బెడిసికొట్టిన ‘మాక్‌’ నాటకం! | Ec To Reverification Evms In 12 Booths Of Ongole Constituency Over Balineni Srinivasa Reddy Complaint | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన ‘మాక్‌’ నాటకం!

Published Tue, Aug 20 2024 4:19 AM | Last Updated on Tue, Aug 20 2024 10:05 AM

Ec To Reverification Evms In 12 Booths Of Ongole Constituency Over Balineni Srinivasa Reddy Complaint

ఈవీఎంలలో అవకతవకలున్నాయని ఈసీకి బాలినేని ఫిర్యాదు 

ఈవీఎంలను వీవీ ప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చాలని దరఖాస్తు

ఇందుకు బదులుగా మాక్‌ పోలింగ్‌కు కలెక్టర్‌ సన్నద్ధం

నిరాకరించిన వైఎస్సార్‌సీపీ.. ఆగిన ప్రక్రియ

సాక్షి ప్రతినిధి, ఒంగోలు­/సాక్షి, అమరావతి: ఈవీ­ఎం­లపై సర్వత్రా నెలకొన్న అనుమా­నాలను నివృత్తి చేసి పారదర్శ­కంగా వ్యవ­హరించాల్సి­న ఎన్నికల సంఘం అందుకు విరు­ద్ధంగా ‘సుప్రీం’ ఆదేశా­లను బేఖాతర్‌ చేస్తూ మాక్‌ పోలింగ్‌తో మభ్య­పుచ్చేందుకు చేసిన యత్నా­లను వైఎస్సార్‌­సీపీ తీవ్రంగా ప్రతిఘ­టిం­చడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచి పోయింది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీ­ఎంలలో అవకతవకలు జరిగాయనే అనుమానా­లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పోలింగ్‌ రోజు వినియోగించిన ఈవీఎంల్లో 12 కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్‌ స్లిప్‌­లను పరిశీలించటానికి బదులుగా డమ్మీ బ్యాలె­ట్‌తో కేవలం మాక్‌ పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్‌ పోలింగ్‌కు నిరాకరించింది. డమ్మీలతో మాక్‌ పోలింగ్‌ నిర్వ­హిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్‌ పోలింగ్‌ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్‌ దీన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. కాగా, ఎన్నికల సంఘం ఎస్‌ఓపీ ప్రకారం మాక్‌ పోలింగ్‌కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలి­పారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివా­స­రెడ్డి మాట్లా­డుతూ.. ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ఆరోపణ­లను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిష­న్‌దేనని స్పష్టం చేశారు. మాక్‌ పోలింగ్‌ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమా­నాలు మరింత బలపడు­తున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితా­లను రీ వెరిఫికేషన్‌ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు.

పూర్తి వివరాలు ఇవ్వండి
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్‌ స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (టీ–ఎస్‌ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement