Top Stories
ప్రధాన వార్తలు

ఆగిన రేషన్ బండి.. నడిరోడ్డుపైకి బతుకు బండి
ప్రాణం తీసిన రేషన్రేషన్ దుకాణాల వద్ద సరుకుల పంపిణీ మొదలైన తొలిరోజే గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక అనంతపురంలో ఆదివారం లక్ష్మీదేవి అనే వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. కొద్ది రోజులు మాత్రమే బియ్యం ఇస్తారనే ఆందోళనతో ఉదయమే దుకాణం వద్దకు చేరుకున్న బాధితురాలు ఎండకు సొమ్మసిల్లి కుప్పకూలింది. సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు కక్షపూరిత విధానాలు, అనాలోచిత∙నిర్ణయాలు లక్షలాది మంది పేదలను మళ్లీ రోడ్డుకీడ్చాయి! ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తూ తీసుకున్న రేషన్ వాహనాల రద్దు నిర్ణయం సర్కారు అమానవీయ చర్యలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. గత ప్రభుత్వంలో పేదలు ఇంటివద్దే ఆత్మగౌరవంతో అందుకున్న రేషన్ సరుకులను డీలర్ల చేతికి అప్పగించి పంపిణీ వ్యవస్థను చంద్రబాబు సర్కారు అస్తవ్యస్తంగా మార్చేసింది. పుట్టెడు తిండి గింజల కోసం రోజంతా రోడ్లపై నిరీక్షించాల్సిన దుస్థితి కల్పించింది. తమ నోటికాడ ముద్దను లాక్కోవడం మతిలేని నిర్ణయమని బియ్యం కార్డుదారులు మండిపడుతున్నారు. తిరోగమన విధానాలతో కూటమి సర్కారు అమానుషంగా వ్యవహరిస్తోందని ఆక్రోశిస్తున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందిస్తూ పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను నీరుగార్చి చంద్రబాబు సర్కారు తమను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమటలు కక్కుతూ గంటల తరబడి క్యూలలో నిలబడ్డ రేషన్ కార్డుదారులు..! ఎండకు సొమ్మసిల్లి కుప్పకూలుతున్న వృద్ధులు..! చిన్న పిల్లలను ఎత్తుకుని వచ్చి రేషన్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్న మహిళలు..! కిలోమీటర్ల తరబడి రేషన్ సరుకులను మోసుకుంటూ గూడేలకు వెళుతున్న గిరిజనులు..! నెత్తిపై బియ్యం మూటలతో వృద్ధుల అవస్థలు...! పనులు మానుకుని వచ్చినా సర్వర్లు పనిచేయక, సరుకుల అందక ఉసూరుమంటూ వెనుతిరుగుతున్న లబ్ధిదారులు..! మొదటి రోజే మూతపడ్డ రేషన్ షాపులు..! నానా తిప్పలు పడి దుకాణాల వద్దకు చేరుకున్న వారితో వేలి ముద్ర వేయించుకుని ఇచ్చినంత డబ్బు తీసుకుని వెళ్లిపోవాలని గదమాయిస్తున్న డీలర్లు..! ఇదీ తొలిరోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద కనిపించిన దుస్థితి! తూకం యంత్రాలతో పనిలేదు. విజయనగరం జిల్లా రామభద్రపురంలో రేషన్ కోసం మండుటెండలో క్యూ కట్టిన వృద్ధులు ఈ–పోస్ మిషన్ల అనుసంధానం అసలే లేదు. ఏ రేషన్ షాపును పరిశీలించినా ఇదే దందా కనిపించింది. గత ఐదేళ్లూ పారదర్శకంగా ఇంటివద్దే అందిన సరుకుల పంపిణీని కూటమి సర్కారు రేషన్ మాఫియా చేతుల్లో పెట్టేసింది. రాజకీయ కక్షతో పేదల పొట్టగొట్టి నడిరోడ్డుకీడ్చేసింది. ఇంటివద్దే కచ్చితమైన తూకంతో రేషన్ సరుకులను అందిస్తూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ డెలివరీ వాహనాల వ్యవస్థను దేశమంతా ప్రశంసిస్తే.. దీన్ని కాదని పచ్చ నేతల జేబులు నింపేందుకు మళ్లీ రేషన్ షాపుల ద్వారా సరఫరాను తెరపైకి తెచ్చింది. ఫలితంగా ప్రజాపంపిణీ వ్యవస్థ తిరోగమనంలోకి జారిపోయింది. తొలిరోజే కూటమి సర్కారు అసమర్థత, దోపిడీ విధానం బహిర్గతమయ్యాయి. పేదలకు బియ్యం అందించటానికి బదులు ‘డీబీటీ ’(డీలర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానాన్ని అమలు చేస్తూ ప్రజాధనాన్ని కాజేసే పనిలో నిమగ్నమైనట్లు స్పష్టమవుతోంది. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో బియ్యం బస్తాలు మోసుకుని వెళ్తున్న మహిళలు పొద్దున్నే పడిగాపులు..రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు ఉదయాన్నే దుకాణాల వద్ద క్యూ కట్టడంతో పలుచోట్ల కిక్కిరిసిపోయాయి. ఎండలో రోడ్లపై, అరుగులపై గంటల కొద్దీ నిలబడి బియ్యం కోసం అగచాట్లు పడ్డారు. ఇరుకు గదుల్లోని రేషన్ దుకాణాల వద్ద చమటలు కక్కుతూ నిరీక్షించారు. బియ్యం మూటలను నెత్తిపై మోసుకుంటూ వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు. సోమవారం తిరిగి పనులకు వెళ్లాల్సి ఉన్నందున కార్మికులు భారీగా రేషన్ షాపుల దగ్గరకు చేరుకున్నారు. వయసు మళ్లిన వారు బియ్యాన్ని మోసుకెళ్లే శక్తి లేక, సాయం అందించే వారు కానరాక డీలర్ ఇచ్చినంత తీసుకుని ఉసూరుమంటూ వెనుదిరిగారు.తూకానికి తూట్లు..కేంద్ర ప్రభుత్వం కార్డుదారుల్లో ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కచ్చితత్వంతో కూడిన తూకం, నాణ్యమైన సరఫరా విధానం కోసం తూకం యంత్రాలు, ఈ–పోస్ మిషన్లను అనుసంధానం చేసి పంపిణీ చేపట్టాలని సూచించింది. గత ప్రభుత్వంలో ఎండీయూల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ సమయంలో ఇదే విధానాన్ని పాటిస్తూ కచ్చితమైన తూకంతో బియ్యాన్ని అందించారు. ఈ–పోస్ మిషన్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయగానే పంపిణీ చేయాల్సిన బియ్యం పరిమాణం కనిపించేది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం వెంకటాపురం గ్రామంలో రేషన్ షాపు వద్ద గంటల తరబడి లబ్ధిదారుల నిరీక్షణ తూకం మిషన్లో సరైన పరిమాణంలో బియ్యాన్ని తూచినప్పుడే ఈ–పోస్ మిషన్ నుంచి బిల్లు జారీ అయ్యేది. తూకం మిషన్పై తక్కువ/ఎక్కువ పరిమాణం వేస్తే ట్రాన్సాక్షన్ నిలిచిపోయేలా చర్యలు తీసుకున్నారు. రేషన్ వాహనాల ద్వారా ఇంత పారదర్శకంగా జరిగిన సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టిన తొలిరోజే తూకం యంత్రాలతో పని లేకుండా మాన్యువల్గా ఈ–పోస్ మిషన్లలో పరిమాణాన్ని నమోదు చేయడం ద్వారా అక్రమాలకు పచ్చజెండా ఊపింది. డీలర్ ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులు నోరెత్తకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది.పది రోజుల్లో ఫినిష్..!కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలు ప్రజలకు శాపాలుగా మారాయి. రేషన్ కోసం రోడ్లపైకి రావడం పెద్ద ప్రహసనం కాగా, అది కూడా కొద్ది గంటలకే పరిమితం చేశారు. ప్రతి నెలా 10వ తేదీలోపు వస్తేనే బియ్యం దక్కే పరిస్థితి నెలకొంది. నిల్వలు అయిపోతే ఇక ఆ నెల ఖాళీ సంచితో వెనుదిరగాల్సిందే. ఇవన్నీ తొలిరోజు రేషన్ షాపులకు వెళ్లిన లబ్ధిదారులకు డీలర్లు చెప్పిన మాటలే! అంటే ప్రభుత్వం ఆయా డీలర్ల పరిధిలోని కార్డులకు తగినంత నిల్వలు సరఫరా చేయదా? లేదంటే ఐదు రోజుల ముందుగానే పంపిణీని ముగించి గుట్టు చప్పుడు కాకుండా బియ్యాన్ని తరలించుకునే ఎత్తుగడ వేస్తున్నారా?.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ హయాంలో అనుభవాలను పరిశీలిస్తే వీటికి బలం చేకూరుతోంది. 2019కి ముందు రేషన్ షాపుల్లో 10వ తేదీకే బియ్యం పంపిణీ ముగిసేది. ఆ తర్వాత లబ్ధిదారులు ఎంత మొత్తుకున్నా ఆలకించే నాథుడు ఉండేవారు కాదు. ఇప్పుడు మళ్లీ అలాంటి అరాచక పరిస్థితి పునరావృతమవుతోంది.‘‘శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల పరిధిలోని ఓ రేషన్ దుకాణంలో లబ్ధిదారులను వరుసగా కూర్చోబెట్టి వేలిముద్రలు తీసుకుని బియ్యానికి బదులు నగదు ఇచ్చి పంపించేశారు. వీరిలో అధిక శాతం వృద్ధులే. మరికొందరు మోసుకెళ్లే ఓపిక లేక డీలర్ దగ్గరే వదిలేసి ఇచ్చినంత తీసుకుని ఇంటి ముఖం పట్టారు’’ బడుగు, బలహీన వర్గాల ఉపాధికి గండి..కూటమి సర్కారు వివక్షతో రేషన్ వాహనాలను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల జీవనోపాధిని దెబ్బ తీసింది. 9,260 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు ప్రభుత్వ సేవల్లో భాగస్వామ్యం కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం వారిని సొంతూరిలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా తోడ్పాటు అందించింది. వీటిపై ఆధారపడి మరో 10 వేల మంది వరకు హెల్పర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నఫళంగా రేషన్ వాహనాలను రద్దు చేసి వారి జీవనోపాధికి గండి కొట్టింది.రేషన్ క్యూలో వృద్ధురాలి మృతి‘అనంత’లో విషాదం..అనంతపురం: ఇంటికే రేషన్ రద్దు నిర్ణయం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది! అనంతపురంలో రేషన్ దుకాణం వద్ద గంటల తరబడి క్యూలైన్లో నిలబడటంతో నీరసించిపోయిన మందల లక్ష్మీదేవి (70) అనే వృద్ధురాలు కుప్పకూలి చనిపోయింది. ఆదివారం అనంతపురం హెచ్చెల్సీ కాలువ సమీపంలోని నిర్మలానంద నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. లక్ష్మీదేవి రేషన్ బియ్యం కోసం ఉదయం ఎనిమిది గంటలకు రేషన్ షాపు వద్దకు చేరుకుంది. కుమార్తె ఈశ్వరమ్మతో కలసి క్యూలైన్లో నిల్చుంది. ఎనిమిది గంటలకు ఇవ్వాల్సిన రేషన్ పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో క్యూలో ఉన్న లక్ష్మీదేవి నీరసించి ఉదయం 9:45 గంటలకు కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో పరీక్షించి చూడగా చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఇద్దరు కుమారులు గతంలో కాలువలో పడి చనిపోవడంతో కుమార్తె వద్ద ఉంటోంది. రెండు రోజులు మాత్రమే రేషన్ ఇస్తారనే ఆందోళనతో క్యూలో నిలబడ్డారని, మండుటెండను సైతం లెక్కచేయకుండా గంటలకొద్దీ నిలబడటంతో కుప్పకూలి చనిపోయారని స్థానికులు తెలిపారు.జగన్ హయాంలో నిశ్చింతగా..2014-19 మధ్య టీడీపీ హయాంలో పేదలకు ఇచ్చే బియ్యం తినడానికి ఏమాత్రం పనికొచ్చేవి కాదు. పురుగులు పట్టి, ముక్కిపోయి, రంగు మారి, చెత్త, రాళ్లతో అధ్వాన్నంగా ఉన్న బియ్యాన్ని పేదలు వండుకోలేక, బయట మార్కెట్లో కొనలేక నరకం అనుభవించారు. ఈ దుస్థితిని తప్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని ప్రవేశపెట్టింది. అది కూడా రేషన్ వాహనాల్లో ఇంటి వద్దకే చేరవేయడంతో పేదల కష్టాలు తీరిపోయి నిశ్చింతగా వండుకున్నారు. ఫలితంగా 90 శాతానికిపైగా పంపిణీ పెరిగింది. ఇలా కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.41 చొప్పున వెచ్చించింది. అలాంటిది ఇప్పుడు డీలర్లు రూ.10 లబ్ధిదారుల చేతుల్లో పెడుతూ అక్రమ దందాకు పాల్పడుతున్నా కూటమి సర్కారు కళ్లు మూసుకుని కూర్చుంది.

అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్’.. బాంబు దాడి కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో(Colorado)లో కలకలం చెలరేగింది. ఇక్కడి బౌల్డర్లో చోటుచేసుకున్న దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.ఎప్బీఐ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బెన్ విలియమ్సన్ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ నిందితుడు యూదులపై బాంబులు విసురుతూ ‘ఫ్రీ పాలస్తీనా’ అని అరిచాడని తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వీజర్ మాట్లాడుతూ ఈ ఘటనలో కొందరిని లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తున్నదన్నారు. కాగా నిందితుడిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాగా ఎప్బీఐ గుర్తించింది.ఈ ఘటనపై బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్ఫెర్న్ మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయెల్ బందీలను గుర్తుచేసుకుంటూ ప్రదర్శన జరుగుతుండగా, దానికి సమీపంలోనే ఈ దాడి జరిగిందన్నారు. గాజా- ఇజ్రాయెల్ యుద్ధం నేపధ్యంలో అమెరికాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఇజ్రాయెల్(Israel) మద్దతుదారులు.. ఈ పాలస్తీనా అనుకూల నిరసనలను యూదు వ్యతిరేక నిరసనలుగా పేర్కొంటున్నారు. 🚨Disturbing scenes of panic and chaos! Stay away & Safe.⚠️Developing: Police are asking the public to avoid Pearl and 13th in Boulder after a reported attack as it's show here! pic.twitter.com/8ZBYzYKdgZ— Mohanad Shaabani (@MohanadShaabani) June 1, 2025బౌల్డర్లో జరిగిన ఘటనను చూసిన కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన 19 ఏళ్ల బ్రూక్ కాఫ్మన్ మాట్లాడుతూ, దాడి జరిగిన సమయంలో నలుగురు మహిళలు కాలిన గాయాలతో బాధపడుతుండటాన్ని చూశానని తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ప్రాంగణంలో చొక్కా లేకుండా నిలుచుని, ఏదో ద్రవం ఉన్న గాజు సీసాలను పట్టుకుని అరిచాడని ఆమె వివరించారు. కాగా ప్రముఖ యూదు డెమొక్రాట్, సెనేట్ మైనారిటీ నేత చక్ షుమెర్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పోటీ

అతడొక అత్యుద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్
ఐపీఎల్-2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. తొలుత బ్యాటింగ్లో అదరగొట్టిన ముంబై, బౌలింగ్లో మాత్రం చేతులెత్తేసింది. ఆఖరికి ఆ జట్టు ప్రధాన బౌలర్ బుమ్రా సైతం తేలిపోయాడు. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 పరుగులు చేసి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిష్(38), వధేరా(48) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ముంబై బౌలర్లలో అశ్వినీ కుమార్ రెండు, బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు. బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్లో రాణించినా, బౌలింగ్లో విఫలమయ్యామని హార్దిక్ అన్నాడు."శ్రేయస్ అయ్యర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడు ఆడిన షాట్లు అత్యద్భుతం. అయ్యర్తో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ తర్వాత ఈ టార్గెట్ను డిఫెండ్ చేసుకోవచ్చు అని భావించామ. కానీ ఇటువంటి కీలక మ్యాచ్లలో బౌలింగ్ యూనిట్ కూడా సమిష్టిగా రాణించడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్లో మా బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లు చాలా ప్రశాంతంగా కన్పించారు. వారు తమ అద్బుత బ్యాటింగ్తో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్కు సెకెండ్ ఇన్నింగ్స్కు పిచ్లో పెద్దగా మార్పులేదు. కొంచెం మంచు ప్రభావం ఉన్నప్పటకి దానిని మా ఓటమికి సాకుగా చెప్పాలనుకోవడం లేదు. కెప్టెన్గా నేను కూడా అంత వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయాను.సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయడం, సరైన సమయంలో సరైన బౌలర్ను ఉపయోగించడం వంటివి చేసుంటే ఫలితం భిన్నంగా ఉండేది. బుమ్రాను సరైన సమయంలో బౌలింగ్ చేయించాని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 17వ ఓవర్ వేయించి ఉంటే మరి తొందరయ్యేది.ఆ సమయంలో 4 ఓవర్లలో పంజాబ్ విజయానికి 41 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి మూడు ఓవర్లలో బుమ్రాతో ఓవర్ వేయించాలని మేము ప్లాన్ చేశాము. 18 బంతులు మిగిలిఉన్నప్పటికి బుమ్రా తన అనుభవంతో ప్రత్యేకంగా ఏదైనా చేయగలడు అని భావించాము. కానీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నది ఈ రోజు జరగలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పాండ్యా పేర్కొన్నాడు. ఇక మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుది పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు
న్యూఢిల్లీ: గాలిలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. విపరీతమైన దుమ్ము తుఫాను(Dust storm) కారణంగా రాయ్పూర్ - ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్ను నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణం మెరుగుపడే వరకు ఇండిగో విమానం 6ఈ 6313 కొంతసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఉదంతాన్ని ఒక ప్రయాణికుడు వీడియోలో రికార్డు చేశారు.ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నెలకొన్న తీవ్రమైన దుమ్ము తుఫాను కారణంగా రాయ్పూర్-ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్ను నిలిపివేయవలసి వచ్చింది. ఢిల్లీ-ఎన్సీఆర్(Delhi-NCR)లో చోటు చేసుకున్న ఈదురుగాలులు, దుమ్ము తుఫాను మధ్య పైలట్ ల్యాండింగ్ను నిలిపివేసి పరిస్థితులు మెరుగుపడే వరకు గాలిలో విమానాన్ని వృత్తాకారంలో తప్పుతూ వచ్చారు. ఈ సమయంలో ఒక ప్రయాణీకుడు రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమానం గాలిలో చక్కర్లు కొడుతున్నప్పుడు చుట్టూ అల్లకల్లోలంగా ఉన్న దృశ్యం వీడియోలో కనిపించింది. #WATCH | An IndiGo flight number 6E 6313 from Raipur to Delhi experienced turbulence due to a duststorm, prompting the pilot to climb up again when the aircraft was about to touch down at Delhi airport. The aircraft landed safely at Delhi airport after making many circuits in the… pic.twitter.com/TtDUwIH79b— ANI (@ANI) June 1, 2025ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో గాలి వేగం గంటకు 80 కి.మీ మేరకు ఉంది. కాగా(సోమవారం)తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్సీఆర్ అంతటా బలమైన గాలులు వీచాయి. కాగా మే చివరి మూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, స్థానికులకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇది కూడా చదవండి: అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్’.. బాంబు దాడి కలకలం

అడుక్కునే స్థితిలో ఉన్నామంటే.. ఆదుకునే పరిస్థితుల్లేవ్: పాక్ ప్రధాని ఆవేదన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దేశ నోట ఆర్థిక దుస్థితికి అద్దం పట్టే వ్యాఖ్యలు వెలువడ్డాయి. నిత్యం చిప్ప పట్టుకుని దేహీ అంటూ అర్థించడాన్ని మిత్రదేశాలు కూడా హర్షించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. తమ దేశ ప్రజలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆదివారం క్వెట్టాలో ఆయన సైనికాధికారులను ఉద్దేశించి పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్.. ‘చైనా, సౌదీ అరేబియా, తుర్కియే వంటివి పాక్కు విశ్వసనీయమైన మిత్రులు. కానీ చీటికీమాటికీ అప్పులివ్వాలని కోరుతుంటే అవి కూడా చిరాకు పడుతున్నాయి. విద్యా, వర్తకం, ఆరోగ్యం, పరిశోధనల వంటి రంగాల్లో మనం కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాయి. ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్తోపాటు ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని అన్నారు. దేశంలో సహజ వనరులతోపాటు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సమర్థమంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. 🚨Utterly Humilating!!Pakistan PM Shehbaz Sharif's another SHOCKING admission after admitting BrahMos strikes:“Even trusted allies like China, Saudi Arabia, Turkey, Qatar & UAE don’t want Pakistan constantly begging with a bowl in hand.” pic.twitter.com/pyrYwRXhmD— Megh Updates 🚨™ (@MeghUpdates) May 31, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సాయం కోసం ప్రపంచదేశాలను అభ్యర్థిస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఒక బిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం అనేక షరతులను విధించిన ఐఎంఎఫ్.. భారత్తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాక్కే ఎక్కువ సమస్యలు వస్తాయని, దేశంలో ఆర్థిక, ఇతర సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని చురకలు అంటించింది. ఈ క్రమంలో కొన్ని షరతులను సైతం విధించింది.

లవర్ను నమ్మి 30 కోట్ల కానుక.. పుట్టినరోజున అదిరిపోయే ట్విస్ట్
మాంట్రియల్: మాజీ ప్రియుడికి వచ్చిన రూ.30 కోట్ల లాటరీ సొమ్ము తీసుకోని ఓ యువతి తన కొత్త ప్రియుడితో పారిపోయింది. జరిగిన మోసాన్ని గుర్తించి లబోదిబోమన్న ఆ బాధితుడు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు కోర్టుకెక్కాడు. ఈ సంఘటన కెనడాలో చోటుచేసుకుంది.అసలేం జరిగిందంటే.. విన్నీపెగ్ పట్టణానికి చెందిన లారెన్స్ క్యాంప్బెల్, క్రిస్టల్ యాన్ మెక్కే ప్రేమించుకున్నారు. ఏడాదిన్నరపాటు కలిసి ఓ హోటల్ గదిలో జీవించారు. క్యాంప్బెల్ 2024లో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ టికెట్కు ఇటీవలే జాక్పాట్ తగిలింది. క్యాంప్బెల్ 5 మిలియన్ డాలర్ల (రూ.30 కోట్లు) సొమ్ము గెలుచుకున్నాడు. కానీ, ఈ డబ్బు తీసుకోవాలంటే అతడి వద్ద సరైన గుర్తింపు కార్డు లేదు. బ్యాంకు ఖాతా కూడా లేదు. వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ నుంచి లాటరీ సొమ్ము తీసుకోవడానికి తన ప్రియురాలి సాయం కోరాడు. ఆమెను పూర్తిగా నమ్మాడు.ఈ క్రమంలో ఆమె తన ఐడీ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడంతో ఎట్టకేలకు లాటరీ సొమ్ము ఆ ఖాతాలోకి చేరింది. ఆ సయయంలో లారెన్స్ క్యాంప్బెల్, క్రిస్టల్ యాన్ మెక్కే నమూనా చెక్కును చేతపట్టుకొని ఫొటోలకు, వీడియోలకు ఫోజులిచ్చారు. ఇది తనకు క్యాంప్బెల్ ఇస్తున్న పుట్టినరోజు కానుక అంటూ ఆమె మురిసిపోయింది. నిజానికి ఆ యువతి అప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. పాత ప్రియుడికి చెందిన రూ.30 కోట్లలో అతడికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా కొత్త ప్రియుడితో పరారయ్యింది. అతడితో సంబంధాలు తెంచేసుకుంది. ఫోన్లో కూడా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆచూకీ కనిపెట్టగలిగాడు. మరో వ్యక్తితో పడకపై ఆమెను చూశాడు. తాను దారుణంగా మోసపోయినట్లు గుర్తించిన క్యాంప్బెల్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు.

కరోనా తీవ్రం.. సర్కారు చోద్యం
సాక్షి, అమరావతి : కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంతో పాటు, రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులే ఇందుకు ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ కోవిడ్ డ్యాష్ బోర్డు ప్రకారం గతనెల 26న రాష్ట్రంలో కేవలం నాలుగు యాక్టివ్ కేసులు ఉండేవి. కానీ, ఇప్పుడు విశాఖపట్నం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆదివారం నాటికి ఆ సంఖ్య 23కు చేరింది. తాజా గణాంకాల ప్రకారం.. పాజిటివ్ కేసుల్లో ఏపీ దేశంలో 12వ స్థానంలో ఉంది. అయితే, రాష్ట్రంలోనూ వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటోంది. పైగా.. నివారణ చర్యలను పూర్తిగా గాలికొదిలేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాలూ నమోదవుతున్నా సర్కారులో ఎక్కడా చలనంలేదు. రాష్ట్రంలోనూ కోవిడ్ పాజిటివ్గా తేలిన వ్యక్తి విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, ఇతర హైరిస్క్ వర్గాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నా బాబు సర్కారు ఏమీ పట్టనట్లు ఉంటోంది. వైరస్ను నిర్ధారించే ఆర్టిపీసీఆర్ కిట్లూ ఎక్కడా అందుబాటులో లేవు. ర్యాపిడ్ టెస్టులకు దిక్కులేదు.. ప్రాథమిక దశలోనే వైరస్ నిర్ధారణ అన్నది అత్యంత కీలకమైంది. ఇందులో భాగంగా.. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీ, యూపీహెచ్సీల స్థాయిలోనే వైరస్ లక్షణాలున్న హైరిస్క్ వర్గాల వారికి ర్యాపిడ్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఇవి నిర్వహించడంలేదు. సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఉండే విజయవాడలో దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలున్న హైరిస్క్ వ్యక్తులు యూపీహెచ్సీలను సంప్రదిస్తునా. ఒక్కరికి కూడా కోవిడ్ పరీక్షలు చేయడంలేదు. బాధితులే కరోనా టెస్ట్ చేయమని అడిగితే టెస్టింగ్ కిట్లు లేవని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. తప్పనిసరి అయితేశ్యాంపిల్స్ తీసి సిద్ధార్థ వైద్య కళాశాలలోని ల్యాబ్కు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో సైతం ఇదే దుస్థితి. మరోవైపు.. శ్యాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపితే ఫలితాలు రావడానికి కనీసం 48 గంటలు పడుతోంది. అంచనా వేసే ఆలోచనేది.. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పరీక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాల ప్రజలు ఆ రెండు రాష్ట్రాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖ, విజయవాడ విమానాల్లో వివిధ రాష్ట్రాల ప్రయాణికులు ఇక్కడకు వస్తుంటారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అంచనా వేయడం కోసమైనా.. హైరిస్క్ వర్గాల వారికి ప్రభుత్వం ర్యాండమ్గా పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఆలోచనా చేయడంలేదు. అలాగే, వైరస్ వ్యాప్తి మొదలైన నేపథ్యంలో.. రాష్ట్రంలో వైద్యశాఖ సన్నద్ధత, వనరులపై సీఎం చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలోనే వైద్యశాఖ నిమగ్నమైంది. నాటి ముందుచూపు ఇప్పుడు ఏదీ? నిజానికి.. 2020 నుంచి దేశంలో కరోనా వ్యాప్తి మొదలైంది. నాటినుంచి వివిధ రూపాల్లో వ్యాప్తి కొనసాగుతునే ఉంది. అయితే, 2019 వరకు చంద్రబాబు పాలనలో ధ్వంసమైన ఆరోగ్య రంగాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ పక్క గాడిలో పెడుతూనే మరోపక్క కోవిడ్ వైరస్ నియంత్రణకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంది. అత్యధిక స్థాయిలో కోవిడ్ పరీక్షల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. కోవిడ్ కేసులు వస్తే విలేజ్ క్లినిక్స్, సచివాలయాల ద్వారా గ్రామస్థాయిలోనే వైద్యసేవలు అందించేలా వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. ఎప్పుడు వైరస్ వ్యాప్తి ప్రారంభమైనా వెంటనే ఫీవర్ సర్వే చేపట్టి అనుమానితులను గుర్తించి లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, ఐసోలేషన్ చేయడం ద్వారా ప్రాథమిక దశలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టారు. బాధితులు తీవ్ర అనారోగ్యం పాలుకాకుండా కాపాడారు. 365 రోజులూ సచివాలయాల్లో హోం ఐసోలేషన్ కిట్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచి వైరస్ వ్యాప్తి మొదలైతే వెంటనే చర్యలు తీసుకునేలా ముందుచూపుతో వ్యవహరించారు. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్టడంలేదు. ఇందుకు నిదర్శనమే కోవిడ్ నివారణకు ఉద్దేశించిన నిబంధనలు ఉపసంహరించడమని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనావళి మహానాడుకు ఇబ్బందిగా మారుతుందని రోజుల వ్యవధిలోనే దానిని ఉపసంహరించడం ప్రజారోగ్యంపట్ల సర్కారు చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. పరీక్షల కోసం ఎక్కడికెళ్లాలో తెలీని దుస్థితి.. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనుమానిత లక్షణాలున్న వృద్ధులు, వివిధ వ్యాధుల బాధితులు వైద్య పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.వైఎస్సార్సీపీ హయాంలో గ్రామాల్లోని విలేజ్ క్లినిక్లు, పీహెచ్సీల్లో సైతం వైరస్ ప్రాథమిక నిర్థారణ ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉండేవి. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక కిట్ల పంపిణీ చేపట్టనే లేదు. మెజారిటీ శాతం క్లినిక్లు, పీహెచ్సీల్లో కిట్లు లేవు. ముప్పు ఎక్కువగా (హైరిస్క్) ఉండే వర్గాల వారిలో కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయకుండా మాత్రలు ఇచ్చి ఇళ్లకు పంపుతున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనుమానిత లక్షణాలున్న వారు ప్రైవేట్ ల్యాబ్లకు పరుగులు పెడుతున్నారు.

సీఎం రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా.. తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

లేటు వయసులో డేటింగ్.. పొరపాటున జరిగిపోయింది: అమిర్ ఖాన్
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాల కంటే వ్యక్తిగతంగానే వార్తల్లో నిలుస్తున్నారు. ఆరు పదుల వయస్సులో ప్రేమ అంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన బర్త్ డే వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూలో గౌరీ స్ప్రాట్తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. ఈ వయలులో మళ్లీ ప్రేమలో పడాలనే ఆలోచన తనకు లేదని అన్నారు. ఇప్పటికే తన వయసు అయిపోయిందని.. తనకు భాగస్వామి దొరకడం సాధ్యం కాదని భావించేవాడినని ఆమిర్ పేర్కొన్నారు. తనకు వృద్ధాప్యఛాయలు వచ్చినట్లు అనిపించిందని.. గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నానని తెలిపారు. నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నామని అమిర్ ఖాన్ వెల్లడించారు.గౌరీతో పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ.. 'నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నాం. ఆ తర్వాత మేము స్నేహితులమయ్యాం.. మా మధ్య ప్రేమ పుట్టింది. నాకు నా తల్లి, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. నాకు ఇప్పటికే చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నాకు భాగస్వామి అవసరం లేదు. కిరణ్, రీనా నేను ఇప్పటికీ పానీ ఫౌండేషన్ కోసం కలిసి పని చేస్తున్నాం. మేము ప్రతిరోజూ కూర్చుని మాట్లాడుకుంటాం. ఒక కుటుంబంగా మా మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది మేము ఎల్లప్పుడూ కుటుంబంగానే ఉంటాం. మేము భార్యాభర్తలం కాకపోవచ్చు.. కానీ మేము ఎల్లప్పుడూ ఓకే ఫ్యామిలీగానే ఉంటాం. వారు ఎప్పటికీ నా జీవితంలో ఒక శాశ్వత భాగం.' అని వెల్లడించారు. కాగా..అమిర్ ఖాన్, గౌరీ ఏప్రిల్ 12న చైనాలో జరిగిన మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో జంటగా మొదటిసారి కనిపించారు. ప్రస్తుతం అమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', లోకేష్ కనగరాజ్ 'కూలీ'చిత్రంలో కనిపించనున్నారు.

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి రా.12.06 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మఖ రా.2.31 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.2.06 నుండి 3.45 వరకు, దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు, అమృతఘడియలు: రా.12.07 నుండి 1.46 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27. మేషం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.వృషభం.... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.మిథునం..... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.కర్కాటకం.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.సింహం.. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.కన్య....... వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.తుల..... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.వృశ్చికం.. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.ధనుస్సు.. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.మకరం.... కుటుంబసమస్యలు. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కుంభం.. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. శ్రమ ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.మీనం.... శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
రూట్ '164' నాటౌట్.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తెలంగాణ అసెంబ్లీ వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
అతడొక అత్యుద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్
దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు
బాధలెవరివి? భోగాలెవరివి?
లవర్ను నమ్మి 30 కోట్ల కానుక.. పుట్టినరోజున అదిరిపోయే ట్విస్ట్
ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డ్: శేఖర్ కమ్ముల కామెంట్స్
ఉత్తమ హాస్యనటుడు.. కామారెడ్డి కిశోరుడు
మన ఫైటర్ జెట్స్ను కోల్పోయాం: సీడీఎస్
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
డ్రైవర్తో వివాహేతర సంబంధం.. చివరికి..!
ఈ సినిమాను సెన్సార్ కట్ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే
నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
కాంగ్రెస్ లో శశిథరూర్ ముసలం
స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
కింగులా బతికాడు సింగిల్గా..!
రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా
ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ సినిమా.. ఇన్నాళ్లకు మోక్షం
ఏరా.. ల...కొడకా.. నీ..మ్మా!
కుమార్తెను అమెరికా నుంచి రప్పించాలని తండ్రి వేడుకోలు
ఆంధ్రాకు నేనే బ్రాండ్.. చంద్రబాబు
6000 మంది ఉద్యోగుల తొలగింపు అందుకే: సత్య నాదెళ్ళ
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
అలాగే సీఎం లాలూప్రసాద్యాదవ్ అని అనకండీ!! మీరే సీఎం!!
రూట్ '164' నాటౌట్.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తెలంగాణ అసెంబ్లీ వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
అతడొక అత్యుద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్
దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు
బాధలెవరివి? భోగాలెవరివి?
లవర్ను నమ్మి 30 కోట్ల కానుక.. పుట్టినరోజున అదిరిపోయే ట్విస్ట్
ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డ్: శేఖర్ కమ్ముల కామెంట్స్
ఉత్తమ హాస్యనటుడు.. కామారెడ్డి కిశోరుడు
మన ఫైటర్ జెట్స్ను కోల్పోయాం: సీడీఎస్
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
డ్రైవర్తో వివాహేతర సంబంధం.. చివరికి..!
ఈ సినిమాను సెన్సార్ కట్ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే
కాంగ్రెస్ లో శశిథరూర్ ముసలం
స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
కింగులా బతికాడు సింగిల్గా..!
రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా
ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ సినిమా.. ఇన్నాళ్లకు మోక్షం
ఏరా.. ల...కొడకా.. నీ..మ్మా!
కుమార్తెను అమెరికా నుంచి రప్పించాలని తండ్రి వేడుకోలు
ఆంధ్రాకు నేనే బ్రాండ్.. చంద్రబాబు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం
6000 మంది ఉద్యోగుల తొలగింపు అందుకే: సత్య నాదెళ్ళ
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
అలాగే సీఎం లాలూప్రసాద్యాదవ్ అని అనకండీ!! మీరే సీఎం!!
సినిమా

నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘నా సినిమాల ద్వారా ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చానని చెబుతున్నారు. కానీ వాళ్లందరూ స్వతహాగా ప్రతిభ ఉన్నవారు. నా చిత్రాల ద్వారా వారి ప్రతిభ ప్రేక్షకులకు మరింతగా తెలిసింది. అంతేకానీ నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం (జూన్ 1) హైదరాబాద్లో ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నన్ను మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ, అండగా నిలబడిన నిర్మాత అచ్చిరెడ్డిగారికి కృతజ్ఞతలు.దర్శకుడిగా నాకు తొలి చాన్స్ ఇచ్చిన హీరో రాజేంద్రప్రసాద్గారికి థ్యాంక్స్’’ అన్నారు. నటి, మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ– ‘‘కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో చేసిన ‘శుభలగ్నం’ చిత్రం నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భర్తను కోటి రూపాయలకు అమ్మే అలాంటి ఘటనలు ఈ రోజు సమాజంలో జరుగుతున్నాయి. అంటే ఆయన సృజనాత్మకతలో ఎంత ముందు చూపు ఉందో ఊహించుకోవచ్చు’’ అని తెలిపారు. ఈ వేడుకల్లో మురళీమోహన్, బ్రహ్మానందం, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, అలీ, బండ్ల గణేశ్, లయ, ఇంద్రజ, ఆమని, సుచిత్రాచంద్రబోస్ తదితరులు పాల్గొని, ఎస్వీ కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

హీరోతో ప్రేమ? క్లారిటీ ఇచ్చేసిన నిధి అగర్వాల్
సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమలో ఉన్నారని రూమర్స్ రావడం సహజం. కలిసి సినిమా చేస్తున్న టైంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో అయితే శ్రీలీల.. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో డేటింగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరో హీరోయిన్.. తనపై వస్తున్న గాసిప్స్ గురించి క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)'ఇస్మార్ట్ శంకర్'తో పాటు తెలుగులో పలు సినిమాలు చేసిన నిధి అగర్వాల్.. ప్రభాస్తో 'రాజాసాబ్', పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాల్లో నటించింది. పవన్ మూవీ.. ఈ నెల 12న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న నిధికి.. తమిళ హీరో శింబుతో రిలేషన్ అంటూ వచ్చిన రూమర్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి సవివరంగా క్లారిటీ ఇచ్చేసింది.'సినిమాల్లో నటించిన హీరోయిన్ల గురించి చాలా పుకార్లు వస్తాయి. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారు. ఇదంతా చాలా కామన్. ఎందుకంటే జనాలకు నిజాల కంటే రూమర్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నా గురించి ఎప్పుడూ ఏదో ఒకటి ఇలాంటివి వినిపిస్తూనే ఉంటాయి' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)

స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా
సెలబ్రిటీలు అంటే ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కొందరు మాత్రం పదేపదే నోరు పారేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒకరు. నటుడిగా ఈయన్ని వంక పెట్టాల్సిన పనిలేదు. అన్ని రకాల భావోద్వేగాల్ని అవలీలగా పండించేస్తుంటారు. కానీ స్టేజీ ఎక్కితే మాత్రం నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే అలీపై ఓ బూతు పదాన్ని ఉపయోగించారు.ఈ మార్చిలో 'రాబిన్ హుడ్' సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. వార్నర్ని 'దొంగ *** కొడకా' అని అన్నాడు. అప్పుడు ఆ విషయం పెద్ద రచ్చ కావడంతో తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అదే రాజేంద్ర ప్రసాద్ మరోసారి స్టేజీపై అందరి ముందు నోరు జారాడు.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్లో ఆదివారం నిర్వహించారు. కృష్ణారెడ్డితో కలిసి పనిచేసిన చాలామంది టాలీవుడ్ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే ఈవెంట్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్.. అక్కడే ఉన్న కమెడియన్ అలీపై నోరు పారేసుకున్నాడు. బయటకు చెప్పలేని ఓ బూతు పదాన్ని అతడిపై ఉపయోగించాడు.'మీరంతా వస్తున్నారని నాకు చెప్పలేదు. రాకుంటే మిస్ అయ్యేవాడిని. ఏరా అచ్చెన్నా.. మన ఇద్దరం బయటకు వెళ్లాక నీ సంగతి చెప్తా. ఇది మా ఇద్దరికీ అలవాటే. అలీగాడు ఎక్కడున్నాడు *** *** ఇది మనకు కామన్. నేను నిన్న ఎన్టీఆర్ అవార్డ్ తీసుకోవడానికి వెళ్లాను. ఏంటి మీరు చప్పట్లు కొట్టరా? ఎన్టీఆర్ అవార్డ్ తీసుకోవడానికి వెళ్తే కొట్టరా? బ్రెయిన్ పోయిందా మీ అందరికీ.. నేను అడిగి మరీ కొట్టించుకోవడం ఏంటన్నయ్యా.. కొట్టకపోతే మీకు సిగ్గు లేనట్లే' అని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇదీ చదవండి: ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్.. ఫైనల్లీ గుడ్ న్యూస్)

ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్.. ఫైనల్లీ గుడ్ న్యూస్
గత నాలుగైదేళ్లుగా ఓటీటీల వాడకం చాలా పెరిగిపోయింది. అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. మూవీస్ సంగతి కాసేపు పక్కనబెడితే ఇంగ్లీష్లో అదిరిపోయే సిరీసులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'స్ట్రేంజర్ థింగ్స్'. నెట్ఫ్లిక్స్ అంటే గుర్తొచ్చే సిరీస్ల్లో ఇది కచ్చితంగా టాప్లో ఉంటుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పేశారు.ఇప్పటివరకు 'స్ట్రేంజర్ థింగ్స్' నుంచి నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. ఇవి వేటికవే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. చివరగా 2022లో నాలుగో సీజన్ వచ్చింది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. కొన్నాళ్ల క్రితం 2025లోనే వస్తుందని అన్నారు గానీ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)ఐదో సీజన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 26న 'వాల్యూమ్ 1', క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న 'వాల్యూమ్ 2', న్యూఇయర్ కానుకగా జనవరి 1న 'ఫైనల్ ఎపిసోడ్' స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పాత్రధారుల లుక్, సీన్స్ ఆసక్తి కలిగించేలా ఉన్నా.యి.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఓ ఊరిలో నలుగురు పిల్లలు స్నేహితులుగా ఉంటారు. ఓరోజు అనుకోకుండా అతీంద్రయ శక్తులున్న ఎలెవన్ అనే అమ్మాయి వీళ్ల దగ్గరకొస్తుంది. ఈమె రాకతో సదరు ఊరిలో ఎలాంటి వింతలు, విడ్డూరాలు జరిగాయి? ఏమైందనేదే సింపుల్గా స్టోరీ. చూడటానికి చిన్నపిల్లలా సినిమాల ఉంటుంది గానీ విజువల్స్, స్టోరీ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్లో ఇంటికే రేషన్ సరుకుల పంపిణీ బంద్... రేషన్ దుకాణాల్లో విచ్చలవిడిగా అక్రమాలు... పేదలకు మళ్లీ మొదలైన కష్టాలు

మిస్ వరల్డ్గా సుచాత ఓపల్ చువాంగ్ శ్రీ.. కిరీటం దక్కించుకున్న థాయ్లాండ్ సుందరి

ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీల్లో విచ్చలవిడిగా వసూళ్ల దందా... నిబంధనలు, అర్హతలు పక్కనపెట్టి అంతా ఇష్టారాజ్యం

ఆంధ్రప్రదేశ్లో దేవుడి భూములకు దేవుడే దిక్కు... ఖరీదైన ఆలయ భూములను అస్మదీయులకు కట్టబెడుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం

మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి

ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు

అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు

ఈశాన్య రాష్ట్రాల్లో అసాధారణ అభివృద్ధి జరుగుతోంది... అక్కడ పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి... ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
క్రీడలు

పియాస్ట్రి ప్రతాపం
బార్సిలోనా (స్పెయిన్): క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగిస్తూ... మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన పియాస్ట్రి ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. నిర్ణీత 66 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 32 నిమిషాల 57.375 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో పియాస్ట్రి చైనా గ్రాండ్ప్రి, బహ్రెయిన్ గ్రాండ్ప్రి, సౌదీ అరేబియా గ్రాండ్ప్రి, మయామి గ్రాండ్ప్రిలలో విజేతగా నిలిచాడు. మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ఐదో స్థానంలో నిలిచినా... చివరి ల్యాప్లో జార్జి రసెల్ కారును ఢీకొట్టినందుకు అతనిపై 10 సెకన్ల పెనాల్టీని విధించారు. దాంతో వెర్స్టాపెన్ చివరకు పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఆస్టన్ మార్టిన్ జట్టు డ్రైవర్ లాన్స్ స్ట్రోల్ చేతిలో నొప్పి కారణంగా రేసులో పాల్గొనలేదు. మెర్సిడెస్ డ్రైవర్ కిమి ఆంటోనెలి 53వ ల్యాప్లో, అలెగ్జాండర్ ఆల్బోన్ (విలియమ్స్) 27వ ల్యాప్లో వైదొలిగారు. 24 రేసుల ఈ సీజన్లో 9 రేసులు ముగిశాయి. 186 పాయింట్లతో పియాస్ట్రి అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 176 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 137 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు కెనడియన్ గ్రాండ్ప్రి జూన్ 15న మాంట్రియల్లో జరుగుతుంది.

చాంపియన్స్ లీగ్ విజేత పీఎస్జీ
మ్యూనిక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుది పోరులో పీఎస్జీ 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై విజయం సాధించింది. పీఎస్జీ తరఫున డెసైర్ డౌ (20వ, 63వ నిమిషాల్లో) రెండు గోల్స్తో చెలరేగగా... అష్రఫ్ హాకిమి (12వ నిమిషంలో), ఖ్విచా క్వారట్స్ఖేలియా (73వ నిమిషంలో), సెన్నీ మయులు (86వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆద్యంతం పీఎస్జీ జట్టు ఆధిపత్యం కనబర్చగా... ఇటలీ క్లబ్ ఇంటర్ మిలాన్ జట్టు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. 60 శాతం బంతిని తమ ఆధినంలో పెట్టుకున్న పీఎస్జీ చిన్న చిన్న పాస్లతో ఫలితం రాబట్టింది. 70 ఏళ్ల చరిత్రగల యూరోపియన్ కప్ ఫైనల్లో ఇలా ఒక జట్టు ఏకపక్షంగా భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఇదే తొలిసారి. పీఎస్జీకి ఇదే మొదటి యూరోపియన్ కప్ టైటిల్ కాగా... ఏడో ఫైనల్ ఆడిన ఇంటర్ మిలాన్ జట్టు నాలుగోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. 1956లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో రియల్ మాడ్రిడ్ జట్టు విజేతగా నిలవగా... ఇప్పుడు పీఎస్జీ రూపంలో 24వ విజేత అవతరించింది. మ్యూనిక్ వేదికగా ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ టోర్నీ ఫైనల్ జరగగా... ఐదుసార్లూ కొత్త విజేత ఆవిర్భవించడం విశేషం.

ENG VS WI 2nd ODI: 54వ సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అంతర్జాతీయ క్రికెట్లో 54వ సెంచరీ, వన్డేల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. వెస్టిండీస్తో ఇవాళ (జూన్ 1) జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. సెంచరీ చేసే క్రమంలో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 309 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ అజేయమైన సెంచరీతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. రూట్ సిక్సర్, బౌండరీతో సెంచరీ పూర్తి చేశాడు. 🚨 54th INTERNATIONAL HUNDRED FOR JOE ROOT 🚨- The Greatest England Batter ever. 🐐 pic.twitter.com/bs7uEjregH— Johns. (@CricCrazyJohns) June 1, 202538 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 226/5గా ఉంది. రూట్తో (117) పాటు విల్ జాక్స్ (35) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 72 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలో ఎదురుదెబ్బలు తినింది. ఓపెనర్లు జేమీ స్మిత్, బెన్ డకెట్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. వన్డౌన్లో వచ్చిన రూట్ అజేయమైన సెంచరీతో విజయం దిశగా తీసుకెళ్తున్నాడు. హ్యారీ బ్రూక్ 47, జోస్ బట్లర్ 0, జేకబ్ బేతెల్ 17 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2, జేడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. వన్డౌన్ బ్యాటర్ కీసీ కార్టీ సూపర్ సెంచరీతో (105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు), ఓపెనర్ బ్రాండన్ కింగ్ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్ ఆటగాడు షాయ్ హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (10-0-63-4), సాకిబ్ మహమూద్ (9.4-0-37-3) చెలరేగగా.. బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్ తలో వికెట్ తీశారు.కాగా, విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లు)..విరాట్ కోహ్లి-82జో రూట్-54రోహిత్ శర్మ-49కేన్ విలియమ్సన్-48స్టీవ్ స్మిత్-48వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు..జో రూట్-7000 (నాటౌట్)ఇయాన్ మోర్గాన్-6957ఇయాన్ బెల్-5416జోస్ బట్లర్-5196పాల్ కాలింగ్వుడ్-5092

IPL 2025 Qualifier 2, PBKS VS MI: మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి..?
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (జూన్ 1) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు వరుస విరామాల్లో అడ్డుపడుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి మ్యాచ్ 9 గంటల వరకు ప్రారంభం కాలేదు. 9 గంటల ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తుంది. 9:30 గంటల లోపు మ్యాచ్ ప్రారంభమైతేనే ఎలాంటి ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరిగేలా లేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో లేని వర్షం మ్యాచ్ ప్రారంభ సమయానికి జోరందుకుంది.మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి..?ఒకవేళ ఈ మ్యాచ్ పూర్తిగా రద్దైతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరుతుంది. ప్లే ఆఫ్స్లో మ్యాచ్లకు రిజర్వ్ డే లేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందేమో చూడాలి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున హర్ప్రీత్ బ్రార్ స్థానంలో చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్
బిజినెస్

అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆ వస్తువులు ఇక అమ్మరు..
ఆన్లైన్ షాపింగ్ అన్నది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. దుస్తుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకూ అన్నింటినీ ఈ-కామర్స్ సంస్థల్లోనే కొనేస్తున్నారు. అయితే ఇలా అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లో విక్రయించేందుకు వీల్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, జియోమార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు వాకీ-టాకీల విక్రయాలను నిలిపేశాయి.రేడియో పరికరాల అక్రమ లిస్టింగ్, అమ్మకాల నివారణ, నియంత్రణ కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) మార్గదర్శకాలను జారీ చేసిన మీదట ఈ-కామర్స్ సంస్థలు తమ విక్రయ వస్తువుల జాబితా నుంచి వాకీ-టాకీలను తొలగించాయని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. రేడియో కమ్యూనికేషన్ పరికరాలు ముఖ్యంగా భద్రతా ముప్పును కలిగించే వాకీ-టాకీలను ఆన్లైన్లో అనధికారికంగా విక్రయించడాన్ని అరికట్టడానికి ఈ మార్గదర్శకాలను జారీ చేశారు.టెలికమ్యూనికేషన్స్ విభాగం, హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు సీసీపీఏ పీఐబీ ప్రకటనలో పేర్కొంది. చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు లేదా లైసెన్సింగ్ వివరాలు లేకుండానే చాలా సంస్థలు ఆన్లైన్లో వాకీటాకీలను విక్రయిస్తున్నట్లు గుర్తించామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా సంస్థలు వాకీటాకీల ఫ్రీక్వెన్సీ రేంజ్, వాటిని వినియోగానికి లైసెన్స్ అవసరమా అన్న వివరాలను పేర్కొనకుండా, ఆ పరికరాలను స్వేచ్ఛగా ఉపయోగించవచ్చని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని గుర్తించిన మీదట తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.దీంతో కొన్ని ఈ- కామర్స్ సంస్థలు తమ లిస్టింగ్ నుంచి వాకీటాకీలను తొలగించినప్పటికీ మరికొన్ని మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగిస్తుండటం గమనార్హం. అన్ని ప్రధాన ఆన్లైన్ విక్రయ సంస్థల్లో 16,970 వస్తువులకు సంబంధించి ఫ్రీక్వెన్సీ, అవసరమైన లైసెన్సింగ్ వివరాలు లేకపోవడంపై సీసీపీఏ గతంలోనే 13 నోటీసులు జారీ చేసింది. ఈ ప్లాట్ ఫామ్ లు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయి.

బ్యాంకు అకౌంట్లో పైసా లేకపోయినా పర్లేదు..!
బ్యాంక్ అకౌంట్.. దేశంలోని ప్రతి పౌరుడికీ కనీస అవసరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం అందరూ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. కానీ ఆ బ్యాంకు అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంచడం పేదలు, సామాన్యులకు భారంగా మారింది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీల పేరుతో బ్యాంకులు బాదేస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే సామాన్యులకు ఉపశమనం కల్పిస్తున్నాయి.తాజాగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు జూన్ 1 నుంచి అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని, తక్కువ లేదా జీరో బ్యాలెన్స్కు ఎటువంటి జరిమానాలు విధించని జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను మరికొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇలాంటి అకౌంట్లను ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి.. ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.. ఈ కథనంలో తెలుసుకోండి...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్బీడీఏ)ను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ యాక్టివేట్ చేయడానికి లేదా అకౌంట్ క్లోజర్కు ఎలాంటి ఛార్జీలు ఉండవు.వడ్డీ రేటు: రూ .10 కోట్ల వరకు సంవత్సరానికి 2.70%అర్హత: భారతీయ నివాసితులు; చెల్లుబాటు అయ్యే కేవైసీ (ఆధార్, పాన్ మొదలైనవి) అవసరం.అదనపు గమనికలు: గరిష్ట బ్యాలెన్స్ పై గరిష్ట పరిమితి లేదు; ఏటీఎం లేదా బ్రాంచీల వద్ద విత్ డ్రా ఫారాల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్:జూన్ 1 నుండి, కెనరా బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ జరిమానాలను తొలగించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా మార్చింది.ఫీచర్లు: తక్కువ లేదా జీరో బ్యాలెన్స్ లకు ఛార్జీలు ఉండవు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను ప్రోత్సహిస్తాయి.సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐ ఎస్బీ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.ఇండియన్ బ్యాంక్:బీఎస్బీడీఏ, మైనర్ల ఖాతాలు వంటి నిర్దిష్ట జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను అందిస్తుంది (గరిష్టంగా రూ. 2,00,000 ఉన్న ఖాతాలకు కనీస బ్యాలెన్స్ లేదు).ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఇంటర్నెట్ / మొబైల్ బ్యాంకింగ్ (అభ్యర్థనపై).వడ్డీ రేటు: సంవత్సరానికి 2.75% –2.90% (2024 లో బ్యాలెన్స్ ఆధారంగా).గమనిక: సాధారణ పొదుపు ఖాతాలకు రూ .500 (చెక్బుక్ లేకుండా) లేదా రూ. 1,000 (చెక్బుక్తో) కనీస బ్యాలెన్స్ అవసరం, కానీ ఈ ఖాతాలలో ఈ మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోయినా ఎటువంటి జరిమానాలు ఉండవు. నిర్దిష్ట పథకాలకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయి.యాక్సిస్ బ్యాంక్:ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, బేసిక్ బ్యాంకింగ్ సేవలు (డిపాజిట్లు/ ఉపసంహరణలు), ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% –3.5% (బ్యాలెన్స్ ఆధారంగా).బ్యాంక్ ఆఫ్ బరోడా:ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో కూడిన బరోడా రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్, జీరో బ్యాలెన్స్కు ఎలాంటి పెనాల్టీలు ఉండవు.వడ్డీ రేటు: మారుతుంది (సాధారణంగా సంవత్సరానికి 2.75%–3.25%).హెచ్డీఎఫ్సీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, అపరిమిత ఏటీిఎం ఉపసంహరణలు, ఉచిత నెట్ / మొబైల్ బ్యాంకింగ్, ఎల్పీజీ సబ్సిడీలు, డీబీటీ వంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు ప్రాప్యత.వడ్డీ రేటు: ఏడాదికి 3 శాతం (రూ.50 లక్షలలోపు బ్యాలెన్స్లకు), 3.5 శాతం (రూ.50 లక్షలకు మించిన బ్యాలెన్స్లకు).ఐసీఐసీఐ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, 15,000+ ఏటీఎంలకు యాక్సెస్, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఆప్షనల్ ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% (ప్రారంభ రేటు).కోటక్ మహీంద్రా బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా కోటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది.ఫీచర్లు: 811 యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తక్షణ ఖాతా తెరవడం, ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు (సంవత్సరానికి రూ.199 వద్ద ఫిజికల్ కార్డు), అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, డెబిట్ కార్డు చెల్లింపులపై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 4% వరకుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్:కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా ప్రథమ్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు (మైక్రో ఏటీఎంలతో సహా), ఉచిత నెట్/ మొబైల్ బ్యాంకింగ్, నెలవారీ వడ్డీ క్రెడిట్లు, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. రూ.35 లక్షల ప్రమాద బీమా, డైనింగ్ డీల్స్).వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు (లిస్టెడ్ బ్యాంకుల్లో అత్యధికం).ఆర్బీఎల్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు (విత్ డ్రా లిమిట్ రూ.50,000/రోజు), ఉచిత అన్ లిమిటెడ్ నెఫ్ట్/ఆర్టీజీఎస్, ఉచిత నెట్/మొబైల్/ఫోన్ బ్యాంకింగ్, షాపింగ్/డైనింగ్ పై డిస్కౌంట్లు.వడ్డీ రేటు: ఏడాదికి 7.5% వరకు.యస్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత అంతర్జాతీయ డెబిట్ కార్డు, యెస్ బ్యాంక్ ఏటీఎంలలో అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు, ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్/ ఐఎంపీఎస్, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. యాక్సిడెంటల్ డెత్ కవర్).వడ్డీ రేటు: ఏడాదికి 2.75% (రూ.50 లక్షల వరకు), 3.25% (రూ.40 కోట్ల వరకు).డీసీబీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత ఏటీఎం కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఉచిత నెట్/ మొబైల్/ ఫోన్ బ్యాంకింగ్, ఫిజికల్/ ఈమెయిల్ స్టేట్మెంట్లు.వడ్డీ రేటు: వనరులలో పేర్కొనబడదు, కానీ సాధారణంగా పోటీ.ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:సెల్ఫీ సేవింగ్స్ అకౌంట్ (జీరో బ్యాలెన్స్, యువతను లక్ష్యంగా చేసుకుని) అందిస్తోంది.ఫీచర్లు: నో మినిమమ్ బ్యాలెన్స్, ఉచిత డెబిట్ కార్డు, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, కాంపిటీటివ్ వడ్డీ రేట్లు.వడ్డీ రేటు: పరిశ్రమలో అత్యధికం (క్రెడిట్ త్రైమాసికం).ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, రూ .5,000 వరకు కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు.

ఇంట్లో ఇలాంటి మొక్కలే పెంచుతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలను పెంచుకుంటున్నారు. దాంతో అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగా ఉంటాయి.ఇండోర్ గార్డెనింగ్పై ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్కే. నిర్వహణ అత్యంత సులువు. తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఉంచినప్పటికీ.. స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది. నిలువుగా పెరుగుతుంది. మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచూ శుభ్రం చేస్తుండాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి. లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది.గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి.కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్లను పీల్చుకోవటంలో, ఇండోర్లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచూ నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి.ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్ ఎవర్గ్రీన్ లేదా ఆగ్లోనెమాస్ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువు. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్లో వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో.. ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి.

ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్కార్డులపై కొత్త చార్జీలు.. జూలై 1 నుంచి..
ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఛార్జీలను పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ రెండూ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించాయి. కొత్త చార్జీలను ప్రవేశపెడుతున్నాయి. ఇవి జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు కస్టమర్లకు ఆయా బ్యాంకులు నోటిఫికేషన్లు పంపించాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్పులివే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించింది. గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ ఛార్జీలపై జూలై 1 నుండి కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టింది. డ్రీమ్ 11, రమ్మీ కల్చర్, జంగ్లీ గేమ్స్ లేదా ఎంపీఎల్ వంటి ప్లాట్ఫామ్లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే 1% ఛార్జీ వర్తిస్తుంది. ఇది గరిష్టంగా రూ.4,999గా ఉంటుందని, ఆన్ లైన్ గేమింగ్ లావాదేవీలపై ఎలాంటి రివార్డు పాయింట్లు లభించవని బ్యాంక్ తెలిపింది.క్రెడిట్ కార్డును ఉపయోగించి పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్ లేదా ఓలా మనీ వంటి ప్లాట్ఫామ్లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ వాలెట్ లోడింగ్ చేస్తే 1% చార్జీ వసూలు చేస్తారు. నెలకు మొత్తం వాలెట్ లోడింగ్ ఖర్చుకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. గరిష్టంగా రూ .4,999 ఉంటుంది.క్రెడిట్ కార్డులతో నెలకు రూ.50,000 లకు మించిన యుటిలిటీ లావాదేవీలపై 1% ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నెలకు మొత్తం యుటిలిటీ ఖర్చులకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఇది రూ .4,999 వరకు ఉంటుంది. అయితే బీమా లావాదేవీలను యుటిలిటీ లావాదేవీలుగా పరిగణించబోమని, అందువల్ల వీటిపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని బ్యాంక్ స్పష్టం చేసింది.👉ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులురెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ కేటగిరీలకు సంబంధించి ఒక్కో లావాదేవీకి గరిష్ట ఛార్జీని రూ.4,999గా నిర్ణయించారు. ప్రస్తుతం రూ .15,000 మించిన ఇంధన లావాదేవీలపై మాత్రమే 1% ఛార్జీ వసూలు చేస్తున్నారు. జూలై 1 నుంచి అన్ని అద్దె లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. అయితే కాలేజీ/స్కూల్ వెబ్సైట్లు లేదా వాటి పీఓఎస్ మెషీన్లలో థర్డ్ పార్టీ యాప్ చెల్లింపుల ద్వారా చేసే విద్యా లావాదేవీలకు మాత్రం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలుడీడీ (డిమాండ్ డ్రాఫ్ట్), పీవో (పే ఆర్డర్), ఏటీఎం ఇంటర్చేంజ్, ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డు ఫీజులను ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. నగదు డిపాజిట్, చెక్కు, డీడీ, పీవో బదిలీకి ఛార్జీలను ప్రతి రూ.1000కు రూ.2గా సవరించింది. ఇది కనిష్ఠంగా రూ.50, గరిష్టంగా రూ.15 వేలు ఉంటుంది. గతంలో రూ.10,000 వరకు అయితే రూ.50, రూ.10,000 దాటితే ప్రతి రూ.1000కు రూ.5 చొప్పున జనరల్ చార్జీలు వసూలు చేసేవారు.ఏటీఎం ఇంటర్ఛేంజ్ లావాదేవీలకు 3 మూడు దాటితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఆర్థికేతర లావాదేవీకైతే రూ.8.5 లుగా బ్యాంకు సవరించింది. ఇవి గతంలో వరుసగా రూ.21, రూ.8.5లుగా ఉండవి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు 5 దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్కు ఛార్జీని రూ.21 నుంచి రూ.23కు పెంచారు. డెబిట్ కార్డు వార్షిక ఫీజును రూ.200 నుంచి రూ.300కు, రీప్లేస్ మెంట్ కార్డు ఫీజును రూ.200 నుంచి రూ.300కు పెంచారు.
ఫ్యామిలీ

Miss World 2025: ఘనంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే..
ప్రపంచ వేదికపై హైదరాబాద్ నగర ప్రశస్తి మరోసారి అత్యంత వైభవంగా మారుమోగింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 108 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో మిస్ థాయిలాండ్ ప్రపంచ సుందరిగా నిలిచింది. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై కళ్లు చెదిరే హంగులతో లైటింగ్తో ప్రతిష్టాత్మకంగా ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ వేదిక పై భారతీయ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోడియంపై తెలుగు సెలబ్రిటీలు సందడి చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు క్యాట్ వాక్ చేసే పోడియం ప్యానెల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ రానా దగ్గుబాటి, మరో సినీతార నమ్రత శిరోద్కర్ ఆశీనులయ్యారు. ఇదే వరుసలో ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్, సామాజికవేత్త, మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ విభాగానికి గ్లోబల్ అంబాసిడర్గా ఎన్నికైన తెలుగు మహిళ సుధారెడ్డి ఉన్నారు. మెగా హంగామా.. ఈ పోటీలను వీక్షించడానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చారు. ఈ మెగా వేదికపై ప్రముఖ సెలబ్రిటీ ఇషాన్ కట్టర్ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా తను ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటు సాంగ్కు అదిరిపోయే స్టెప్పులేస్తుంటే.. చిరంజీవి సంతోషంగా చప్పట్లు కొట్టారు. స్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహపరిచిన సోనూసూద్ తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలిపారు.ఆతిథ్యం అద్భుతం.. ఈ పోటీల నేపథ్యంలో తెలంగాణ అందించిన ఆతిథ్యం అద్భుతమని టాప్ 4లో నిలిచిన పోలండ్ కాంటెస్టెంట్ కొనియాడారు. ఇక్కడి మర్యాదలు ఆత్మీయత తనను కట్టిపడేశాయని.. భాగ్యనగరాన్ని తన రెండో ఇంటిగా అనుభూతి చెందానని సంతోషం వ్యక్తం చేశారు. ప్యానలిస్టుల్లో రానా, నమ్రత.. అంతే కాకుండా ఈ గ్రాండ్ ఫినాలేలో టాప్ 4 మార్టినిక్, ఇథియోఫియా, పోలెండ్, థాయిలాండ్ కాంటెస్టెంట్ లను చివరి ప్రశ్నలు అడిగిన నలుగురు ప్యానలిస్టుల్లో రానా, నమ్రత ఇద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం. మరో రెండు ప్రశ్నలు అడిగిన ఇద్దరిలో సోనూ సూద్ కూడా హైదరాబాద్కు సుపరిచితుడే. ( చదవండి: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా)

చూడటానికి అదొక దేవాలయం..! కానీ కింద చూస్తే..
అదొక పుస్తక నిలయం. లక్షల సంఖ్యలో గ్రంథాలతో కళకళలాడే జ్ఞానభాండాగారం. కాని, అక్కడికి వెళితే, అక్కడ ఒక దేవాలయం మాత్రమే గోచరిస్తుంది. గుడిలోకి ప్రవేశించాక నేలమాళిగలోకి వెళ్లేందుకు భూగర్భమార్గం కనిపిస్తుంది. అలా మెట్ల మార్గంలో కిందికిపోతే, అరుదైన భూగర్భ గ్రంథాలయం ఆశ్చర్యపరుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ గ్రంథాలయమది. అత్యంత అరుదైన ఈ భూగర్భ గ్రంథాలయం కథా కమామిషు తెలుసుకుందాం...పదహారడుగుల లోతులో...రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లా భడారియా గ్రామం చుట్టూ ఎడారి వాతావరణం. ఊరిలో భడారియా దేవాలయం ప్రత్యేక ఆకర్షణ కేంద్రం. కారణం ఈ ఆలయం భూ ఉపరితలానికి పదహారడుగుల కింద కొలువైన భూగర్భ గ్రంథాలయం. విశాలమైన వరండాలు, గాజు అలమరాలలో భద్రపరచిన పుస్తకాలు, పెద్దపెద్ద ర్యాకులు, ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం ప్రత్యేకతలు. భడారియా గ్రంథాలయాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఒకటి అధ్యయన భవన్, మరొకటి సంగ్రహణ భవన్. అధ్యయన భవన్లో వందలాది మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విశాలమైన గదులను నిర్మించారు. సంగ్రహణ భవన్లో పలు అరుదైన గ్రంథాలను అందుబాటులో ఉంచారు. వీటికోసం 562 అలమరాలు, 16వేల అడుగుల పొడవులో ర్యాక్స్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ప్రాచీన ప్రతులు, రాష్ట్రపతులు, ప్రధానుల ప్రసంగాలు లభిస్తాయి. భడారియా మహారాజు కృషి ఫలితంభడారియా మహారాజు 1960లో శక్తిపీఠమైన భడారియామాత మందిరాన్ని సందర్శించి. అక్కడే స్థిరపడిపోయారు. ఆయన అసలు పేరు హరివంశ్సింగ్ నిర్మల్. ఇక్కడి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడ గ్రంథాలయాన్ని నెలకొల్పాలని అనుకున్నారు. 1983లో నిర్మాణానికి సంకల్పించారు. బయట ఎడారి వాతావరణం కాబట్టి పాఠకులకు, సందర్శకులకు ఇబ్బంది లేకుండా దీనిని నేలమాళిగలో నిర్మించారు. దీనివల్ల లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఎలాంటి అసౌకర్యానికి గురికారు. మహారాజు పదిహేనేళ్ల కృషికి ఫలితంగా 1998లో ఈ గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. దీని నిర్మాణం ప్రారంభం నుంచే పుస్తకాల సేకరణ ప్రారంభించారు. అలా ఇప్పటికి తొమ్మిది లక్షల పుస్తకాలను ఇందులో అందుబాటులో ఉంచారు. వీటిలో ప్రపంచస్థాయిలోని పలు మత గ్రంథాలు, చారిత్రక, భాషా, న్యాయ శాస్త్రాలకు సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. వీటితోపాటు వినోద, విజ్ఞానాలను పంచే పుస్తకాలనూ ఉంచారు. ఇక్కడికి వచ్చే పరిశోధకులు, విజ్ఞానార్థులు వేరేచోట అన్వేషించాల్సిన అవసరం లేకుండా సకల గ్రంథాలూ లభించేలా సమకూర్చారు. విశాలమైన భోజనశాలలుపలు అంశాలపై అధ్యయనం చేయడానికి వచ్చే వారికోసం పద్దెనిమిది గదులు నిర్మించారు. అలాగే విశాలమైన భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఎడారి ప్రాంతమైనా, ఈ గ్రంథాలయంలో ఎక్కడా వేడి వాతావరణం కనిపించదు. పాలరాతి గోడలతో చుట్టూ చల్లటి వాతావరణం ఉండేలా దీనిని నిర్మించారు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుంచే కాదు, యూరోప్ నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా అధికంగా ఉంటుందని గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిఆసియాలో పేరున్న భూగర్భ గ్రంథాలయాల రెండే ఉన్నాయి. వాటిలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని స్టార్ ఫీల్డ్ లైబ్రరీ ఒకటి కాగా రెండోది మన భడారియా గ్రంథాలయం. ఈ రెండిటిలో భడారీయా పుస్తక నిలయమే పెద్దది కావడం విశేషం. తిరుమలరావు కరుకోల(చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!)

రాచ సాలీడు..! టాలెంట్కి ఫిదా అవ్వాల్సిందే..
‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే సినిమా డైలాగ్లా కాదు. కొన్నిసార్లు కటౌట్తో పనిలేకుండా కూడా కొన్ని కొన్ని నమ్మేయాలి. ఎందుకంటే, ఫొటోలో చిన్నగా బొద్దుగా ఉండే ఈ సాలీడు టాలెంట్ తెలిస్తే అలాగే అనిపిస్తుంది. ఇది సాలీడు జాతికే రారాజులాంటిది. పేరు ‘డార్విన్ బార్క్ స్పైడర్’. కేవలం ఇరవై రెండు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కాని, అది అల్లే సాలెగూడు పరిమాణం ముందు సినిమాల్లోని స్పైడర్ మాన్ కూడా తలదించుకోవాల్సిందే! గాలిలోకి దాని జిగురు దారాలను వదిలి, ఎక్కడో ఓ చెట్టుకి అంటుకునేలా చేస్తుంది. అలా మొదలైన దాని సాలెగూడు ఏకంగా ఇరవై ఐదు మీటర్ల దూరం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన గూడు నిర్మించుకునే సాలీడుగా ఇది రికార్డులకెక్కింది. గూడు ఎంత పెద్దదైతేనేం అంత బలంగా ఉండదనుకోకండి. దాని జిగురు దారాల బలం, పట్టుదారం కంటే పదిరెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. దాని సాలెగూడులో పడి, ఒకేసారి దాదాపు ఇరవై దోమలు, ఈగలు బ్రేక్ఫాస్ట్ బఫేగా మారిపోగలవు. దీని గురించి తెలిస్తే స్పైడర్మాన్ కంటే ఈ నిజమైన వెబ్ హీరోకే ఫిదా అయిపోతారు. (చదవండి: కింగులా బతికాడు సింగిల్గా..!)

కింగులా బతికాడు సింగిల్గా..!
రోజూ పొద్దునే లేస్తాడు. ఆకలైతే తింటాడు. వ్యవసాయం తన వృత్తి. ఇంటి ముందే కొన్ని పండ్లు, కూరగాయల మొక్కలను పెంచుకుంటుంటాడు. మనుషులెవ్వరితోనూ మాట్లాడడు. మూగజీవాలు, పక్షులే అతని ఫ్రెండ్స్. కాలక్షేపం కోసం ఇంటి పనులు, మరమ్మతులు, నీటి గుంటలు తవ్వటం వంటివి చేస్తాడు. అన్ని పనులూ పూర్తి చేసుకున్నాక అలసట వస్తే, స్వయంగా నిర్మించుకున్న తన తాటాకుల గుడిసెలో సేద తీరుతాడు. అతన్ని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా, ప్రతిసారి పెద్ద యుద్ధమే చేసి, విజయం సాధించాడు. అడగకుండా ఎన్ని ఇచ్చినా పుచ్చుకోకుండా, చేయి చాచని మహారాజులా నిలబడేవాడు. ఆఖరుకు ఎక్కడికైనా చేరగల ఇంటర్నెట్ కూడా అతని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అతన్ని మచ్చిక చేసుకోలేక పోయాయి. ఇలా హాయిగా తన పని తాను చేసుకునేవాడు. ఇంతే! ఇదే తన జీవితం. ఎంతో అందమైన, ప్రశాంతమైన జీవితం. ఇలా అందరూ బతకలేరు. ఎవరికీ సాధ్యం కాని పనికూడా! అయినప్పటికీ అతను ఈ సూపర్ సింగిల్ లైఫ్ని గత మూడు దశాబ్దాలుగా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ అతనెవ్వరో కాదు, 1996లో తొలిసారి అమెజాన్ అటవీ అధికారులు గుర్తించిన ఒంటరి గిరిజనుడు. అతని తెగ మొత్తం అంతరించిపోయినా, అతను మాత్రం ఒక్కడే అడవిలో జీవిస్తున్నాడని తెలిసింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం అతన్ని 2018లో కెమెరాలో రహస్యంగా వీడియో తీసి, వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ మధ్యనే అధికారులకు అతని శరీరం గుడిసెలో కనిపించింది. నిద్రలో ప్రశాంతంగా మరణించాడు. ఇరవై ఆరేళ్లపాటు ఎవ్వరితోనూ మాట్లాడకుండా, కలవకుండా, ఒంటరిగా మహారాజులా బతికి, అంతే రాజసంగా లోకం నుంచి నిష్క్రమించాడు. (చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!)
ఫొటోలు


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్ ఫ్యామిలీ (ఫొటోలు)


కొత్తిల్లు కొన్న నటుడు.. ఘనంగా గృహప్రవేశం (ఫోటోలు)


ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం దండేలి..! చూడచక్కని ప్రదేశాలివే..


జనంపై బాబు పగ.. ఏపీలో ‘రేషన్’ కష్టాలు (ఫొటోస్)


దక్షిణాదిన ఈ జలపాతాలు చూశారా?


పెళ్లి వేడుకలా హీరోయిన్ శ్రీలీల బర్త్ డే (ఫొటోలు)


మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)


మిస్ వరల్డ్-2025 ఫైనల్స్ సందడి.. ర్యాంప్ వాక్తో మెరిసిన అందగత్తెలు (ఫొటోలు)


ట్రెడిషనల్ లుక్లో ముద్దుగుమ్మలా వర్ష (ఫొటోలు)


నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
అంతర్జాతీయం

రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి, గాయాలు
మాస్కో: రష్యాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. అదే సమయంలో ప్యాసింజర్ రైలు వెళ్తున్న కారణంగా సదరు రైలు ప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.⚡ BREAKING Russian Emergency crews are cutting through metal train cars to rescue trapped passengers. The Klimov–Moscow train was crushed after the blast, caused by the detonation of a bridge support in the Vygonichsky district of Russia’s Bryansk region.#Russia #Bryansk https://t.co/X6oD1mZJUk pic.twitter.com/RZoahsb4wC— ⚡𝙉𝙊𝙄𝙎𝙀 𝘼𝙇𝙀𝙍𝙏𝙎 (@NoiseAlerts) May 31, 2025ఈ సందర్భంగా బ్రయాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవలు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మృతిచెందిన వారిలో రైలు లోకో పైలట్ కూడా ఉన్నారు. ప్యాసింజర్ రైలు మాస్కో నుండి క్లిమోవ్కు వెళుతోందని అన్నారు.BREAKING: Multiple dead and wounded after bridge collapses onto passenger train in Russia's Bryansk region, according to BazaSabotage is suspected pic.twitter.com/S4v4c0aXfJ— Faytuks News (@Faytuks) May 31, 2025అయితే, గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రయాన్స్క్ ప్రాంతం రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండటంతో డ్రోన్ దాడులు, బాంబు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దాడుల ప్రభావంతో వంతెన కూలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
జాగ్రత్త.. 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి
వాషింగ్టన్: మల్లాది ‘నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త’ నవల గుర్తుందా? కెన్యా నుంచి వచ్చిన భయంకరమైన రాక్షస నత్తలు ఓ రైలు ప్రమాదంలో తప్పించుకుని ఆంధ్ర రాష్ట్రంపై పడతాయి. చూస్తుండగానే అసంఖ్యాకంగా పెరిగిపోయి అల్లకల్లోలం చేసిపారేస్తాయి. అదీ, ఇదీ అని తేడా లేకుండా దొరికిన దాన్నల్లా తినేస్తూ భయోత్పాతం సృష్టిస్తాయి. అమెరికాలో వాషింగ్టన్ రాష్ట్రంలో కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి! 31,751 కిలోల తేనెతుట్టెలతో వెళ్తున్న వాహనం లిండెన్ సమీపంలో కెనడా సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మూలమలుపు వద్ద వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో బోల్తా పడింది. తేనెతుట్టెలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో తేనెటీగలు బయటికొచ్చి జారుకున్నాయి. విషయం తెలియగానే పోలీసులు తేనెటీగల నిపుణులతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి తేనెతుట్టెలను ఒక్కచోటికి చేర్చారు. తప్పించుకున్న తేనెటీగల కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. అవి తప్పకుండా తుట్టెల వద్దకు తిరిగొస్తాయని నిపుణులు చెప్పారు. ‘‘తేనెటీగలు రాణి ఈగను విడిచి ఉండలేవు. దాన్ని తీసుకొని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి’’ అని వివరించారు. కనుక రెండు మూడు రోజులపాటు పరిసర ప్రాంతాలకు రావొద్దని స్థానికులకు పోలీసులు సూచించారు. అమెరికాలో లక్షలాది తేనెటీగలను తరచుగా ఇలా ఒకచోటి నుంచి మరోచోటికి తరలిస్తుంటారు. వ్యవసాయంలో తేనెటీగలది కీలక పాత్ర. పరాగ సంపర్కానికి, పంటలు పండడానికి దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతుండటంతో మే 20ని ‘ప్రపంచ తేనెటీగల దినం’గా జరుపుకోవాలని ఐరాస 2018లో పిలుపునిచ్చింది.
చైనాతో తక్షణ ప్రమాదం వాస్తవం
సింగపూర్: డ్రాగన్ దేశం చైనా నుంచి ఇండో–పసిఫిక్ దేశాలకు తక్షణ ముప్పు పొంచి ఉందని, ఇది నిజమని అమెరికా విదేశాంగ మంత్రి పీటర్ హెగ్సెత్ హెచ్చరించారు. చైనా నుంచి ఎదురయ్యే సైనిక, ఆర్థికపరమైన ఒత్తిడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలోని మిత్ర దేశాలను ఒంటరిగా వదిలేయబోమని హామీ ఇచ్చారు. అదే సమయంలో, ఆయా దేశాలు రక్షణపరంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. జీడీపీలో 5 శాతం మేర రక్షణ రంగానికి కేటాయించాలని సూచించారు. యూరప్ దేశాలు సైతం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చైనా నుంచి వేగంగా పెరుగుతున్న ముప్పును, ముఖ్యంగా తైవాన్ విషయంలో దుండుడుకు చర్యలకు ముకుతాడు వేసేందుకు అమెరికా రక్షణ చర్యలను ముమ్మరం చేస్తుందని ప్రకటించారు. తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ రిహార్సల్స్ చేస్తోందని హెగ్సెత్ వ్యాఖ్యానించారు. ఇదే లక్ష్యంతో సైన్యానికి రోజువారీ శిక్షణ అందిస్తోందన్నారు. 2027 నాటికి తైవాన్ను విలీనం చేసుకోవాలనే లక్ష్యాన్ని సాధించే సత్తా తమకుందని చైనా ఇప్పటికే చేసిన ప్రకటనపై ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సింగపూర్లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సు ‘షంగ్రీ లా డైలాగ్’లో హెగ్సెత్ శనివారం కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ ఏర్పాటు చేసింది. చైనా విస్తారమైన దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలను ఏర్పాటు చేసి మిలటరీ ఔట్ పోస్టులను నెలకొల్పుతోంది. అత్యంత అధునాతన హైపర్సోనిక్ క్షిపణులను తయారు చేయడంతోపాటు అంతరిక్షంలోనూ పైచేయి సాధించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ బెడదను దృష్టిలో ఉంచుకునే అమెరికా ‘గోల్డె న్ డోమ్’క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది. పనామా కాలువ సహా లాటిన్ అమెరికా ప్రాంతంలోనూ పలుకుబడిని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని హెగ్సె త్ ఆరోపించారు. ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా సైనిక మద్దతును పొందుతూనే చైనాతో ఆర్థికంగా సంబంధాలు నెరుపుతుండటం ప్రమాదకరమైన వ్యవహా రమని హెగ్సెత్ పేర్కొన్నారు. యూరప్ దేశాలు తమ సొంత భద్రతను చూసుకోవా లని, ఇండో–పసిఫిక్ బాధ్యతను అమెరికాకు వదిలేయాలన్నారు. అనంతరం మాట్లాడిన ఈయూ ఉపాధ్యక్షురాలు కాజా కల్లాస్ హెగ్సె త్ వ్యాఖ్యలను ఖండించారు. ‘ఉత్తరకొరియా బలగాలు రష్యా తరఫున ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నాయి. అదే సమయంలో, రష్యాకు చైనా మద్దతుగా నిలుస్తోంది. యూరప్, ఆసియాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి’అని పేర్కొన్నారు.హాజరు కాని చైనా రక్షణ మంత్రిఏటా జరిగే ఈ సదస్సుకు చైనా తన రక్షణ మంత్రిని పంపిస్తుంటుంది. అమెరికాతో నడుస్తున్న టారిఫ్ విభేదాల నేపథ్యంలో ఈసారి దిగువ స్థాయి అధికారులతో కూడిన బృందాన్ని పంపించింది. హెగ్సెత్ వ్యాఖ్యలను ఈ బృందంలోని చైనా నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ హు గంగ్ఫెంగ్ తీవ్రంగా ఖండించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
సరదాల వేళ... తలుపులతో జాగ్రత్త!
వాషింగ్టన్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ను ఆయన భార్య ముఖంపై చేతులు వేసి తోసేస్తున్న వీడియో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం తెలిసిందే. దానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాజాగా స్పందించారు. శుక్రవారం మీడియా భేటీ సందర్భంగా విలేకరులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘అది అధ్యక్ష దంపతుల నడుమ సరదా సన్నివేశం మాత్రమే. మాక్రాన్తో మాట్లాడాను. వారి మధ్య సమస్యేమీ లేదు. అంతా బానే ఉంది’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఓ దేశాధినేతగా వైవాహిక బంధానికి సంబంధించి మరో దేశాధ్యక్షునికి మీరిచ్చే సలహా ఏమిటని ప్రశ్నించగా, ‘‘సరదాల వేళ తలుపులు మూసున్నదీ, లేనిదీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి చాలు. అంతకంటే మరేమీ అక్కర్లేదు’’అంటూ బదులిచ్చి నవ్వులు పూయించారు.
జాతీయం

