాజేసేందుకే..పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1లో 393 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్‌ పనులను 2022లో మేఘా సంస్థ పూర్తి చేసింది. ఆ డయాఫ్రం వాల్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చింది. ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులను రూ.990 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘాకు కాగితంపై ప్రభుత్వం అప్పగించింది. కానీ.. మేఘా­పై ఒత్తిడి తెచ్చి బావర్‌ సంస్థకు ఆ పనులను అనధి­కారికంగా సబ్‌ కాంట్రాక్టు కింద ఇచ్చేసింది. పను­లను సబ్‌ కాంట్రాక్ట్‌ కింద అధికారికంగా ఇస్తే మేఘా, బావర్, ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలి. కానీ.. మేఘా, బావర్‌ మధ్య అంతర్గత ఒప్పందం చేసుకోవడాన్ని బట్టిచూస్తే ముఖ్యనేత కమీషన్ల కక్కుర్తి బయటపడిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో అంటే 2016–18లో డయాఫ్రం వాల్‌ పనులను బావర్‌ సంస్థకే అప్పగించగా.. కొత్త డయాఫ్రం వాల్‌ పనులను తిరిగి ఆ సంస్థకే కట్టబెట్టడం గమనార్హం. కొత్త డయాఫ్రం వాల్‌ను 1.5 మీటర్ల మందం.. గరిష్టంగా 93.5 మీటర్ల లోతు.. 1,396.6 మీటర్ల పొడవుతో టీ–16 ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ సమ్మేళనంతో నిర్మించేలా జనవరి 16న సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. ఆ డిజైన్‌ ప్రకారం 66,002 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు చేయాల్సి ఉంటుంది. కానీ.. డయాఫ్రం వాల్‌ మందం తగ్గించడం వల్ల చేయాల్సిన పనుల పరిమాణం సగానికి తగ్గే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. పనుల పరిమాణం తగ్గినా.. అత్యంత కఠిన శిల (సౌండ్‌ హార్డ్‌ రాక్‌)లోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానళ్లను దించి డయాఫ్రం వాల్‌ వేయడం వల్ల అదనపు పనులు చేశామని చూపి రూ.వందల కోట్లు కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టి కమీషన్లు రాబట్టుకునేందుకు ముఖ్యనేత పథకం వేశారని చెబుతున్నారు.కమీషన్ల కోసం చారిత్రక తప్పిదం» సీడబ్ల్యూసీ ఆమోదించిన పోల­వరం ప్రాజెక్టు డిజైన్‌ ప్రకారం.. తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌­లను పూర్తిచేసి.. వాటి మధ్యన ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రం వాల్‌ నిర్మి­ంచి దానిపై ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేయాలి. » కానీ.. 2016, డిసెంబర్‌లో ఒకేసారి స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, ప్రధాన డ్యామ్‌ డయాఫ్రం వాల్‌ పనులను నాటి చంద్రబాబు సర్కారు ప్రారంభించి చారిత్రక తప్పిదం చేసింది. కమీషన్ల కక్కుర్తితో ఆ పనులను బావర్‌ సంస్థకు సబ్‌ కాంట్రాక్టు కింద కట్టబెట్టేసింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్‌ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్‌ 1,485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్‌ నుంచి 2018 జూన్‌ వరకూ చెయినేజ్‌ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించింది. » డయాఫ్రం వాల్‌ను అప్పట్లో బావర్‌ సంస్థ ఇష్టారాజ్యంగా చేసిందని.. ప్యానళ్లను సౌండ్‌ హార్డ్‌ రాక్‌లోకి రెండు మీటర్ల లోతు వరకూ దించలేదని, కేవ­లం సాధారణ రాతి నేల వరకూ మాత్రమే పనులు చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. » కానీ.. అవేమీ పట్టించుకోకుండా డయాఫ్రం వాల్‌ పనులకు 2018 జూన్‌ నాటికే రూ.393.32 కోట్ల మేర బిల్లులు చెల్లించింది. మరో రూ.94 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని బావర్‌ సంస్థ ప్రతిపాదనలు పంపింది. ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడపులు చేతు­లు మారాయి. అప్పటి ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ అధినేత రాయపాటి రంగారావు మీడియా సాక్షిగా వెల్లడించిన అంశాలే దీనికి నిదర్శనం. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్‌ను అదే సంస్థకు కట్టబెట్టడం.. లోపభూయిష్టంగా పనులు చేస్తుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డ్యామ్‌ భద్రతకే ప్రమాదంపోలవరం ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద ఇసుక నేలలో ఊటనీటి (సీపేజీ) ఫర్మియ­బులిటీని 2016–17లో తప్పుగా లెక్కించారు. దీనివల్ల ఎగువ కాఫ­ర్‌ డ్యామ్‌ పునాది జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్‌ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే కమీషన్ల కక్కుర్తితో జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను తక్కువ లోతుతో నిర్మించారనే విషయం స్పష్టమ­వుతోంది. 