balineni srinivasa reddy
-
‘ప్రతిసారి అలగడం, ఏడవడమే బాలినేని చరిత్ర’
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి బాలినేనికి మాట్లాడే అర్హత లేదంటూ జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ, వైస్సార్ కుటుంబం లేకపోతే నువ్వెవరవి అంటూ బాలినేనిని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిసారి ఏదో ఒక సాకుపెట్టు కొని మా మీద ఏడుస్తావు. గతంలో కూడా మా కుటుంబం మీద కుట్రలు చేశావ్. ఇప్పటికీ నీ బుద్ధిమారలేదు’’ అంటూ వెంకాయమ్మ మండిపడ్డారు.‘‘బూచేపల్లి కుటుంబంపై కుట్రలు చేసి.. ఇవాళ నువ్వే రోడ్డున పడ్డావు. వైఎస్ జగన్ను ఓడిస్తావా..? నీ తరం కాదు. 2024 ఎన్నికలో నా కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్రెడ్డి గెలవకూడదని కుట్ర పన్నావ్...? నువ్వే ఓడిపోయావు. నన్ను చైర్ పర్సన్ పదవి నుంచి దించుతావా..? నా కుర్చి టచ్ చేసి చూడు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం.. ఎవరూ అడ్డుకోలేరు.?...2004 నుంచి రాజకీయాల్లో ఉండి.. నీతిగా రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రాణాలు పోయే వరకు వైఎస్ జగన్తోనే ప్రయాణం. మా కుటుంబం మీద అభిమానంతో వైఎస్ జగన్ నన్ను జడ్పి చైర్ పర్సన్ని చేశాడు. నీకు దమ్ముంటే... నా కుర్చీ జోలికిరా..? చూస్తా.. ప్రతీ సారి వైఎస్ జగన్ మీద అలగడం.. ఎడవడమే.. బాలినేని చరిత్ర?. జిల్లాలో పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడు బాలినేని’’ అంట వెంకాయమ్మ ధ్వజమెత్తారు. -
బాలినేనిపై దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డ్డి ఫైర్
-
బాలినేని కామెంట్స్ కు అంబటి కౌంటర్
-
‘బాలినేని ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు’
సాక్షి, తాడేపల్లి: పిఠాపురం జయకేతనం సభలో పవన్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ జనసేన స్థాపించారని.. పవన్ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కాపు సామాజికవర్గంపై చంద్రబాబు అనేక దుశ్చర్యలు చేశారు. జనసేన నిర్వహణను చూసేది చంద్రబాబే. జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు మనుషులే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైంది?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పిఠాపురంలో పవన్ ఎందుకు మాట్లాడలేదు?. గతంలో బీజేపీ నేతలపై పవన్ అనేక విమర్శలు చేశారు. పవన్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడు. రాష్ట్రంలో జనసేన నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని.. పవన్ ఆయన అన్నకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని..బాలినేని శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇస్తూ.. బాలినేని శ్రీనివాస్రెడ్డి చరిత్ర ఏంటి?. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని.. ఆయన ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన బాలశౌరి కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి రావటానికి 16 ఏళ్లు పట్టింది. అదికూడా అన్ని పార్టీలు కలిస్తేనే ఆ అవకాశం వచ్చింది. వైఎస్ జగన్ ఢిల్లీని ఢీకొట్టి, పోరాటం చేసి పదేళ్లకే సీఎం అయ్యారు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘టీడీపీ కోసం పుట్టిన పార్టీ జనసేన. చంద్రబాబును కాపులు నమ్మరు. కాబట్టి జనసేన పార్టీని పవన్ చేత ఏర్పాటు చేయించారు. జనసేనను నడిపేదంతా చంద్రబాబే. రెండు పార్టీల మద్దతుతో పవన్కు 21 సీట్లు వచ్చాయి. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. జనసేనలో ఉన్నవారంతా చంద్రబాబు మనుషులు, వైఎస్సార్సీపీ బహిష్కరించిన వారే..రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయబోతున్నారో చెప్ప లేదు. ఎర్రకండువా నుండి కాషాయ రంగు వేసుకునే వరకు పవన్ వచ్చారు. అసలు ఎప్పుడు ఏ వేషం వేస్తారో జనానికి అర్థం కావటం లేదు. ఏ వ్యూహం, సిద్దాంతం లేకుండా మారిపోతున్న వ్యక్తి పవన్. జనసేన నేతలంతా ఇసుక, మద్యం దోపిడీలో మునిగి పోయారు. బియ్యం, విజిలెన్స్, దాడులు, డబ్బులు.. ఇదే పనిలో ఒక మంత్రి ఉన్నారు. ఇంత దోపిడీ చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారు?అధికారం, సినిమా గ్లామర్ ఉన్నందున జనం వస్తారు. అంతమాత్రానికే ఏదేదో ఊహించుకోవద్దు. పవన్ సీఎం అయ్యే అవకాశం లేదని కాపులకు సినిమా క్లయిమాక్స్ లో తెలుస్తుంది. నాగబాబుకు కొత్తగా ఎమ్మెల్సీ వచ్చేసరికి ఏవేవో కలలు కంటున్నారు. ఎన్నికలలో అవసరం తీరాక వర్మను తరిమేశారు. వర్మకి కనీసం మర్యాద అయినా ఇవ్వండి. పిఠాపురాన్ని మీ అడ్డా అనుకోవద్దు. ఉత్తరాది అహంకారం అంటూ అవకాశం వాద రాజకీయాలు చేయటం పవన్కే చెల్లింది’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
బాలినేని.. జగన్ గురించి మాట్లాడే స్థాయేనా నీది?
ప్రకాశం, సాక్షి: జనసేన ఆవిర్భావ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. వైఎస్సార్సీపీ ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించడమే.. అడ్డగోలుగా అకమార్జనకు పాల్పడ్డారని, పైగా కోవర్టు రాజకీయాలతో బాలినేని పార్టీని ఘోరంగా దెబ్బ తీశారని వైఎస్సార్సీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాలినేని.. నీ మంత్రి పదవి త్యాగం చేశావా?. కనబడ్డ భూమి అంతా కబ్జా చేశావ్. ఒంగోలులో బ్రాహ్మణుల భూమి కాజేశావు. వేల కోట్ల రూపాయలతో సామ్రాజ్యం నిర్మించుకున్నావ్. నీ చరిత్ర ఏంటో మొత్తం ప్రకాశం జిల్లాకి తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ద్వారానే కదా నువ్వు వైఎస్సార్కు బంధువైంది. అలాంటిది జగన్ వెంట నడవడానికే నెలల తరబడి ఆలోచించావు కదా?. నువ్వు ఆస్తులు అమ్ముకున్నావా?. మీ నాన్న ఆస్తి ఎంత ఉంది.. ఎక్కడ అమ్మావు?. కోట్ల రూపాయల ఖర్చు చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రష్యా వెళ్తావు. కాసినోకు వెళ్తా అని నువ్వే చెప్పావు.. బహుశా ఆస్తి అంతా అక్కడే పోగొట్టావా?. మొదటి నుండి నువ్వొక టీడీపీ కోవర్టువి. ఆ పార్టీలో కుదరక పోవడంతోనే జనసేనలో చేరావ్. నీలాంటి వాడికి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(Jagan Mohan Reddy) గురించి మాట్లాడే స్థాయి ఉందా?’’ అంటూ వైస్సార్సీపీ ఒంగోలు ఇంచార్జ్ కామెంట్స్ చుండూరి రవి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ఓటమికి బాలినేనే కారణమని మాజీ పీడీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య ఆరోపించారు. బాలినేని గ్రూపులు చేసి పార్టీని భ్రష్టుపట్టించారు. ఇక్కడి విషయాలు జగన్ దాకా చేరకుండా అడ్డం పడ్డారు. ఇప్పుడు ఆయన పార్టీని వీడాక స్వేచ్ఛగా ఉంది. అధికారం అనుభవించి కోట్లు పోగేసుకున్న బాలినేని.. ఇప్పుడు ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారాయన. -
Chevireddy Reddy: పవన్ పిఠాపురం ఎందుకెళ్లాడు ?
-
బాలినేని జనసేనలోకి వెళ్లినా వదలను.. టీడీపీ నేత వార్నింగ్
సాక్షి, ప్రకాశం జిల్లా: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి చేరిక కూటమిలో చిచ్చు రేపుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ సమక్షంలోనే టీడీపీ నేత ఎద్దు శశికాంత్ రెచ్చిపోయారు. బాలినేని శ్రీనివాస్రెడ్డి జనసేనలోకి వెళ్లినా వదలనంటూ బెదిరింపులకు దిగారు. బాలినేని జనసేనలోకి చేరడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేపోతున్నారు. ఎవరిని అడిగి బాలినేనిని జనసేనలోకి చేర్చకున్నారంటూ ప్రశ్నించారు.వాడు వీడు అంటూ బాలినేనిపై శశికాంత్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు భాగస్వామ్య పార్టీల మనోభావాలు గౌరవించాలి. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నామన్నది పవన్ కల్యాణ్ గుర్తుంచుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలినేనికి జనసేన కండువా వేస్తే మా రక్తం మరిగింది. కూటమిలో ఉండి తమను సంప్రదించాలన్న ఇంగితం కూడా లేదా?. ఓడిపోయినవాళ్లను చేర్చుకుంటే మేము కూడా మా దారిలో వెళ్తాం’’ అని తేల్చి చెప్పారు. కాగా, శశికాంత్ భూషణ్ వ్యాఖ్యలను జనసేన జిల్లా అధ్యక్షుడు ఖండించారు. పవన్పై శశికాంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు. -
ఒంగోలు: వాసన్నకు వరుస అవమానాలు!
ప్రకాశం, సాక్షి: జనసేనలో చేరకముందే ప్రత్యర్ధి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేయగా.. మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో ‘రాజకీయ సహకారం’ అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. తాజాగా.. నగరం అంతటా బాలినేని అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెబుతూ.. ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు. కానీ, నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు. మొన్న చర్చి సెంటర్లో.. ఈ మంగళవారం లాయరు పేటలో.. ఇలాగే బాలినేని వెల్కమ్ ఫ్లెక్సీలు చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. గత శుక్రవారం రాత్రి నగరంలోని చర్చి సెంటర్ వద్ద బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగు దేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది. అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. కానీ.. చంద్రబాబు ఫొటో మాత్రం ముద్రించారు. వాటినీ ఎవరో చించేశారు. గత కొద్దిరోజులుగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇప్పుడు దామచర్ల వర్గీయులు జనసేనలోకి బాలినేని వెళ్లడాన్ని భరించలేకపోతున్నారు. మరోవైపు.. భవిష్యత్తులో జనసేనలోనూ బాలినేని వల్ల వర్గపోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఫ్లెక్సీల చించివేత వ్యవహారాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం. -
‘బాలినేని.. నిన్ను వదల’
ఒంగోలు టౌన్/టంగుటూరు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కలిసిన బాలినేని ఆ పారీ్టలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒంగోలు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. మొదట్నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల ఇప్పుడు ఒక కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. శుక్రవారం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఫొటో కూడా ముద్రించడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వారి్నంగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆలూ లేదు సూలు లేదు అన్నట్లు ఇంకా పారీ్టలో చేరక ముందే ఇలా ఉంటే రానురాను ఈ ఇరుపార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో చూడాలి.ఏ పార్టీలోకి వెళ్లినా వదలను..: ఎమ్మెల్యే దామచర్ల బాలినేని వంటి అవినీతిపరుడిని ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేదే లేదని, అతనిని, అతని కుమారుడిని చట్టపరంగా శిక్షిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం, ఒంగోలులో టీడీపీ శ్రేణులు, నాపై బాలినేని 32 కేసులు పెట్టారు, మా నాయకుడు చంద్రబాబుని కూడా దూషించారు, అధికారం పోయి వంద రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారు. జనసేన పార్టీలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలను బయటకు తీస్తాం, వాటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పారీ్టలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం..’’ అని దామచర్ల జనార్దన్ అన్నారు. నేనెప్పుడూ కాంప్రమైజ్ కాను.. బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ‘‘నేనెప్పటికీ కాంప్రమైజ్ కాను. జనసేన ఫ్లెక్సీలు ఎవరు వేశారో నాకు తెలియదు. ఆయన బొమ్మేశారని తీసేయమన్నాడంటా, సంతోషమే... ఆయన బొమ్మ వద్దంటే తీసేద్దాం’’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన కామెంట్స్పై వివరణ ఇచ్చారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడని, జనసేన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అడిగానని, అంతకుమించి తానేమీ మాట్లాడలేదన్నారు. దానిమీద కూడా ఆయన అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తాను జనసేనలోకి వెళ్లడం ఇష్టం లేకనే రెచ్చగొట్టేందుకు కావాలని ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడో చూస్తానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని విన్నానని, అంతపనికి రాదు... ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రశ్నించేందుకే జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఇప్పుడు కూడా ఏదైనా తప్పులు జరిగితే తాను ప్రశి్నస్తానన్నారు. జనసేన పార్టీలో ఉన్న పాతవారిని, తనతో పాటు వస్తున్న వారిని కలుపుకొని జనసేన బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. -
బెడిసికొట్టిన ‘మాక్’ నాటకం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, అమరావతి: ఈవీఎంలపై సర్వత్రా నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా ‘సుప్రీం’ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మాక్ పోలింగ్తో మభ్యపుచ్చేందుకు చేసిన యత్నాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచి పోయింది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనే అనుమానాలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లో 12 కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్లను పరిశీలించటానికి బదులుగా డమ్మీ బ్యాలెట్తో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్కు నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. కాగా, ఎన్నికల సంఘం ఎస్ఓపీ ప్రకారం మాక్ పోలింగ్కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దేనని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలను రీ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు.పూర్తి వివరాలు ఇవ్వండిసుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
మాక్ పోలింగ్ వద్దు..
-
మాకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదు తేడావస్తే సుప్రీంకు వెళ్తా..
-
ఆగిపోయిన ఈవీఎంల లెక్కింపు బయటకు వచ్చిన బాలినేని
-
మాక్ పోలింగ్ వెరిఫికేషన్ ఏర్పాట్లపై బాలినేని అభ్యంతరం
-
వీవీప్యాట్ కూడా లెక్కించాల్సిందే!.. బాలినేని తరఫు ప్రతినిధుల వాకౌట్
ప్రకాశం, సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరఫున ప్రతినిధులు బయటకు వచ్చేయగా.. దీంతో అధికారులు రీ వెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు.ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో వేరిఫికేషన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని తొలి నుంచి బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు కూడా. అయినప్పటికీ అధికారులు ముందుకు వెళ్లారు. ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వేరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మరోవైపు.. రిట్ విచారణ రేపటికి..ఈవీఎంల వేరిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో బాలినేని వేసిన రిట్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. మాక్ పోలింగ్ పద్ధతి నిలిపివేసి , సుప్రీంకోర్టు ఉత్వర్వుల ప్రకారం ఈవీఎం చెక్ అండ్ వేరిఫికేషన్, వీవీప్యాట్ లెక్కింపును కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. ఈసీ మాక్ పోలింగ్ చేస్తోందని బాలినేని తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయడం సరికాదని బాలనేని లాయర్ వాదించారు. దీంతో.. ఈసీ తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపిస్తామని చెప్పడంతో విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. ఆ 12 బూత్లలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 12 బూత్లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది.డమ్మీ బ్యాలెట్ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల(అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధులు) సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. -
నేటి నుంచి ఈవీఎంల పరిశీలన
ఒంగోలు అర్బన్: ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు అందిన క్రమంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు పరిశీలించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించనున్నారు. డమ్మీ బ్యాలెట్ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. ఈ ప్రక్రియను సీసీ కెమెరా నిఘాలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నారు. -
ఈవీఎంలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ బాలినేని న్యాయ పోరాటం
-
ఈసీకి బాలినేని ఫిర్యాదు.. 19 నుంచి ‘ఒంగోలు’ ఈవీఎంల చెకింగ్
సాక్షి, ఒంగోలు అర్బన్: ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను విలేకర్లు అడగగా.. జరిగేది రీకౌంటింగ్ కాదని, డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుందని చెప్పారు.ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించనున్నట్టు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు రెండు ఈవీఎంల వంతున పరిశీలించనున్నట్లు తెలిపారు. -
బుజ్జిగాడి పచ్చపన్నాగం
నగరపాలక సంస్థలో ఆయన కీలక నాయకుడు.. ఇన్నాళ్లూ పైకి మంచోడిలా కనిపించిన ఆయన ముసుగు తొలగించి తన కపట బుద్ధిని బయటపెట్టాడు.! నాటి శాసన సభ్యుడితో సన్నిహితంగా మెలుగుతూనే ఆయన కన్నుగప్పి భూ దందాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేడు స్వార్ధప్రయోనాల కోసం వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశాడు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి తల్లి లాంటి పార్టీకే ద్రోహం తలపెట్టేందుకు సిద్ధమయ్యాడు.సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీలో పదవులు అనుభవించి..సుదీర్ఘంగా ప్రయోజనాలు పొంది.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ఎన్నో అవకాశాలిచ్చిన పార్టీని వదిలిపోవడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నమ్మిన వారిని నట్టేట ముంచడం సర్వసాధారణంగా మారింది. ఒంగోలు నగరానికి చెందిన ఓ నాయకుడి వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉంది.పార్టీలోనూ అధిక ప్రాధాన్యం..ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని సదరు నాయకుడికి పార్టీ పరంగానూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నగర పాలక సంస్థలో సభ్యుడిగా ఉంటూనే పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనైనా ఆయన కనిపించేలా కీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా నాటి శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడిగా ఉంటూనే ఆయనకు తెలియకుండా అన్ని పనులు చక్కబెట్టుకున్నాడు. తీరా సొంత పార్టీ అధికారం కోల్పోయాక పచ్చ పార్టీలో చేరేందుకు రాయ‘బేరాలు’ నెరుపుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పైకి 24 కేరట్ బంగారంలా కనిపిస్తాడు కాని నిజానికి అసలు సిసలు కల్తీ బంగారమని తనకు తానే రుజువు చేసుకుంటున్నాడు.కేసుల నుంచి తప్పించుకునేందుకేనా?ఒంగోలు నగరంలో భూ కబ్జాలపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు వాటిని నాటి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అంటగట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే భూకబ్జాలు, నకిలీ పట్టాల సృష్టికర్తల వివరాలు బట్టబయలు చేయడం ద్వారా టీడీపీ నేతల విమర్శలను బాలినేని తిప్పికొట్టారు. అదే సమయంలో భూకబ్జా ఆరోపణలపై బాలినేని సిట్ విచారణకు నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీపైనా ఒత్తిడి తీసుకొచ్చి పట్టుబట్టి మరీ ‘సిట్’ వేయించారు. సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టొద్దని మీడియా ముఖంగా బాలినేని స్పష్టం చేశారు. భూ కబ్జాలపై ఇప్పటికీ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరు నాయకుడు తన భూ దందాల గుట్టు బయటపడుతుందనే భయంతో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.పక్కాగా సేఫ్ గేమ్..సదరు నాయకుడు ఎలాగైనా భూ కబ్జాల కేసుల నుంచి బయటపడేందుకు ఎన్నికలకు ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో తన బంధువులను, సన్నిహితులను టీడీపీలోకి పంపేశాడు. ఒక వేళ అధికారం కోల్పోతే టీడీపీలోకి వెళ్లిన వారి సాయంతో తాను ఆ పార్టీకి వెళ్లిపోవచ్చనే పథకాన్ని రచించాడు. తన సేఫ్ గేమ్లో భాగంగా టీడీపీలోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. తనతో పాటు నగరపాలక సంస్థలో ఉన్న కార్పొరేటర్లు, మరికొంత మంది వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులను తీసుకొస్తానని పచ్చపార్టీ ముఖ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది.తాయిలాలు..బెదిరింపులు:తనతో పాటు పార్టీ మారాలంటూ సదరు నాయకుడు సహచర కార్పొరేటర్లతో రాయబారం నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తనతో పాటు టీడీపీలోకి వస్తే ఆర్థికంగా బాగుంటుందని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులకు తెరతీసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు నాయకుడి వ్యవహారాన్ని వైఎస్సార్ సీపీ కేడర్ అసహ్యించుకుంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని దెబ్బ తీయాలని చూస్తున్న అతడి చర్యలను ఖండిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దేనికైనా సిద్ధమే దామచర్ల కు బాలినేని వార్నింగ్
-
దామా.. అంతా డ్రామా జనం చిత్రవధ
కుట్రలూ..కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి నేతల వరకూ అదేతీరు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఊరచెరువు ప్రాంతంలోని ముస్లింలపై ప్రతాపాన్ని చూపారు. నగరంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా న్యాయపరమైన అవరోధాలు కల్పించారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం ఆ తర్వాత మొండిచేయి చూపడం ఆయనకు అలవాటేఒంగోలు సాక్షిప్రతినిధి: తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యవహార శైలితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన పాల్పడిన అక్రమాలు ఎన్నో ఉన్నాయి. పుష్కరకాలంగా దామచర్ల కుట్రలు, కుతంత్రాలకు సాక్ష్యంగా పలు సంఘటనలు నిలుస్తున్నాయి. ఆయన సొంత సామాజిక వర్గం నేతల్ని మినహా మిగతవారందరినీ అవసరాలకు తగ్గట్టుగా వాడుకుని వదిలేస్తారన్నది బహిరంగ రహస్యం. 2012 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల పోటీకి దిగారు. ఆ నాటి నుంచి నేటి వరకూ నగరంలో జరిగిన సంఘటనల్లో ప్రధానమైనవి పరిశీలిస్తే నియోజకవర్గానికి ఎంత నష్టం జరిగిందో అవగతమవుతుంది.👉 2012 ఉప ఎన్నికల సమయంలో 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సొంతంగా మినరల్ వాటర్ ప్లాంటు పెడుతున్నట్లు డ్రామా ఆడారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కేటాయించిన నివాస ప్లాట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా. దీంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి రాగానే మినరల్ వాటర్ ప్లాంటు పెడతామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అక్కడ మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు కాలేదు.👉 ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలుకు మంచినీటి పైపులైను నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. సమయంలో ప్రైవేటు స్థల యజమానికి పరిహారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో పనులు నిలిచిపోయాయి. మరో వైపు నరగపాలక సంస్థ రూ.70 కోట్లు భాగస్వామ్యంగా వ్యయం చేయాల్సి ఉంది. అయితే కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చుచేసి కమీషన్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉 నగరంలో రెండో కేంద్రీయ విద్యాలయం అవసరం ఉందని అప్పట్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర మానవవనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక ప్రభుత్వ భవనాల సముదాయంలో రూములు కూడా తాత్కాలికంగా కేటాయించారు. సొంత భవనం నిర్మాణం కోసం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి శిథిలమైన క్వార్టర్లు ఉండే భాగాన్ని ఎంపిక చేశారు. కానీ ఆ స్థలాన్ని కేటాయిస్తే వైఎస్సార్ సీపీకి మంచి పేరువస్తుందని కుట్రలు పన్ని అడ్డుకున్నారు దామచర్ల.👉 రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వం సూచించింది. అందుకుగాను ఎన్టీయార్ సుజల పథకం అని నామకరణం చేశారు. అందులో భాగంగా ఒంగోలులో కూడా కేశవరాజుకుంటలో ఒక నివేశన స్థలంలో ప్లాంటు అయితే ఏర్పాటు చేశారు కానీ చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. పేరుకు మాత్రం 20 లీటర్ల నీరు రూ.2లకే అని పేర్కొన్నారు. అందులోనూ తిరకాసే. ఖర్చు దాతలది...ప్రచారం ప్రభుత్వానికి కావడంతో దాతలు ముందుకు రాలేదు.👉 ప్రస్తుత మినీ స్టేడియం పక్కన ఉన్న జెడ్పీ ప్రాంగణాన్ని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించాలంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అందుకు తిరస్కరించడంతో జైకా నిధులతో నిర్మిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్యాలయంపై కన్ను పడింది. కార్యాలయ భవన నిర్మాణ పనులను అడ్డుకుని నానా యాగీ చేశారు. నేటికీ పునాది దశలోనే ఆ నిర్మాణం దర్శనమిస్తోంది.👉 వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలమిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా యరజర్ల వద్ద 25 వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి శాటిలైట్ సిటీ నిర్మించాలని బాలినేని యత్నిస్తే దానిని కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నారు. పేదలకు ఎలాగైనా సొంతిళ్లు నిర్మించాలని బాలినేని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారులు పక్కాగా ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేశారు. సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇస్తే అవి దొంగపట్టాలంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. ఈ స్థలాలపై కూడా న్యాయపరమై ఇబ్బందులు కలిగించేందుకు యత్నిస్తూనే ఉన్నారు.👉 సంతనూతలపాడు, కొప్పోలు చెరువులను సమ్మర్ స్టోరేజీ ట్యాంకులుగా ఏడాది కాలంలో నిర్మిస్తానని ఎంఎల్ఏగా గెలిచిన మొదటి పర్యటలోనే ప్రజలకు దామచర్ల హామీ ఇచ్చారు. కానీ ఆయన పదవీ కాలం పూర్తయ్యేనాటికి కూడా కనీసం వాటివైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు.👉 స్థానిక బైపాస్లో విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం వద్ద నుంచి లీజుకు తీసుకున్నారు. దాని ప్రకారం అందులో నిర్మాణం ప్రారంభించాల్సి ఉన్నా అది ప్రారంభం కాకపోవడంపై దాతలు దొరక్కే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.👉 స్థానిక కేశవరాజు కుంటలో పెళ్లి కానుక పేరుతో ధనికులైన, తెల్లకార్డు కూడా లేని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లకు ఎన్ఎస్పీ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి మరీ అప్పగించిన చరిత్ర దామచర్లదే. చివరకు ఈ వ్యవహారంపై తిరగబడ్డ సమీప కాలనీవాసులైన మహిళలపై పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టించి పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లిన ఘనత దామచర్లదే.👉 దామచర్ల తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని డ్రైవింగ్ లైసెన్స్, టూ వీలర్ కాగితాలు చూపించాలని ట్రాఫిక్ ఎస్సై మహేష్ కోరినందుకు ట్రాఫిక్ పోలీస్స్టేషన్నే ముట్టడించారు.బాబు మెప్పుకోసం..తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలు ఊరచెరువుపై చంద్రబాబు కన్నుపడింది. ఆ స్థలంలో భువనేశ్వరి హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ఆ భూమిని లీజుకు కేటాయించేందుకు యత్నాలు జరిగాయి. అప్పటి టీడీపీ మున్సిపల్ పాలకవర్గం అనుమతి కూడా ఇచ్చేసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అడ్డుతగలడంతో అది కాస్తా ఆగింది. తిరిగి 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు కన్ను మరోమారు ఆ ప్రాంతంపై పడింది. అధినేతను ప్రసన్నం చేసేందుకు దశాబ్దాలుగా ఊరచెరువు ఒడ్డున ఇనుపరేకులు, చెక్క వస్తువుల తయారీ దుకాణాలు ఏర్పాటు చేసు కుని పొట్టపోసుకుంటున్న ముస్లిం కుటుంబాలపై ప్రతాపాన్ని చూపారు దామచర్ల. రంజాన్ మాసం అని కూడా చూడకుండా వారి షాపులను కూల్చివేయించారు. దానిని హస్తగతం చేసుకోవాలని యత్నించినా బాలినేని ముస్లింలకు అండగా నిలిచారు. దీంతో నేటికీ వారి దుకాణాలు అక్కడే ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు అరాచకాలకు పాల్పడి నేడు ఎన్నికలు సమయం వచ్చేసరికి ముస్లింలకు అండగా ఉంటానంటూ ప్రవచనాలు వల్లిస్తున్నారు.జెడ్పీ పీఠంపైనా కుట్రే..2014 సాధారణ ఎన్నికలకు కొద్ది ముందుగా జిల్లా ప్రజాపరిషత్కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 31 ప్రాదేశికాలను కై వసం చేసుకుంటే టీడీపీ 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు అభ్యర్థులను కొనుగోలు చేయడం ద్వారా, మరో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఎన్నికకు హాజరుకాకుండా పోలీసుల అండగా యత్నించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ తదితరులు అడ్డుకట్ట వేశారు. అయితే ఈదర హరిబాబు జెడ్పీ చైర్మన్గా ఎంపిక కావడం ఇష్టంలేని దామచర్ల చివరకు ఆయనను జెడ్పీ చైర్మన్ స్థానంలో కొనసాగకుండా చేసేందుకు ఎంతోమందిపై ఎన్నోరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు.కాపులపైనా కేసులుఅధికారంలో ఉన్నప్పుడు కాపులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జనార్దన్ నేడు జనసేన పొత్తు కలవడంతో కుల రాజకీయాలకు తెరతీశారు. నేతలను తమ వైపునకు తిప్పుకుంటే ఓట్లు వాటంతట అవే పడతాయనే భావనతో నేతలపై ఆకర్ష పథకాన్ని ప్రారంభించారు. నాడు కాపు సోదరునిపై గంజాయి కేసు పెట్టించారు. అంతే కాదు ముద్రగడపై టీడీపీ ప్రభుత్వ దమన కాండను నిరశిస్తూ కంచాలు మోగిస్తే దానిపై సైతం కేసులు పెట్టించిన విషయాన్ని కాపులు మర్చిపోలేదు. ఇలా అన్ని రకాలుగా నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన దామచర్లను జనం ‘నిన్ను నమ్మం’ బాబూ అంటున్నారు. -
దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు యుక్తాయుక్త విచక్షణ మరిచి ‘రాళ్లతో కొట్టండి.. కర్రలతో బాదండి..’ అని సెలవిస్తే పచ్చదండు ఊరుకుంటుందా? ‘నిన్ను చంపితే ఏం చేస్తావ్..’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నేతల గత వైఖరిని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ‘ఓటు వేయకుంటే పోటు.. అడ్డు తగిలితే వేటు’.. స్థూలంగా చెప్పాలంటే టీడీపీ సిద్ధాంతం ఇదే. ప్రజల ఆశీస్సులతో గద్దెనెక్కాలనే ఆలోచనకే తావు లేకుండా తమకు తెలిసిన ‘దండన’ విద్యనే పచ్చ నేతలు నమ్ముకున్నారు. నిత్యం తగువులే తలంపుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పారీ్టల నాయకులు, కార్యకర్తలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో టీడీపీ నేతల వికృత క్రీడకు బలైన రాజకీయ నాయకులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారు. అంతకు పది రెట్ల మంది అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చుపెట్టడమే కాకుండా తమ అహానికి, అవినీతికి అడ్డు వస్తున్నారనే కారణంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు మళ్లీ బరితెగించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని పచ్చమూకలు రెచ్చిపోయాయి. పల్లెల్లో దాడులకు తెగబడ్డాయి. తమకు అడ్డువస్తే అంతమొందించడమే లక్ష్యంగా రెచ్చిపోయాయి. నేడు అధికార పక్షంపై వికృత రాతలతో శునకానందాన్ని పొందుతున్న పచ్చమీడియా నాడు కళ్లుండి చూడలేదని కబోదుల్లా చోధ్యం చూశాయి. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అరాచకాల్లో కొన్ని ప్రధాన ఘటనలు ఎంపీటీసీ భర్తను చంపారు 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపూడి మండలం కెల్లంపల్లి సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా తేలుకుట్ల గురవమ్మ పోటీ చేశారు. ఏప్రిల్ 11న గోసుకొండ అగ్రహారంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడటంతో గురవమ్మ భర్త వెంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒంగోలులో చికిత్స ΄పొందుతూ మృతి చెందారు. ఏడాది వ్యవధికే దిగులుతో గురవమ్మ కూడా కన్నుమూసింది.దాడులకు అంతే లేదు..పీసీపల్లిలో 2017 జూలైలో వైఎస్సార్ సీపీ ఎంపీపీ బత్తుల అంజయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. 2015 ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నారాయణ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై ప్రశ్నించిన అప్పటి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్తోపాటు మరో ఏడుగురిపై అక్రమంగా కేసులు బనాయించారు. కొండపి నియోజకవర్గంలో అయ్యప్పరాజుపాలెంలో ఎంపీటీసీ ఎన్నికల రోజున ఐదుగురిపై దాడి చేసి గాయపరిచారు. జరుగుమల్లి మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయబాబుపై టీడీపీ నేతలు దుర్మార్గంగా రేప్ కేసు పెట్టించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో సాధారణ ఎన్నికల సమయంలో వెంకట్రావు అనే వ్యక్తి ఏజెంట్గా కూర్చున్నాడని అతనికి చెందిన రూ.5 లక్షల విలువ చేసే పొగాకును టీడీపీ నాయకులు తగలబెట్టారు. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సమయంలో టీడీపీ బరితెగించింది. మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డి ఓటింగ్లో పాల్గొనకుండా చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పేరుతో అరెస్టు చేయించారు. గాజులపల్లెలో దాష్టీకం2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని పుల్లలచెరువు మండలం మర్రివేముల నుంచి ఆ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో గాజులపల్లెలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను రెచ్చగొట్టడమే కాకుండా మర్రివేముల నుంచి 100 మంది టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్లి దమనకాండ సృష్టించారు. ఇళ్లలోకి చొరబడి ఆడామగా తేడా లేకుండా బయటకు లాక్కుని వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు. బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల సొమ్ము లూటీ చేశారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని కాలితో తన్నడంతో ఆమెకు అబార్షన్ చేయాల్సి వచ్చింది. మమ్ము చిన్న అంజయ్య అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఎముకలన్నీ విరిగి ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. సుమారు పది వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పురుగుమందు డబ్బాలు తెచ్చి కొందరిపై పోసి రాక్షసానందం పొందారు. రాళ్లదాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త బలి పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామంలో 2018 సెపె్టంబర్లో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రంగునీళ్లు చల్లి రెచ్చగొట్టారు. మరుసటి రోజు ఉదయం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కొందరు బహిర్భుమికి వెళ్లి వస్తున్న సమయంలో మాటువేసిన టీడీపీ నాయకులు కొందరు ఇంటిపైకి ఎక్కి ఒక్కసారిగా ఇటుక రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎనిమిరెడ్డి పెదబ్రహ్మయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.రెచ్చగొట్టి.. అక్రమ కేసులు పెట్టి.. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో ఆలూరి శ్రీహరి ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని 2019లో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ పెట్టడమే కాకుండా, బూతులు తిడుతూ.. తొడలు చరుస్తూ టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దాడికి దిగడమే కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్రెడ్డి, మరికొందరిపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టించారు. కమ్మపాలెంలో దళితులు నివసించే ప్రాంతాల్లో డ్రెయినేజీ, రోడ్లు, పబ్లిక్ టాయ్లెట్కు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా టీడీపీ నేతలు అడ్డుపుల్ల వేశారు. కమ్మపాలెంలో 119 మంది దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లోకి వారిని వెళ్లనివ్వకుండా దామచర్ల అడ్డుకున్నారు. దళితులు మొత్తుకుంటున్నా వినకుండా ఆ స్థలంలో గుండా డ్రెయినేజీ నిర్మించి జులుం ప్రదర్శించారు. ఒంగోలు సమతా నగర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారానికి ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలిన పచ్చ మందలో మేడికొండ మోహన్రావు, ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చౌదరి, ఆయన భార్య కీలకంగా ఉన్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఏఆర్ కానిస్టేబుల్ భార్య మాట్లాడిన బూతులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయిన రోజున బండ్లమిట్టలోని దుకాణాలపై టీడీపీ నేతలు తెగబడ్డారు. ఓ ముస్లిం యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా, దుకాణం షట్టర్ మూతవేసి హల్చల్ చేశారు. గాయపడిన ముస్లిం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో కీలక సూత్రధారి, సమతానగర్లో రచ్చకు కారణమైన మేడికొండ మోహన్రావే. నగరంలో రాజకీయ ఘర్షణలు ఎక్కడ జరిగినా మోహన్రావు పేరే ప్రధానంగా వినిపిస్తోంది. మోటా నవీన్ అనే ఎస్టీ యువకుడిని చితకబాది ముఖంపై మూత్రం పోసిన కేసులో నిందితుడు రామాంజనేయ చౌదరికి ఆశ్రయం కలి్పంచి పోలీసులకు చిక్కకుండా కొద్ది రోజులపాటు అడ్డుపడింది మోహన్రావే అన్న ఆరోపణలున్నాయి. దాడి కేసులో జైలుకు వళ్లి వచ్చిన మోహన్రావును ముందు పెట్టి దామచర్ల జనార్దన్ ఆడిస్తున్న డ్రామాలను ఎల్లో పత్రిక ప్రముఖంగా ప్రచురించడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
ABN కి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్ పై రాళ్ళు...బాబు హస్తం జాగ్రత్త పవన్
-
సీఎం జగన్ కంటికి తగిలి వుంటే.. బాలినేని వార్నింగ్
-
కావాలనే సీఎం జగన్ ను టార్గెట్ చేశారు: బాలినేని
-
చాలా ఓర్పుతో ఉన్నాం...మీరు ఎన్ని దాడులు చేసిన 150 సీట్లు పక్కా..
-
తప్పుడు కేసులు పెడితే ఊరుకోను మాజీ మంత్రి బాలినేని ఫైర్
-
పోలీసులు ఓవర్ యాక్షన్ బాలినేని ఆగ్రహం
-
ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్.. బాలినేని ఆగ్రహం
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు సమతా నగర్ ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. తెల్లవారు జామున 4 గంటలకు వైస్సార్సీపీ కార్యకర్తలు ఇండ్లలోకి వెళ్లి పోలీసులు భయబ్రాంతులకు గురి చేశారు. ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపడ్డారు. తనను కూడా అరెస్ట్ చేయండంటూ వన్ టౌన్ పీఎస్కి బాలినేని వెళ్లారు. ఒంగోలు నగరంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. తప్పులు చేయడం.. ఆ నెపాన్ని అధికార వైఎస్సార్ సీపీపై నెట్టేయడం వారికి రివాజుగా మారింది. ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అండ్ కో అలజడి సృష్టించారు. పక్కా ప్లాన్ ప్రకారం అధికార వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు పన్నాగం పన్నారు. అది బెడిసికొట్టేసరికి ఎదురుదాడికి దిగారు. బుధవారం రాత్రంతా హంగామా సృష్టించారు. ఓటమి భయంతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేలా పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని వాస్తవాలు వక్రీకరిస్తూ రెచ్చిపోయారు. మహిళ అని చూడకుండా ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. అసలు జరిగింది ఇదీ.. పార్టీ ఏదైనా తోటి మనిషి పట్ల సంస్కారవంతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య అన్నారు. నగరంలోని 37వ డివిజన్ సమతానగర్ 4వ లైన్లో శ్రీకావ్య, మరోచోట బాలినేని శచీదేవి వేర్వేరుగా గురువారం మహిళలతో మమేకం–సీ్త్రశక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన సమతానగర్ ఘటనపై బాలినేని శ్రీకావ్య మీడియాతో మాట్లాడారు. తాము ఓట్లు అభ్యర్థించడానికి వచ్చామని, వచ్చిన వారిని అవమానించడం మాత్రం సంస్కారం కాదని అన్నారు. బుధవారం జరిగిన ఘటనలో గేటు వేసి తమను లోపలకు రానివ్వకపోగా తమతో పాటు ఉన్న గర్భిణీ అయిన రాజీనామా చేసిన వలంటీర్పై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. తాము అవతలివైపు ఉన్న నాలుగు ఇళ్లకు వెళ్లి వస్తామని, ఇక్కడే ఉండమని గర్భిణీకి చెప్పామన్నారు. తాము అక్కడకు వెళ్లి వచ్చేసరికి ఆమెతో టీడీపీ వర్గీయులు గొడవపడుతుండటంతో ఎందుకు ఇలా చేస్తున్నారని తాము మాట్లాడామన్నారు. దానికి అవతలి టీడీపీ మహిళ వినలేని, చెప్పలేని బూతు పదజాలంతో మాట్లాడిందని, అవి మహిళలుగా తాము చెప్పలేని పదాలని అన్నారు. చివరకు పైనుంచి వాళ్ల కుమార్తె వీడియో తీస్తుండటంతో.. ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించగా, ఆమె మాట్లాడిన మాటలు కూడా తట్టుకోలేకుండా ఉన్నాయన్నారు. విషయం తెలుసుకుని మా వద్దకు వచ్చిన మా మమయ్య బాలినేని శ్రీనివాసరెడ్డికి పూర్తి విషయం చెప్పకుండా తామే సర్దిచెప్పి పంపామన్నారు. కానీ, వారు మళ్లీ తమ పక్కన ఉన్న మహిళల పట్ల కూడా అవమానకరంగా మాట్లాడి రెచ్చగొట్టారన్నారు. వారు వీడియో తీస్తూనే ఉన్నారని, తమను మెట్ల వద్దనే అడ్డుకున్నారని, అలాంటప్పుడు తాము వారుండే పైఅంతస్తులోని ఇంట్లోకి ఎలా వెళ్లగలమని అన్నారు. తమకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటు వేయమని చెప్పినా పర్వాలేదని, కానీ, అసభ్యపదజాలంతో దూషిస్తే మాత్రం సహించమని అన్నారు. మన ఇంటికి వచ్చిన వ్యక్తితో నవ్వుతూ మాట్లాడటం అనేది సంస్కారమని, వైఎస్సార్ సీపీ వాళ్ల ఇళ్లకు కూడా టీడీపీ వారు ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లరా అంటూ శ్రీకావ్య ప్రశ్నించారు. ముందస్తుగా ఒక పథకం ప్రకారమే వాళ్లు ఉద్రిక్తత సృష్టించి దురదృష్టకర ఘటనకు కారణంగా నిలిచారన్నారు. -
‘ఈనాడు’పై పరువు నష్టం దావా వేస్తా..
ఒంగోలు సబర్బన్: ‘పచ్చ పత్రికల్లో వెధవ రాతలు, పిచ్చి రాతలు రాస్తున్నారు. ఎవరో వెధవలు పేరు లేకుండా కరపత్రాలు వేస్తే.. ఆ కరపత్రాన్నే ఈనాడు పేపర్లో రాస్తారు. అసలు కొంచెం అయినా విలువలున్నాయా’ అని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈనాడు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒంగోలు నగరంలోని రెండో డివిజన్ ముక్తినూతలపాడులో ఇళ్ల పట్టాలు, డాక్యుమెంట్లు లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో బాలినేని, ఆయన సతీమణి శచీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఒంగోలు నగరంలోని సొంత ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలిచ్చి ఇళ్లు కట్టిద్దామనుకుంటే హైకోర్టుకు వెళ్లి అదే పనిగా ఆపేస్తున్న టీడీపీ నాయకులు, మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. అయినా సరే మేం పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీ నాయకుల కడుపు మంట అంతా ఇంతా కాదన్నారు. పట్టాల వ్యవహారాన్ని జీర్ణించుకోలేక కొత్త ఎత్తుగడలు వేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డికి క్రాస్ ఓటింగ్ చేయిస్తానని టీడీపీ వాళ్లు ఎవరో ఊరు, పేరు లేకుండా కరపత్రాలు వేస్తే.. దానిపై ఈనాడు పత్రికలో కథనంగా రాస్తారా.. అసలు ఈనాడు యాజమాన్యానికి సిగ్గుందా? అంటూ నిలదీశారు. అందుకే ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రజ్యోతి పత్రికలో షాదీఖానాను ప్రారంభించిన దానినే రెండో సారి ప్రారంభిస్తున్నానని రాశారని, ఇవేం రాతలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు వస్తే వాస్తవాలు తేలుస్తామన్నారు. చెవిరెడ్డి మాట్లాడుతూ నలుగురు చీఫ్ సెక్రటరీలు వచ్చి, సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలిస్తే దొంగ పట్టాలు అంటున్నారంటే.. టీడీపీ నేతలకు మతి పోయిందంటూ ఎద్దేవా చేశారు. వాసన్నకు తనకు అవినాభావ సంబంధం ఉందని చెవిరెడ్డి పేర్కొన్నారు. అనంతరం బాలినేని దంపతులు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు దుస్తులు పంపిణీచేశారు. -
మళ్ళీ రిపీట్ అయిందో.. ఈనాడుకు బాలినేని సీరియస్ వార్నింగ్
-
రేపు 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒకేసారి 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం ఒక చరిత్ర అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయ మీడియాతో మాట్లాడుతూ, పూరి గుడిసె లేని ఇంటిని చూడాలనిదే లక్ష్యమన్నారు. 536 ఎకరాల్లో సుమారు 25 వేల మందికి ఇంటి స్థలం లేని పేదలకు రేపు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. సీఎం జగన్ మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఈ బృహత్తర కార్యక్రమం నిదర్శనమన్నారు. కష్ట కాలంలో కూడా 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సీఎం జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటా. టీడీపీ ఇన్ని కుట్రలు చేసినా పేదల పక్షాన ముందుకెళ్తూనే ఉంటాం. సీఎం జగన్ చేతుల మీదుగా రేపు లబ్ధిదారులకు స్థల రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తాం. అలాగే 339 కోట్ల రూపాయలతో నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకి సీఎం శంకుస్థాపన చేస్తారు. పేద, మధ్యతరగతి వర్గాల పక్షాన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని, సేవను ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. -
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
-
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25 వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేని తెలిపారు. అర్బన్ లేఔట్ను బాలినేని శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు కోర్టులో పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని.. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకచోట కోర్టుకెళ్లి ఇంటి స్థలాలను అడ్డుకున్న టీడీపీ.. మరోసారి కోర్టులో పిల్ వేయడంపై బాలినేని అసహన వ్యక్తం చేశారు. ఇంత నీచ రాజకీయం నా జీవితంలో చూడలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్ -
‘పట్టాల’పై పేట్రేగితే సహించను
ఒంగోలు : ‘పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే ఎవరైనా సంతోషిస్తారు.. కానీ అందుకు భిన్నంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం ఈ ప్రక్రియను ఎలా ఆపాలా అంటూ రోజూ తప్పుడు కథనాలు రాయడం ఆశ్చర్యంగా ఉంద’ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల పట్టాల పంపిణీ కోసం రాజకీయ జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి తాను పోరాడుతున్నానని, ఇచ్చిన మాటకు కట్టుబడి కృషిచేస్తుంటే, ఎలాగైనా పట్టాల పంపిణీ నిలిచిపోయేలా కుతంత్రాలు చేస్తూ పేట్రేగితే మాత్రం సహించే ప్రసక్తేలేదని ఆ రెండు పత్రికలపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. స్థానిక నర్సాపురం అగ్రహారం–మల్లేశ్వరపురం రైతుల వద్ద నుంచి జగనన్న కాలనీ కోసం పేదలకు పట్టాలిచ్చేందుకు కొనుగోలు చేసిన భూముల్లో అభివృద్ధి పనులను ఆదివారం బాలినేని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల రాతలను తూర్పారబట్టారు. ఒక్క రూపాయి తీసుకున్నా చెప్పుతో కొట్టండి.. తానేదో రైతుల వద్ద నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు కథనాలు రాయడం ఏమిటంటూ బాలినేని మండిపడ్డారు. ఒక్క రూపాయి తాను తీసుకున్నా తనను చెప్పుతో కొట్టాలన్నారు. ఇప్పటికే భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన డబ్బులు రూ.231 కోట్లు కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమయ్యాయని.. ఇందులో ఇప్పటికే 80 శాతం మందికి నగదు కూడా జమచేశారన్నారు. ఆదివారం కూడా 29 మందికి జమచేసినట్లు తెలిపారు. మిగిలిన కొంత భూమికి సంబంధించిన వివాదాలు ఉండడంతో వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని బాలినేని చెప్పారు. రోడ్లు, విద్యుత్, గుడి, బడి, పార్కులు ఇలా అన్ని రకాల మౌలిక వసతులతో ఒక సిటీని నిరి్మస్తున్నామన్నారు. రైతులు కూడా ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇళ్లు కూడా మంజూరు చేయిస్తా.. ఇక ఈనెల 20 నుంచి 25లోగా 25 వేల మందికి సీఎం వైఎస్ చేతుల మీదుగా పట్టాలను ఇప్పించడమే కాక ఇళ్లు కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తానని బాలినేని హామీ ఇచ్చారు. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు తాను ఇంతగా తాపత్రయపడుతుంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రం డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఇవ్వరంటూ అడ్డగోలుగా కథనాలు రాశారని, తీరా నేడు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయగానే కాగితాలు మాత్రమే ఇస్తారు, స్థలం చూపరు అంటూ వేరే కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లకు భూసేకరణ సమయంలో భూములను ఎలా సేకరించారో, ఇప్పుడు భూముల కొనుగోలు ఎలా జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు. అడ్డుకుంటే ముట్టడిస్తా.. ఏదో ఒక రూపంలో పేదల పట్టాలను అడ్డుకోవాలని చూస్తే మాత్రం సహించేదిలేదని, ఇంటికి ముగ్గురు చొప్పున 25 వేల పట్టాలకు సంబంధించి 75 వేల మందితో ఆ రెండు పత్రికల కార్యాలయాలను సైతం ముట్టడిస్తానని బాలినేని హెచ్చరించారు. పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని తనపై ఎన్ని కేసులు పెట్టినా డోంట్ కేర్ అని స్పష్టంచేశారు. సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్రావు తదితరులు ఉన్నారు. నేను పార్టీలోనే ఉంటా.. అనంతరం.. టంగుటూరు మండలం అనంతవరం గ్రామంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ సచివాలయ సముదాయాన్ని మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తో కలిసి బాలినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిమూలపు సురే‹Ùను కొండపి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పారు.. పార్టీ తల్లిలాంటిది.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే.. అధికారం ఉంటేనే ఏ పనైనా చేసుకోగలం. మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయితే చాలు. నా గుండె నుంచి వస్తున్న మాటలివి. నేను పార్టీలోనే ఉంటాను’’ అని బాలినేని స్పష్టంచేశారు. జగనన్న నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. -
వ్యక్తిగతంగా తిట్టమని చెప్పడం తప్పు: విజయసాయిరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: బాలినేని శ్రీనివాస్రెడ్డికి ఎలాంటి సమస్య లేదని.. పార్టీలో ఆయన అత్యంత విలువైన నాయకుడని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజనల్ కోర్దినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యం తగ్గదని, బాలినేని స్థానం ఆయనకు ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో నాలుగో జాబితా ఉంటుందన్నారు. ‘‘చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది.. ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహ ఎలక్షన్ కమిషన్కు వివరించాం. రాజకీయ పార్టీలలో విమర్శలు-ప్రతి విమర్శలు సహజం. కానీ.. పార్టీ అధినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించవలసిన బాధ్యత ఉంది. తిట్టమని చెప్పడం తప్పు. మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ ఆ పదాన్ని ఎందుకు వాడుతుందో తెలియదు. కావాలనే వాళ్లంతా దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ విజయసాయి ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: మాకు అంత కర్మ పట్టలేదు: మంత్రి రోజా -
చంద్రబాబుపై బాలినేని ఫైర్
-
‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్పై వచ్చి పరామర్శించాడా?’
సాక్షి, ప్రకాశం: గ్రేటర్ హైదరాబాద్లో సెటిలర్స్ ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది.. అదే కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ టీడీపీ వాళ్లు ఇప్పటికీ కూడా సంబరాలు చేసుకునేవాళ్లని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ‘‘తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్కి సపోర్ట్.. పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు. ఆంధ్రాలో పవన్, చంద్రబాబు కలిసి పోటీనా? వీళ్లకు నైతికత లేదు. వీళ్ల అనైతిక పొత్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. బాపట్లకి సీఎం వస్తే అసత్య ప్రచారాలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్పై వచ్చి పరామర్శించాడా? తుపానుకు సంబంధించి సీఎం జగన్ ముందుగానే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు కాబట్టే ప్రజలు సంతోషంగా ఉన్నారు’’ అని బాలినేని పేర్కొన్నారు. గతంలో వర్షం వస్తే ఒంగోలు జలమయమయ్యేది.. కానీ ఇప్పుడు చుక్కనీరు కూడా నిలబడకుండా అభివృద్ధి చేసి చూపించాం. గుండ్లకమ్మ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే ఇప్పుడు ఈ శిక్ష. 2024లో అత్యధిక మెజార్టీతో గెలుస్తా.. మరలా సీఎం జగన్మోహన్రెడ్డి అని నిక్కచ్చిగా చెప్తున్నానని బాలినేని అన్నారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
ఏపీలో స్కీములు పక్క రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు.. అది సీఎం జగన్ గొప్పతనం..
-
ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యాత్ర
-
ఒంగోలులో సామజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు
-
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే 50 కోట్లు ఆస్తి పోతుంది
-
ప్రమాణం చేద్దామా?.. దామచర్లకు బాలినేని సవాల్
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో జరిగే అన్ని మీటింగ్లకు నన్ను పిలిచారని, మీడియా వాళ్లు అనవసరంగా ప్రతీది రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్కి అబద్ధాలు మాట్లాడటం అలవాటు. కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు డబ్బులు తీసున్నారో ప్రమాణం చేద్దామా?. చీము, నెత్తురు, సిగ్గు ఉంటే నా ఛాలెంజ్కు స్పందించు’’ అంటూ సవాల్ విసిరారు. కొత్తపట్నం బ్రిడ్జి మెటీరియల్ కొనుగోలుకు నేను రూ.40 లక్షలు ఇచ్చా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే పద్దతిగా ఉండదు’’ అని బాలినేని హెచ్చరించారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? -
నిజాయితీని నిరూపించుకున్న బాలినేని
సాక్షి, అమరావతి/ఒంగోలు: నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణల మీద మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా విచారణ కోరి తన నిజాయితీని నిరూపించుకున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదో ఒక విషయం వెలుగులోకి రాగానే దానిని అధికార పార్టీకి అంటగట్టి రాజకీయాలు చేయాలని చూడటం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. అందులో భాగంగానే నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వివాదంలోకి బాలినేనిని లాగాలని టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించి అభాసుపాలయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న బాలినేని ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ స్వయంగా పోలీసు, రెవెన్యూ అధికారులను కోరారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మలికాగర్గ్, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ విచారణ చేసి వాస్తవాలను మీడియాకు వివరించి, ఇందులో బాలినేని, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర లేదని చెప్పారని వివరించారు. దీంతో బాలినేని నిజాయితి నిరూపితమైందని, తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ అభాసుపాలైందని పేర్కొన్నారు. కంచికచర్ల ఘటనపైనా దుష్ప్రచారం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడిపై దాడి ఘటనలో నిందితుల తరఫున తాను జోక్యం చేసుకున్నట్లు టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. యువకుడిపై దాడి చాలా బాధాకరమని, తక్షణమే పోలీసులు స్పందించి దాడి చేసినవారిపై కేసు నమోదు చేయడంతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. కంచికచర్ల పోలీసులతో తాను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ చేశారు. -
బాలినేని కుటుంబానికి సంబంధం లేదు
ఒంగోలు అర్బన్/సబర్బన్: ‘నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు, ఫోర్జరీలతో ఒంగోలులో జరిగిన భూ అక్రమాలతో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ స్పష్టంచేశారు. బాలినేనిపైన, ప్రభుత్వంపైన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఒంగోలు భూదందాపై సిట్ దర్యాప్తును బాలినేని కుటుంబం ముందుకు సాగనివ్వడంలేదంటూ కథనాలు ప్రచురించటం సరికాదని చెప్పారు. బాలినేని కుటుంబం దర్యాప్తును ఎప్పుడూ అడ్డుకోలేదని అన్నారు. అవాస్తవాలను, అసత్య కథనాలను ప్రచురిస్తే అవి రాజకీయ జీవితంలో ఉండేవారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఇలాంటి కథనాలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు సరైన వివరణ తీసుకోవాలని చెప్పారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వివరాలను కలెక్టర్, ఎస్పీ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. భూ కబ్జాలపై ఒంగోలు జెడ్పీటీసీ, మేయర్ గంగాడ సుజాత, మరికొందరు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు సిట్ ద్వారా నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే బాలినేని సోదరుడు వేణుగోపాల్రెడ్డి భూమి వివాదంలో ఉందని, దాన్ని భూ కబ్జా కోవలోకి తేవటం çసరికాదని అన్నారు. ఆ భూమి 40 ఏళ్లుగా బ్యాంకు లావాదేవీల ప్రక్రియలో ఉందన్నారు. సివిల్ పంచాయితీలను కూడా భూ కబ్జాల కింద కథనాలుగా ఇవ్వడం వల్ల సిట్ దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారన్నారు. సిట్లో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పని చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ విభాగం తరఫున జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శాఖ, మార్కాపురం, కనిగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు సిట్ సబ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఫోర్జరీ, నకిలీ స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంపై ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ఒకరు సెప్టెంబర్ 28న ఫిర్యాదు ఇవ్వడంతో భూ కబ్జాల వ్యవహారం వెలుగు చూసిందని కలెక్టర్ చెప్పారు. దీనిపై విచారణ చేపట్టగా లాయర్పేటలోని ఒక ఇంట్లో పూర్ణచంద్రరావు, మరికొందరితో కూడిన బృందం ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆ ఇంట్లో మీ సేవ బ్లాంక్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు, పలు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు లభించాయన్నారు. ఇటువంటి అనేక ఫిర్యాదులు రావడంతో సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 572 డాక్యుమెంట్లు, 60 రబ్బర్ స్టాంప్లు, 1,224 జ్యుడిషియల్ స్టాంప్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మార్కాపురం, కనిగిరి పరిధిలో కూడా 5 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు ప్రభుత్వ భూముల డీకే పట్టాల విషయంలోనూ నకిలీ వ్యవహారాలు జరిగాయని తెలిపారు. ఈ దందా పన్నెండేళ్లకు పైగా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కువ కాలం ఎటువంటి లావాదేవీలు జరగని ఖాళీ స్థలాలకు నకిలీ వీలునామా, జీపీఏ వంటివి సృష్టించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఎటువంటి సమస్యలు లేని స్థలాలకు సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటిని గొడవల్లోకి తెచ్చి, కోర్టుల్లో స్టే ఆర్డర్ వంటివి పొందినట్లు కూడా తెలిసిందన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావం లేకుండా పూర్తి స్వేచ్ఛగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాలపై ఆరోపణలు చేయడం వారిని వ్యక్తిగతంగా బాధించడమే అవుతుందని చెప్పారు. విషయాలను పూర్తిగా తెలుసుకుని వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం చేయాలన్నారు. ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నామని, సిట్ బృందం వేగంగా, నిరంతరాయంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు 54 కేసులు నమోదయ్యాయన్నారు. పూర్ణచంద్రరావు బృందంలో 72 మంది ఉన్నారని, వారిలో 38 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. సిట్ దర్యాప్తుపై బాలినేని ప్రభావం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. -
టీడీపీ నేతలకి బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్
-
‘ఎల్లో మీడియా వార్తలను నేను అప్పుడే ఖండించా’
సాక్షి, తాడేపల్లి: తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను గతంలోనే ఖండించానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) సీఎం జగన్ను కలిసిన తర్వాత బాలినేని మాట్లాడుతూ..‘ ఇళ్ల స్థలాలు, నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎంతో మాట్లాడాను. భూ ఆక్రమణల మీద మా నియోజకవర్గంలో చర్చ జరిగింది. ఇవన్నీ టీడీపీ నేతలు కావాలనే ప్రచారం చేశారు. ఈ ఆరోపణలపై పోలీసు అధికారులతో మాట్లాడాను. వారిని అరెస్ట్ చేయమని చెప్తే కొంత ఆలస్యం చేశారు. అందుకని కోపం వచ్చి నా గన్మెన్లను సరెండర్ చేశాను. ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. 40 మందిని అరెస్ట్ చేశారు. పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను నేను అప్పుడే ఖండించా. పేదల ఇళ్ల స్థలాలకు సేకరించిన స్థలం మీద టీడీపీ వారు కోర్టుకు వెళ్లారు. 25వేల మందికి సరిపడా స్థలం ఇప్పుడు వేరేగా తీసుకుంటున్నాం. త్వరలోనే సీఎం జగన్ వచ్చి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. భూకబ్జాలు ఎవరు చేసినా అరెస్టులు చేయమని గట్టిగా చెప్పాం. నేను విలువైన రాజకీయాలే చేస్తాను. టీడీపీ నేత జనార్థన్ నాకు వ్యతిరేంగా వార్తలు రాయిస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద వార్తలు రాగానే ఫీలవుతున్నారు. మరి నా మీద వార్తలు రాయించినప్పుడు ఆ బాధ తెలీదా? అని ప్రశ్నించారు బాలినేని. -
ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త బాధ, విస్మయం కల్గించింది: బాలినేని
-
ఫేక్ డాక్యుమెంట్లపై ముమ్మర దర్యాప్తు
ఒంగోలు: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయరెడ్డితో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శుక్రవారం భేటీ అయ్యారు. ఒంగోలులో గత పది సంవత్సరాలకుపైగా జరుగుతున్న ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణం అంశాలపై నిష్పాక్షిక దర్యాప్తు ద్వారా నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా గురువారం సీఎంవోలో భేటీ అయిన అంశాలపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం అయ్యాయని, అందుకు గల కారణం ఏమిటనేది కూడా విచారించాల్సిన అవసరాన్ని వివరించారు. అయితే బాలినేని తెలియజేసిన అంశాలపై సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి తక్షణమే కలెక్టర్, ఎస్పీలను సీఎంవోకు పిలిపించుకుని ముగ్గురి సమక్షంలో చర్చించడం, అనంతరం ఒంగోలు నియోజకవర్గ ప్రజలు, నాయకులు బాలినేని భద్రతను దృష్టిలో ఉంచుకుని వెనక్కు పంపిన గన్మెన్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎంవో అధికారులు సూచించడంతో బాలినేని అంగీకరించారు. అలాగే ఈ వ్యవహారాన్ని తొందరగా తేల్చాలని, అవసరమైతే సీఐడీ సహకారాన్ని తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించినట్టు తెలిసింది. ఫేక్ డాక్యుమెంట్స్, భూ రిజిస్ట్రేషన్ వివాదాలను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల దృష్టికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధానంగా తీసుకెళ్లారు. ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో వాటన్నింటిపై విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రస్తావించారు. విచారణకు సంబంధించిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించగలుగుతామన్నారు. దీనిలో జరుగుతున్న జాప్యం వల్లే తాను మనస్తాపానికి గురయ్యానని, అందువల్లే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి సమస్యను తీసుకొచ్చామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, వారిలో నెలకొన్న ఆందోళన తొలగించాలనే ఉద్దేశంతోనే కేవలం పోలీసు డిపార్టుమెంట్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా వారి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకుపోయేందుకు గన్మన్లను వెనక్కు పంపినట్లు పేర్కొన్నారు. దీనిపై ధనుంజయరెడ్డి కలెక్టర్తో, ఎస్పీతో చర్చించారు. విచారణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు అవసరమైతే సీఐడీ సహకారం కూడా తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించారు. శుక్ర, శనివారాల్లో సీఎంవో అధికారులతో బాలినేని భేటీ అంశాలపై మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలను సీఎంవో కార్యాలయం కూడా ఖండిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అంతే కాకుండా తప్పుడు కథనాల అంశాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, దానిపై ఆయన ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించినట్లు సీఎంవో అధికారులు బాలినేనికి వివరించారు. అదే విధంగా ఒంగోలులో సుమారు 25 వేలమందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నిధుల విడుదలపై జరుగుతున్న జాప్యాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షించి అతి త్వరలోనే నిధులు విడుదలచేసి పట్టాల పంపిణీ చేస్తారని తెలిపారు. ఒంగోలులో ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి సరఫరా స్కీము టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడానికి ఉన్న జాప్యాన్ని కూడా సీఎంవో కార్యాలయం దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు బాలినేనికి స్పష్టం చేశారు. కొత్తపట్నం బకింగ్హాంపై కెనాల్పై జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి, ఆర్యవైశ్య ఆరామక్షేత్రం పనులు గురించి చర్చించారు. -
టీడీపీకి సవాల్ విసిరినా ఎమ్మెల్యే బాలినేని
-
బాలినేని సవాల్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఇళ్ల పట్టాలలో స్కాం చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ‘‘నిస్వార్దంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నాం. బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే పేదలు క్షమించరు. స్కామ్లు నిరూపించలేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా?. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరతా’’ అని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: దళిత గళం గొంతు నొక్కి! -
పేదల ఇళ్ల కోసం తగ్గేదేలే..!
గూడులేని పేదల కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ‘మహాయజ్ఞం’లా చేపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఒంగోలు నగరంలో పేదలందరికీ ఒకే డిజైన్ లో ఇళ్లు నిర్మించి శాటిలైట్ సిటీని రూపొందించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తలంచారు. దీనికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సైంధవుడిలా అడ్డుపడ్డారు. తన అనుచరులతో న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. ఫలితంగా పేదలు సొంతగూడుకు దూరమయ్యారు. ఒక వైపు దేశం నేతల కుట్రలు ఎదుర్కొంటూనే మరో వైపు పేదలకు ఎలాగైనా గృహాలు నిర్మించాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే బాలినేని అడుగులు వేశారు. దీనికి సీఎం నుంచి సానుకూలంగా స్పందన రావడం, భూముల కొనుగోలుకు రూ. 200 కోట్లు మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. నగర పరిసరాల్లో 508 ఎకరాల భూసేకరణ కూడా జరిగిపోయింది. ఇలా పచ్చ నేతలకు బాలినేని షాక్ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనివిధంగా ఒకేచోట భారీ స్థాయిలో ప్రభుత్వ భూమిని సేకరించి నగరంలోని వేలాది మంది పేదలకు ఇళ్లు నిర్మించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. కొత్తగా ఒక శాటిలైట్ సిటీని నిర్మించాలని అనుకున్నారు. నగర శివారు యరజర్ల గ్రామంలో 818 ఎకరాలు సేకరించారు. దాదాపు 23,531 మందికి సొంత ఇంటి కల నిజం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హద్దురాళ్లు కూడా వేయించారు. ఇది పచ్చనేతలకు కంటగింపుగా మారింది. ఇంతమంది నిరుపేదలకు ఇళ్లు ఇస్తే తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి కుట్రలకు తెరతీశారు. తన ప్రధాన అనుచరుడైన ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించారు. గతంలో ఈ స్థలాన్ని ఐరన్ ఓర్ మైనింగ్కు ఇచ్చారని హైకోర్టుకు వెళ్లాడు. దీంతో హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీనిపై పేదలు దామచర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ రాజకీయ భవిష్యత్కు మేము బలికావాలా అంటూ నిలదీస్తున్నారు. ఇళ్లులేని నిరుపేదలపై టీడీపీకి ఎందుకింత కక్ష అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. పేదల ఇళ్ల కోసం ఎందాకై నా అంటున్న బాలినేని... టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరాలన్న దృఢ సంకల్పంతో బాలినేని శ్రీనివాస రెడ్డి అడుగులు ముందుకేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసైనా ఇళ్లు ఇద్దామని సీఎం భరోసా ఇచ్చారు. రైతుల వద్ద భూములు కొనుగోలు చేయటానికి రూ.200 కోట్లు విడుదల చేశారు. దీంతో రెవెన్యూ అధికారులను రైతుల నుంచి భూములు కొనుగోలు చేసేందుకు బాలినేని పరుగులు పెట్టించారు. అగ్రహారం, వెంగముక్కల పాలెంలలో భూముల సర్వే చేపట్టారు. రైతుల వద్ద నుంచి 508 ఎకరాలు కొనుగోలు చేశారు. లే అవుట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో ఇళ్లులేని నిరుపేదలు 23,531 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పుడా సంఖ్య 28 వేలమందికి చేరింది. అయినా సరే వెనక్కి తగ్గేదే లేదంటూ దరఖాస్తు చేసుకున్న అందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్లు కూడా నిర్మించాలన్న నిర్ణయంతో బాలినేని అడుగులు ముందుకేస్తున్నారు. టీడీపీ అడ్డుకోవటం... పేదలకు మంచే జరిగింది: యరజర్లలో శాటిలైట్ టౌన్షిప్ నిర్మించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని తలిస్తే దానిని పూర్తి కానీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు పేదలకు చెడుచేయాలని తలంచినా... అంతా మన మంచికే అన్న చందంగా నిరుపేదలకు ఇంకా మేలే జరిగింది. అక్కడి టౌన్షిప్ ఆగిపోవటంతో బాలినేని అగ్రహారం, వెంగముక్కల పాలెంలలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పూనుకున్నాడు. దీంతో ఇప్పుడు ఇవ్వదలచుకున్న ప్లాట్లు ఇంకా ఒంగోలు నగర పరిధిలోనే కావటంతో సొంతింటి కల నెరవేరుతున్న నిరుపేదల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. పేదలకు సేవ చేయాలనే నాయకుడి సంకల్పం బలంగా ఉండాలే కానీ పేదలకు ఎప్పుడూ అన్యాయం జరగదు అని ఈ ఉదంతంతో తేటతెల్లమైంది. బాలినేని శ్రీనివాస రెడ్డి సంకల్పం బలంగా ఉంది కాబట్టే ప్రైవేటు భూములు కొనుగోలు చేసి ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా పట్టాలు ఇప్పిస్తా ఒక్క ఎకరా కూడా ప్రైవేటు భూమి కొనుగోలు చేయకుండా ప్రభుత్వ భూమిలోనే పెద్ద ఎత్తున యరజర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో కూడా ఇంతపెద్ద ప్రభుత్వ స్థలం లేదని, ఒంగోలులోనే ఇది సాధ్యమైందని అందరూ భావించారు. అయితే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యరజర్లలో శాటిలైట్ టౌన్ షిప్ను మాజీ ఎమ్మెల్యే దామచర్ల అడ్డుకున్నాడు. న్యాయపరమైన అడ్డంకులు సృష్టించాడు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి తీరుతాం. అందుకే అగ్రహారం, వెంగముక్కల పాలెంలలో 508 ఎకరాలు కొనుగోలు చేయించాం. ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది. త్వరలో లే అవుట్లు సిద్ధం చేయిస్తాం. సొంత ఇంటికల నెరవేర్చి నిరుపేదల కళ్లలో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి లక్ష్యం. త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా పేదల పట్టాల పంపిణీ చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. – బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే -
అందరూ సుభిక్షంగా ఉండాలి
ఒంగోలు: ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారిని బాలినేని దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలినేని దంపతులు అందించిన పట్టువస్త్రాలను స్వామివారికి అర్చక పండితులు వేదోక్తంగా సమర్పించారు. స్వామివారి ఆలయ ఆవరణంలో ఉన్న రంగనాయక మండపంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవిలకు వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపల బాలినేని మీడియాతో మాట్లాడుతూ స్వామివారి వస్త్ర సేవ దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. పేదలకు అండగా ఉంటూ సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని స్వామిని కోరుకున్నానన్నారు. సమృద్ధిగా వర్షాలు పడి రైతులకు సిరులు కురవాలని స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: తనపై కొద్ది రోజులుగా పనిగట్టుకుని ఆరోపణ చేస్తున్నారని, రాజకీయంగా తనను హింసించడమే ధ్యేయంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ మరణం తర్వాత పార్టీని అంటిపెట్టుకొని ఉన్నానని అయినా తనపైన నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని వాపోయారు. హవాలా కుంభకోణం నుంచి భూ కుంభకోణం దాకా అన్నీ నా మీద రుద్ది ఒక పద్ధతి ప్రకారం అభాసుపాలు చేస్తున్నారని బాలినేని మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. తనను తన కుమారుడిని రాజకీయంగా వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఎవరు ఏం చేసినా తాను వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని బాలినేని స్పష్టం చేశారు. పార్టీలో బాధ్యత గల వ్యక్తిగా తను ఒకరి గురించి మాట్లాడనని బాలినేని అన్నారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్సిగ్నల్ -
బాలినేని నిర్ణయంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్ణయంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బాలినేని అంశం తమ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అంతర్గతం అని సజ్జల పేర్కొన్నారు. ‘‘బాలినేని స్పష్టమైన కారణం చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని అంటున్నారు. వైఎస్సార్సీపీలో ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రయత్నం చేస్తోంది. టీ కప్పులో తుఫాను కాదు కదా.. అందులో టీ కూడా లేదు. వివాదాలేమీ లేవు.. అంతా మీడియా హడావుడి తప్ప మరేమీలేదు. మాట్లాడేందుకు ఏమీలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పదవికి రాజీనామా...సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ
-
మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని
సాక్షి, ప్రకాశం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కాగా, బాలినేని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు. 40 మంది మా పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్లో ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను ఎందుకు కొనుకున్నారు?. ఒంగోలులో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకంది టీడీపీనే. పేదల స్థలాలపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని దేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. -
2024 ఎన్నికల్లో వార్ వన్సైడ్: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తిరుపతి: 2024 ఎన్నికల్లో కూడా వార్ వన్సైడ్ ఉంటుందని.. గాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తామే గెలుస్తామని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుస్తారని బాలినేని అన్నారు. 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 మంది బీసీలే ఉన్నారని బాలినేని పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట: మంత్రి పెద్దిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధిస్తామని.. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను సీఎం జగన్ 98.5 శాతం అమలు చేశారన్నారు. కరోనా సమయంలోనూ సీఎం సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి అన్నారు. చదవండి: Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ -
కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అవాస్తవం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: తన ఫోన్ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన ఆరోపణలను వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవాలని చెప్పారు. ఆయన టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని, అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని వాస్తవాలను బట్టబయలు చేశారు. కోటంరెడ్డి వినిపిస్తున్న మాటలు ఎవరో రికార్డింగ్ చేసినవే తప్ప, ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదని స్పష్టంచేశారు. ఎవరితోనో కోటంరెడ్డి మాట్లాడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేస్తే.. వాటిని మరెవరో రికార్డు చేసి సర్క్యులేట్ చేస్తే.. దాన్నే కోటంరెడ్డికి శ్రేయోభిలాషిగా ఇంటెలిజెన్స్ చీఫ్ పంపి ఉండొచ్చని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎవరి ఫోన్లూ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యాకే కోటంరెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆయనకు వైఎస్ జగన్ సముచిత గౌరవం ఇచ్చారన్నారు. కోరుకున్న పదవులు రాలేదనే అసంతృప్తి ఉన్నట్లు కోటంరెడ్డే అన్నారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో కూడా సర్క్యులేట్ అవుతోందని, దాన్ని కూడా ట్యాపింగ్ చేశారంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి కోటంరెడ్డి, ఆనం ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని తెలిపారు. ఆ బురదలో వారే కొట్టుకుపోతారని చెప్పారు. చంద్రబాబు, రామోజీరావులతో ఎవరైనా మాట్లాడాలంటే వారి సహాయకులకే ఫోన్ చేస్తారని అన్నారు. అదే రీతిలో వైఎస్ వివేకా మరణించారనే సమాచారాన్ని ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ ఇంట్లో పనిచేసే నవీన్కు వైఎస్ అవినాష్రెడ్డి ఫోన్ చేశారని, ఇందులో అసహజం ఏముందని ప్రశ్నించారు. దీన్ని పట్టుకుని చంద్రబాబు, ఎల్లో మీడియా బురదజల్లడం రాక్షసత్వమని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణతోనే సమతుల అభివృద్ధి సాధ్యమని సీఎం వైఎస్ జగన్ ఆదిలోనే ఆయన విధానాన్ని ప్రకటించారన్నారు. అందులో భాగంగా మూడు రాజధానులను ప్రకటించారని తెలిపారు. 3 నెలల కిందటే ఎందుకు చెప్పలా? : మాజీ మంత్రి పేర్ని నాని మూడు నెలలుగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే అప్పుడే ఎందుకు చెప్పలేదని, ఇప్పుడెందుకు చెబుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య(నాని) నిలదీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ పెట్టకపోతే ఇంత మంది ఎమ్మెల్యేలు అయ్యేవారా? ఒక్కసారి కోటంరెడ్డి ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి శ్రీధర్రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ సామాన్లు కొనలేదని, ట్యాపింగ్ చేసే సదుపాయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. శ్రీధర్రెడ్డిది అవకాశవాద రాజకీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోటంరెడ్డిలాంటి వారు పోతే పార్టీకి దరిద్రం పోతుంది: కొడాలి నాని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి లాంటి నాయకులు వెళ్లిపోతే వైఎస్సార్సీపీకి దరి ద్రం పోతుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు (నాని) అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. కోటంరెడ్డిని సీఎం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఉంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబే సీఎం అయ్యే పరిస్థితిలేదని, కోటంరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేది ఎక్కడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే అలవాటు చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్ ఎవరినీ మభ్య పెట్టరని, ఉన్నది ఉన్నట్లు చెబుతారని తెలిపారు. ఈ పనికిమాలిన వారు ఏమి మాట్లాడుతారో వినే సమయం సీఎంకు ఉంటుందా అని ప్రశ్నించారు. అది రికార్డింగ్ వాయిస్ : మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సాక్షి ప్రతినిధి నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేస్తున్న ఆరోపణలు అర్థరహితమైనవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. శ్రీధర్రెడ్డి పార్టీని వీడి వెళ్లిపోవడానికి ఏదో కారణం చూపించాలన్న ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫోన్ టాపింగ్ అనేదే లేదని మంత్రి స్పష్టం చేశారు. రికార్డింగ్ మెసేజ్ను పట్టుకుని యాగీ చేయడం సరైన పద్ధతి కాదన్నారు.పోన్లో మాట్లాడింది ట్యాపింగా లేదా రికార్డింగా అనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా, కోర్టు ద్వారా దర్యాప్తు చేయించినా అభ్యంతరం లేదన్నారు. ట్యాపింగ్ అని నిరూపిస్తే రాజకీయాలకు నేను దూరం: బాలినేని సాక్షి ఒంగోలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఫోన్ ట్యాపింగ్ నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, నిరూపించలేకపోతే శ్రీధర్రెడ్డి రాజకీయాలకు దూరమవుతారా అని నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కోటంరెడ్డి పక్కన ఉండే స్నేహితుడే ఆయన కాల్ను రికార్డు చేసి పార్టీ అధిష్టానానికి పంపారన్నారు. అది తెలుసుకున్న ఇంటెలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కోటంరెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా దానిని ఫోన్లో వినిపించారని తెలిపారు. దానిని పట్టుకుని ఫోన్ ట్యాపింగ్ అనడం అర్థరహితమని చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్న చనువుతోనే ఇంటెలిజెన్స్ అధికారి శ్రీధర్రెడ్డిని అడిగారని, చివరకు ఆ స్నేహంపైనే మచ్చ వేయడం దారుణమని అన్నారు. కాల్ రికార్డు చేసిన వ్యక్తిని ప్రెస్మీట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమన్నారు. ఆయన స్నేహితుడు రామశివారెడ్డినే అడిగి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు టిక్కెట్ ఇస్తానని చెప్పకపోతే 20 24లో టీడీపీ తరఫున పోటీచేస్తానని ఎలా ప్రకటిస్తారని అన్నారు. ఆనం రామనారాయణరెడ్డికి భద్రత తగ్గించలేదని తెలిపారు. ఫోన్ట్యాపింగ్ రాజకీయ ఆరోపణ: మిథున్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ : ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనడం రాజకీయ ఆరోపణ అని వైఎస్సార్సీపీఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. రాజకీయ స్వార్ధంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. -
ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయం..
ఒంగోలు: స్థానిక గద్దలగుంట పారువేట కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలు గద్దలగుంట పారువేటకు వచ్చారు. గద్దలగుంట ముఖ ద్వారంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు నేతృత్వంలో ఏర్పాటైన పాటకచ్చేరికి బాలినేని, ఎంపీ పాల్గొన్నారు. అనంతరం స్థానిక గద్దలగుంటలోని నాగార్పమ్మతల్లి, అంకమ్మ తల్లి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, శ్రీకోదండ రామస్వామి ఆలయం, అంకమ్మ తల్లి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోదండ రామస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన పాటకచ్చేరి కార్యక్రమానికి బాలినేని, మాగుంట ఇరువురు హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సంయుక్తంగా వాల్తేరు వీరయ్య సినిమా కేక్ను కట్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయం మొత్తం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు. అందరం ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి వేగం అవుతుందన్నారు. చిరంజీవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, ఆయన సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో తమ కుటుంబానికి మంచి బంధం ఉందని అన్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య అయితే ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వీరయ్యగా చిరంజీవి అభిమానులు పేర్కొంటుండడం మరింత ఆనందంగా ఉందన్నారు. అనంతరం అక్కడ నుంచి గాంధీబొమ్మ సెంటర్లో 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఏర్పాటు చేసిన పాటకచ్చేరిలో ఇరువురు పాల్గొన్నారు. ఇక్కడ బాలినేని, మాగుంటను వైఎస్సార్ సీపీ నాయకులు ఓగిరాల వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, కార్పొరేటర్ తాడి కృష్ణలత సత్కరించారు. రాజరాజేశ్వరస్వామి అమ్మవారు, గద్దలగుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇరువురు గద్దలగుంట నెహ్రూబొమ్మ సెంటర్లోని పాట కచ్చేరిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. మీ వాడిని.. ఎప్పుడూ అందుబాటులో ఉంటా ‘‘నేను మీ వాడిని... మీతో కలిసి పెరిగిన వాడ్ని..తిరిగిన వాడ్ని... నా బాల్యం అంతా గద్దలగుంటలోనే గడిచింది. ఇక్కడి ప్రజల ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... గద్దలగుంటతో తన అనుబంధం విడదీయరానిదన్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. ఇప్పటికే గద్దలగుంటలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని, మరో వారం రోజుల్లో రూ.10 లక్షలతో మహిళా భవన్కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో గద్దలగుంటలో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివిధ పోటీల్లో విజేతలకు శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డిని కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించారు. బహుమతి ప్రధానోత్సవ సభకు కమిటి అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు సభా నిర్వాహకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్బాబు, కాపు కళ్యాణ మండపం చైర్మన్ టీవి రంగారావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సాంబశివరావు, కమిటీ సభ్యులు ఈదుపల్లి అంకబాబు, కాటా నాగేశ్వరరావు, ఈదుపల్లి కోటేశ్వరరావు, చిట్టెం వెంకటేశ్వర్లు, తోటకూర చైతన్య, మలిశెట్టి రాజేంద్రప్రసాద్, దండే వెంకటేశ్వర్లు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. (క్లిక్ చేయండి: 2024 ఎన్నికల్లో జగనే సీఎం.. ఇది పక్కా) -
టీడీపీ కుట్రలకు చెక్..పేదల గూడుకు ఎందాకైనా
సీన్ 1: పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒంగోలు నగరంలో శాటిలైట్ టౌన్ షిప్ నిర్మించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి యోచించారు. నిరుపేదలకు సొంత ఇంటికల నిజం చేయాలన్న సదుద్దేశంతో బాలినేని నగర సమీపంలో ప్రభుత్వ స్థలం అన్వేషించిమరీ లే అవుట్ తయారు చేయించారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనివిధంగా ఒకేచోట భారీ స్థాయిలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి వేల సంఖ్యలో పేదలకు ఒకేచోట ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని భావించి వడివడిగా చదును చేయించారు. యరజర్ల గ్రామంలోని 818 ఎకరాల్లో 24 వేల మందికి ఇళ్లు నిర్మించాలనుకున్నారు. సీన్ 2: ఇంత మంది పేదలకు ఇళ్లు కట్టిస్తే ప్రభుత్వానికి, బాలినేనికి ఎక్కడ పేరు వస్తుందోనని భావించిన తెలుగుదేశం పార్టీ కుట్రలకు తెరతీసింది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుయుక్తులు పన్నారు. న్యాయపరమై ఇబ్బందులు సృష్టించి పేదలకు గృహాలను దూరం చేశారు. తన అనుచరుడు మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చారు. ఫలితంగా నిరుపేదల ఆశపై నీళ్లుజల్లారు. సీన్ 3: పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఎందాకైనా వెళ్లాలని బాలినేని నిర్ణయించారు. పచ్చ కుట్రలను తిప్పికొట్టి నిరుపేదలను ఆదుకోవాలనుకున్నారు. నగర పరిసర ప్రాంతాల్లో 500 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని సేకరించాలని రంగం సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంచారు. సీఎం బాలినేని ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరం చుట్టూ ఉన్న ఆరు గ్రామాల్లో స్థలాలు ఎంపిక చేసేపనిలో పడ్డారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదవారి సొంతింటి కల సాకారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలంచారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున గృహాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ఒంగోలు నగరంలో పేదలకు ఒకే ప్రాంతంలో ఇళ్లు నిర్మించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక శాటిలైట్ సిటీని కట్టాలని, ఆమేరకు చర్యలు చేపట్టారు. యరజర్ల గ్రామంలోని 818 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. దాదాపు 24 వేల మందికి సొంత ఇంటి కల నిజం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హద్దురాళ్లు సైతం వేయించారు. పనులు వేగంగా జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు సైంధవుడిలా అడ్డుపడ్డారు. ఇంతమంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇక తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భావించి కుట్రలకు తెరతీశారు. తన ప్రధాన అనుచరుడు అయిన ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించాడు. దీంతో హైకోర్టు నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను ఇవ్వకుండా నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది. మైనింగ్ పేరుతో అడ్డుపుల్ల: యరజర్ల గ్రామంలోని ప్రస్తుతం ఇళ్లపట్టాలకు ఇవ్వాలని భావించిన స్థలం గతంలో ఐరన్ ఓర్ మైనింగ్కు ఇచ్చారంటూ మక్కెన శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్లాడు. అయితే గతంలో మైనింగ్కు ఇచ్చినప్పుడు ఇదే మక్కెన శ్రీనివాసరావు మైనింగ్కు ఇవ్వటానికి వీలులేదని ఆందోళనలు చేశాడు. మైనింగ్ లీజులు రద్దుచేసి ఐఐఐటీకి ఇవ్వాలని కూడా ఆందోళనలు చేపట్టాడు. ఇదంతా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆడుతున్న కుట్రలో భాగంగానే జరిగిందని అందరూ గుర్తించారు. టీడీపీ కుట్రలకు చెక్ నగరంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి బలంగా భావించారు. ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంచారు. దీనికి ఆయన అంగీకరించారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల పరిధిలో 500 ఎకరాలు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భూములు కొనేందుకు రూ.200 కోట్లు కేటాయించారు. ఆరు గ్రామాల్లో స్థలాల గుర్తింపు.. ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఆరు గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మొత్తం దాదాపు 25 వేల మందికి ఇచ్చేలా స్థలాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. మల్లేశ్వరపురం, పెళ్లూరు, అగ్రహారం, సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కల పాలెం, కరవది గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా స్థలాలను ఇప్పటికే గుర్తించారు. సర్వే నంబర్ల వారీగా అనుభవదారులు, హక్కుదారులను గుర్తించి వారి వద్ద నుంచి కొనుగోలు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పదిహేను రోజుల్లోపు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. మార్చి నెలాఖరుకల్లా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం టీడీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా మార్చి నెలాఖరుకల్లా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకుంటాం. సీఎం వైఎస్ జగన్కు ఇళ్ల పట్టాల విషయం చెప్పాను. కోర్టు అడ్డంకులు ఉన్నందున ప్రైవేటు స్థలాలైనా కొనుగోలు చేసి ఇద్దామని హామీ ఇచ్చారు. దీంతో ఒంగోలు నగర పరసర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వటానికి భూముల గుర్తింపు ప్రారంభించాం. అందుకోసం రూ.200 కోట్లు కేటాయించారు. ఇప్పటికే భూముల గుర్తింపు కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. – బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే -
చంద్రబాబు మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారు : బాలినేని
-
Prakasam District: వికేంద్రీకరణకు మద్దతుగా మానవహారం
సాక్షి, ప్రకాశం జిల్లా: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. అనంతరం వందలాది మంది కార్యకర్తలతో మానవహారం నిర్వహించి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై ఇంచార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్తో మురిపించి రాష్ట్ర ప్రజలను మోసం చేసారని బాలినేని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ తప్ప వెలగబెట్టింది ఏమి లేదని బాలినేని మండిపడ్డారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో శాసన రాజధాని ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ముళ్ళకంపళ్లలో రాజధాని పెట్టి ఒక వర్గాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు కలలు కన్నారని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రాన్నీ కొల్లగొట్టేశాడని మంత్రి మండిపడ్డారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష -
అభివృద్ధే మన అజెండా.. ప్రతి ఒక్కరికీ సంక్షేమం
ఒంగోలు: అభివృద్ధే మన అజెండా అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మూడో డివిజన్ అయిన కరుణాకాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లింల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. వాసన్నా అంటూ ఆప్యాయతను కనబరిచారు. కరుణాకాలనీలో కబేలా స్థలం ఖాళీగా ఉందని, దానిని కమ్యూనిటీ స్థలం కోసం కేటాయిస్తే తమ ప్రాంతంలో ఇబ్బందులు తొలగిపోతాయంటూ పలువురు ప్రజలు బాలినేనికి విజ్ఞప్తి చేశారు. దీనిని వెంటనే పరిశీలించి నివేదిక అందజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ను బాలినేని ఆదేశించారు. అదే విధంగా కొంతమంది పరిస్థితి దయనీయంగా ఉండడం చూసి చలించిన బాలినేని అక్కడికక్కడే వారికి కొంత మొత్తం ఆర్థిక సాయం అందించారు. అదే విధంగా మరికొంతమంది డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యుత్ లైన్లు ఇళ్లకు అందుబాటులో ఉంటున్నాయని, తద్వారా ప్రమాదం జరిగే ఉందంటూ వివరించారు. రేషన్ బియ్యం, సంక్షేమ ఫలాలతోపాటు ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదా అంటూ బాలినేని అడిగి తెలుసుకున్నారు. గతంలో పెన్షన్ కోసం తిండీ తిప్పలు లేకుండా ఒకటికి రెండు రోజులు పడిగాపులు పడాల్సి వచ్చేదని, అప్పుడు కూడా వేలిముద్రలు పడడంలేదంటూ అధికారులు తిప్పి పంపేవారన్నారు. కానీ నేడు ఒకటో తేదీ నిద్రలేచే సరికే పెన్షన్ చేతిలో పెడుతున్నారని, నిజంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చల్లగా ఉండాలంటూ వృద్ధులు దీవించారు. సాయంత్రం ప్రకాశం కాలనీలో పర్యటించారు. బాలినేని వెంట స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, ఆమె భర్త గండు మధు, 3వ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, నగర మేయర్ గంగాడ సుజాత, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జిలాని, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్ కళాపరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ దస్తగిరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, బడుగు ఇందిర, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, అయినాబత్తిన ఘనశ్యాం, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షేక్ మీరావలి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు, ఒంగోలు సూపర్బజార్ డైరెక్టర్ వల్లెపు మురళి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖుద్దూస్, షేక్ రజాక్, వైఎస్సార్సీపీ నగర కార్యదర్శి షేక్ సలాం, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గోవర్థన్రెడ్డి, వీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ దుగ్గిరెడ్డి వీరాంజనేయరెడ్డి, కొమ్మూరి రవిచంద్ర, కార్పొరేటర్లు అంగిరేకుల గురవయ్య, తాడి కృష్ణలత ఉన్నారు. -
గడపగడపకు మన ప్రభుత్వం: శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
ఒంగోలు సబర్బన్: నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని మూడో డివిజన్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. తొలుత డివిజన్ ప్రారంభంలోని బలరాం కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు దంపతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు బాలినేనికి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం మిలటరీ కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని స్థానికులను అడిగి బాలినేని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో డివిజన్లో ఎక్కువ భాగం స్లమ్ ఏరియా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మూడో డివిజన్లో రోడ్లు వేశామని ప్రగల్భాలు పలికారంటూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై ధ్వజమెత్తారు. నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ, ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. మూడో డివిజన్లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. ఈ డివిజన్లో ఎక్కువ అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. డివిజన్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. వలంటీర్ల పనితీరు కూడా సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మళ్లీ సీఎంగా వైఎస్ జగన్, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని గెలవాలని నినాదాలు చేశారు. మిలటరీ కాలనీలో ఒక మహిళ మంచినీటి ట్యాప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇవ్వలేదని బాలినేని దృష్టికి తీసుకురాగా, ఎంఈ కే మాల్యాద్రిని పిలిచి బాలినేని ప్రశ్నించారు. మూడు రోజుల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తామని ఎంఈ తెలిపారు. ఓ ఇంటి వాకిటికి ఎదురుగా విద్యుత్ స్తంభం ఉండటాన్ని బాలినేని గమనించారు. అక్కడకు వెళ్లినప్పుడు ఆ ఇంటి మహిళ కూడా విద్యుత్ స్తంభం సమస్యను బాలినేని దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ ఏఈని పిలిపించిన బాలినేని.. ఆ స్తంభాన్ని పక్కకు మార్చాలని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కాలువల నిర్మాణానికి శంకుస్థాపన... గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మిలటరీ కాలనీలో కాలువ నిర్మాణానికి బాలినేని శంకుస్థాపన చేశారు. టెంకాయలు కొట్టి భూమి పూజ చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మిలటరీ కాలనీ, మసీదు కాలనీ, బాలినేని భరత్ కాలనీల్లో కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ.30 లక్షలు మంజూరు చేశామని, తొలుత మిలటరీ కాలనీలో కాలువ పనులు ప్రారంభించామని బాలినేని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే జాఫర్, కార్పొరేటర్లు ఎందేటి పద్మావతి రంగారావు, చల్లా తిరుమల రావు, తాడి కృష్ణలత, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాకా బసివిరెడ్డి, ఇస్లాంపేట జిలానీ, బేతంశెట్టి శైలజ, యరజర్ల రమేష్, ఊసా మధుబాబు, డివిజన్ నాయకులు సుల్తాన్, రమీజా, కోటయ్య, చిన్నా, పేరిరెడ్డి, రాజేంద్ర, హబీబ్, వెంకట్, సుజాత, డానియేలు, అమర్, తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు పోటీ చేయాలన్నా భయపడాలి
నెల్లూరు(సెంట్రల్): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ప్రకటించారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్లో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్రెడ్డి, మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కిలివేటి సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మానుగుంట మహీధర్రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మంత్రి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల మొదటి నుంచి ఓటర్ జాబితాలో పేర్ల నమోదు ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లను గుర్తించి నమోదు చేసే ప్రక్రియపై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. పట్టభద్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వాటిని కూడా గుర్తు చేయాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో అధిక ఓట్లు ఉన్నాయని, పూర్తిగా వైఎస్సార్సీపీ వైపే పట్టభద్రులు ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు భయపడాలి పట్టభద్రుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి వచ్చే మెజార్టీ చూసి ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా తీర్పును తీసుకువద్దామన్నారు. ఓటరు లిస్టులో పేర్లు నమోదు అనేది అత్యంత ప్రతిష్టాత్మంగా జరగాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటు నమోదు చేయించడంతో పాటు, ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. పట్టభద్రుల ఓట్లు చాలా కీలకమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వాళ్లు గమనిస్తున్నారని, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రత్యేక ఆదరాభిమానాలు వాళ్లకు ఉన్నాయన్నారు. ప్రతి ఓటు ఎంతో కీలకంగా భావించి మెజార్టీ వచ్చే విధంగా చూడాలన్నారు. చాలా కాలం తర్వాత జిల్లాలో తిరిగి పట్టభద్రుల ఎన్నికల వాతావరణం వస్తోందని, ఈ విషయంపై ప్రతి ఒక్కరం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గెలవడం ఖాయమని, మెజార్టీని చూసి ప్రతిపక్షాలు భయపడే విధంగా తీసుకుని వద్దామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, పి రూప్కుమార్, నిరంజన్బాబురెడ్డి, వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ఆర్ సీపీలోనే ఉంటాను : బాలినేని
-
నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీతోనే: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు. తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: దూషించిన నోటితోనే పులకింతా? చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానని అన్నారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్తో మాట్లాడతానని బాలినేని తెలిపారు. గోరంట్ల మాధవ్ విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయాయని తెలిపారు. -
కేసినో వ్యవహారానికి నాకు సంబంధం లేదు: మాజీ మంత్రి బాలినేని
-
‘చీకోటి’ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: కేసినో వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసినో ప్రవీణ్ ఎవరో తనకి అసలు తెలియదని, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. ఒంగోలు నగరాన్ని ఈ రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని బాలినేని అన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధికి రూ.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్న ఆయన, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని బాలినేని అన్నారు. చదవండి: చంద్రబాబు పాలనలో జరిగింది డీపీటీ: సీఎం జగన్ -
నా కుటుంబంపై కుట్ర జరుగుతోంది: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: తనకు సంబంధం లేని విషయాలపై కొందరు గొడవ చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీని వెనుక టీడీ జనార్ధన్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న చెన్నైలో పట్టుబడ్డ డబ్బుపై మరోసారి దుష్ప్రచారం చేశారన్నారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. ఇకనైనా వారు పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే పదవి నుంచి తప్పకుంటానని బాలినేని సవాల్ విసిరారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ఓపెన్ సవాల్ -
ఒంగోలు జేఎంబీ చర్చిలో గొడవలు బాధాకరం: బాలినేని
-
ఎంతటికైనా దిగజారతాడు.. బాబు వీక్నెస్ అదే..
సాక్షి, ప్రకాశం జిల్లా: తెలుగుదేశం పార్టీపై నమ్మకం కోల్పోయి వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో అన్న అభద్రతా భావంలో చంద్రబాబు ఉన్నాడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఎంతటికైనా దిగజారతాడని బాలినేని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సింగిల్గా ఎదుర్కోలేకే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చదవండి: తిరుపతి: పోలీసులపై జనసేన నాయకుల దాడి హోంమంత్రి వనితపై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను బాలినేని ఖండించారు. తన తోబుట్టువుతో సమానమైన హోంమంత్రి వనితను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. హోం మంత్రి మా ఆడపడుచు అనే ఉద్దేశ్యంతోనే ఓన్ చేసుకొని మాట్లాడాననీ దాన్ని వర్ల రామయ్య వక్రీకరించి మాట్లాడడం సిగుచేటు అన్నారు. తన మీద ఏదో తీస్తున్నా.. తవ్వుతున్నా అన్న వర్ల రామయ్యకు బాలినేని సవాల్ విసిరారు. దమ్ముంటే వర్ల రామయ్య తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని ఆయన అన్నారు. -
సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా
ఒంగోలు: సీఎం జగన్ మాటే తమకు శాసనమని, ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం సోమవారం జిల్లాకు వచ్చిన ఆయనకు అభిమానులు అడుగడుగునా భారీ ర్యాలీలతో స్వాగతం పలికారు. అనంతరం తన నివాసంలో బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ‘మంత్రిగా ఉన్నప్పటి కంటే మంత్రి పదవికి రాజీనామా చేశాక వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు నాపై ఎక్కువ అభిమానాన్ని చాటారు. పెద్దఎత్తున వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు కృషి చేస్తాను’ అని చెప్పారు. ఈనెల 22న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించేందుకు ఒంగోలుకు వస్తున్నందున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు మహిళలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. తొలుత మార్టూరు మండలం బొప్పూడి వద్ద ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలినేని అనంతరం ర్యాలీగా ఒంగోలు బయలుదేరారు. బొప్పూడి వద్ద ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, అన్నా వెంకటరాంబాబు, పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి రావి రామనాథంబాబు, బొల్లాపల్లి టోల్గేట్ వద్ద ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఏపీ శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బంటు: మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
-
టెరాసాఫ్ట్ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు
సాక్షి, అమరావతి: టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకు సన్నిహితుడని అందుకే నిబంధనలు పక్కనపెట్టి ఫైబర్నెట్ ప్రాజెక్టు టెండర్లను దానికి కట్టబెట్టారని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ఫైబర్నెట్ టెండర్ల గోల్మాల్పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ టెండర్లలో చాలా అవకతవకలు జరిగాయని, ఇతర కంపెనీల కంటే ఎక్కువకు కోట్ చేసినా ఆ సంస్థకే పనులు అప్పగించారని తెలిపారు. అప్పటి సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే రూ.307 కోట్ల ఈ టెండర్ల ప్రక్రియ జరిగిందన్నారు. ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఎండీ హరికృష్ణప్రసాద్నే టెండర్ పత్రాల మదింపు కమిటీ సభ్యుడిగా నియమించారని తెలిపారు. టెండర్లు వేయడానికి ఒకరోజు ముందు ఈ కంపెనీని బ్లాక్లిస్ట్ నుంచి తొలగించారని, అది కూడా బ్లాక్లిస్ట్లో పెట్టిన అధికారి కాకుండా కిందిస్థాయి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చేశారని చెప్పారు. ఈ కంపెనీ సరఫరా చేసిన సెట్టాప్ బాక్సులు వంటి పరికరాల్లో 20% మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని, 80 % పనిచేయడంలేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించామని, దర్యాప్తు వేగవంతంగా చేపట్టి దోషులను శిక్షిస్తామన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దీనిపై మాట్లాడుతూ ఫైబర్గ్రిడ్ టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయన్నారు. కంపెనీ ఏర్పాటు చేసి మూడేళ్లు నిండాలి, కనీసం రూ.350 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనలు పాటించకుండా ఈ కాంట్రాక్టును టెరాసాఫ్ట్కు అప్పగించారని తెలిపారు. ఇది అవినీతి గ్రిడ్ దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టును అవినీతి గ్రిడ్గా మార్చారని విమర్శించారు. మార్కెట్లో రూ.2,200కు దొరికే సెట్టాప్ బాక్సుని రూ.4,400కి కొనుగోలు చేశారని తెలిపారు. ఫైబర్నెట్ ప్రాజెక్టు ఉన్న శాఖ చంద్రబాబు చేతిలో ఉంటే చినబాబు సంతకం పెట్టారని చెప్పారు. ఇలా ఎలా, ఎందుకు చేశారో బయటపెట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, అమ్మఒడి పథకానికి సంబంధించిన ప్రశ్నలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియం బోధన కోసం టీచర్లకు మూడుదశల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కీ రీసోర్స్ పర్సన్స్కి మూడు వర్సిటీలకు చెందిన నిష్ణాతులైన ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించామన్నారు. వారిద్వారా జిల్లా, మండల స్థాయిలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు జూన్లో ప్రొబేషన్ ఖరారు జూన్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ను ఖరారు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సచివాలయ ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల కొంతమంది సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులను తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగాలను తమ హయాంలో ఇచ్చినట్లు టీడీపీ మాట్లాడుతోందని, ఆ ఉద్యోగాలను సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. వారి పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉందని తెలిపారు. -
టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు: బాలినేని
-
పవన్.. బీజేపీని రోడ్ మ్యాప్ అడగటం ఏంటి?: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: గత ఎన్నికల్లో చంద్రబాబును తిట్టి ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుల కోసం వెంపర్లడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును తిట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆయనతో కలసి పొత్తుపెట్టుకోవడాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు. జనసేన పార్టీ పెట్టి.. బీజేపీని రోడ్ మ్యాప్ అడగటం ఏంటని బాలినేని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలవుతున్నాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ -
వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): వేసవిలో డిమాండ్కు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని రాష్ట్ర ఇంధన శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. విజయవాడ 30వ డివిజన్ దేవీనగర్ ట్రెండ్సెట్ మెడోస్లో రూ.3.60 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ..వేసవిలో ఎటువంటి పవర్కట్ లేకుండా నిరాటంకంగా విద్యుత్ సరఫరా అందించాలని, అవసరమైతే అదనంగా విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. టీడీపీ హయాంలోని రూ.26 వేల కోట్ల బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో వసూలు చేసిన ట్రూఅప్ చార్జీలను సైతం తిరిగి చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. రూ.2.49కు లభించే విద్యుత్ రూ.4.84 చెల్లించడానికి గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పీపీఏ చేసుకున్నారో టీడీపీ నేతలు చెప్పాలని అన్నారు. 86 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు. తమ పథకాలే తమ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని, వచ్చే ఎన్నికల్లో 150కు పైగా సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. -
గౌతమ్ రెడ్డి బంగారంలాంటి మనిషి
-
టీడీపీ వల్లే డిస్కమ్లపై రూ.30వేల కోట్ల భారం
ఒంగోలు: గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకంవల్లే విద్యుత్ డిస్కమ్లు రూ.30వేల కోట్ల భారాన్ని భరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఐదేళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తోందని.. ఇది ప్రభుత్వానికి భారంగా మారడంతో ఇబ్బందిగా ఉందన్నారు. ప్రైవేటుకు లీజుకిచ్చే అంశంపై విద్యుత్ జేఏసీ అడిగిన విజ్ఞప్తికి తాము ఎటువంటి స్పష్టమైన హామీని ఇవ్వలేదన్నారు. అయినా వారి విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇక విద్యుత్ జేఏసీతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ్రారెడ్డి, తాను మాట్లాడామని.. జేఏసీ కోరికలన్నీ దాదాపుగా నెరవేరుస్తున్నామన్నారు. అలాగే పీఆర్సీకి సంబంధించి కమిషన్ కాదు.. కమిటీ వేయాలంటూ విజ్ఞప్తి వచ్చిందని, దీనిని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ సమస్యలను వక్రీకరించడం సబబుకాదు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని బాలినేని స్పష్టంచేశారు. ఎప్పుడైనా ఒకటి అరా సమస్యలు రావడం సహజమని, దానిని వక్రీకరించాలని చూస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ విద్యుత్ రూ.2.50కు అందుబాటులో ఉంటే ఏకంగా రూ.4.87లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందన్నారు. దీనివల్ల విద్యుత్ డిస్కంలు ఏకంగా రూ.30 వేల కోట్ల భారాన్ని మోస్తున్నాయన్నారు. అయినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు విచిత్రంగా ఉంటున్నాయని.. కేంద్రం నిధులు ఇస్తామంటే వద్దని, అప్పులు ఎవరైనా చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడడం సరికాదన్నారు. నిజంగా సోము వీర్రాజుకు రాష్ట్రంపై ప్రేమే ఉంటే మోదీతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కోరాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. -
విద్యుత్పై టీడీపీ అనవసర రాద్ధాంతం
ఒంగోలు సబర్బన్: విద్యుత్ విషయంలో తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా విద్యుత్ కోతలు లేవని చెప్పారు. సాంకేతిక సమస్య కారణంగా రెండు రోజులుగా కొంతమేర విద్యుత్ సమస్య నెలకొందన్నారు. దీనిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి విద్యుత్ సంస్థల మెడకు బకాయిల బండను కట్టి వెళ్లారని ధ్వజమెత్తారు. ఆ భారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మంత్రి బాలినేని ఇంకా ఏమన్నారంటే.. ఎన్టీఆర్పై బాబుకు దొంగ ప్రేమ ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఒక జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా ఆయనకు గౌరవం కల్పించారు. చంద్రబాబు మాత్రం ఓట్ల కోసమే ఎన్టీఆర్కు దండం పెడుతున్నాడు. మనసులో ఏమాత్రం ప్రేమ ఉండడు. పైకి చూపించేదంతా దొంగ ప్రేమ. ► తను ముఖ్యమంత్రిగా పని చేసి కూడా.. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదో సినీ నటుడు బాలకృష్ణ తన బావ చంద్రబాబును నిలదీయాలి. ఆ పని చేయకుండా పుట్టపర్తి జిల్లా విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ► రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు, సత్య సాయిబాబాకు దేశ, విదేశాల్లో ఉన్న ప్రేమ పూర్వక, మంచి పేరును దృష్టిలో ఉంచుకొని సీఎం వైఎస్ జగన్ పుట్టపర్తిని జిల్లాగా ప్రకటించారు. ► ఉద్యోగులతో జరుపుతున్న చర్చలు తప్పక ఫలిస్తాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు ఎన్నో రకాలుగా మేలు చేస్తోంది. చంద్రబాబు కేసులు పెట్టి వేధిస్తే, సీఎం వైఎస్ జగన్ ఆ కేసులు ఎత్తివేశారు. ► కొంత మంది వ్యక్తులు వెనుక ఉండి సుబ్బారావు గుప్తాను ప్రోత్సహిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి బాగోలేదు. -
‘చిన్న సమస్యను ఉద్యోగులు రాద్ధాంతం చేయడం సరికాదు’
సాక్షి, ప్రకాశం: చర్చల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఉద్యోగులు వచ్చి చర్చిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. చిన్న సమస్యను ఉద్యోగులు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని మంత్రి బాలినేని అన్నారు. విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నా విద్యుత్ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా అవకాశం ఉన్నంతమేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. -
వంగవీటి రాధాది చారిత్రక తప్పిదం
ఒంగోలు: వంగవీటి రాధా టీడీపీలో చేరి చారిత్రక తప్పిదం చేశారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తండ్రిని హత్య చేయించిన పార్టీలో రాధా చేరకుండా ఉండాల్సిందన్నారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నా, రంగా కుటుంబంపై సీఎం వైఎస్ జగన్కు, తమకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు. తనను హత్య చేసేందుకు నెల కిందట రెక్కీ నిర్వహించారని రాధా ప్రకటన చేయడంతో ప్రభుత్వం గన్మెన్లను కేటాయించిందని చెప్పారు. గన్మెన్లను వద్దనుకోవడం రాధా వ్యక్తిగతమని పేర్కొన్నారు. రాధా చేసిన రెక్కీ ఆరోపణలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు. చంద్రబాబు ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాధా ఇప్పటికైనా తండ్రిని చంపిన పార్టీలో కొనసాగడంపై పునరాలోచించుకోవాలని ఒక మిత్రుడిగా తాను సూచిస్తున్నానని చెప్పారు. -
వైశ్యుల్ని రెచ్చగొట్టే పనిలో టీడీపీ
ఒంగోలు/ఒంగోలు సబర్బన్: ఆర్యవైశ్యుల్ని రెచ్చగొట్టే పనిలో టీడీపీ నాయకులు, వారికి మద్దతుగా పనిచేస్తున్న కొన్ని చానళ్లు కంకణం కట్టుకున్నాయని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. సోమిశెట్టి సుబ్బారావు (గుప్తా) ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలకు తమ పార్టీలోనే కొందరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో వారు కొంత తొందరపడ్డారని చెప్పారు. ఆ విషయం తన దృష్టికి రాగానే వాళ్లని నిలువరించానని చెప్పారు. ఆ తరువాత సుబ్బారావు తమతోనే ఉన్నారన్నారు. ‘అసలు టీడీపీ వాళ్లకు ఏమిటి బాధ. వీళ్లకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మమ్మల్ని అభాసుపాలు చేయాలన్నదే టీడీపీ నాయకులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పనిగా పెట్టుకుని కుయుక్తులు పన్నుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ‘రాజకీయ సన్యాసం తీసుకుంటా’ ‘ఐదుసార్లు ఒంగోలు శాసనసభ్యునిగా ఎన్నికయ్యా. ఇన్నేళ్లలో నా వల్ల ఏ ఒక్క ఆర్యవైశ్యుడైనా బాధపడ్డారా. వైఎస్సార్ సీపీలోనే కాదు. చివరకు టీడీపీ, జనసేనలో ఉన్న వారినీ అడుగుతున్నా. ఎవరైనా బాధపడి ఉంటే చెప్పండి. రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని మంత్రి బాలినేని అన్నారు. ‘నాకు స్నేహితుడి వంటి వ్యక్తి అతని వ్యాపారం నిమిత్తం డబ్బుతో చెన్నై వెళ్తుంటే ఆ డబ్బులు నావంటూ హవాలా మంత్రి అని మీడియా ప్రచారం చేసింది. ఆ డబ్బు ముమ్మాటికీ నల్లమల్లి బాలు అనే వ్యక్తికి చెందినదనే విషయం ఆర్యవైశ్యుల్లో అందరికీ తెలుసు. ఇప్పుడు సుబ్బారావుగుప్తాపై ఓ కార్యకర్త దాడిచేస్తే దానిపై నేను స్వయంగా కేసు పెట్టించాను. అరెస్ట్ కూడా చేయమని కోరాను. ఈ దాడికి, బాలినేనికి సంబంధం లేదని స్వయంగా సుబ్బారావే చెప్పినా మీడియాలో విష ప్రచారం చేయడం దారుణం’ అని మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని మాట్లాడినా, మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెట్టినా అందరి సంతోషం, సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. గతంలో వ్యాపారి పత్తి రామకృష్ణ మరణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం కారణమైతే.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్న మీడియా అప్పుడేమైందని ప్రశ్నించారు. తాను మౌనంగా ఉంటున్నానని ఇష్టం వచ్చి నట్లుగా విమర్శలు చేస్తుండటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. భౌతిక దాడులను సహించే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లాతో ఉన్న బంధం విడదీయరానిదని మంత్రి బాలినేని అన్నారు. ఆయన ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివ ర్గంలో తాను ఒక మంత్రినని, ఈ నేపథ్యంలో ఆయన రుణం కొంతైనా తీర్చుకునేందుకు ఒంగోలులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆర్యవైశ్య ప్రముఖులు ఏ స్థలంలో రోశయ్య విగ్రహాన్ని పెడితే బాగుంటుందో వారం రోజుల్లో సూచించాలని కోరారు. -
గుప్తాపై దాడిని నేనే ఆపా
సాక్షి, అమరావతి, ఒంగోలు: పార్టీ సమావేశంలో విమర్శలకు దిగిన సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను కొందరు కొడుతున్నట్లు తెలిసి వెంటనే తానే ఫోన్ చేసి ఆపానని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భౌతిక దాడులను సహించబోమని స్పష్టం చేశారు. సుబ్బారావు గుప్తాకు రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మతిస్థిమితం లేకే గుప్తా ఆ సభలో అలా మాట్లాడారని ఆయన భార్యే స్వయంగా చెబుతున్నారని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ, ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక బురదజల్లుతున్నారని మండిపడ్డారు. తన గురించి ఒంగోలు ప్రజలకు బాగా తెలుసని, దాడులు చేయడం తమ సంస్కృతి కాదని చెప్పారు. సోమవారం విజయవాడ, ఒంగోలులో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.. తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ఉన్నానని, తనది ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. తనపై రెండు సార్లు ఆర్యవైశ్యులు పోటీ చేశారని, ఎప్పుడూ వారిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవన్నారు. వారిని సోదరులుగానే భావించి సహాయ సహకారాలు అందించానన్నారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు తాను ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. దాడి జరిగిన విషయం తెలియగానే ఎస్పీకి ఫోన్ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరానని చెప్పారు. కావాలనే వివాదం.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురించి తమ పార్టీ వారెవరూ శాసనసభలో తప్పుగా మాట్లాడలేదని, కావాలనే ఆమెను టీడీపీ వారే వివాదంలోకి లాగుతున్నారని బాలినేని తెలిపారు. లోకేష్ నేతృత్వంలో తనపై తప్పుడు ప్రచారం జరిగినప్పుడు తాను ఎంతో బాధ పడ్డానని చెప్పారు. క్షమించండి.. అదృశ్య శక్తుల పనే: గుప్తా తప్పుగా మాట్లాడినందుకు తనను సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్షమించాలని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కోరారు. మంత్రి బాలినేనితో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని మీడియాతో పేర్కొన్నారు. తాను సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టింగ్లు చేయలేదని, ఇదంతా కొన్ని అదృశ్య శక్తుల పనేనని చెప్పారు. తనపై దాడి జరిగిందన్న విషయం తెలియగానే ముందుగా బాలినేని స్పందించి తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పారని వెల్లడించారు. తనపై ఎంతో అభిమానం ఉండబట్టే తనకు వీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. మంత్రి పుట్టిన రోజును పురస్కరించుకుని తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య విబేధాలను సృష్టించేందుకు గతంలో ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాస్తే ఆ పత్రిక కార్యాలయం వద్దే ప్రతులను దగ్థం చేశానని చెప్పారు. తల్లి, అత్త ఇటీవలే మృతి చెందడంతో తన భర్త మనోవ్యధకు గురైనట్లు గుప్తా భార్య నాగమణి తెలిపారు. జై జగన్.. జై బాలినేని అని నినదించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు తొలుత ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని సుబ్బారావు గుప్తా మంత్రి బాలినేని అభయం ఇవ్వడంతో భార్యతో కలసి వన్టౌన్ పోలీసుస్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. మంత్రి వాసన్న అభయం ఇచ్చారంటే ఇక భయం లేదని అందుకే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుప్తా తెలిపారు. సుబ్బారావు ఫిర్యాదుపై వన్టౌన్ సీఐ సుభాషిణి 506,323, 427 రెడ్విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. -
AP: శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: భారీ వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆయన ఆదివారం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో సమీక్షించారు. విద్యుత్ సరఫరా స్థితిగతులపై ఆరా తీశారు. విద్యుత్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడకూడదని, వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు హరనాథరావు, పద్మ జనార్ధనరెడ్డి, సంతోషరావులతో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ టెలీకాన్ఫరెన్స్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షల్లో ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాధరావు మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరుపతి, నెల్లూరు ఈహెచ్టీ సబ్స్టేషన్లు, మరో 19 సబ్స్టేషన్లలో నీరుందని చెప్పారు. దీనివల్ల 98 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయని తెలిపారు. వీటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం విద్యుత్ పునరుద్ధరణకు తీసుకున్న చర్యల్ని ఇంధనశాఖ కార్యదర్శి మంత్రి బాలినేనికి వివరించారు. వరదలు, తుపానులు, భారీ ఈదురుగాలులు వంటి విపత్తుల్లో విద్యుత్ సమస్యల తీవ్రతను తగ్గించడానికి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని మంత్రి సూచించారు. రూ.30 కోట్లతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్కు ప్రతిపాదనలు తిరుపతిలో ప్రస్తుతం ఉన్న 132 కేవీ సబ్స్టేషన్ స్థానంలో కొత్తగా రూ.30 కోట్లతో అత్యాధునిక గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్, తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద 220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణాలకు ప్రతిపాదనలివ్వాలని ట్రాన్స్కో డైరెక్టర్ ప్రవీణ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళం వద్ద 132 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న స్థల వివాదంపై జిల్లా అధికారులతో మాట్లాడారు. నాలుగు రోజులుగా వరద నీటిలోనే ఉన్న తిరుపతి 132 కేవీ సబ్స్టేషన్ను ఆదివారం ఆయన పరిశీలించారు. నాలుగడుగుల నీరుండటంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభించలేకపోయామని, అలిపిరి, రేణిగుంట సబ్స్టేషన్ల నుంచి తిరుపతి నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో ఎస్ఈ ప్రతాప్కుమార్ చెప్పారు. ఎస్జీఎస్ కళాశాల పక్కన గోడ లేకపోవటం వల్లే వరద నీరు సబ్స్టేషన్ను దిగ్బంధించినట్లు గుర్తించారు. వెంటనే గోడ నిర్మించాలని, ముందువైపు నీళ్లు రాకుండా ర్యాంపు ఏర్పాటు చేయాలని సివిల్ ఎస్ఈ నరసింహకుమార్ను డైరెక్టర్ ఆదేశించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్న సిబ్బంది, అధికారులను, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నలుగురి ప్రాణాలను కాపాడిన నెల్లూరు జిల్లా విద్యుత్ సిబ్బందిని ఆయన అభినందించారు. ట్రాన్స్కో కడప జోన్ సీఈ శ్రీరాములు, ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ ఎస్ఈ చలపతి, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్లను ప్రలోభపెడుతున్నారు
నెల్లూరు సిటీ/దర్శి: కుప్పంలో కూడా ఘోర పరాజయం తప్పదనే విషయం తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్లు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, అనిల్కుమార్ యాదవ్ అన్నారు. అనేక ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు శనివారం నెల్లూరు నగరం, ప్రకాశం జిల్లా దర్శిలో వేర్వేరుగా ఎన్నికల ప్రచారం చేశారు. నెల్లూరు, దర్శిలో మంత్రి బాలినేని మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. ఇక రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అందుకే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఎదురీదుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు లోకేష్ కుప్పంలో గెలిచేందుకు ఓటుకు రూ.5 వేలు చొప్పున పంచే పరిస్థితి వచ్చిందన్నారు. కుప్పాన్ని మునిసిపాలిటీ చేసింది సీఎం వైఎస్ జగన్ అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దర్శిలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో రుణమాఫీలంటూ ఎడాపెడా హామీలిచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్ జగన్ అన్ని హామీలను నెరవేరుస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీలతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, కాకాణి గోవర్ధన్రెడ్డి, విడదల రజిని, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి దిమ్మతిరిగే తీర్పు రావాలి
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు టీడీపీకి దిమ్మతిరిగేలా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ప్రజలు గెలిపిస్తారనే ధీమా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కన్నా మెజార్టీ ముఖ్యమన్నారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా మెజార్టీని తీసుకురావడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. నెల్లూరులోని ఒక హోటల్లో బుధవారం మంత్రి అనిల్కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కలసి కార్పొరేటర్లుగా పోటీలో ఉన్న అభ్యర్థులను సజ్జలకు, బాలినేనికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు. కార్పొరేషన్కు సంబంధించి ఇతర పార్టీల వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం తమవైపే ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వారిని గుర్తించి టికెట్లు ఇచ్చామని చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే జట్టుగా అడుగులు వేసి విజయం కోసం కృషి చేస్తారన్నారు. ప్రతి ఇంట్లో నవరత్నాల పథకం వల్ల లబ్ధి పొందిన వాళ్లు ఉన్నారని, వారికి మళ్లీ పథకాల అమలు తీరు, ఏం లబ్ధి పొందుతున్నారు అనేది గుర్తుచేయాలన్నారు. ఎన్నికల్లో తీర్పు అనేది సీఎం జగన్ పాలనకు నిదర్శనంగా ఉండాలని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సీఎం అమలు చేస్తున్న పథకాలే మనకు శ్రీరామరక్ష లాగా ప్రజలు ఆశీర్వాదాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ, రూరల్పై ఉంచిన నమ్మకం వమ్ము కాకుండా అధిక మెజార్టీతో 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, నుడా చైర్మన్ ద్వారకానాథ్, పి.రూప్కుమార్ పాల్గొన్నారు. -
చంద్రబాబు చరిత్ర వింటేనే అసహ్యం: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం: సానుభూతి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో శనివారం మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. బూతులు తిట్టినందుకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడా లేక వాళ్ల ఆఫీసు పగలగొట్టారని చెప్పేందుకు వెళ్తున్నాడో అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దేవాలయం అంటున్న చంద్రబాబు.. దేవుడైన ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘనుడు. చంద్రబాబు చరిత్ర వింటేనే అసహ్యం వేస్తుంది. చదవండి: (ఇప్పుడే రాజీనామా చేస్తా: వల్లభనేని వంశీ) రాష్ట్రంలో పని, పాట లేని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రెండు రోజుల పాటు తిరిగి వస్తాడు. తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అమిత్ షాను కలుస్తాడో చెప్పాలి. సానుభూతి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడు. తన హయాంలో సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించని ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరగగానే సీబీఐ ఎంక్వయిరీ జరపాలని కోరడం హాస్యాస్పదంగా ఉంది' అని మంత్రి బాలినేని అన్నారు. చదవండి: (చంద్రబాబు దీక్షలపై డిక్షనరీ రాయాలి: కన్నబాబు) -
బాబు రాజకీయ జీవితం మొత్తం కుట్రల మయం: బాలినేని
-
కుట్రపూరితంగా టీడీపీ దుష్ర్పచారం: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఏపీలో విద్యుత్ కోతలు ఉండవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంత ఖర్చయినా విద్యుత కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొన్నారు. టీడీపీ కుట్రపూరితంగా దుష్ర్పచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. విద్యుత్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాల భ్రష్టు పట్టించారు. సోలార్ పవర్ను కొనుగోలు చేయకుండా ప్రతిపక్షం అడ్డుకుందని’’ మంత్రి బాలినేని నిప్పులు చెరిగారు. చదవండి: AP: విద్యుత్ కోతలపై తప్పుడు ప్రచారం.. ఖండించిన ఇంధన శాఖ -
7న వైఎస్సార్ ఆసరా రెండో విడత సాయం
ఒంగోలు: వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఈ నెల 7న ఒంగోలులో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం సోమవారం పరిశీలించారు. సభాస్థలి కోసం ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలోని హెలీపాడ్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 7వ తేదీ ఉదయం 11 గంటలకు సభ జరుగుతుందని, లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి మాట్లాడుతారని చెప్పారు. అనంతరం పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా అధికారులతో కలిసి మంత్రి బాలినేని, తలశిల రఘురాం పరిశీలించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్పీ మలికాగర్గ్ తదితరులు పాల్గొన్నారు. -
5 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక: మంత్రి బాలినేని
-
చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారు?: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కష్టకాలంలో దాక్కుని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని.. వాటిని పక్కదారి పట్టించడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినప్పుడే ప్రతిపక్షం పోయిందన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడం మంచిదని మంత్రి బాలినేని ఎద్దేవా చేశారు. -
మైనింగ్ ఆధారిత పరిశ్రమలపై హేతుబద్ధ ఫీజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖనిజాధారిత పరిశ్రమలపై శాస్త్రీయంగా హేతుబద్ధమైన ఫీజులు విధించాలని గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు సూచించారు. విజయవాడలోని పీసీబీ కార్యాలయంలో మంగళవారం ఇంధన, అటవీ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి కాలుష్యకారక పరిశ్రమలు, వాటి నియంత్రణ తదితర అంశాలపై పెద్దిరెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రోత్సాహకరమైన వాతావరణంలోనే పరిశ్రమలు పనిచేసేందుకు సహకరించాలన్నారు. మైనింగ్ పరిశ్రమలకు అనుమతులు, నిర్వహణ సందర్భంగా విధిస్తున్న సీఎఫ్ఓ, సీఎఫ్ఈ ఫీజుల పెంపు హేతుబద్ధంగా ఉండాలన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే మైనింగ్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారో పరిశీలించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించిన ఫీజులు తమకు ఆర్థికంగా భారంగా మారుతున్నాయని మైనింగ్ పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారని, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలనే సీఎం ఆశయానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. ఘన, ద్రవరూప వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలన్నారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలను మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు అందించాలని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో ఆస్పత్రులు, ల్యాబ్ల నుంచి పెద్దఎత్తున వస్తున్న బయో మెడికల్ వ్యర్థాలను తగిన జాగ్రత్తలతో నాశనం చేయాలని ఆదేశించారు. పీసీబీ చైర్మన్ ఏకే ఫరీడా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..!
ఒంగోలు/కవిటి: కోవిడ్ బాధితులకు అలుపెరగని సేవలందించిన ప్రభుత్వ వైద్యుడు కరోనా బారిన పడి ఆస్పత్రి పాలవగా.. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్ ఎన్.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా తేలిన వారెందరికో అండగా నిలబడ్డారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్ బారినుంచి బయటపడ్డారు. ఏప్రిల్ 24న ఆయనకు కరోనా సోకింది. నెలాఖరు వరకు హోమ్ ఐసోలేషన్లో ఉండి వైద్యం పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ 10 రోజుల వైద్యం తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్, తరువాత గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుండటంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని తేల్చిన వైద్యులు అందుకు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో డాక్టర్ భాస్కరరావు కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. బాలినేని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.కోటి వెంటనే చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారని మంత్రి బాలినేని తెలిపారు. చదవండి: సకల సౌకర్యాలతో జర్మన్ హ్యాంగర్ ఆస్పత్రి -
రఘురామకృష్ణరాజును ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది: మంత్రి బాలినేని
-
టీడీపీ కి కనీసం డిపాడిట్లు కూడా దక్కవు :మంత్రి బాలినేని
-
నమ్ముకున్న వారికీ అండగా నిలిచే వ్యక్తి సీఎం వై ఎస్ జగన్ : బాలినేని
-
కృత్రిమ మేధ.. లేదిక ‘కోతల’ బాధ!
సాక్షి, అమరావతి: విద్యుత్ శాఖ అందుబాటులోకి తెచ్చిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)వ్యవస్థ వేసవి వేళ సత్ఫలితాలిస్తోంది. పెరుగుతున్న డిమాండ్ను ఇట్టే పసిగట్టడమే కాకుండా తక్షణమే అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వీలు కల్పిస్తోంది. ఇంటర్నెట్ ద్వారా అనుసంధానమైన ఈ వ్యవస్థ వల్ల వినియోగం అమాంతం పెరిగినా.. విద్యుత్ కోతలు లేకుండా చేయగలుగుతున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ లోడ్, లోడ్ను బట్టి విద్యుత్ వినియోగం, ఏయే ప్రాంతాల్లో ఎంత వాడకం ఉంటుందనే అనేక అంశాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను విద్యుత్ శాఖ రూపొందించింది. పదేళ్ల విద్యుత్ డేటాను నెట్కు అనుసంధానించింది. ఫలితంగా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా విద్యుత్ డిమాండ్ను ముందే అంచనా వేయగలుగుతున్నారు. అప్పటికప్పుడు అవసరమైన విద్యుత్ను మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం సాధ్యమవుతోంది. లెక్క పక్కా: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఈ నెల 27న 220.6 మిలియన్ యూనిట్లుగా రికార్డయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు మరో వారం రోజుల్లో ఇది రోజుకు 222 మిలియన్ యూనిట్లకు చేరొచ్చని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని ఆధారంగా చేసుకుని ఈ తరహా అంచనాకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 2018లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లు ఉండగా, 2020–21 నాటికి 218 మిలియన్ యూనిట్లకు చేరింది. గరిష్ట (పీక్) విద్యుత్ వినియోగం మార్చి 27, 2021 నాటికి 220.6 మిలియన్ యూనిట్లు. విద్యుత్ డిమాండ్ 11,193 మెగావాట్లకు చేరినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కా లెక్క అందించింది. డిమాండ్ ఎంత పెరిగినా.. ‘కోత’లొద్దు తాజా పరిస్థితిపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా కోతలు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏపీ జెన్కో ద్వారా రోజుకు 100 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి 40–45 మిలియన్ యూనిట్లు, పునరుత్పాదక విద్యుత్ (విండ్, సోలార్) నుంచి 30–35 మిలియన్ యూనిట్లు, ఇతర వనరుల నుంచి మరో 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ పరిస్థితుల్లో 35–45 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మే నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉండొచ్చని వివరించారు. ఏప్రిల్ రెండో వారానికి రబీ సీజన్ ముగుస్తుందని, అయితే, గృహ విద్యుత్ వాడకం పెరుగుతుందని మంత్రికి నివేదించారు. ఈ వివరాలను విద్యుత్ శాఖ సోమవారం వెల్లడించింది. -
చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ..
సాక్షి, ప్రకాశం: స్థానిక ఎన్నికలను నిర్వహించడమనేది ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యతిరేకిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని.. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ఎలా చెబితే ఎస్ఈసీ అలా పనిచేస్తోంది. ప్రభుత్వ సలహా కూడా తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గుజరాత్లో కూడా ఎన్నికలు వాయిదా వేశారని’’ బాలినేని పేర్కొన్నారు.(చదవండి: అమ్మ ఒడి ఆగదు: మంత్రి సురేష్) ప్రజాశ్రేయస్సుకు అవిరామ కృషి: మంత్రి వేణుగోపాల కృష్ణ పశ్చిమగోదావరి: కులమతాలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ప్రజాశ్రేయస్సుకు అవిరామంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు భస్మాసురుడులా వచ్చి.. మహిళల నెత్తిన చేతులు పెట్టారని’’ ఆయన ఎద్దేవా చేశారు.(చదవండి: పేదలకు పథకాలందే వేళ ఎన్నికల కోడ్ తెస్తారా!) -
విద్యుత్ సంస్థలు లాభాల బాట: బాలినేని
సాక్షి, విజయవాడ: విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ. 70వేల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకున్నామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలను ముంచేశారని మండిపడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గడచిన ఏడాది కాలంలో 30 వేల కోట్ల రూపాయలపైగా ఇచ్చామని చెప్పారు. (చదవండి: అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్) వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్ నాటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. 7 వేలకుపైగా జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేశామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమే మీటర్లు బిగిస్తున్నామని ఆయన వివరించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లు అంతా అవినీతిమయమేని మంత్రి బాలినేని దుయ్యబట్టారు.(చదవండి: ‘ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ’) -
సర్వేపల్లిలో అభివృద్ది పథం
-
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో కొంతకాలంగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ (జేఏసీ) ప్రకటించింది. సంఘాల నేతలతో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం చర్చలు జరిపారు. వారు లేవనెత్తిన ప్రతీ డిమాండ్పైనా సానుకూలంగా స్పందించారు. దీంతో సమ్మె విరమిస్తూ జేఏసీ నేతలు మంత్రి సమక్షంలో లిఖిత పూర్వకంగా తెలిపారు. జేఏసీ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల అంశాలను అధికారులు వెల్లడించారు. ► విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించేందుకు గల అవకాశాలను అధ్యయనం చేయనున్నారు. ఇందుకు ఈఆర్పీడీసీ సీఎండీ, ట్రాన్స్కో జేఎండీ నేతృత్వంలో వేయనున్న కమిటీ 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ► 1999–2004 మధ్య నియమించిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ను సమీక్షించి, ప్రభుత్వానికి 30 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్ డీఏలను ఫ్రీజింగ్ ఆర్డర్స్ తొలగిన తర్వాత చెల్లిస్తారు. నగదు రహిత వైద్యసేవల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తారు. ► రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఏపీ జెన్కో పీపీఏ నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ తీసుకుంటుంది. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనేదీ లేదని చర్చల సందర్భంగా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: బాలినేని ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 2019–20లో రూ.17,904 కోట్లు, బిల్లుల చెల్లింపునకు రూ.20,384 కోట్లు ఇచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.30 వేల కోట్లకుపైగా నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరించకుండా ఆపిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. విద్యుత్ రంగం పటిష్టానికి 7 వేల మంది లైన్మెన్లను, 172 మంది ఏఈలను నియమించామని తెలిపారు. ప్రైవేటీకరణ ఆలోచన లేదు కాబట్టే ఇవన్నీ చేశామని మంత్రి విద్యుత్ ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్న జేఏసీ డిమాండ్పైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. ► చర్చల్లో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్కో జేఎండీలు శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి, జేఏసీ నేతలు పి.చంద్రశేఖర్, ఎం.వాసుదేవరావు, సాయికృష్ణ, ఓసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు రూ. 1,863 కోట్లు: మంత్రి
సాక్షి, ప్రకాశం: మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో మంత్రి ఒంగోలు నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించి, మహిళలకు చిన్నారులకు పోషకాహారాన్ని అందించారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 1,863 కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని వెల్లడించారు. మహిళలకు సంబంధించి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్దే అన్నారు. ఈ నెల 11వ తేదీన డ్వాక్రా మహిళలకు ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ పథకం కింద 6, 200 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళలకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద జిల్లాలోని దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల పరిధిలోని 248 అంగన్వాడి కేంద్రాల ద్వారా 3, 980 మంది తల్లులు, 14, 650 మంది చిన్నారులు ప్రయోజనం పొందనున్నారన్నారు. అంతేగాక సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలోని 53 మండలాల్లో 3,996 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 46 వేల మంది తల్లులు, 7 నెలల నుండి 6 ఏళ్ళ లోపు ఉన్న లక్షా ఇరవై వేల మంది చిన్నారులు లబ్ధి పొందునున్నారన్నారు మంత్రి పేర్కొన్నారు. -
రైతులపై రూపాయి భారం పడినా రాజీనామా
ఒంగోలు: ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లుగా ఉచిత విద్యుత్కు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. బుధవారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులా రైతులపై కాల్పులకు ఆదేశించి కన్నీరు కార్చడం తమకు చేతకాదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. (రైతులు పైసా కట్టక్కర్లేదు) ► కేంద్ర ప్రభుత్వం నాలుగు రంగాల్లో నగదు బదిలీని తెచ్చింది. అందులో భాగంగానే విద్యుత్ శాఖలోనూ నగదు బదిలీ అమలు చేయాల్సి వస్తోంది. ► రైతులపై రూపాయి కూడా భారం పడకుండా కరెంటు బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి ముందుగానే జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్నదాతలు తమ ఖాతాల్లో నగదు జమ అయిన తరువాతే బిల్లు మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తారు. ► రైతులు నేరుగా బిల్లులు చెల్లించడం ద్వారా నాణ్యమైన కరెంట్ సరఫరాకోసం విద్యుత్తు శాఖ సిబ్బందిని ప్రశ్నించే వీలుంటుంది. ► ముఖ్యమంత్రి జగన్ రైతుల పక్షపాతి. పంటలకు గిట్టుబాటు ధరలకోసం ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా రూ.70 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేశారు. రైతులకు పగటిపూట 9 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు నిధులు కావాలని అధికారులు అడిగిన వెంటనే రూ.1,700 కోట్లు మంజూరు చేశారు. ► దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ను మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యం. బషీర్బాగ్ కాల్పులు గుర్తున్నాయ్ బాబూ.. ► ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ను అవహేళన చేయడమే కాకుండా హైదరాబాద్లో రైతులపై కాల్పులకు ఆదేశించిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుంది. ఆయన నిర్వాకాలను ఎవరూ మరచిపోలేదు. -
కావాల్సినంత కరెంట్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. రబీ నాటికి వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ను వందశాతం ఫీడర్ల ద్వారా ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే రూపొందించాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్ల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ► రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలో నిర్వహణ లోటుపాట్లకు సంబంధించి చీఫ్ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కీలకమైన పవర్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాలి. ► రాష్ట్రంలో నిరంతర విద్యుత్, వ్యవసాయానికి 9 గంటల పగటి పూటే విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఖరీఫ్లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలకు అనుగుణంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు çచేసుకోవాలి. ► వర్షాకాలంలో మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలి. బ్రేక్ డౌన్ సమయంలో తక్షణ విద్యుత్తు పునరుద్ధరణకు వీలుగా విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. ► సబ్ స్టేషన్లు, జిల్లా వారీగా పనితీరు స్కోర్ నమోదు చేసి ర్యాంకులివ్వాలి. సమీక్ష సమావేశంలో ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, విజిలెన్స్ జేఎండీ కే వెంకటేశ్వరరావు, పంపిణీ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్దన రెడ్డి పాల్గొన్నారు. -
డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!
సాక్షి, ప్రకాశం : ఒంగోలును అభివృద్ధి చేశానని డబ్బా కొట్టిన జిల్లా టీడీపీ నాయకుడు ఇప్పుడు పత్తాలేకుండా పోయారని, గత ప్రభుత్వం పర్సంటేజీలు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి బాలిలేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంత్రి బాలినేని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ టీడీపీ విస్మరించిన మార్కాపురం మెడికల్ కాలేజ్, రామాయపట్నం పోర్ట్, నిమ్స్ వంటి భారీ ప్రాజెక్టులను త్వరలో ప్రారంభించబోతున్నాం. ('జంతువులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు') రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అన్నీ సిద్ధం. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఫ్యాక్టరీల పరిస్థితిపై కమిటీలు వేశాం. కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా కొనసాగింపు చర్యలు ఉంటాయి. అందులో ఒంగోలు భగీరథ కూడా ఉంది. దీనిపై ఇప్పటికే కమిటీ వేశాం. కనిగిరి, దర్శీలలో రెండు వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పనున్నాం. -
'జంతువులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చీఫ్ పారెస్ట్ కన్జర్జేటివ్ అధికారి ప్రతీప్ కుమార్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. జంతువులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జంతు ప్రదర్శనశాలకు ఎలాంటి వాయువు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులంతా తక్షణమే సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలన్నారు. ఈ మేరకు ప్రతీప్ కుమార్ స్పందిస్తూ.. ఇప్పటికే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటవీ శాఖ అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు.అనంతరం విద్యుత్ శాఖతో నిర్వహించిన సమావేశంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమతంగా ఉండాలని పేర్కొన్నారు. పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లకుండా వెంటనే చర్యలు చేపట్టాలని పర్యావరణ అధికారులకు ఆదేశించారు. కాగా గురువారం తెల్లవారుజామున ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. (గ్యాస్ లీక్.. అధికారులతో సీఎం జగన్ సమీక్ష) (విశాఖ ఎల్జీ పాలిమర్స్లో భారీ ప్రమాదం) -
నాపై చౌకబారు ఆరోపణలు మానుకోండి..
సాక్షి, ఒంగోలు : తనపై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాలను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనకు కరోనా వైరస్ సోకిందని కుట్రపూరితంగానే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇకనైనా చౌకబారు ఆరోపణలు మానుకోవాలని మంత్రి బాలినేని హెచ్చరించారు. ఆయన శుక్రవారం ఒంగోలులో కరోనా నియంత్రణా చర్యలను పర్యవేక్షించారు. బాపూజీ మార్కెట్లో కోవిడ్19- డిస్ ఇన్ఫెక్షన్ టన్నల్ను ప్రారంభించారు. జిల్లాలో కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. (కుటుంబ సర్వే ఆధారంగా పరీక్షలు: సీఎం జగన్) టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు తప్ప, సేవా కార్యక్రమాలు చేయడం లేదని మంత్రి బాలినేని విమర్శించారు. అసలు లాక్ డౌన్ లో టిడిపి చేసిన సేవా కార్యక్రమాలు ఏంటో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. ఇక చంద్రబాబు నాయుడు డప్పు కొట్టుకోవడంలో తనకు తానే పోటీ పడతారని ఎద్దేవా చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరికైనా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా స్వయంగా ఫోన్ చేస్తే సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సేవా కార్యక్రమాలు చేసే సమయంలో నిరాహార దీక్షలు చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని బాలినేని వ్యాఖ్యానించారు. (కరోనా పరీక్షలు: నాలుగో స్థానంలో ఏపీ) -
కరోనా పోరు: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం అందించారు. విరాళ చెక్కును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. అలాగే దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల 55 వేలు విరాళం ఇచ్చారు. ఇలా అనేకమంది ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. వారి వివరాలు.. పశ్చిమ గోదావరి : జిల్లాకు చెందిన శ్రీ వైష్టవి స్పింటెక్స్(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ రూ.50 లక్షలు విరాళం అందించారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ వైష్టవి స్పింటెక్స్(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ ఛైర్మన్ రెడ్డి శ్రీనివాస్, రెడ్డి రంగబాబు(ఎండీ) విరాళ చెక్కును సీఎం జగన్కు అందించారు. ► వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు(ఏపి ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్) ఒక రోజు వేతనాన్ని రూ. 75,50,600 విరాళంగా అందజేశారు. చెక్కుకు సంబంధించిన వివరాలను యూనియన్ గౌరవ అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. సీఎం జగన్కు అందజేశారు. ► తణుకు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 58,47,833 లను విరాళంగా అందించారు. ఈ చెక్కును ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సీఎం జగన్కు అందించారు. ►ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులు రూ.50 లక్షలు విరాళం. ఈ చెక్కును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. అనంతరాము, స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, సీఈఓ అర్జా శ్రీకాంత్.. ముఖ్యమంత్రికి అందించారు విశాఖ : కరోనా నియంత్రణకు ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 21.30 లక్షల చెక్కును కలెక్టర్ వినయ్ చంద్కు అందించారు. అలాగే మాడుగుల నియోజకవర్గం ప్రజల కూడా ముప్పై లక్షల 7 వేలు చెక్కును కలెక్టర్కు అందించారు. ►రేసపువాణిపాలెం ఎక్స్- సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ. 27200 విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కును విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అందజేశారు. వైఎస్సార్ కడప: పోరుమామిళ్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మదర్ థెరీసా ఫౌండేషన్ స్వచ్చంద సంస్థ వాళ్లు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చేతుల మీదుగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 వేల చొప్పున విరాళం ఇచ్చారు. అనంతపురం : రాయదుర్గం పట్టణ మహిళా సంఘాల సమాఖ్య తరపున మెప్మా సంఘాలు .. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డికి లక్ష రూపాయల చెక్కను అందజేశారు. తూర్పుగోదావరి(కాకినాడ) : ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ పరుచూరి కృష్ణారావు రూ. 5 లక్షలు, పోలీసు శాఖకు రూ. 2 లక్షలు విరాళం అందజేశారు. అలాగే రాజమండ్రి హర్షవర్ధన విద్యాసంస్థల చైర్మన్ హరి ప్రసాద్.. లక్ష రూపాయలు సహాయాన్ని ఎంపీ భరత్రామ్కు అందజేశారు. కృష్ణా: కైకలూరు మండలం గోకర్ణపురం గ్రామ పెద్దలు 50వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకి అందజేశారు. -
ఆసుపత్రులకు నిరంతర విద్యుత్తు
సాక్షి, అమరావతి: ఆసుపత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగరాదని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవల్లో సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సరఫరా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా పరిస్థితిపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్కో జేఎండీ చక్రధర్బాబు, జెన్కో ఎండీ శ్రీధర్, డిస్కమ్ల సీఎండీలు, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ► విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఫీడర్లు మొదలుకొని అన్నిటిని పర్యవేక్షిస్తున్న అధికారులు ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే అప్రమత్తమయ్యేలా చర్యలు చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్లను సిబ్బంది నిరంతరం పరిశీలిస్తున్నారు. ► రోగుల తాకిడి ఎక్కువగా ఉండేచోట అదనపు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ఉపకరణాలు, సిబ్బందిని తయారుగా ఉంచారు. ► లాక్డౌన్కు ముందు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 196 – 200 మిలియన్ యూనిట్ల వరకు ఉండగా ప్రస్తుతం ఇది 154 ఎంయూలకు పడిపోయింది. అయితే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగం తగ్గినా గృహ విద్యుత్కు మాత్రం డిమాండ్ పెరుగుతోంది. ► విద్యుత్ డిమాండ్ తగ్గడంతో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో ఐదు యూనిట్లు, ఎన్టీటీపీఎస్ లో నాలుగు యూనిట్లు, ఎస్డీఎస్టీపీఎస్లో ఒక యూనిట్, కుడిగిలో ఒక యూనిట్, వల్లూరులో 40 మెగావాట్లతో కలిపి మొత్తం 3,370 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేశారు. ► థర్మల్ విద్యుదుత్పత్తిని తగ్గించడంతో వివిధ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచు కోవడంపై ఏపీ జెన్కో దృష్టి పెట్టింది. మొత్తం 14,89,703 మెట్రిక్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది. ఇది 20 రోజులకు సరిపోతుంది. ► బహిరంగ మార్కెట్లలో ప్రస్తుతం విద్యుత్ అమ్మకం ధరలు పడిపోయాయి. వాణి జ్య, పారిశ్రామిక డిమాండ్ బాగా తగ్గడం తో గతవారం సగటున ఒక యూనిట్ ధర రూ.2 నుంచి రూ.2.50 వరకు ఉంది. సొంతంగా ఉత్పత్తి కన్నా బహిరంగ మార్కెట్లోనే విద్యుత్ తక్కువ ధరకు లభిస్తుండడంతో డిస్కమ్లు అటు వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గడం తోపాటు డిస్కమ్లపై ఆర్థిక భారం కొంతమేర తగ్గే అవకాశముంది. -
జంతు ప్రదర్శనశాలలు, పర్యాటక కేంద్రాలు మూసివేత
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఎకో టూరిజం కేంద్రాలు, అటవీ పర్యాటక కేంద్రాలు, పార్కులు, టెంపుల్ ఎకో పార్కులు, నగర వనాలు, జంతు ప్రదర్శనశాలలను శుక్రవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర అటవీ దళాల అధిపతి ప్రతీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాలకు రోజూ భారీగా సందర్శకులు వస్తున్నారని, వీటిని కొనసాగిస్తే కోవిడ్ ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని, అందువల్ల తక్షణమే వీటిని మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల అధికారులకు ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. -
సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం
సాక్షి, ప్రకాశం: ‘సీఎం కప్’ పేరుతో క్రీడా పోటీలు జరపడం ఆనందదాయకమని రాష్ట్ర ఇంధన, అటవీ, శాస్త్ర, పర్యావరణ, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతోపాటు ఉద్యోగాల్లో కోటా కూడా ఉంటుందన్నారు. ఆదివారం ఉదయం ఆయన ఒంగోలులోని స్థానిక మినీ స్టేడియంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్చి 7, 8వ తేదీల్లో జిల్లాలో జరిగే బీచ్ ఫెస్టివల్ క్రీడల పోటీలో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలన్నారు.(‘సీఎం కప్ పేరుతో క్రీడలు నిర్వహిస్తాం’) ఈ కార్యక్రమానికి హాజరైన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మీద క్రీడలు జరపడం ఇదే తొలిసారని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థి శక్తి ఏంటో తనకు బాగా తెలుసన్నారు. సీఎం జగన్ ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. ఆటలు పిల్లల హక్కని.. ఆడించకపోతే స్కూళ్ల మీద విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేయండని సూచించారు. ఇక మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎం జగన్ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రాజధాని విషయంలో టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. ‘మొన్న కేంద్రం ఒప్పుకోదన్నారు.. నేడు నేవీకి అభ్యంతరం అన్నారు.. రేపు అమెరికాకు, చంద్రమండలానికి అభ్యంతరం అంటారు. చంద్రబాబు అభ్యంతరాలు మాకు అక్కర్లేదు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమ’ని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.(కార్పొరేట్ శక్తులకు బీజేపీ ఊడిగం) -
విద్యుత్ అంతరాయాలకిక చెక్
సాక్షి, అమరావతి: విద్యుత్ సరఫరాలో ఇక మీదట ఎలాంటి అంతరాయాలు లేకుండా చేస్తామని ఇంధన శాఖ ప్రకటించింది. ఇందుకోసం రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వెల్లడించింది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఓవర్లోడ్ను గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపింది. అన్ని వర్గాలకు విద్యుత్ సరఫరాతో పాటు వ్యవసాయ ఉచిత విద్యుత్కు కూడా ఈ విధానం బలం చేకూరుస్తుందని వివరించింది. రియల్ టైం పర్యవేక్షణపై ఉన్నతాధికారులు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. రియల్ టైం పర్యవేక్షణలో ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్ల వద్దే మీటర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి, ఆన్లైన్ ద్వారా విద్యుత్ కార్యాలయాలకే విద్యుత్ సరఫరా వివరాలు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తెలిసేలా చేస్తారు. దీంతో పంపిణీ సంస్థలు ఎంత విద్యుత్ సరఫరా చేస్తున్నాయనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ ఇప్పటికే డిస్కమ్లను ఆదేశించింది. సరఫరా చేసే విద్యుత్ వివరాలను ప్రతీనెతి 5న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీకి పంపాల్సి ఉంటుంది. మీటర్లు లేకపోవడంవల్ల ఉచిత విద్యుత్ సరఫరా వివరాలు కచ్చితంగా తెలుసుకోలేకపోతున్నారు. పైగా విద్యుత్ సరఫరాలో జరిగే నష్టాలన్నీ ఉచిత విద్యుత్ ఖాతాలోనే వేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని రైతు సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. రియల్ టైం వ్యవస్థ ద్వారా ట్రాన్స్ఫార్మర్ వద్దే సరఫరాను లెక్కించడంవల్ల ఇక మీదట ఇలాంటి అశాస్త్రీయ విధానాన్ని తొలగించవచ్చని విద్యుత్ శాఖ తెలిపింది. అలాగే, ఎనర్జీ ఆడిట్ను కూడా నిక్కచ్చిగా అమలుచేయడం ఇక మీదట సులువని తెలిపింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తిరగక్కర్లేదు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా, మరమ్మతు అవసరమైనా వినియోగదారులు సిబ్బంది చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ, రియల్ టైం వ్యవస్థలో ఈ తరహా సమస్యలను గుర్తించొచ్చు. తద్వారా ట్రాన్స్ఫార్మర్ బిగించడమో, మరమ్మతు చేయడమో వెంటనే జరగాలి. పరిష్కారం జరిగిన సమయం సైతం రికార్డు అవుతుంది కాబట్టి మరింత జవాబుదారీతనానికి అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాలో రైతులు నెలల తరబడి అసౌకర్యానికి గురవ్వకుండా చూడొచ్చు. రియల్ టైమ్ పర్యవేక్షణ శుభ పరిణామం : బాలినేని కాగా, రియల్ టైం పర్యవేక్షణను విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వాగతించారు. ఇలాంటి సరికొత్త ప్రయోగాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే పగటిపూట 9 గంటల విద్యుత్ను శాశ్వతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆర్థికంగా దివాలా తీయించినా ప్రజలపై భారం వేయకుండా వ్యవస్థను బలోపేతం చేయాలన్నది తమ ధ్యేయమన్నారు. ఇందులో భాగంగానే వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్ టారిఫ్ ఇచ్చిన ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిని మంత్రి అభినందించారు. కేవలం గృహ విద్యుత్ వినియోగదారులకే ప్రభుత్వం రూ. 1,707.07 కోట్లు సబ్సిడీ ఇచ్చిందని గుర్తుచేశారు. మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ సంస్థలకు రూ.10,060.65 కోట్లు సబ్సిడీ ఇవ్వడాన్ని బట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. అలాగే, ఐదేళ్ల కాలంలో విద్యుత్ సంస్థలను ఏ స్థాయిలో గత ప్రభుత్వం అప్పులపాల్జేసిందో మంత్రి గణాంకాలతో సహా వివరించారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్కో జేఎండీ చక్రధర్ బాబుతో పాటు డిస్కమ్ల సీఎండీలు పాల్గొన్నారు. -
టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నిర్వీర్యం
సాక్షి, విజయవాడ: గత టీడీపీ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పీపీఏ లు ద్వారా తక్కువ ధరకు సోలార్ పవర్ వస్తున్న అధిక మొత్తం లో కోట్ చేశారన్నారు. విద్యుత్ చార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్ను వినియోగదారులకు అందించడమే ధ్యేయం అని పేర్కొన్నారు. రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం రూ.1700 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు రంగం 70వేల కోట్లు అప్పుల్లో ఉందని చెప్పారు. ఏపీసీపీడీఎల్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ఇంధన శాఖ సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు. పీపీఏలు తగ్గించుకుంటూ తక్కువ ధరకు విద్యుత్ను అందిస్తున్నామని తెలిపారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. -
వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం : మంత్రి
సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ శాసనసభ మూడోరోజు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఆదిమూలపు సురేష్ సమాధానమిచ్చారు. కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్తో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాటసాని కోరగా.. కర్నులు జిల్లాలోని శకునాల గ్రామంలో సోలార్ పార్క్ కోసం భూసేకరణ పూర్తయిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని చెప్పారు. క్లీనింగ్కు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. త్వరలో ఈ విషయంపై చర్చించి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. మంత్రుల కమిటీని నియమించాం.. ఎయిడెడ్ కాలేజీల్లోపనిచేసే అధ్యాపకుల జీతాలు పెంచాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. వారికి కనీసం రూ.20 వేల జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసే విషయమై ముఖ్యమంత్రి మంత్రుల కమిటీని నియమించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్టూడెంట్స్, టీచర్స్ నిష్పత్తి కారణంగా నాణ్యతా ప్రమాణాలు తగ్గుతున్నాయని అన్నారు. త్వరలోనే వీటన్నింటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరుస్తామని మంత్రి చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. -
డిమాండ్కు సరిపడా విద్యుత్
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా రోజుకు 200 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉందని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) అంచనా వేస్తోంది. ఈ మేరకు ముందస్తు ప్రణాళిక(ఫోర్కాస్ట్)ను విద్యుత్ ఉన్నతాధికారులు సంబంధిత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నివేదించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఏసీల వినియోగం లక్షకుపైగా పెరిగినట్టు గుర్తించారు. మరోవైపు వ్యవసాయ ఉచిత విద్యుత్ను ఏడు నుంచి తొమ్మిది గంటలకు పెంచారు. ఫలితంగా వేసవిలోనూ కొన్ని రకాల ఉద్యాన పంటలకు విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ, గృహ, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను త్వరలో అనుమతించే వీలుంది. కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఎస్ఎల్డీసీ అంచనా వేసింది. ఏటా గరిష్టంగా రోజుకు 175 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే, వచ్చే మే నెలలో 210 మిలియన్ యూనిట్లకు చేరుతుందని భావిస్తున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. - ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య కాలంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలి. - ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో పరిధిలోని ఎన్టీపీసీ, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలను డిసెంబర్ నాటికి 3 లక్షల టన్నులు, వచ్చే ఏడాది జనవరి చివరకు 6 లక్షల టన్నులు, మార్చి చివరకు 9 లక్షల టన్నులకు పెంచాలి. - రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ స్టేషన్లలో రోజుకు 80 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసేందుకు నెలకు 17 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఇందులో సగం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో విదేశాల నుండి కూడా జెన్కో తక్కువ ధరకు బొగ్గు దిగుమతి చేసుకోవాలి. - ఫిబ్రవరి, జూలై మధ్యలో దశల వారీగా నెలకు 2 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం. - ఏపీ డిస్కమ్లతో పీపీఏలున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్ కొనుగోలుకు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - ఇటీవల కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (విద్యుత్ కొనుగోలుకు ముందే బ్యాంకులో డబ్బులు చెల్లించడం)కు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. (కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,184 కోట్లు ఎల్సీ కింద చెల్లించారు). దీంతో వచ్చే వేసవిలో నిరంతర విద్యుత్ కొనుగోలుకు ఇబ్బందులు ఉండవు. - ఈసారి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వేసవి నాటికి 300 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా. - ఈ ఏడాది జలాశయాలు పుష్కలంగా నిండాయి. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది. దేనికైనా సిద్ధమే వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందుబాటు ధరలోనే సరఫరా చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు. వేసవిలోనూ ప్రజల అంచనాలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తాయి. - బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
జనవరిలో అటవీశాఖ పోస్టుల భర్తీ
సాక్షి, విశాఖపట్నం: అటవీ శాఖలో సిబ్బంది కొరత అధిగమించేందుకు ఖాళీల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. విశాఖ కంబాలకొండలో జరిగిన ఏపీ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్మగ్లర్ వీరప్పన్ చేతిలో మృతి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్తో పాటు పలువురు అమర వీరులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మొక్కలు నాటి సీడీ ఆవిష్కరించారు. ముందుగా అమర వీరుల స్ధూపానికి పుష్పగుచ్చం ఉంచి మంత్రి బాలినేని నివాళులర్పించారు. వీరప్పన్ చేతిలో హత్యకు గురైన అధికారి శ్రీనివాస్తో పాటు అమరులైన సిబ్బందికి నివాళులర్పించడానికే ఈ అమరు వీరుల దినోత్సవం ఏటా నిర్వహిస్తున్నట్లు బాలినేని తెలిపారు. అటవీ అధికారులకు నూతన వాహనాలు.. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని తెలిపారు. జనవరి నాటికి అటవీ అధికారులకి నూతన వాహనాలు సమకూరుస్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని...అధునాతన ఆయుధాలు సమకూరుస్తామన్నారు. ఏపీ అటవీ శాఖ వద్ద ఉన్న 60 టన్నుల ఎర్ర చందనం అమ్మడానికి కేంద్ర అనుమతి కోరామని తెలిపారు. అటవీ శాఖలో ఇబ్బందులు అధిగమించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారని తెలిపారు. అటవీ సిబ్బందికి ఆధునిక ఆయుధాలు.. అటవీ శాఖ పిసిసిఎఫ్ ప్రతీప్ కుమార్ మాట్లాడుతూ ఎర్ర చందనం అక్రమ రవాణా ప్రాంతంలో సిబ్బందికి ఆధునిక ఆయుధాలు సమకూర్చామని...అటవీ ప్రాంతంలో వేగంగా కదిలే వాహనాల కొనుగోలుకి ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసిందన్నారు. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2500 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. రాష్ట్రంలో 33 శాతం అడవులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ సీపీ రాజీవ్ కుమార్ మీనా, అదనపు పిసిసిఎఫ్ ఎకె ఝా, విశాఖ సిసిఎఫ్ రాహుల్ పాండే, సీనియర్ అటవీ శాఖాధికార్లు పాల్గొన్నారు. -
విద్యుత్ కొనుగోళ్లతో రూ.5 వేల కోట్ల భారం
-
విద్యుత్ కొనుగోళ్లతో రూ.5 వేల కోట్ల భారం
సాక్షి, అమరావతి: సోలార్, విండ్ పవర్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.ఐదు వేల కోట్ల భారం పడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్కి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. సోలార్,విండ్ పవర్ల కోసం యూనిట్కు రూ.3.55 భారం పడుతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సోలార్, విద్యుత్ పవర్ల కొనుగోలు కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీలో మరింత సంక్షోభం తలెత్తుతోందని పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన విద్యుత్ సరఫరా కంపెనీలు దేశంలోనే అత్యంత తక్కువ విద్యుత్ సరఫరా నష్టాలు నమోదు చేస్తూ మంచి పనితీరు కనబరుస్తున్నా, పై కారణాల వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని లేఖలో ప్రస్తావించారు. భారం రూ.5,300 కోట్లు.. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించడానికి విద్యుత్ సరఫరా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి సోలార్, విండ్ పవర్ల కంపెనీలతో నిరంతరాయంగా చర్చలు జరుపుతోందని..తగిన పరిష్కార మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో ఏడాదికి 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే.. అందులో 15వేల మిలియన్ యూనిట్లు సోలార్, విండ్ పవర్లదేనని..దీనివల్ల పడే భారం రూ.3.55పైసలు చొప్పున ఏడాదికి రూ.5300 కోట్లు అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కొనుగోలు రూపంలో ప్రతి సోలార్, విండ్ పవర్ యూనిట్కు రూ.4.84 కన్నా ఎక్కువ చెల్లిస్తోందన్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం.. గడిచిన నాలుగేళ్లుగా నిర్ణయించిన పరిమితికి మించి సోలార్, విండ్ పవర్ను కొనుగోలు చేస్తున్నామని, దీనివల్ల జెన్కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి, సోలార్, విండ్ పవర్ ల కోసం అధిక భారాన్ని మోస్తున్నామన్నారు. చిన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రానికి ఇది తీవ్ర నష్టంగా ఉందన్నారు. ఇన్ని సమస్యలున్నా ప్రత్యామ్నాయ, సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 175 జిగా వాట్స్ లక్ష్యాన్ని తనకు కష్టం ఉన్నా సరే భుజానకెత్తుకోవాల్సి వచ్చిందని మంత్రి బాలినేని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల కోసం సంక్షేమ పథకాలు ప్రకటించిన విధంగానే కేంద్రం కూడా సోలార్, విండ్ పవర్ ప్రమోషన్లో భాగంగా సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుందని సూచించారు. భారాన్ని మోపడం సమంజసం కాదు.. మరోవైపు విభజన నాటికి ఆస్తులు పంపిణీ చేయకుండా కేవలం అప్పులు మాత్రమే పంపిణీ జరగడం రాష్ట్ర ప్రజలకు భారంగా మారిందని పేర్కొన్నారు. అధిక విద్యుత్ ధరల మీద ఏపీ డిస్కంలు ఎన్సిఎల్టి ను ఆశ్రయించడమో, ఇప్పటికే అధికంగా ఉన్న ధరలను ఇంకా పెంచి వినియోగదారులపై భారాన్ని మోపడం కూడా సమంజసం కాదని సూచిస్తూ..ఈ నేపథ్యంలో ఈ సంక్షోభానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారం చూపేందుకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరులు శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇంధన శాఖ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఎన్టీపీసీ కరెంట్కు చంద్రబాబు అవినీతి షాక్ : బాలినేని
సాక్షి, అమరావతి : కుడిగి ఎన్టీపీసీ కరెంట్కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి షాక్ తగిలిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. చంద్రబాబు కమీషన్ల కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజా ధనానికి నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. ప్రైవేటు సంస్థలకు అధిక ధరలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు సొంత మనుషులు నెలకొల్పిన కొన్ని సోలార్, విండ్ పవర్ ప్లాంట్లకు లబ్ధి చేకూర్చేందుకు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ కుడిగి ఎన్టీపీసీ నుంచి తక్కువ ధరకు కరెంట్ వస్తున్న ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు తగ్గించేశారని వెల్లడించారు. కానీ ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా వందల కోట్ల రూపాయల ఫిక్స్ చార్జీలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గపు చర్యలు వల్ల కడిగి నుంచి రూ. 4.80కే కరెంట్ లభిస్తున్నా.. రూ.11.84 కొనుగోలుకు అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను గణంకాలతో ఆయన సహా ఆయన వివరించారు. -
చిత్తూరులో 65వ వన్యప్రాణి వారోత్సవం
-
‘సమీర్- రాణి’ పిల్లలకు నామకరణం!
సాక్షి, తిరుపతి: శ్రీవెంకటేశ్వర జూ పార్కులో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. జూ పార్కుకు చెందిన తెల్ల పులులు సమీర్, రాణిలకు పుట్టిన సంతానానికి రాష్ట్ర అటవీశాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామకరణం చేశారు. మూడు మగ పులి పిల్లలకు వాసు, సిద్ధాన్, జగన్ అని... ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గ అనే పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్. ప్రదీప్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు నళినీ మోహన్, ఏకే ఝా, ఆర్కే సుమన్, శరవణన్, జూ క్యూరేటర్ బబిత తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గాయత్రి దేవి అలంకారంలోఉన్న అమ్మవారిని గవర్నర్ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయ ఈవో సురేష్బాబు గవర్నర్ దంపతులను శేష వస్త్రాలతో సత్కరించారు. అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో దుర్గమ్మ గుడి ఒకటిగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. గనులశాఖ మంత్రి బాలినేన్ శ్రీనివాస్రెడ్డి ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు గాయత్రీ దేవీ అలంకారంలో ఉన్న దుర్గమ్మకు బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
బాబు పాపాలే విద్యుత్ శాఖకు శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతి, లంచగొండి తనం, తప్పుడు విధానాల కారణంగా విద్యుత్ సంస్థలకు ఇబ్బంది ఏర్పడిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన చేసిన తప్పులు, అక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదించేందుకు టీడీపీ, ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన ఐదేళ్లలో విద్యుత్ రంగంలో అవినీతి, అక్రమాలు, అస్తవ్యస్త విధానాల గురించి ఏరోజూ ప్రజల పక్షాన ఆ వర్గం మీడియా పనిచేయలేదన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారన్నారు. మార్చి 2019 నాటికి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం రూ.20 వేల కోట్లు బకాయిలు పడిందని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే విద్యుత్ రంగాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. కేంద్రానికి లేఖ రాయడంతో పాటు సింగరేణి నుంచి బొగ్గు సరఫరాను పెంచాలని కోరారని వివరించారు. మరోవైపు విద్యుత్ కంపెనీల బకాయిలను చెల్లించుకుంటూ వస్తున్నారన్నారు. ఎన్టీపీసీకి రూ.3,414 కోట్లు, ఇతర విద్యుత్ సంస్థలకు రూ.1,200 కోట్లు చెల్లించామని తెలిపారు. -
చంద్రబాబుకు చెంపపెట్టు: బాలినేని
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కోర్టు తీర్పు చంద్రబాబు, టీడీపీకి చెంపదెబ్బ అని.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని విద్యుత్ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పీపీఏల పునఃసమీక్ష వ్యవహారాన్ని తాము కోరినట్టుగా ఏపీఈఆర్సీకి హైకోర్టు అప్పగించిందన్నారు. రేట్లు ముట్టుకోకూడదన్న కంపెనీల వాదనను కోర్టు తోసిపుచ్చిందని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలన్నీ ప్రజల కోసమేనని తెలిపారు. విద్యుత్రంగ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అవినీతి రహిత, పారదర్శక పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేస్తున్నారని.. అందులో భాగంగా పీపీఏలపై కూడా సమీక్ష చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. చేతనైతే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ధైర్యంగా తీసుకుంటున్న చర్యలను సమర్థించాలని.. లేకపోతే మౌనంగా కూర్చోవాలన్నారు. (చదవండి : విద్యుత్ కంపెనీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!) ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కట్టుకథలు.. కొన్ని కంపెనీలతో కుమ్మక్కై అధిక ధరకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను మాత్రమే పునఃసమీక్షిస్తామని చెప్పామన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, విద్యుత్ పంపిణీ సంస్థలు బతికి బట్టకట్టడానికే ఈ నిర్ణయాలని చెప్పామన్నారు. ప్రజలకోసం కాకుండా లోపాయికారీ ఒప్పందాలు కోసం చంద్రబాబు, టీడీపీ నాయకులు పోరాటం చేశారని మండిపడ్డారు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష ఘోర అపరాధంగా, అభివృద్ధికి నిరోధంగా కట్టుకథలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లంచగొండి విధానాల వలనే.. పీపీఏల పునఃసమీక్ష రాజ్యాంగవిరుద్ధం, చట్ట విరుద్ధం అని మాట్లాడారని.. పరిశ్రమలకు తక్కువ ధరకు విద్యుత్ రావాలన్నా, డిస్కంలు బతికి బట్టకట్టాలన్నా, విద్యుత్ కంపెనీలకు సకాలంలో చార్జీలు చెల్లించాలన్నా... ఈ చర్యలు తప్పనిసరి అని మంత్రి బాలినేని పేర్కొన్నారు. తాము ప్రజల తరఫున మాట్లాడుతున్నామని.. ఛార్జీలు తక్కువ ఉంటేనే ప్రజలకు, పారిశ్రామిక రంగానికి మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు లంచగొండి విధానాల వల్లే గడచిన ఐదేళ్లలో విద్యుత్ సంస్థల బకాయిలు 20 వేల కోట్లు దాటాయని విమర్శించారు. -
నేడు మంత్రి బాలినేని పర్యటన ఇలా
సాక్షి, ఒంగోలు సిటీ: రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన ఆదివారం రాత్రికి ఒంగోలుకు చేరుకొని వీఐపీ రోడ్డులోని ఆయన నివాస గృహంలో బస చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ► ఉదయం 10.15 గంటలకు వీఐపీ రోడ్డు పాత సుజాత నగర్ వద్ద బాబూరావు అధ్యక్షతన జరిగే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ► 10.30 గంటలకు వీఐపీ రోడ్డులోని విశ్వసేవిక ఆశ్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత అధ్యక్షతన జరిగే వృద్ధులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ► 10.45 గంటలకు ప్రభుత్వ బీసీ వసతి గృహంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు కటారి శంకర్ అధ్యక్షతన విద్యార్థులకు ట్రంకు పెట్టెలు, ఇతర వస్తువుల పంపిణీలో పాల్గొంటారు. ► 11 గంటలకు గాంధీరోడ్డులో పట్నం మధు, ఎస్.కె.మీరావలి అధ్యక్షతన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ► 11.15 గంటలకు మాతాశిశు వైద్యశాలలో బాలింతలకు నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు అధ్యక్షతన పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ► 11.30 గంటలకు చర్చి సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు. ► 11.45 గంటలకు గోరంట్ల కాంప్లెక్సు వద్ద జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ జలీల్ అధ్యక్షతన రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ► 11.55 గంటలకు బలరాం కాలనీలో డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్ అధ్యక్షతన పేదలకు చీరల పంపిణీ, వృద్ధులకు పండ్ల పంపిణీలో పాల్గొంటారు. ► మధ్యాహ్నం 12.10 గంటలకు ఆర్టీసీ బస్టాండ్లో 49వ డివిజన్ నాయకులు గురవయ్య, కాశయ్య అధ్యక్షతన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ► 12.20 గంటలకు కూచిపూడి బజారులో 45వ డివిజన్ నాయకులు రవి అధ్యక్షతన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ► 12.30 గంటలకు ఉమా మనోవికాసకేంద్రంలో డివిజన్ నాయకులు రవి అధ్యక్షతన రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ► 12.45 గంటలకు గాంధీనగర్లో స్ధానిక నాయకులు పెద్దిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించే కార్యక్రమం, పలహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ► రాత్రి 7.30 గంటలకు మాజీ కౌన్సిలర్ ఈదర చిన్నారి అధ్యక్షతన హౌసింగ్ బోర్డులో వినాయక విగ్రహ సందర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ► 8 గంటలకు గాంధీరోడ్డులో సూపర్బజార్ మాజీ అధ్యక్షుడు తాతా ప్రసాద్ అధ్యక్షతన వినాయక విగ్రహం సందర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ► 8.15 గంటలకు రంగుతోటలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అధ్యక్షతన వినాయక విగ్రహం సందర్శన కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
జోరుగా జల విద్యుదుత్పత్తి
సాక్షి, అమరావతి: ‘గత కొద్ది రోజులుగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జోరందుకుంది. ఇది ఎంతో శుభ పరిణామం’ అనిరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్టు రెండో వారంలోనే కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా జల విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయడం ఇటీవల కాలంలో అరుదైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై మంత్రి ఆదివారం విద్యుత్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి చర్చించిన విషయాలను ఇంధన శాఖ మీడియా సలహాదారు చంద్రశేఖర్రెడ్డి విలేకరులకు వివరించారు. శ్రీశైలంలో ఈ ఏడాది 715 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే నాగార్జునసాగర్లోనూ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కాగా, జల విద్యుత్ యూనిట్ రూ.1.6కే ఉత్పత్తి అవుతున్నందున ఖరీదైన విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తామన్నారు. రైతులకు 9 గంటలు పగటి పూట ఉచిత విద్యుత్ సరఫరావల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. ‘ఖరీఫ్’కు పక్కా ప్రణాళిక కాగా, ఖరీఫ్ సీజన్లో విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశముందని.. దీనిని తట్టుకునేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సమావేశంలో వివరించారు. వర్షాలు కురవడంతో ఈనెల తొలి వారంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 30 మిలియన్ యూనిట్ల మేర తగ్గిందని, ఫలితంగా విద్యుత్ సంస్థలకు రూ.100 కోట్లకు పైగా ఆదా అయ్యే అవకాశముందని వివరించారు. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం ఉండడంతో రానున్న పది రోజుల్లో 165 మిలియన్ యూనిట్ల వరకు జల విద్యుదుత్పత్తి చేయగలమని ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్ మంత్రి బాలినేనికి వివరించారు. ఒకవేళ కృష్ణానదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి 100 టీఎంసీలు కేటాయిస్తే ఏపీ జెన్కో దాదాపు 550 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. మొత్తంగా రూ.114.4 కోట్ల వ్యయం (యూనిట్ రూ.1.60 చొప్పున)తో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి 715 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చని వివరించారు. ఇంతే మొత్తంలో థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే రూ.329 కోట్లు (యూనిట్ రూ.4.60 చొప్పున) ఖర్చవుతుందని శ్రీధర్ తెలిపారు. టెలీకాన్ఫరెన్స్లో ఏపీ ట్రాన్స్కో జేఎండీలు కేవీఎన్ చక్రధర్బాబు, పి.ఉమాపతి, సీఎండీలు నాగలక్షి్మ, హెచ్. హరనాథరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
వారికి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తర సయమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ.. పాతపట్నం పరిధిలోని గిరిజనులను ఆదుకోవాలని కోరారు. ఏనుగుల దాడి నుంచి గిరిజనులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో గిరిజనలు ఆదుకునే నాధుడే లేరని ఆరోపించారు. ఏనుగుల దాడిలో ఎంతో మంది గిరిజనులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏనుగులు గ్రామాలలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కోరారు. సభ్యుల విజ్ఞప్తిపై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి స్పందించారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లను జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 11 మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చామని వెల్లడించారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. కాపులను చంద్రబాబు మోసం చేశారు కాపుల విషయంలో చంద్రబాబు నాయుడు కపట నాటకం ఆడారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. రిజర్వేషన్లపై మంజునాథన్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కాపు ఉద్యమాన్ని పోలీసులతో ఏ విధంగా అణచివేశారో అందరికీ తెలుసన్నారు. కాపులను ఏ విధంగా బీసీలలో చేరుస్తారని కేంద్రం అడిగిన ప్రశ్నకు చంద్రబాబు జవాబు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటులో దిట్ట అయిన బాబు కాపులను కూడా అలాగే మోసం చేశారని ఆరోపించారు. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. -
విస్తుగొలిపే మోహనరావు వికృతాలు
గుంటూరు: గుంటూరు జిల్లా ఫారెస్ట్ అధికారి మోహనరావు వికృత చేష్టలపై డొంక కదులుతోంది. పోలీసుల విచారణలో పలువురు బాధిత మహిళలు ఆయన అకృత్యాలను ధైర్యంగా బయటపెడుతున్నట్టు తెలిసింది. ఉద్యోగాల పేరుతో యువతుల నుంచి డబ్బు తీసుకోవడంతో పాటు.. లైంగికంగా వికృత చేష్టలకు పాల్పడుతున్న కె.మోహనరావుపై మేడికొండూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఉద్యోగం పేరుతో రూ.2 లక్షలు తీసుకోవడంతో పాటు.. లైంగికంగా వేధిస్తూ వికృత చేష్టలకు పాల్పడేవారని చీరాలకు చెందిన యువతి బుధవారం అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మేడికొండూరు సీఐ ఎం.ఆనందరావు, సిబ్బంది పేరేచర్లలోని ఫారెస్ట్ కార్యాలయానికి చేరుకుని అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని విచారించారు. చదవండి: ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు అయితే ఫారెస్ట్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ యువతిని కూడా బలవంతంగా లొంగదీసుకుని సెలవు రోజుల్లో ఆమెపై వికృత చేష్టలకు పాల్పడినట్టు పోలీసుల ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైందని తెలిసింది. గుంటూరుకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం వెళితే రూ.4 లక్షలు తీసుకుని ఆమెను కూడా ఇదే తరహాలో భయపెట్టి లోబరచుకున్నాడు. తన డబ్బు ఇవ్వకుంటే నడిరోడ్డుపై కూర్చుంటానని ఆ యువతి హెచ్చరించడంతో విడతలవారీగా రూ.3.50 లక్షలు తిరిగి ఇచ్చాడని ఆమె చెప్పినట్టు సమాచారం. మాచర్లకు చెందిన ఓ రిక్షా కార్మికుడి కుమార్తెను కూడా ఇదే తరహాలో లోబరుచుకునేందుకు యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అనంతరం మోహనరావు ఆ రిక్షా కార్మికుడిని బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశాడని తెలిసింది. అయితే ఈ విషయం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టిలో ఉండటంతో ఆయన కూడా ఈ విషయాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టికి తీసుకెళ్లి.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. డీఎఫ్ఓను బదిలీ చేయండి సాక్షి, అమరావతి: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు డీఎఫ్ఓను మోహనరావును తక్షణమే బదిలీ చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మోహన్రావు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మంత్రికి ఫిర్యాదు అందింది. దీంతో ఆయనను తక్షణమే బదిలీ చేసి, విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ దళాల అధిపతి రిజ్వీని మంత్రి ఆదేశించారు. -
జాబ్ పేరుతో వికృత చేష్టలు, డీఎఫ్వోపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా అటవీశాఖాధికారి డీఎఫ్వో మోహన్రావుపై బదిలీ వేటు పడింది. ఆరోపణలపై విచారణ జరిపి తక్షణమే నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నత అధికారులను విద్యుత్, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నివేదిక రాగానే డీఎఫ్వోపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పస్టం చేశారు. కాగా అటవీశాఖలో కాంట్రాక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని మోహన్రావు ఓ మహిళ వద్ద డబ్బులు వసూలు చేయడంతో పాటు కోరికలూ తీర్చితేనే ఉద్యోగమంటూ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఐదు నెలలు లైంగికంగా వేధించి చివరకు డబ్బు లేదు.. ఉద్యోగమూ లేదని చెప్పడంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన మంత్రి బాలినేని సదరు అధికారిని బదిలీ చేయాలంటూ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. చదవండి: ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు -
రైతన్న కోసం ఎంతైనా ఖర్చు
సాక్షి, అమరావతి: చౌకగా నాణ్యమైన విద్యుత్ను ప్రజలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఖరీదైన విద్యుత్ కొనుగోళ్లకు స్వస్తి చెప్పి, విద్యుత్ రంగాన్ని ఐదేళ్లుగా పట్టి పీడిస్తున్న జాడ్యాన్ని వదిలించాలని అధికారులకు పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ అధికారి చంద్రశేఖర్రెడ్డి మీడియాకు విడుదల చేశారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి బాలినేని చెప్పారు. తొమ్మిది గంటల పగటి విద్యుత్ సరఫరాను శాశ్వతం చేస్తామన్నారు. ఇందు కోసం రూ. 2,780 కోట్లు (రూ. 1,700 కోట్లు అదనపు మౌలిక సదుపాయాలకు, రూ. 1,080 కోట్లు అదనంగా 2 గంటలు సరఫరా చేసేందుకు) ఖర్చు చేయనున్నట్లు వివరించారు. దీనివల్ల సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తుందనేది ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఉచిత విద్యుత్ను సమర్థంగా అమలు చేసేందుకుగాను 18 లక్షల మంది రైతుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖలో లొసుగులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండును తీర్చే స్థాయిలో ఏపీ జెన్కో సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. జెన్కోను బలోపేతం చేద్దాం: ఇంధన శాఖ కార్యదర్శి ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోను బలోపేతం చేసే దిశగా ఉద్యోగులు శ్రమించాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి సిబ్బందిని కోరారు. సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడం, విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉదయ్, డీడీయూజీజేవై, ఐపీడీఎస్ వంటి వాటిని గరిష్టంగా వినియోగించుకోవడంపై నిర్దేశిత గడువుతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,995 మెగావాట్ల డిమాండ్ ఉందని, 2023–24 కల్లా ఇది 15,015 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ తలసరి విద్యుత్ వినియోగం 1,147 కిలోవాట్లుగా ఉందని, జాతీయ స్థాయిలో ఇది 1,149 కిలోవాట్లని తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే దిశగా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, చౌక విద్యుత్ కొనుగోలుకే ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాంత్ సూచించారు. గడువులోగా జెన్కో పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్ పేర్కొన్నారు. ఎన్టీటీపీఎస్ ఐదో దశ (800 మెగావాట్లు), కృష్ణపట్నం (800 మెగావాట్లు) థర్మల్ ప్రాజెక్టులను ఆర్నెల్లలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
‘పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ప్రారంభింపచేస్తాం’
సాక్షి, ప్రకాశం : ప్రతీ గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి సమీక్షించారు. జిల్లాలో గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య ఉందన్నారు. ఒంగోలు, మర్కాపురంలలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కావరిడార్ పనులపై త్వరలో సమీక్షిస్తామన్నారు. రైతులకు పగటిపైట తొమ్మిది గంటల నిరంతరాయ విద్యుత్ను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్రిపుల్ ఐటీ తరగతులను ఒంగోలుకు తీసుకొస్తాం : ఆదిమూలపు జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం ఇడుపులపాయలో నడుస్తోందని, ఆ తరగతులను ఒంగోలుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గత డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు త్వరలో జిల్లాల వారీగా సర్టిఫికేట్ల వెరిఫికేష్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మఒడి కార్యక్రమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రెండు ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాని మారుస్తామన్నారు. -
అధికార పార్టీకి తొత్తుగా పోలీసు వ్యవస్థ
ఒంగోలు: తమ పార్టీ కార్యాలయ ప్రారంభానికి ముందస్తు అనుమతులు ఇచ్చి కూడా అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన తన నివాసంలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ వెంట వేలాదిమంది కార్యకర్తలు ఉంటే కేవలం వంద మంది కూడా లేని టీడీపీ నాయకులను బూచిగా చూపించి ప్రజాస్వామ్య హక్కును కాలరాసేలా పోలీసుశాఖ వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం కాదని, నేరుగా ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని టీడీపీ నేత జనార్దన్కు సవాల్ విసురుతున్నానన్నారు. ఒంగోలులో జరిగిన ఘటనతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి ఎంతలా కొమ్ముకాస్తోందో తెలుస్తోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేను బస్సులో కింద కూర్చోబెట్టి రాత్రంతా తమిళనాడులో తిప్పి తెల్లవారుఝామున అనారోగ్యానికి గురైనా పట్టించుకోకుండా సత్యవేడు పోలీసుస్టేషన్లో వదిలారన్నారు. దీనిపై చిత్తూరు ఎస్పీ ఇస్తున్న సమాధానం సరిగా లేదన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల కమిషన్తోపాటు మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయిస్తామన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్ర పోలీసులు వివక్ష ప్రదర్శిస్తున్నారని, దీనిపై గవర్నర్కు కూడా రాతపూర్వకంగా తెలియజేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ బాచిన చెంచుగరటయ్య పాల్గొన్నారు. -
ఫ్రంట్ పేరు చెబితే ఉలుకెందుకు?
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డితో టీఆర్ఎస్ నేతలు జరిపిన చర్చలను వక్రీకరించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ రాద్దాంతానికి తెర లేపారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరు వింటేనే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భవించిందని అన్నారు. శనివారం ఒంగోలు నగరంలోని 43వ డివిజన్లో జరిగిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ టీఆర్ఎస్ నేత కేటీఆర్ జగన్మోహన్రెడ్డిని కలిసినప్పటి నుంచి చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో లేని టీఆర్ఎస్తో వైఎస్సార్ సీపీ పొత్తులు పెట్టుకుందని ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్టానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా టీఆర్ఎస్ కలిసి వస్తుందని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫెడరల్ ఫ్రంట్లో కలిసి ప్రజల సంక్షేమం కోసం పని చేయడానికి జరిగిన చర్చలను చంద్రబాబు వక్రీకరించి, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాపీల బాబును ప్రజలు నమ్మరు.. ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుకనే జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని పెంచారన్నారు. నిజంగా పేదలపై అంత ప్రేమ ఉంటే నాలుగేళ్ల నుంచి పింఛన్ ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కాపీల బాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ఓటమి భయంతోనే పింఛన్ రూ.2 వేలకు పెంచారన్నారు. ఎన్నికల్లో ఎక్కడ వెనుకబడిపోతామోనన్న భయంతో హడావుడిగా పెంచిన పింఛన్ అమలుకు పూనుకున్నారన్నారు. ఆటో, ట్రాక్టర్లకు పన్నుల రద్దు జగన్ ప్రకటించిన నవరత్నాల్లోనివేనని ప్రస్తావించారు. చంద్రబాబు ఇంకా రైతుబంధు పథకం కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారన్నారు. కనీసం ఎన్నికల సమీపంలోనైనా ప్రజలకు కొంత మేలు జరుగుతుందంటే అది ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చలవేనన్నారు. చంద్రబాబు ఎన్ని తాయిలాలు ప్రకటించినా ప్రజలు అర్థం చేసుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు మానసికంగా సిద్ధమయ్యారన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లల్లో తెలుగుదేశం చేసిన అభివృద్ధి లేకపోగా ప్రజాధనాన్ని వాటాలు వేసుకొని లూఠీ చేశారని విమర్శించారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో చంద్రబాబు ఉలికిపాటుకు గురవుతున్నారని, జగన్కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఉద్వేగానికి లోనవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, అదనపు కార్యదర్శి వేమూరి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
తాలూకా సీఐపై ఎస్పీకి బాలినేని ఫిర్యాదు
ఒంగోలు: తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉందని, పోలీసు విధుల్లో ఉన్న వారు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటంటూ ఎస్పీ సత్యఏసుబాబుతో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్కు ఆయన స్వయంగా హాజరయ్యారు. ఇటీవల ఇందిరమ్మ కాలనీలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టారని, ఆ ఫ్లెక్సీలో పలువురు మహిళలు కూడా ఉన్నారన్నారు. ఈ క్రమంలో కోటేశ్వరి అనే మహిళ పట్ల సాయి అనే వ్యక్తి అసభ్యంగా మాట్లాడటంతో ఆమె అతడిని ప్రశ్నించిందని ఎస్పీ దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. దీనికి అతను పరుష పదజాలం వాడడంతో మనస్తాపానికి గురైన ఆమె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయగా మరునాడు రమ్మని సూచించారన్నారు. ఆదివారం ఆమె పోలీసుస్టేషన్కు వెళ్తే ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో ఉంచుకొని ఫిర్యాదు చేసిన మహిళను మనస్తాపానికి గురిచేశారని బాలినేని పేర్కొన్నారు. అంతే కాకుండా సోమవారం ఉదయం మళ్లీ పోలీసుస్టేషన్కు రావాలని తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు హెచ్చరించాడన్నారు. ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులు సరైన చర్యలు కాదని, ఇటీవల కేశవరాజుకుంట వ్యవహారంలో కూడా సీఐ స్థానిక మహిళల పట్ల ఉపయోగించిన పదజాలం బాధాకరమన్నారు. ఈ మేరకు రాతపూర్వకంగా వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ.. ఇందిరమ్మ కాలనీ ఘటనపై పూర్తి సమాచారంతో తనకు సోమవారం సాయంత్రానికి రిపోర్టు అందజేయాలని తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లును ఆదేశించారు. అంతే కాకుండా విధి నిర్వహణలో వివాదం తెచ్చుకోవద్దంటూ హితవు పలికారు. సోమవారం జిల్లా ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్కు మొత్తంగా 45 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను పరిశీలించిన ఎస్పీ వాటిని పరిశీలించి న్యాయం చేయాలంటూ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. -
సర్కారుకు రైతుల ఉసురు తప్పదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 582 అడుగుల నీరున్నా వరిపంటకు పూర్తిస్థాయిలో నీరివ్వలేమని చంద్రబాబు సర్కార్ చేతులెత్తడం దుర్మార్గమని, బాబుసర్కార్ కు జిల్లా రైతాంగం ఉసురు తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాకు 60 టీఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ పట్టుమని 12 టీఎంసీల నీరుకూడా రాలేదన్నారు. ఎగువన వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండాయన్నారు. నాలుగేళ్లుగా వరుస కరువులతో పంటలు లేక కరువు బారినపడిన జిల్లా రైతాంగం ఈ సారైనా నీళ్లొస్తామని ఆశించారన్నారు. ప్రభుత్వం సైతం వరిపంటకు నీళ్లిస్తామని ప్రకటించిందని బాలినేని చెప్పారు. దీంతో రైతులు వరినార్లు పోసుకున్నారని, తీరా వరిపంటకు పూర్తిస్థాయిలోల నీళ్లివ్వలేమని అధికారులు, ప్రభుత్వం చేతులెత్తడం దుర్మార్గమన్నారు. సాగర్ కింద ఆరుతడి పంటలు పోను పట్టుమని రెండు లక్షల ఎకరాలు కూడా వరిపంట సాగయ్యే పరిస్థితి లేదన్నారు. ఇందు కోసం 20 టీఎంసీల నీరు సరిపోతుందన్నారు. మొత్తం ఆరుతడి పంటకు కలిపి 8 నుండి 10 టీఎంసీ నీరు సరిపోతుందని బాలినేని తెలిపారు. ఒక వైపు జిల్లాకు ఇంకా 40 టీఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు. ఈ నీరు అన్ని పంటలకు సరిపోతుందన్నారు. అలాంటిది ఇప్పటి వరకూ వరినార్లు పోసుకున్నవారు మాత్రమే వరి సాగుచేయాలని ప్రభుత్వం చెప్పడం దారుణమని బాలినేని విమర్శించారు. ఇప్పటి వరకూ పట్టుమని 20 శాతం కూడా వరి సాగు కాలేదన్నారు. అధికారులు చెప్పిన ప్రకారం మరో 30 శాతం కూడా వరినాట్లు పడేపరిస్థితి లేదన్నారు. నాలుగేళ్లు వరుస కరువులతో తిండిగింజలు, పశువుల మేత అందక రైతాంగం విలవిల లాడుతోందన్నారు. వైఎస్ హాయంలో సాగర్లో 545 అడుగుల నీరున్నపుడే వరిపంటకు నీళ్లిచ్చారని బాలినేని గుర్తు చేశారు. ప్రస్తుతం సాగర్ లో 582 అడుగుల నీరున్నా పూర్తిగా వరిపంటకు నీరు ఇవ్వలేమనడం దారుణమన్నారు. జిల్లా టీడీపీ నేతలకు ప్రజా ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. ఏ మాత్రం రైతులపై ప్రేమున్నా ముఖ్యమంత్రి పై ఒత్తిడి తెచ్చి సాగర్ జలాలను పూర్తిస్థాయిలో తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని బాలినేని సూచించారు. ప్రకాశం జిల్లా రైతాంగంపై వివక్షతోనే చంద్రబాబు సర్కార్ ఇలా చేస్తుందని బాలినేని విమర్శించారు. వరి పంటకు పూర్తిస్థాయిలో నీరివ్వక పోతే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. -
నేటి నుంచి రావాలి జగన్.. కావాలి జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో గ్రామ గ్రామాన మరోమారు ప్రచారం నిర్వహించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రావాలి జగన్–కావాలి జగన్ పేరుతో సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను, వాటివల్ల ప్రజలకు జరిగే మేలును ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. అదే సమయంలో అధికార పార్టీ శాసన సభ్యులు, ముఖ్యనేతలతో పాటు గ్రామస్థాయి నేతల దోపిడీని ఎత్తి చూపనున్నారు. పనులు చేయకుండానే ప్రజాధనాన్ని దోచుకుతినడం, సంక్షేమ పథకాలను అర్హులకు కాకుండా అనర్హులకు అప్పగించడం, ప్రతి పనిలోనూ కమీషన్లు పుచ్చుకోవడం తదితర అక్రమాలను ప్రజల ముందుంచనున్నారు. ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత స్థానిక నేతలతోపాటు ముఖ్యమంత్రి జిల్లాకు ఇచ్చిన వందలాది హామీలను పట్టించుకోకపోవడాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ప్రజలకు గుర్తు చేయనున్నారు. ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పనులు తప్ప నాలుగున్నరేళ్ల పాలనలో మిగిలి ఉన్న అరకొర పనులను చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడాన్ని ప్రజలకు వివరించనున్నారు. రామాయపట్నం పోర్టు, దొనకొండ, కనిగిరిలో పరిశ్రమలు నెలకొల్పుతామన్న హామీలను తుంగలో తొక్కడం, మూడు సంవత్సరాలవుతున్నా కనీసం ట్రిపుల్ ఐటీకి భవనాలు కూడా ప్రభుత్వం నిర్మించకపోవడాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ప్రజల ముందుంచనున్నారు. ఒంగోలు డెయిరీని పతనావస్థకు చేర్చడం, పీడీసీసీబీని నిర్వీర్యంచేయడం, కరువు రైతులను పట్టించుకోకపోవడం, సాగర్ జలాలు వచ్చినా సకాలంలో నీళ్లివ్వకపోవడం, రైతులకు వరి విత్తనాలను అందించకపోవడంతో పాటు జిల్లాకు ఇచ్చిన వందలాది హామీలను టీడీపీ సర్కార్ తుంగలో తొక్కడాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఎత్తి చూపనున్నారు. జిల్లాలో సోమవారం నుంచి మూడు నెలల పాటు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి నెలా 20 రోజులకు తగ్గకుండా నేతలు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పార్టీ నేతలు ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి జనంలో ఉండి ప్రచారం చేస్తారు. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు సైతం కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలకాలని ఆయన కోరారు. జగన్ సీఎం అయితేనే జిల్లా అభివృద్ధి: మాజీ మంత్రి బాలినేని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే తిరిగి వైఎస్ పాలన వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. జిల్లాకు సంబంధించి ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ సర్కార్ నెరవేర్చలేదన్నారు. వెలిగొండపై బాబు మాయమాటలు చెబుతున్నాడన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. ప్రజలు పాల్గొని కార్యక్రమాన్న విజయవంతం చేయాలన్నారు. వైఎస్సార్ సీపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలని బాలినేని పిలుపునిచ్చారు. -
వట్టి మాటలు కట్టిపెట్టండి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాలుగేళ్లుగా అధికారంలో ఉండి వెలిగొండ పనలను పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు సంక్రాంతికి వెలిగొండ నీరిస్తానంటూ పశ్చిమ ప్రాంతవాసులను వంచిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఒంగోలులో సాక్షితో మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో కనీసం మూడు కిలో మీటర్లు కూడా వెలిగొండ టన్నెల్ తవ్వలేదని, వచ్చే 5 నెలల్లో మూడున్నర కిలోమీటర్ ఎలా తవ్వుతారని బాలినేని ప్రశ్నించారు. జిల్లా వాసులను మభ్యపెట్టేందుకే చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. వెలిగొండ టన్నెల్ పనులు నిలిచి పోయి మూడు నెలలు దాటుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు వెలిగొండ పనులంటూ హడావిడి చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మంగళవారం పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసిన అధికార పార్టీ నేతలు వెలిగొండకు వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. దివంగత నేత వైఎస్ హయాంలోనే60 శాతానికి పైగా వెలిగొండ పనులు పూర్తి చేశారన్నారు. వైఎస్ మరణంతోనే వెలిగొండ పనులు నిలిచి పోయాయన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు వెలిగొండ ప్రాజెక్టు పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తెలియచెప్పడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ పాదయాత్ర చేపట్టిందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండను పూర్తి చేసి నీరిస్తామని బాలినేని స్పష్టం చేశారు. -
ఉద్యమం పై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం
-
పోలవరాన్ని పూర్తి చేయలేని అసమర్థుడు బాబు
-
రాజన్న తనయుడికి ఘన స్వాగతం
సాక్షి, ఒంగోలు: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలో పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా వైఎస్ జగన్ కొత్తపేటలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజాసంకల్పయాత్ర జిల్లాలో 9 నియోజకవర్గాల పరిధిలో 255 కి.మీ. మేర సాగనుంది. జగన్ యాత్రకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగన్ భరోసా కోసం ఎదురుచూపు: గత ఎన్నికల సమయంలో వందలాది హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చక చంద్రబాబు సర్కారు ప్రజలను వంచించింది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ రకరకాల హామీలిచ్చి అన్ని వర్గాలను మభ్యపెట్టారు. ఓట్లేయించుకొని గద్దెనెక్కి హామీలను తుంగలో తొక్కారు. బాబు వంచనతో రైతులు మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, చేనేతలు, కార్మికులు అన్ని రకాల వారు దగా పడ్డారు. చంద్రబాబు సర్కారు వంచనను ఎండగట్టడమే కాక దగా పడిన బాధితులందరికీ తానున్నానంటూ భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ యాత్ర సాగుతోంది. జగన్కు తమ బాధలు, కష్టాలు, కన్నీళ్లు చెప్పుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. రామాయపట్నం పోర్టు వస్తే వెనుకబడిన ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు మేలు జరుగుతుందని అందరూ ఆశ పడుతున్నారు. పోర్టు వస్తేనే పరిశ్రమలొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలొస్తాయని ఎదురు చూస్తున్నారు. పొగాకుకు గిట్టుబాటు ధరల్లేక ఇక్కడి రైతులు లబోదిబోమంటున్నారు. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీళ్లే దిక్కు కావడంతో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధుల బారినపడి వందలాది మంది మృత్యువాతపడుతున్నారు.గుక్కెడు మంచినీళ్ల కోసం వారు దోసిలొగ్గి వేడుకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే వరుస కరువులకు నిలయంగా మారిన పశ్చిమ ప్రకాశం కష్టాలు తీరతాయి. కానీ బాబు సర్కారు కనికరించడం లేదు. మిరప రైతులకు గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి, నాగార్జున సాగర్ కుడికాలువ ఉన్నా వరి పంటకు నీళ్లిచ్చే పరిస్థితి లేదు. ఆరుతడి పంటలకు అంతంతమాత్రమే నీరు. వైఎస్ హయాంలో కొద్దిపాటి నీరున్నా పెద్ద మనసుతో నీళ్లిచ్చిన ఘనత ఆయనకే దక్కిం ది. చీరాల ప్రాంతంలో చేనేతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముం దుకు రావడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో సవాలక్ష సమస్యలున్నా బాబు సర్కారు పట్టించుకోవడం లేదు. సమస్యలను జగన్ దృష్టికి తెచ్చేందుకు జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఆయన భరోసా కోసం ఆశపడుతున్నారు. తొలిరోజు ప్రజాసంకల్పయాత్ర ఇలా... తొలిరోజు జగన్ ప్రజాసంకల్ప యాత్ర లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి రాళ్లపాడు రిజర్వాయర్, తాతా హోటల్, జంపాలవారిపాలెం, పెంట్రాల,వాకమళ్లవారిపాలెం, లింగసముద్రం, బలిజపాలెం, రామకృష్ణాపురానికి చేరనుంది. ఇక్కడితో జగన్ ప్రజాసంకల్ప యాత్ర 1200 కి.మీ. చేరనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం భోజన విరామం సైతం ఇక్కడే. ఆ తర్వాత తిమ్మారెడ్డిపాలెం క్రాస్, వెంగళాపురం మీదుగా వలేటివారిపాలెం మండలం కమ్మపాలెం, బంగారక్కపాలెం క్రాస్ వద్ద తొలిరోజు యాత్ర ముగియనుంది. ఇక్కడే రాత్రి బస 17వ తేదీ ఉదయం వలేటివారిపాలెం నుంచి రెండవ రోజు యాత్ర ప్రారంభమై పోలినేనిపాలెం వద్ద మధ్యాహ్నం స్టే. ఆ తర్వాత షామిరుపాలెం క్రాస్ రోడ్డు, పోకూరు వరకు రెండో రోజు యాత్ర ముగుస్తుంది.18న బడేరుపాలెం ఎస్సీ కాలనీ, మోపవరం, బడేరుపాలెం, బొంతవారిపాలెం, కాకుటూరు, చెర్లోపల్లి, ప్రశాంత్నగర్ వరకు మధ్యాహ్నం స్టే. ఆ తర్వాత కందుకూరులో సభ, సాయంత్రం వెంకటాద్రిపాలెం వరకు యాత్ర సాగి అక్కడ రాత్రి బస ఉంటుంది. -
దేవరపల్లిలో ఏం జరుగుతోంది?
-
దేవరపల్లిలో ఏం జరుగుతోంది?
దళితుల భూములను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి దేవరపల్లి: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూములను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస రెడ్డి శుక్రవారం పరిశీలించారు. యంత్రాలతో చెరువులు తవ్వుతున్న భూముల్లో కలియ తిరిగారు. తమ భూములు దౌర్జన్యంగా లాక్కున్నారని నాయకులు ఎదుట దళితులు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బాధితులకు సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి భరోసాయిచ్చారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో స్థానిక అధికార పార్టీ నేతలు ఆ భూములను లాక్కునేందుకు పలుమార్లు ప్రయత్నించిన్నట్టు బాధితులు ఆరోపించారు. గత ఎన్నికల్లో తమకు ఓట్లేయలేదన్న అక్కసుతో 70 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములు లాక్కునేందుకు సిద్ధమయ్యారని వాపోయారు. టీడీపీ నాయకులు 300 ఎకరాలు ఆక్రమించినా పట్టించుకోని ప్రభుత్వం పోలీసులను మొహరించి తమ భూముల్లో చెరువులు తవ్వడాన్ని తప్పుబడుతున్నారు. కాగా, దేవరపల్లిలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ రామ్శంకర్ కటేరియాకు ఫిర్యాదు చేశారు. -
‘చంద్రబాబు దళిత వ్యతిరేకి’
ఒంగోలు: సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళిత భూములను ప్రభుత్వం లాక్కోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తామన్నారు. తక్షణమే దళితుల భూముల్లో చెరువు తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నీరు-చెట్టు పేరుతో దళితుల భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేవరపల్లి దళిత భూముల్లో చెరువు తవ్వడం సరికాదని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దళితులు ఆందోళన చేస్తుంటే పోలీసు పహారాలో చెరువు తవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. దళితులపై ప్రభుత్వం సామాజిక, ఆర్థిక దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. -
రాష్ట్రంలో నియంత పాలన
∙ దళితులకు అండగా ఉంటామంటే అరెస్టులా? ∙ దేవరపల్లికి తప్పక వెళ్తాను ∙ దామచర్లకి అభద్రతాభావం ఎక్కువైంది ∙ ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదు ప్రజల అవసరాలకు కావాల్సిన పనులు మేం చేశాం ∙ పేదలకు 8 వేల పట్టాలిచ్చాను పర్సంటేజిల కోసం పాకులాడే చరిత్ర నీది ∙ ఏమీ చేయకుంటే నాలుగు సార్లు ప్రజలు గెలిపిస్తారా..? ∙ విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలన నియంత పాలనలా సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పర్చూరు నియోజకవర్గం దేవరపల్లిలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై వారికి అండగా ఉండేందుకు, ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న సమాచారం తెలుసుకొని ఒక రోజు ముందుగానే అర్ధరాత్రి తనని హౌస్ అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అధికార పార్టీ తీరు చూస్తుంటే ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ఎన్ని రోజులు దేవరపల్లికి వెళ్లకుండా ఆపగలరో చూస్తానన్నారు. తప్పకుండా గ్రామానికి వెళ్లి దళితులకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. దళితుల భూములు లాక్కున్న టీడీపీ నేతలని విడిచి వైఎస్సార్ సీపీ నేతలని దిగ్బంధించడం సిగ్గుచేటన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి వస్తున్న వ్యతిరేకత చూసి అభద్రతాభావం ఎక్కువైందన్నారు. మతి చలించిన ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి తాను ఏం చేశానని దామచర్ల ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏమీ చేయకుండా నాలుగు సార్లు ప్రజలు గెలిపిస్తారా అని ప్రశ్నించారు. ఉలిచి చెక్డ్యాం, మెడికల్ కాలేజి, రిమ్స్, ఓవర్హెడ్ ట్యాంకులు, ఫిల్టర్బెడ్లు, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎవరి హయాంలో వచ్చాయో తెలుసుకోవాలని సూచించారు. పర్సంటేజీల కోసం పనులు చేయలేదు.. పేదలకి 8 వేల నివేశన స్థల పట్టాలిచ్చానని గుర్తు చేశారు. ఒక్క పేదవాడికైనా ఒక్క పట్టా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేశామే తప్పా పర్సంటేజిల కోసం పని చేయలేదన్నారు. గుండ్లకమ్మ పైపులైన్ పనుల్లో పర్సంటేజిలు తీసుకొని ఇళ్లు నిర్మించుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయం సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారని విమర్శించారు. చివరికి గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజలు అభిమానంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే చూసి ఓర్వలేకపోవడం సిగ్గు చేట న్నారు. దాంతో ఫ్లెక్సీల వాడకం రద్దు చేశామని చెప్పి టీడీపీ కార్యక్రమాలకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ చిన్న పిల్లాడిలా వ్యవహరించడం దామచర్లకే చెల్లిందన్నారు. ఒంగోలు దామచర్ల జాగీరు కాదని అహ ంకారంతో ప్రవర్తిస్తున్న తీరు ప్రజలతో పాటు టీడీపీ నాయకుల్లోనూ అసహనం కలిగిస్తోందన్నారు. దామచర్లకి బుద్ధి చెప్పే సమయం కోసం ప్రజలు ఆయనతో ఉంటున్న నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వకపోవడంతో అధికారులను బదిలీ చేస్తూ ఒకే సమాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్య ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తన హయాంలో కుల, మత, పార్టీలకు అతీతంగా పనిచేసిన చరిత్ర ఉందన్నారు. దామచర్ల ఆంజనేయులు విగ్రహం ఏర్పాటు చేయాలని జనార్దన్ స్వయంగా కోరి తే సహకరించి ఏర్పా టు చేశామన్నారు. జనార్దన్ తాత ఆంజనేయులు మంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలుకి ఏం చేశారో ఆయన చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత నేత వైఎస్ హయాంలో జిల్లాలో కనిగిరి ఫ్లోరైడ్ సమస్యకి రూ.70 కోట్లు కేటాయించామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించినా దాన్ని టీడీపీ పట్టించుకుందా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయి కల్పించింది వైఎస్ హయాంలోనే అని గుర్తుచేశారు. హామీలు నెరవేర్చకపోగా విమర్శలా.. నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేశారని, దానికి హాజరైన బాలినేని ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టారని అన్నారు. హామీలు నెరవేర్చకపోగా స్థానిక నేతలు బాలినేని విమర్శించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్ క్రాంతికుమార్ ఉన్నారు. -
ప్రకాశంపై ప్రభుత్వం చిన్నచూపు
►తక్షణం సమస్యలు పరిష్కరించాలి ►వెలుగొండను వెంటనే పూర్తి చేయాలి ►రామాయపట్నం పోర్టును తక్షణం చేపట్టాలి ►జిల్లాను వెనుకబడిన జాబితాలో చేర్చాలి ►ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత నీటిని అందించాలి ►రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి ►జిల్లా సమస్యలపై వైఎస్సార్ సీపీ ప్లీనరీలో బాలినేని తీర్మానం ఒంగోలు: ప్రకాశం జిల్లాను టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా చిన్నచూపు చూస్తోందని, ప్రధాన సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా వరప్రసాదిని అయిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జిల్లాప్రజలకు తాగునీరు, సాగునీరందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో బాలినేని జిల్లా ప్రధాన సమస్యలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ 2003–2004 ఆర్థిక సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కారు ఆ ఏడాదిబడ్జెట్లో కేవలం 9.6కోట్లు మొక్కుబడిగా కేటాయించారని విమర్శించారు. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో టీడీపీ ప్రభుత్వ హయంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన ఐదేళ్లలో వెలుగొండ ప్రాజెక్టుకు 1600కోట్ల నిధులు విడుదలచేసి పనులు వేగవంతంగా జరిగేలా చూశారన్నారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిలు నామమాత్రంగానే నిధులు వెచ్చించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ. 600కోట్లు నిధులు కేటాయించినట్లు చెబుతున్నా, అందులో ఖర్చు చేసింది రూ.400కోట్లు మాత్రమేనన్న విషయాన్ని గుర్తు చేశారు. 2017 బడ్జెట్లో రూ.200కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 4287కోట్లు ఖర్చు చేసినట్లు బాలినేని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 2330కోట్లు అవసరం అవుతాయన్నారు. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం మరో పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. తక్షణం ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని రామాయపట్నం పోర్టును కేంద్రం తక్షణం ప్రకటించాలని బాలినేని రెండవ తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లాకు నీరు, పోర్టు లేకుండా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. అదే జరిగితే జిల్లా ఎలాంటి అభివృద్ధికి నోచుకోదన్నారు. నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నం పోర్టుకు అనుకూలత లేదని కేంద్రం తేల్చినందున తక్షణం చంద్రబాబు ప్రభుత్వం రామాయపట్నం పోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశార రాయలసీమతోపాటు వర్ష కరువులతో వెనుబకడిన ప్రకాశం జిల్లాను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని బాలినేని డిమాండ్ చేస్తూ మూడో తీర్మానం చేశారు. జిల్లాలోని 1200గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉందని, గత రెండేళ్ల కాలంలో దాదాపు 430మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వెలుగొండ ప్రాజెక్టును తక్షణం పూర్తిచేసి కెనాల్స్ ద్వారా ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోయారని, గత మూడేళ్ల కాలంలో 70మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని బాలినేని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లీనరీలో ఐదో తీర్మానం చేశారు.