పాక్, దుబాయ్కు భారతీయుల అక్రమ రవాణా.. ఆలయంలో సంచలన లేఖ..
ఛండీగఢ్: హర్యానాలోని ఓ శివాలయంలో దొరికిన సీక్రెట్ లేఖ సంచలనంగా మారింది. సదరు లేఖలో దాదాపు 100 మంది కిడ్నాప్ చేసినట్టు రాసి పెట్టి ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. దానిలోని విషయాలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి రాసిన లేఖలో హిస్సార్కు చెందిన సుమిత్ గార్గ్ గురించి ప్రస్తావించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు.వివరాల ప్రకారం.. హర్యానా హిస్సార్లోని రెడ్ స్క్వేర్ మార్కెట్లో ఉన్న శివాలయంలో పూజ చేసేందుకు శనివారం ఉదయం పూజరి సురేష్ గుడికి వెళ్లారు. ఆలయ ద్వారాలు తెరిచినప్పుడు గోధుమ రంగు కవరులో ఒక లేఖ కనిపించింది. వెంటనే సురేష్.. దానిని తెరిచి చూశాడు. అందులో ఉన్న మ్యాటర్ చదవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఇక, ఆ లేఖపై తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి చిరునామా ఉంది. దీంతో పూజారి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అనంతరం, హుటాహుటిన అక్కడికి చేరుకుని పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. దానిలోని విషయాలను పరిశీలించారు. హిస్సార్, అంబాలా, గురుగ్రామ్, సిర్సా, రేవారి, గంగానగర్, అజ్మీర్, నర్వానా సహా దేశంలోని వివిధ నగరాల నుంచి దాదాపు వంద మందిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి దుబాయ్, పాకిస్తాన్కు విక్రయించినట్లు లేఖలో ఉంది. దీంతో, షాకైన పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.2018 నుంచే అక్రమ రవాణా..లేఖ ప్రకారం.. మేము 2018 నుంచి ఈ అక్రమ రవాణా ప్రారంభించాం. నేను నా పేరును వెల్లడించను. ఫతేహాబాద్కు చెందిన ఒక కుటుంబం మాకు సహాయం చేసేది. వారు లక్ష్యాలను ఎంచుకుని ప్రేమ లేదా డబ్బు లావాదేవీల ద్వారా ప్రజలను వలలో వేసుకునేవారు. హిస్సార్కు చెందిన సుమిత్ గార్గ్, అంబాలా వాసి దిగ్విజయ్, నర్వానాకు చెందిన నవీన్ రోహిలా, గురుగ్రామ్ వాసి అమర్నాథ్, ఎల్లనాబాద్కు చెందిన వినోద్ కుమార్, అమిత్ బాగ్రి, రేవారీకి చెందిన అన్షు గులాటి, గంగానగర్కు చెందిన రోహిణి, సన్నీ, అజ్మీర్కు చెందిన అంకిత్ శర్మ, సిర్సాకు చెందిన అనూజ్, యాజ్పుర్కు చెందిన నరేష్ను వేరే దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఒకరు పాకిస్థాన్ నుంచి పారిపోయారని కూడా చెప్పారు. మహిళా ముఠా నాయకురాలు పారిపోయిన యువకుడిని పట్టుకుని చంపమని లేదా అతని కుటుంబం నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయమని బెదిరిస్తోందన్నారు. ఆమె తన కుటుంబానికి హాని చేస్తానని బెదిరిస్తోందని, అందుకే భయపడి ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.సుమిత్ ఎవరు?. గుర్తు తెలియని వ్యక్తి రాసిన లేఖలో హిస్సార్కు చెందిన సుమిత్ గార్గ్ గురించి ప్రస్తావించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిస్సార్ లో సుమిత్ అనే పేరు ఉన్న నాలుగైదు మంది కనిపించకుండా పోయినట్లు తేలింది. వారిలో ఎవరు అక్రమ రవాణాకు గురయ్యారో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వారి కుటుంబాలను సంప్రదించారు. అలాగే అక్రమ రవాణాకు సాయం చేసిన ఫతేహాబాద్ కు చెందిన కుటుంబం కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.పోలీసుల తనిఖీలు..పాకిస్థాన్, దుబాయ్ వంటి ప్రదేశాలకు భారతీయుల అక్రమ రవాణా జరుగుతుందని ప్రస్తావించడం వల్ల దర్యాప్తు సంస్థలు ఈ లేఖను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టడానికి హర్యానా పోలీసులు కేంద్ర సంస్థలను సంప్రదించారు. అదే సమయంలో లేఖలో పేర్కొన్న వ్యక్తుల అదృశ్యాన్ని ధ్రువీకరించడానికి వారి కుటుంబాలను సంప్రదిస్తున్నారు. మానవ అక్రమ రవాణా గురించి లెటర్ వైరల్ కావడం వల్ల హిస్సార్, దాని పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది.

బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పోటీ
పట్నా: ఈ ఏడాది(2025) బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్(Election Commission) కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇటీవల బీహార్(Bihar)లోని పట్నాలో జరిగిన ఎల్జేపీ కార్యవర్గ సమావేశంలో చిరాగ్ తాను బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆయన పట్నా, దానాపూర్, హాజీపూర్లలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి. దీనిపై చిరాగ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో చిరాగ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి, చురుకైన పాత్ర పోషించాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడైంది.ఇది కూడా చదవండి: ‘నాన్నా.. ద్రోహం జరిగింది’: లాలూకు తేజ్ లేఖ

హుక్కా.. నిషేధం పక్కా!
బనశంకరి: రాష్ట్రంలో హుక్కాబార్లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతో పాటు సిగరెట్, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చట్టబద్ధ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచింది. ఇటీవల కేంద్రం ఆమోదించిన చట్టానికి అనుగుణంగా శనివారం నాడు ఉత్తర్వులను జారీచేసింది. హుక్కాబార్లపై వేటు కొత్త చట్టంలో హుక్కా బార్ల నిర్వహణను పూర్తిగా నిషేధించారు. ఏ వ్యక్తి లేదా ఇతర వ్యక్తులు టిఫిన్ సెంటర్లు , పబ్, బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు ఎలాంటి ప్రదేశాల్లో హుక్కాబార్ తెరవరాదు, హుక్కాలను సేవించరాదు. ధూమపానాన్ని దూరం చేయడమే ఈ చర్యల ఉద్దేశం. ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి ఏడాది నుంచి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. సందు సందుల్లో హుక్కాబార్లు బెంగళూరులో విచ్చలవిడిగా హుక్కాబార్లు నడుస్తున్నాయి. తొమ్మిది, పదో తరగతి బాలలు కూడా వీటికి అలవాటు పడినట్లు సమాచారం. గతంలో అధికారుల దాడుల్లో బాలలు దొరికిపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్లను నడుపుతూ ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. పాలికె, పోలీసు అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించినా మళ్లీ మామూలుగానే దందా సాగుతోంది. ఈ చట్టంతోనైనా హుక్కాలు బంద్ అవుతాయని సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు.కఠిన నిబంధనలు ⇒ ఇకపై రాష్ట్రంలో 21 ఏళ్లలోపువారికి సిగరెట్, పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదు. విద్యాసంస్థలకు 100 మీటర్ల చుట్టుపక్కల ప్రదేశాల్లో బీడీ, సిగరెట్లను అమ్మరాదు. ⇒ బహిరంగ స్థలాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించారు. అలా పట్టుబడితే రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. గతంలో ఈ జరిమానా రూ.200 ఉండేది.⇒ 30 గదులు కలిగిన హోటల్ లేదా, 30 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు కలిగిన రెస్టారెంట్లలో ప్రత్యేక స్థలంలో ధూమపానం చేయవచ్చునని ఓ మినహాయింపునిచ్చారు.

సింధూ నీళ్లు చుక్క కూడా ఇవ్వం.. పాక్కు భారత్ కౌంటర్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ ఎప్పటికప్పుడు వరుస షాక్లు ఇస్తూనే ఉంది. పహల్గాం ఘటన తర్వాత పాక్కు చుక్కలు చూపిస్తోంది. ఇటు దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా సింధూ జలాల విషయంలో మరోసారి పాక్కు భారత్ ఝలక్ ఇచ్చింది. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం అనేది సింధూ నదీ జలాల ఒప్పందం అమలులో జోక్యంతో సమానమని భారత్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం అమలు విషయంలో తమ దేశాన్ని నిందించడం మానేయాలని పాక్కు హితవు పలికింది.కాగా, తజికిస్తాన్లోని దుషాన్బే నగరం వేదికగా హిమానీ నదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్లీనరీ సెషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్, పాకిస్తాన్కు సహా పలు దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ..‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలుపుదల చేయడాన్ని మేం అంగీకరించం. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇదంతా చేస్తోంది. దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. భారతదేశం రెడ్ లైన్ను దాటడాన్ని మేం సహించం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.అనంతరం, పాకిస్తాన్కు భారత పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ సందర్బంగా కీర్తి వర్థన్ ప్రసంగిస్తూ.. సింధూ నదీ జలాల ఒప్పందంపై భారత్, పాక్ సంతకం చేసిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. పాకిస్తానే ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తానే తప్పు చేస్తూ భారత్ను పాక్ నిందించడం సరికాదు. ఈ సదస్సు వేదికను దుర్వినియోగం చేయడానికి, దీని పరిధిలోకి రాని అంశాలను ప్రస్తావించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని ఖండిస్తున్నాను. సింధూ నదీ ఒప్పందపు నియమ నిబంధనలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. సాంకేతిక, జనాభా, పర్యావరణపరమైన అంశాల్లో మార్పులు జరగాలని డిమాండ్ చేస్తున్నాను. పాక్ సీమాంతర ఉగ్రవాదంపైనా చర్చ జరగాలన్నారు. సద్భావన, స్నేహ స్ఫూర్తితో కుదిరిన ఈ ఒప్పందం అమలుకు ఉగ్రవాదంతో పాకిస్తాన్ ఆటంకం కలిగిస్తోంది.హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. హిమానీనదాలు కరిగిపోతుండటం అనేది ఒక హెచ్చరిక మాత్రమే కాదు. ఈ వైపరీత్యం వల్ల జల భద్రత, జీవవైవిధ్యం, వందల కోట్ల ప్రజల జీవనోపాధి ప్రశ్నార్ధకంగా మారుతాయి. పర్యావరణ పరిరక్షణతో భూతాపాన్ని తగ్గించడంపై కుదిరిన పారిస్ ఒప్పందంలో భారత్ అంగీకరించిన నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్ (NDCs)ను సాధించే దిశగా మోదీ సర్కారు గణనీయమైన పురోగతిని సాధించామం’ అని వెల్లడించారు.
ఎన్ఆర్ఐ

థేమ్స్నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య తెప్పోత్సవం
శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) విదేశీ నీళ్లపై తొలిసారి జరిపిన భక్తి పర్వదినం ‘తెప్పోత్సవాన్ని’ (దివ్య తెప్ప ఉత్సవం) ఘనంగా, భక్తిశ్రద్ధలతో టెమ్స్ నదిపై బ్రే, మైదన్హెడ్ వద్ద నిర్వహించింది. యుకె , యూరప్లో హిందూ ప్రవాసభారతీయుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఇది ఒక మైలురాయి అని నిర్వాహకులు ప్రకటించారు. వేద పారాయణం, భజనలు, సమూహిక అర్చనలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిన ఈ సాయంత్రానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. సుందరంగా అలంకరించబడిన తెప్పపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘గోవింద గోవింద’ నినాదాల మధ్య టెమ్స్ నదిలో విహరించారు. భారీగా హాజరైన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, రెండు విడతలుగా సాగిన ఈ భక్తి నౌక యాత్ర, బ్రిటిష్ వాతావరణంలో దక్షిణ భారతీయ ఆలయాల అనుభూతిని అందించింది. శ్రద్ధతో, సమగ్రంగా రూపొందించి ఈ ఉత్సవం భక్తి, సమాజ చైతన్యం, దైవానుగ్రహానికి అద్దం పట్టింది.ఈ అపూర్వ ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి SVBTCC హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. “దీపమైన భక్తితో నడిచిన కల నౌకై తేలింది — సేవతో నడిచింది, స్వామి అనుగ్రహంతో సాగింది. ఇది ఎంతోమందికి అరుదైన అనుభూతి - దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన అనునిత్య సంప్రదాయాన్ని, యుకె భూమిలో నూతనంగా దర్శించుకోవడం… హృదయాలను నింపింది, ఆత్మలను ఉల్లాసపరిచింది.” అని SVBTCC ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్శిటీ (Harvard University) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తీసుకున్న చర్య దిగ్భ్రాంతికి గురి చేసింది. హార్వర్డ్, ట్రంప్ సర్కార్కు మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే, ఫెడరల్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధికారాన్ని రద్దు చేసిది. హార్వర్డ్ దాని SEVP స్థితిని పునరుద్ధరించాలని భావిస్తే, సంబంధిత పత్రాలను రూపొందించడానికి ఇతర డిమాండ్లను తీర్చడానికి 72 గంటల సమయం ఇచ్చింది. ట్రంప్ తాజా సంచలన నిర్ణయం అనేక మంది విదేశీ విద్యార్థులకు దెబ్బతీయనుంది.ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్శిటీ స్పందించింది.ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించినట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. US డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) గురువారం ప్రకటించిన ఈ నిర్ణయం, హార్వర్డ్లోని దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును నేరుగా ప్రమాదంలో పడేస్తుంది. వీరిలో భారతదేశం నుండి దాదాపు 800 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లుహార్వర్డ్ రికార్డుల ప్రకారం, ప్రతీ సంవత్సరం 500 నుండి 800 మంది భారతీయ విద్యార్థులు మరియు స్కాలర్లు, వివిధ విభాగాలలో నమోదు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం, ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్లో చదువుతున్నారు, వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్-స్థాయి ప్రోగ్రామ్లలో ఉన్నారు. ట్రంప్ పరిపాలన చర్యతో, ఈ విద్యార్థులు ఇప్పుడు అమెరికాలో చట్టబద్ధంగా ఉండాలనుకుంటే మరొక SEVP-సర్టిఫైడ్ సంస్థకు బదిలీ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే వీసా రద్దు , బహిష్కరణకు దారి తీయవచ్చు.హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (DHS) హార్వర్డ్పై జరుపుతోన్న విచారణలో భాగంగా తీసుకున్న చర్య అని ప్రకటించింది. ఈ మేరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అధికారిక లేఖను పంపించారు. ఈ లేఖలో, క్యాంపస్లోని విదేశీ విద్యార్థుల గురించి సమాచారం కోసం అమెరికా ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేకంగా, క్యాంపస్లో జరిగిన నిరసనలకు సంబంధించిన క్రమశిక్షణా రికార్డులు, ఆడియోవిజువల్ డాక్యుమెంటేషన్ను విశ్వవిద్యాలయం సమర్పించ లేదని లేఖలో ఆరోపించింది. అలాగే ‘హార్వర్డ్లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఈ చర్య తీసుకున్నాం. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఓ హక్కు కాదు.. అది ఓ అర్హత మాత్రమే” అని తెపారు. అంతేగాక, విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది బిలియన్ డాలర్లు నిధులు సమ కూర్చుకుంటున్నారు, ఇది హక్కు, కాదు’ అనిఆమె పేర్కొన్నారు.మరోవైపు దీనిపై స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ కక్షపూరిత చర్యగా అభివర్ణించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం చట్ట విరుద్ధమైందని వ్యాఖ్యానించింది. 140కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులకు ఆతిథ్యమిస్తూ ప్రపంచాన్ని వెలుగులో నింపేందుకు చేస్తున్న వారిని మా వర్సిటీలో కొనసాగించేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ చర్య చట్టబద్ధమైనదేనా?అమెరికా చట్టాల ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విద్యార్థి వీసాలపై అధికార పరిధిని కలిగి ఉంటుంది. అలాగూ SEVPని పర్యవేక్షిస్తుంది. గతంలో నిష్ణాతులైన అధ్యాపకుల లేకపోవడం లేదా సంస్థను మూసివేయడం వంటి తీవ్రమైన పరిపాలనా లోపాలతో SEVP జాబితా నుండి కొన్నింటిని తొలగించినప్పటికీ, హార్వర్డ్ SEVP సర్టిఫికేషన్ను రద్దు చేయడం లాంటిది ఇంతకుముందెన్నడూ లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.
H-1B visa applications for 2026 drops hit 4-year low
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థలనిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గింది. వీసా అప్లికేషన్లు సంఖ్య నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.

హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థల నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా దరఖస్తులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా దరఖాస్తుల సంఖ్య నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 26.9 శాతం తగ్గిందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ సంవత్సరం కేవలం 358,737 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి - ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 480,000లతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2025 లో 470,342 అర్హత గల రిజిస్ట్రేషన్లు 343,981 చేరాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ దరఖాస్తుల 308,613గా ఉంది.ప్రత్యేక లబ్ధిదారులు 442,000 నుండి 339,000 కు తగ్గారు ఒక్కో దరఖాస్తుదారుని సగటు రిజిస్ట్రేషన్లు 1.06 నుండి 1.01 కి తగ్గాయి. బహుళ రిజిస్ట్రేషన్లు కలిగిన లబ్ధిదారుల తరపున కేవలం 7,828 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా గత ఏడాది ఈ సంఖ్య 47,314గా ఉంది. అయితే, పాల్గొనే కంపెనీల సంఖ్య 57,600 వద్ద సాపేక్షంగా స్థిరంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, అనిశ్చితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేసిన యూఎస్సీఐఎస్ రిజిస్ట్రేషన్ శాతం తగ్గడానికి కారణం ట్రంప్ విధానాలు, వీసా నిబంధనలు కాదని వెల్లడించింది.. మోసాలు, అన్యాయమైన రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలే కారణమని పేర్కొంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో ట్రంప్ పరిపాలనలో విధానాలు, యుఎస్ చట్టాన్ని ఒక్కసారి ఉల్లంఘించిన వ్యక్తుల వీసాలను రద్దు చేసే "క్యాచ్-అండ్-రివోక్" నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. వీసా సంబంధిత రుసుము పెంపు, ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చిందంటున్నారు టెక్ సంస్థ యజమానులు. జనవరిలో, H-1B రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి 215 కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ చర్య ముఖ్యంగా స్టార్టప్లు. చిన్న సంస్థలకు చాలాఎక్కువగా ప్రభావితం చేసిందని గ్రాడింగ్.కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెఖావత్ అన్నారు. అయితే హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, 2026లో అందుబాటులో ఉన్న 85,000 వీసాల కోసంరిజిస్ట్రేషన్ల సుమారు 3.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.చదవండి: అల్జీమర్స్ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి
క్రైమ్

సైబర్ మోసాలు పదిరకాలు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. కంటికి కనిపించకుండా వివరాలు చెప్పించుకొని మరీ బ్యాంకు ఖాతాలు ఊడ్చేస్తున్నారు. అవగాహనా లేమి, అత్యాశలే సైబర్ మోసాలకు ప్రధాన కారణాలు. మన చుట్టూ సైబర్ నేరాలకు సంబంధించిన వార్తలు నిత్యం చక్కర్లు కొడుతున్నా వాటిపై చాలా మంది ధ్యాస పెట్టడం లేదు. మాకు అంతా తెలుసులే అనే అతిధోరణితో మోసపోతున్నారు. సైబర్ మోసాలపై నమోదవుతున్న కేసులను గమనిస్తే ప్రధానంగా పది రకాల మోసాలే ఎక్కువగా జరుగుతున్నట్లు సైబర్ భద్రతాధికారులు చెబుతున్నారు. ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 1. పెట్టుబడుల పేరిట స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగాయి. తక్కు వ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశ తో ఎంతో మంది అమాయకులు సులువుగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రకటనలతో స్టాక్ మార్కెట్లో 30–40% లాభాలంటూ సైబర్ నేరగాళ్లు ఊదరగొడుతున్నారు. ఈ ప్రకటనలకు స్పందించే వారికి వాట్సాప్లో లింక్లు పంపుతూ వారు రూపొందించిన మోసపూరిత వెబ్సైట్ లలో పెట్టుబడి పెట్టిస్తున్నారు. లాభాలు వస్తున్నట్లు చూపుతూ మరింత పెట్టుబడి పెట్టేలా చేస్తున్నారు. నగదు ఉపసంహరణకు ప్రయతి్నంచినప్పు డు డబ్బులు రాక లబోదిబోమంటున్నారు. అందు వల్ల ఇలాంటి ప్రకటనలు సైబర్ మోసమని గ్రహించాలి. 2. లైక్లు.. షేర్ల పేరిట.. సోషల్ మీడియా పోస్టులను లైక్, షేర్ చేయడం వంటి సులువైన టాస్క్లతో డబ్బులు సంపాదించండంటూ ప్రకటనలిస్తూ సైబర్ ఉచ్చులోకి లాగుతున్నారు. తొలుత చిన్నచిన్న మొత్తాలు రాబడి రూపంలో చూపుతారు. అవతలి వ్యక్తి నమ్మకం పెరిగాక అసలు మోసానికి తెరతీస్తున్నారు. ఫొటోలు, వీడియోలకు లైక్, షేర్ చేస్తే అవతలి వ్యక్తులు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఈ చిన్న లాజిక్ మరవొద్దు. 3. క్రెడిట్కార్డు మోసాలు స్కామర్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ల మాదిరిగా ఫోన్ చేసి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ సీవీవీ, క్రెడిట్ కార్డు నంబర్లు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత డబ్బులు కొల్లగొడతారని గుర్తుపెట్టుకోండి.4. తప్పుగా డబ్బులు పడ్డాయంటూ.. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినట్లు మెసేజ్లు పంపుతారు. ఆ తర్వాత సైబర్ మోస గా ళ్లు ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా లో పొరపాటున జమ అయిన మొత్తాన్ని తిరిగి పంపాలంటూ డబ్బులు కాజేస్తారు. ఇలాంటి సమ యాల్లో బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోకుండా స్పందించవద్దు.5. కేవైసీ అప్డేట్ పేరిట.. మీ బ్యాంకు ఖాతా వివరాలు, పేరు చెబుతూ ఫోన్ చేస్తారు. కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. లేదంటే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా కొన్ని లింక్లు పంపి అందులో మీ బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. వారు అడిగిన వివరాలు ఇస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్టేనని గుర్తుపెట్టుకోండి.6. కస్టమ్స్ అధికారులమంటూ.. మీ బంధువులు, స్నేహితులు విదేశాల నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారని.. అది మీకు చేరాలంటే కస్టమ్స్ సుంకం చెల్లించాలని.. తాము కస్టమ్స్ అధికారులమంటూ ఎస్ఎంఎస్లు లేదా ఫోన్లు చేస్తారు. బహుమతిపై ఆశతో ఎంతో మంది సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు డబ్బు పంపి మోసపోతున్నారు. మీ పేరిట వచ్చిన పార్సిల్లో నిషేధిత వస్తువులు ఉన్నాయని.. మీపై కేసులు పెడతామని బెదిరిస్తూ ఫోన్ చేస్తారు. ఇతరులకు ఈ విషయం చెబితే మీకే చిక్కులంటూ భయాందోళనలకు గురిచేసి అందినకాడికి ఆన్లైన్లో డబ్బులు వేయించుకుంటున్నారు. అనుమానాస్పద ఫోన్కాల్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త.7. ఐటీ చెల్లింపులు, రిటర్న్ల పేరు చెప్పి.. ఆదాయపు పన్ను చెల్లింపుల పేరిట సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఐటీ శాఖ నకిలీ లోగోతో సందేశాలు పంపుతారు. పన్ను చెల్లింపుదారులకు తాము ఐటీ అధికారులమని చెప్పి.. రీఫండ్ను వేగవంతం చేయడానికి బ్యాంకు వివరాలు ఇవ్వాలంటూ ఫోన్ చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు మోసపూరితమైనవిగా గుర్తించాలి. 8. ట్రాయ్ పేరిట.. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారుల పేరిట ఇటీవల ఫోన్ చేస్తారు. మీ ఫోన్ నంబర్పై చట్టవిరుద్ధ కార్యకలాపాలు నమోదయ్యాయని.. ఉగ్రవాదులు, ఇతర నేరగాళ్ల ఫోన్ లిస్టులో మీ నంబర్ ఉందని బెదిరిస్తారు. మీ నంబర్ను ఆ లిస్టులోంచి తీసేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ పట్టుబడతారు. తీవ్రంగా ఒత్తిడి తెచ్చి అందినకాడికి డబ్బులు దండుకుంటారు. ట్రాయ్ అధికారులు ఈ తరహా ఫోన్కాల్స్ చేయరని గుర్తుంచుకోవాలి. 9. డిజిటల్ అరెస్టులు.. ఈ మధ్యకాలంలో అత్యధికంగా నమోదవుతున్న సైబర్ మోసాల్లో డిజిటల్ అరెస్టులు ప్రధానమైనవి. సీబీఐ, పోలీసు అధికారులమని వాట్సాప్లో ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. వాట్సాప్ డీపీలో పోలీస్ యూనిఫాంతో ఉన్న ఫొటోలు, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు పోలీస్ యూనిఫాంలో ఉంటూ మీ కుమారుడు అత్యాచారం, హత్య కేసులో చిక్కినందున మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామని బెదిరిస్తారు. ఈ విషయాలు ఎవరితో పంచుకోవద్దని, బయటికి వెళ్లవద్దని హెచ్చరిస్తారు. కేసు లేకుండా చేయాలంటే తాము చెప్పిన నంబర్కు డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తారు.10. ఏఐతో వలవేసి.. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సైతం మోసాలకు వాడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పంచుకొనే ఫొటోలు, వీడియోలను ఆధారంగా చేసుకొని.. ఏఐ సాయంతో వారి గొంతును అనుకరిస్తూ ఆడియోలు తయారు చేస్తారు. వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపి అత్యవసరమనో లేదా ఆసుపత్రిలో ఉన్నామనో చెబుతూ వెంటనే డబ్బులు పంపాలని అభ్యర్థిస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య
మర్రిపాలెం(విశాఖపట్నం): జ్ఞానాపురం గెడ్డ వీధికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. కిరణ్మయి (15) తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే బాలికను చెల్లెళ్లు నిత్యం ఏదో ఒక విషయంపై ఆటపట్టిస్తుండటంతో.. శుక్రవారం ఇంట్లో ఉన్న బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. కొంతసేపటికి ఆమె తాత ఇంటికి రావడంతో, అక్క ఎక్కడికో వెళ్లిపోయిందని వారు అతనికి చెప్పారు. అంతా వెతికి, చివరికి బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్మయి విగతజీవిగా కనిపించింది. వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా బాలిక తండ్రి ఎండాడలో వెల్డింగ్ పనులు చేస్తుండగా, తల్లి గౌరి నగరంలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
యలమంచిలి రూరల్(అనకాపల్లి): రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్జెండర్గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు.వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే.. దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్షిప్ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు.అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్ పీఎస్లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు.

గొంతు కోసిన కత్తి ఏమైంది?
నాయుడుపేట టౌన్(తిరుపతి): నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో జంట ఆత్మహత్య ఘటన మిస్టరీగా మారింది. లాడ్జీలో కొన్ని గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, మృతుడి గొంతు కోసిన కత్తి కనిపించకపోవడం.. మృతుల సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో తెలియక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వారి కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, ఏకొల్లు పంచాయతీ, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెందిన జమ్మల సుబ్రహ్మణ్యం, అలీయాస్ మణి, అదే గ్రామానికి చెందిన బొడిపెద్ద శీరిష వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరూ నాయుడుపేట పట్టణంలోని ఓలాడ్జీలో గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై మణి తల్లి జమ్మల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బాబి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మణి గొంతుపై కత్తితో కోసిన గాట్లు ఉండడం, అతని మృతదేహంపై నుంచే కుర్చీ వేసుకుని చున్నీతో శీరిష ఉరేసుకుని మృతి చెంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా గొంతు కొసుకునేందుకు వినియోగించిన కత్తి లాడ్జీ గదిలో ఎక్కడా లభించలేదు. మృతు లు మణి, శీరిష సెల్ ఫోన్లు సైతం లేకపోవడం మిస్టరీగా మారింది. మణి, శీరిష మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శీరిష పథకం ప్రకారమే మణికి అతిగా మద్యం తాగించి కత్తితో గొంతు కొసి హతమార్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తర్వాత ఆమె కూడా గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా లాడ్జీ సిబ్బంది వ్యవహర శైలిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. లాడ్జీలో సీసీ కెమెరాలు కొన్ని గంటల పాటు పనిచేయకపోవడంపై విచారిస్తున్నారు. మృతులు ఇద్దరూ నాయుడుపేట లాడ్జీలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు పలుమార్లు రిసెప్షన్ వద్దకు రావడం గుర్తించారు. శిరీష లాడ్జీ కిందకు వచ్చి పలువురితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు మణి, శిరీష మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.ప్రేమ జంట ఆత్మహత్య
వీడియోలు


YSRCPలో చేరిన టీడీపీ కార్యకర్తలు


జీఎస్టీ వసూళ్లలో ఏపీ తిరోగమనం


క్వాలిఫయర్-2లో ముంబైపై పంజాబ్ ఘనవిజయం


బాబూ..పేదలపై ఎందుకింత కక్ష?


ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. మీకు తగిన గుణపాఠం తప్పదు


పిఠాపురంలో తన్నుకున్న టీడీపీ - జనసేన కార్యకర్తలు


అమెరికాలో మరోసారి కాల్పులు మోత..


నిన్ను వదిలిపెట్టం.. సోమిరెడ్డికి వార్నింగ్


బెంగళూరులో BMTC బస్సు డ్రైవర్ అరాచకం..


హాస్య నటుడు అలీని అనరాని మాట అన్న రాజేంద్ర ప్రసాద్