2018లో గోదావరి ప్రవాహం జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉధృతికి జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌లో చెయినేజ్‌ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయని.. దానివల్లే ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో సీపేజీ అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చింది. వరద ఉధృతి పెరిగినప్పుడు సీపేజీ తీవ్రత పెరిగి ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు గండ్లు పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ దిగువన దానికి పొడవునా సమాంతరగా బట్రెస్‌ బర్మ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. గతంలో చేసిన తప్పునకు పరిహారం రూ.200 కోట్లకుపైగా వ్యయం చేస్తోంది. డయాఫ్రం వాల్‌ మందం 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించడం వల్ల.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ దెబ్బతిన్న తరహాలోనే ప్రధాన డ్యామ్‌ బరువు ప్రభావం వల్ల డయాఫ్రం వాల్‌లో చీలికలు ఏర్పడి, సీపేజీ పెరగడానికి.. ప్రధాన డ్యామ్‌లో గండ్లు పడటానికి దారి తీస్తుందని.. ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఇంజినీరింగ్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Rising atrocities against women in andhra pradesh9
కీచక రాజ్యం.. ఆగని అఘాయిత్యాల పర్వం

సగటున రెండు రోజులకొక అత్యాచారం.. చంబల్‌ లోయ దురాగతాలను తలపిస్తున్న రాష్ట్రం చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. రెడ్‌బుక్‌ సేవలో తరిస్తున్న పోలీసు యంత్రాంగం రామగిరి మండలంలో 9వ తరగతి బాలికపై 14 మంది ఆరు నెలలపాటు అత్యాచారం.. బాధిత బాలికను స్వయంగా విచారించిన ఎస్పీ.. అయినా ఇప్పటిదాకా కేసే లేదు! మహిళలంటే టీడీపీ నేతలకు చిన్నచూపు.. అందుకే బాలికలు, మహిళల భద్రతకు కూటమి సర్కారు తిలోదకాలుసాక్షి, అమరావతి: కీచక చంద్రబాబు ప్రభుత్వం గురివింద నీతిని వల్లె వేస్తోంది. మహిళల పట్ల ఒక్కసారిగా మొసలి కన్నీరు కారుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు.. మహిళలు, బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరోవైపు మహిళల భద్రత, గౌరవం, ఆత్మాభిమానం అంటూ వైఫల్యాన్ని కప్పిపుచ్చేకునేందుకు యత్నిస్తోంది.ఒకప్పటి చంబల్‌ లోయను తలపిస్తూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై యథేచ్ఛగా అఘాయిత్యాలతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా భీతావహ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం చేతగాని చంద్రబాబు ప్రభుత్వం.. ఎవరో ఓ ప్రైవేటు వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడుతోంది. తమ ఏడాది పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ రాజకీయాల కుట్రకు తెగిస్తోంది. కానీ, రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంబాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్‌ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇందులో అత్యాచారం ఆపై హత్యకు గురైన వారు 15 మంది ఉన్నారు. మరో తొమ్మిది మంది బాలికలు, మహిళలు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ లెక్కన దాదాపు ప్రతి రెండు రోజులకు ఓ అత్యాచారం జరుగుతోందని పోలీసు రికార్డులే వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు చంబల్‌ లోయలో మహిళలపై ఈ తరహాలో అఘాయిత్యాలకు పాల్పడేవారని పత్రికలు ప్రచురించేవి. ఆనాటి చంబల్‌ లోయలోని దారుణ పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొనడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. మహిళల ఆక్రందనలు పట్టని చంద్రబాబు ప్రభుత్వంరాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత రోజు రోజుకూ దిగజారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. బాలికలు, మహిళల భద్రత గురించి నామమాత్రంగా కూడా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దిశ వ్యవస్థ ద్వారా మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆపదలో ఉన్నామని బాలికలు, మహిళలు ఆ యాప్‌ ద్వారా సమాచారం ఇస్తే చాలు కేవలం 5–10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని భద్రత కల్పించేవారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయడం.. అక్రమ కేసులు నమోదు చేసి వేధించడమే పోలీసుల ఏకైక విధి అని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. పోలీసులు శాంత్రి–భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత వంటి కీలకమైన తమ విధులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతలకు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా, ఇతర కాంట్రాక్టులు లభించేలా ప్రత్యర్థులు, పోటీదారులను బెదిరించడమే తమ విధి అని భావిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధించడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు.దాంతో రాష్ట్రంలో బాలికలు, మహిళా భద్రత గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్‌ నియోజకవర్గం మంగళగిరి, హోమ్‌ మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమైపోయాయి. విద్యార్థినులు బడికి వెళ్లి ఇళ్లకు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. టీడీపీ పెద్దల తీరే అంత.. అందుకే ఈ దుస్థితిటీడీపీ కూటమి పెద్దలు, కీలక నేతలే మహిళల గౌరవానికి భంగం కలిగిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం ప్రభుత్వ మైండ్‌ సెట్‌కు నిదర్శనం. ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ‘కారు షెడ్డులో ఉండాలి.. ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి’ అని దివంగత కోడెల శివ ప్రసాదరావు తదితరుల వ్యాఖ్యలే రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకొని ఈడ్చి.. దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోక పోగా, సదరు బాధితురాలినే తప్పు పట్టడం తెలిసిందే. ఇక నారా లోకేశ్‌ విదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించిన వీడియోలు, ఫొటోలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. అప్పట్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.14 మంది రేప్‌ చేస్తే కేసు కట్టరా?చీమ కుట్టినట్టుగా కూడా లేదా?హోం మంత్రి ఎక్కడ?ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతి పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికపై 14 మంది యువకులు కొన్ని నెలలపాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఆ దారుణం బయటకు పొక్కింది. అదే గ్రామానికి చెందిన బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హెచ్‌.సురేశ్, హెచ్‌.హేమంత్‌ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియరాలేదు. అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తుండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.బాధిత బాలిక తండ్రి గతేడాది టీడీపీ గెలిచిన సంబరాల్లో తప్పెట వాయించుకుంటూ బొలెరో నుంచి జారి కింద పడి చనిపోయారు. బాలిక తల్లికి మతి స్థిమితం లేదు. అలాంటి ఆ బాలికపై వీడియోలు చూపి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ 14 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు.దీంతో బాలికను బంధువులు నిలదీయగా.. అసలు విషయం వెలుగు చూసింది. బాధిత బాలికను స్వయంగా ఎస్పీనే విచారించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స, పరీక్షలు చేయిస్తున్నారు. ఇంత దారుణమైన ఘటనపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరు అడ్డు పడుతున్నారు? ఎంకా ఎన్నాళ్లు నాన్చుతారు? వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ ఘటనలో ఇటు పోలీసులు, అటు పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం దుర్మార్గం. స్థానిక మహిళా శాసన సభ్యురాలు సునీత, మహిళా హోం మంత్రి అనిత ఇప్పటి దాకా ఎందుకు నోరు విప్ప లేదు? కళ్లెదుటే ఎన్నో ఘటనలు..⇒ అనంతపురానికి చెందిన ఓ యువతిని కొందరు యువకులు కిడ్నాప్‌ చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుకు తీసుకువెళ్లి హత్య చేయడం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు తాజా ఉదాహరణ. ⇒ 2024 జూలై 7వ తేదీన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. 11 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ బాలిక మృతదేహాన్ని కూడా గుర్తించలేకపోయారు. నిందితులను శిక్షించనే లేదు. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేకుండాపోయింది. పిఠాపురం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్‌ దుర్గాడ విజయలక్ష్మి భర్త, దుర్గాడ జాన్‌ ఓ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇒ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం హిందూపురం మండలం తూమకుంట పరిధిలో 2024 ఆగస్టు 2వ తేదీన ఎనిమిదేళ్ల చిన్నారిని గంగాధర్‌ (45) అనే వ్యక్తి దారుణంగా చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అంతకు ముందు అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.⇒ వైఎస్సార్‌ జిల్లా గోపవరం మండలంలో ఇంటర్‌ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేశాడు. బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థినిని విఘ్నేష్‌ అనే వివాహితుడు ప్రేమ పేరుతో వేధించాడు. బాలికను గోపవరం మండలంలోని సెంచురీ పానెల్స్‌ పరిశ్రమ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి.. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ ఆమెపై పోసి నిప్పు అంటించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు, మేకల కాపరులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతిచెందింది.⇒ తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన భార్య, భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చేరుకున్నారు. చిన్నారి మేనమామకు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. చిన్నారి తండ్రి, కుటుంబీకులు కలిసి సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. ఏఎం పురానికి చెందిన సుశాంత్‌ చిన్నారికి చాక్లెట్‌ తీసిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. చిన్నారిని తిరిగి నివాసానికి తీసుకెళ్లకుండా.. పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కిరాతకుడైన సుశాంత్‌.. చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి చంపేశాడు.⇒ దర్శి సమీపంలోని గ్రామంలోని ఓ బాలికను టీడీపీ నేత కుమారుడు ఏనుగంటి చరణ్‌ సాయి తన స్నేహితుల రూమ్‌కు తీసుకుని వెళ్లి కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ⇒ అభంశుభం తెలియని చిన్నారులకు తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులు మద్యం తాగించి, వారిని లైంగికంగా వేధించిన అమానవీయ ఉదంతం నంద్యాల జిల్లా డోన్‌ మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలైన యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడి వీడియోలు కూడా చిత్రీకరించారు. టీడీపీ నేత ఈడిగె వీరాంజనేయులు గౌడ్‌ కుమారుడు ఈడిగె రాంబాబుగౌడ్‌ తన ఇద్దరు స్నేహితులతో కలసి బాలికలను బెదిరించి మద్యం తాగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

Rasi Phalalu: Daily Horoscope On 09-06-2025 In Telugu10
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.త్రయోదశి ఉ.8.54 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: విశాఖ ప.3.21 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.7.45 నుండి 9.31 వరకు, దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు, అమృతఘడియలు: ఉ.5.34 నుండి 7.21 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.29. మేషం...... ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వృషభం... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మిథునం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికరమైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.కర్కాటకం... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. సింహం.... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కన్య.... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. తుల...... వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బాధ్యతలు అధికం. వృశ్చికం... ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. అతిథుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. ధనుస్సు.... రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. పనులలో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగాసాగుతాయి. మకరం... కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కుంభం... ప్రయత్నాలు సఫలం. శుభకార్యాలరీత్యా ధనవ్యయం. ఆసక్తికరమైన సమాచారం. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. మీనం.... పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement