balineni srinivasa reddy
-
Chevireddy Reddy: పవన్ పిఠాపురం ఎందుకెళ్లాడు ?
-
బాలినేని జనసేనలోకి వెళ్లినా వదలను.. టీడీపీ నేత వార్నింగ్
సాక్షి, ప్రకాశం జిల్లా: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి చేరిక కూటమిలో చిచ్చు రేపుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ సమక్షంలోనే టీడీపీ నేత ఎద్దు శశికాంత్ రెచ్చిపోయారు. బాలినేని శ్రీనివాస్రెడ్డి జనసేనలోకి వెళ్లినా వదలనంటూ బెదిరింపులకు దిగారు. బాలినేని జనసేనలోకి చేరడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేపోతున్నారు. ఎవరిని అడిగి బాలినేనిని జనసేనలోకి చేర్చకున్నారంటూ ప్రశ్నించారు.వాడు వీడు అంటూ బాలినేనిపై శశికాంత్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు భాగస్వామ్య పార్టీల మనోభావాలు గౌరవించాలి. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నామన్నది పవన్ కల్యాణ్ గుర్తుంచుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలినేనికి జనసేన కండువా వేస్తే మా రక్తం మరిగింది. కూటమిలో ఉండి తమను సంప్రదించాలన్న ఇంగితం కూడా లేదా?. ఓడిపోయినవాళ్లను చేర్చుకుంటే మేము కూడా మా దారిలో వెళ్తాం’’ అని తేల్చి చెప్పారు. కాగా, శశికాంత్ భూషణ్ వ్యాఖ్యలను జనసేన జిల్లా అధ్యక్షుడు ఖండించారు. పవన్పై శశికాంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు. -
ఒంగోలు: వాసన్నకు వరుస అవమానాలు!
ప్రకాశం, సాక్షి: జనసేనలో చేరకముందే ప్రత్యర్ధి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేయగా.. మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో ‘రాజకీయ సహకారం’ అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. తాజాగా.. నగరం అంతటా బాలినేని అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెబుతూ.. ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు. కానీ, నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు. మొన్న చర్చి సెంటర్లో.. ఈ మంగళవారం లాయరు పేటలో.. ఇలాగే బాలినేని వెల్కమ్ ఫ్లెక్సీలు చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. గత శుక్రవారం రాత్రి నగరంలోని చర్చి సెంటర్ వద్ద బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగు దేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది. అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. కానీ.. చంద్రబాబు ఫొటో మాత్రం ముద్రించారు. వాటినీ ఎవరో చించేశారు. గత కొద్దిరోజులుగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇప్పుడు దామచర్ల వర్గీయులు జనసేనలోకి బాలినేని వెళ్లడాన్ని భరించలేకపోతున్నారు. మరోవైపు.. భవిష్యత్తులో జనసేనలోనూ బాలినేని వల్ల వర్గపోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఫ్లెక్సీల చించివేత వ్యవహారాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం. -
‘బాలినేని.. నిన్ను వదల’
ఒంగోలు టౌన్/టంగుటూరు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కలిసిన బాలినేని ఆ పారీ్టలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒంగోలు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. మొదట్నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల ఇప్పుడు ఒక కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. శుక్రవారం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఫొటో కూడా ముద్రించడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వారి్నంగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆలూ లేదు సూలు లేదు అన్నట్లు ఇంకా పారీ్టలో చేరక ముందే ఇలా ఉంటే రానురాను ఈ ఇరుపార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో చూడాలి.ఏ పార్టీలోకి వెళ్లినా వదలను..: ఎమ్మెల్యే దామచర్ల బాలినేని వంటి అవినీతిపరుడిని ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేదే లేదని, అతనిని, అతని కుమారుడిని చట్టపరంగా శిక్షిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం, ఒంగోలులో టీడీపీ శ్రేణులు, నాపై బాలినేని 32 కేసులు పెట్టారు, మా నాయకుడు చంద్రబాబుని కూడా దూషించారు, అధికారం పోయి వంద రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారు. జనసేన పార్టీలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలను బయటకు తీస్తాం, వాటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పారీ్టలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం..’’ అని దామచర్ల జనార్దన్ అన్నారు. నేనెప్పుడూ కాంప్రమైజ్ కాను.. బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ‘‘నేనెప్పటికీ కాంప్రమైజ్ కాను. జనసేన ఫ్లెక్సీలు ఎవరు వేశారో నాకు తెలియదు. ఆయన బొమ్మేశారని తీసేయమన్నాడంటా, సంతోషమే... ఆయన బొమ్మ వద్దంటే తీసేద్దాం’’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన కామెంట్స్పై వివరణ ఇచ్చారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడని, జనసేన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అడిగానని, అంతకుమించి తానేమీ మాట్లాడలేదన్నారు. దానిమీద కూడా ఆయన అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తాను జనసేనలోకి వెళ్లడం ఇష్టం లేకనే రెచ్చగొట్టేందుకు కావాలని ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడో చూస్తానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని విన్నానని, అంతపనికి రాదు... ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రశ్నించేందుకే జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఇప్పుడు కూడా ఏదైనా తప్పులు జరిగితే తాను ప్రశి్నస్తానన్నారు. జనసేన పార్టీలో ఉన్న పాతవారిని, తనతో పాటు వస్తున్న వారిని కలుపుకొని జనసేన బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. -
బెడిసికొట్టిన ‘మాక్’ నాటకం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, అమరావతి: ఈవీఎంలపై సర్వత్రా నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా ‘సుప్రీం’ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మాక్ పోలింగ్తో మభ్యపుచ్చేందుకు చేసిన యత్నాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచి పోయింది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనే అనుమానాలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లో 12 కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్లను పరిశీలించటానికి బదులుగా డమ్మీ బ్యాలెట్తో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్కు నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. కాగా, ఎన్నికల సంఘం ఎస్ఓపీ ప్రకారం మాక్ పోలింగ్కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దేనని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలను రీ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు.పూర్తి వివరాలు ఇవ్వండిసుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
మాక్ పోలింగ్ వద్దు..
-
మాకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదు తేడావస్తే సుప్రీంకు వెళ్తా..
-
ఆగిపోయిన ఈవీఎంల లెక్కింపు బయటకు వచ్చిన బాలినేని
-
మాక్ పోలింగ్ వెరిఫికేషన్ ఏర్పాట్లపై బాలినేని అభ్యంతరం
-
వీవీప్యాట్ కూడా లెక్కించాల్సిందే!.. బాలినేని తరఫు ప్రతినిధుల వాకౌట్
ప్రకాశం, సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరఫున ప్రతినిధులు బయటకు వచ్చేయగా.. దీంతో అధికారులు రీ వెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు.ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో వేరిఫికేషన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని తొలి నుంచి బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు కూడా. అయినప్పటికీ అధికారులు ముందుకు వెళ్లారు. ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వేరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మరోవైపు.. రిట్ విచారణ రేపటికి..ఈవీఎంల వేరిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో బాలినేని వేసిన రిట్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. మాక్ పోలింగ్ పద్ధతి నిలిపివేసి , సుప్రీంకోర్టు ఉత్వర్వుల ప్రకారం ఈవీఎం చెక్ అండ్ వేరిఫికేషన్, వీవీప్యాట్ లెక్కింపును కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. ఈసీ మాక్ పోలింగ్ చేస్తోందని బాలినేని తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయడం సరికాదని బాలనేని లాయర్ వాదించారు. దీంతో.. ఈసీ తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపిస్తామని చెప్పడంతో విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. ఆ 12 బూత్లలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 12 బూత్లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది.డమ్మీ బ్యాలెట్ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల(అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధులు) సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. -
నేటి నుంచి ఈవీఎంల పరిశీలన
ఒంగోలు అర్బన్: ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు అందిన క్రమంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు పరిశీలించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించనున్నారు. డమ్మీ బ్యాలెట్ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. ఈ ప్రక్రియను సీసీ కెమెరా నిఘాలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నారు. -
ఈవీఎంలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ బాలినేని న్యాయ పోరాటం
-
ఈసీకి బాలినేని ఫిర్యాదు.. 19 నుంచి ‘ఒంగోలు’ ఈవీఎంల చెకింగ్
సాక్షి, ఒంగోలు అర్బన్: ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను విలేకర్లు అడగగా.. జరిగేది రీకౌంటింగ్ కాదని, డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుందని చెప్పారు.ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించనున్నట్టు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు రెండు ఈవీఎంల వంతున పరిశీలించనున్నట్లు తెలిపారు. -
బుజ్జిగాడి పచ్చపన్నాగం
నగరపాలక సంస్థలో ఆయన కీలక నాయకుడు.. ఇన్నాళ్లూ పైకి మంచోడిలా కనిపించిన ఆయన ముసుగు తొలగించి తన కపట బుద్ధిని బయటపెట్టాడు.! నాటి శాసన సభ్యుడితో సన్నిహితంగా మెలుగుతూనే ఆయన కన్నుగప్పి భూ దందాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేడు స్వార్ధప్రయోనాల కోసం వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశాడు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి తల్లి లాంటి పార్టీకే ద్రోహం తలపెట్టేందుకు సిద్ధమయ్యాడు.సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీలో పదవులు అనుభవించి..సుదీర్ఘంగా ప్రయోజనాలు పొంది.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ఎన్నో అవకాశాలిచ్చిన పార్టీని వదిలిపోవడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నమ్మిన వారిని నట్టేట ముంచడం సర్వసాధారణంగా మారింది. ఒంగోలు నగరానికి చెందిన ఓ నాయకుడి వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉంది.పార్టీలోనూ అధిక ప్రాధాన్యం..ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని సదరు నాయకుడికి పార్టీ పరంగానూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నగర పాలక సంస్థలో సభ్యుడిగా ఉంటూనే పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనైనా ఆయన కనిపించేలా కీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా నాటి శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడిగా ఉంటూనే ఆయనకు తెలియకుండా అన్ని పనులు చక్కబెట్టుకున్నాడు. తీరా సొంత పార్టీ అధికారం కోల్పోయాక పచ్చ పార్టీలో చేరేందుకు రాయ‘బేరాలు’ నెరుపుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పైకి 24 కేరట్ బంగారంలా కనిపిస్తాడు కాని నిజానికి అసలు సిసలు కల్తీ బంగారమని తనకు తానే రుజువు చేసుకుంటున్నాడు.కేసుల నుంచి తప్పించుకునేందుకేనా?ఒంగోలు నగరంలో భూ కబ్జాలపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు వాటిని నాటి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అంటగట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే భూకబ్జాలు, నకిలీ పట్టాల సృష్టికర్తల వివరాలు బట్టబయలు చేయడం ద్వారా టీడీపీ నేతల విమర్శలను బాలినేని తిప్పికొట్టారు. అదే సమయంలో భూకబ్జా ఆరోపణలపై బాలినేని సిట్ విచారణకు నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీపైనా ఒత్తిడి తీసుకొచ్చి పట్టుబట్టి మరీ ‘సిట్’ వేయించారు. సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టొద్దని మీడియా ముఖంగా బాలినేని స్పష్టం చేశారు. భూ కబ్జాలపై ఇప్పటికీ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరు నాయకుడు తన భూ దందాల గుట్టు బయటపడుతుందనే భయంతో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.పక్కాగా సేఫ్ గేమ్..సదరు నాయకుడు ఎలాగైనా భూ కబ్జాల కేసుల నుంచి బయటపడేందుకు ఎన్నికలకు ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో తన బంధువులను, సన్నిహితులను టీడీపీలోకి పంపేశాడు. ఒక వేళ అధికారం కోల్పోతే టీడీపీలోకి వెళ్లిన వారి సాయంతో తాను ఆ పార్టీకి వెళ్లిపోవచ్చనే పథకాన్ని రచించాడు. తన సేఫ్ గేమ్లో భాగంగా టీడీపీలోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. తనతో పాటు నగరపాలక సంస్థలో ఉన్న కార్పొరేటర్లు, మరికొంత మంది వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులను తీసుకొస్తానని పచ్చపార్టీ ముఖ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది.తాయిలాలు..బెదిరింపులు:తనతో పాటు పార్టీ మారాలంటూ సదరు నాయకుడు సహచర కార్పొరేటర్లతో రాయబారం నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తనతో పాటు టీడీపీలోకి వస్తే ఆర్థికంగా బాగుంటుందని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులకు తెరతీసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు నాయకుడి వ్యవహారాన్ని వైఎస్సార్ సీపీ కేడర్ అసహ్యించుకుంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని దెబ్బ తీయాలని చూస్తున్న అతడి చర్యలను ఖండిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దేనికైనా సిద్ధమే దామచర్ల కు బాలినేని వార్నింగ్
-
దామా.. అంతా డ్రామా జనం చిత్రవధ
కుట్రలూ..కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి నేతల వరకూ అదేతీరు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఊరచెరువు ప్రాంతంలోని ముస్లింలపై ప్రతాపాన్ని చూపారు. నగరంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా న్యాయపరమైన అవరోధాలు కల్పించారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం ఆ తర్వాత మొండిచేయి చూపడం ఆయనకు అలవాటేఒంగోలు సాక్షిప్రతినిధి: తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యవహార శైలితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన పాల్పడిన అక్రమాలు ఎన్నో ఉన్నాయి. పుష్కరకాలంగా దామచర్ల కుట్రలు, కుతంత్రాలకు సాక్ష్యంగా పలు సంఘటనలు నిలుస్తున్నాయి. ఆయన సొంత సామాజిక వర్గం నేతల్ని మినహా మిగతవారందరినీ అవసరాలకు తగ్గట్టుగా వాడుకుని వదిలేస్తారన్నది బహిరంగ రహస్యం. 2012 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల పోటీకి దిగారు. ఆ నాటి నుంచి నేటి వరకూ నగరంలో జరిగిన సంఘటనల్లో ప్రధానమైనవి పరిశీలిస్తే నియోజకవర్గానికి ఎంత నష్టం జరిగిందో అవగతమవుతుంది.👉 2012 ఉప ఎన్నికల సమయంలో 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సొంతంగా మినరల్ వాటర్ ప్లాంటు పెడుతున్నట్లు డ్రామా ఆడారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కేటాయించిన నివాస ప్లాట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా. దీంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి రాగానే మినరల్ వాటర్ ప్లాంటు పెడతామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అక్కడ మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు కాలేదు.👉 ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలుకు మంచినీటి పైపులైను నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. సమయంలో ప్రైవేటు స్థల యజమానికి పరిహారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో పనులు నిలిచిపోయాయి. మరో వైపు నరగపాలక సంస్థ రూ.70 కోట్లు భాగస్వామ్యంగా వ్యయం చేయాల్సి ఉంది. అయితే కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చుచేసి కమీషన్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉 నగరంలో రెండో కేంద్రీయ విద్యాలయం అవసరం ఉందని అప్పట్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర మానవవనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక ప్రభుత్వ భవనాల సముదాయంలో రూములు కూడా తాత్కాలికంగా కేటాయించారు. సొంత భవనం నిర్మాణం కోసం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి శిథిలమైన క్వార్టర్లు ఉండే భాగాన్ని ఎంపిక చేశారు. కానీ ఆ స్థలాన్ని కేటాయిస్తే వైఎస్సార్ సీపీకి మంచి పేరువస్తుందని కుట్రలు పన్ని అడ్డుకున్నారు దామచర్ల.👉 రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వం సూచించింది. అందుకుగాను ఎన్టీయార్ సుజల పథకం అని నామకరణం చేశారు. అందులో భాగంగా ఒంగోలులో కూడా కేశవరాజుకుంటలో ఒక నివేశన స్థలంలో ప్లాంటు అయితే ఏర్పాటు చేశారు కానీ చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. పేరుకు మాత్రం 20 లీటర్ల నీరు రూ.2లకే అని పేర్కొన్నారు. అందులోనూ తిరకాసే. ఖర్చు దాతలది...ప్రచారం ప్రభుత్వానికి కావడంతో దాతలు ముందుకు రాలేదు.👉 ప్రస్తుత మినీ స్టేడియం పక్కన ఉన్న జెడ్పీ ప్రాంగణాన్ని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించాలంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అందుకు తిరస్కరించడంతో జైకా నిధులతో నిర్మిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్యాలయంపై కన్ను పడింది. కార్యాలయ భవన నిర్మాణ పనులను అడ్డుకుని నానా యాగీ చేశారు. నేటికీ పునాది దశలోనే ఆ నిర్మాణం దర్శనమిస్తోంది.👉 వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలమిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా యరజర్ల వద్ద 25 వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి శాటిలైట్ సిటీ నిర్మించాలని బాలినేని యత్నిస్తే దానిని కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నారు. పేదలకు ఎలాగైనా సొంతిళ్లు నిర్మించాలని బాలినేని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారులు పక్కాగా ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేశారు. సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇస్తే అవి దొంగపట్టాలంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. ఈ స్థలాలపై కూడా న్యాయపరమై ఇబ్బందులు కలిగించేందుకు యత్నిస్తూనే ఉన్నారు.👉 సంతనూతలపాడు, కొప్పోలు చెరువులను సమ్మర్ స్టోరేజీ ట్యాంకులుగా ఏడాది కాలంలో నిర్మిస్తానని ఎంఎల్ఏగా గెలిచిన మొదటి పర్యటలోనే ప్రజలకు దామచర్ల హామీ ఇచ్చారు. కానీ ఆయన పదవీ కాలం పూర్తయ్యేనాటికి కూడా కనీసం వాటివైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు.👉 స్థానిక బైపాస్లో విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం వద్ద నుంచి లీజుకు తీసుకున్నారు. దాని ప్రకారం అందులో నిర్మాణం ప్రారంభించాల్సి ఉన్నా అది ప్రారంభం కాకపోవడంపై దాతలు దొరక్కే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.👉 స్థానిక కేశవరాజు కుంటలో పెళ్లి కానుక పేరుతో ధనికులైన, తెల్లకార్డు కూడా లేని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లకు ఎన్ఎస్పీ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి మరీ అప్పగించిన చరిత్ర దామచర్లదే. చివరకు ఈ వ్యవహారంపై తిరగబడ్డ సమీప కాలనీవాసులైన మహిళలపై పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టించి పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లిన ఘనత దామచర్లదే.👉 దామచర్ల తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని డ్రైవింగ్ లైసెన్స్, టూ వీలర్ కాగితాలు చూపించాలని ట్రాఫిక్ ఎస్సై మహేష్ కోరినందుకు ట్రాఫిక్ పోలీస్స్టేషన్నే ముట్టడించారు.బాబు మెప్పుకోసం..తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలు ఊరచెరువుపై చంద్రబాబు కన్నుపడింది. ఆ స్థలంలో భువనేశ్వరి హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ఆ భూమిని లీజుకు కేటాయించేందుకు యత్నాలు జరిగాయి. అప్పటి టీడీపీ మున్సిపల్ పాలకవర్గం అనుమతి కూడా ఇచ్చేసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అడ్డుతగలడంతో అది కాస్తా ఆగింది. తిరిగి 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు కన్ను మరోమారు ఆ ప్రాంతంపై పడింది. అధినేతను ప్రసన్నం చేసేందుకు దశాబ్దాలుగా ఊరచెరువు ఒడ్డున ఇనుపరేకులు, చెక్క వస్తువుల తయారీ దుకాణాలు ఏర్పాటు చేసు కుని పొట్టపోసుకుంటున్న ముస్లిం కుటుంబాలపై ప్రతాపాన్ని చూపారు దామచర్ల. రంజాన్ మాసం అని కూడా చూడకుండా వారి షాపులను కూల్చివేయించారు. దానిని హస్తగతం చేసుకోవాలని యత్నించినా బాలినేని ముస్లింలకు అండగా నిలిచారు. దీంతో నేటికీ వారి దుకాణాలు అక్కడే ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు అరాచకాలకు పాల్పడి నేడు ఎన్నికలు సమయం వచ్చేసరికి ముస్లింలకు అండగా ఉంటానంటూ ప్రవచనాలు వల్లిస్తున్నారు.జెడ్పీ పీఠంపైనా కుట్రే..2014 సాధారణ ఎన్నికలకు కొద్ది ముందుగా జిల్లా ప్రజాపరిషత్కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 31 ప్రాదేశికాలను కై వసం చేసుకుంటే టీడీపీ 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు అభ్యర్థులను కొనుగోలు చేయడం ద్వారా, మరో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఎన్నికకు హాజరుకాకుండా పోలీసుల అండగా యత్నించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ తదితరులు అడ్డుకట్ట వేశారు. అయితే ఈదర హరిబాబు జెడ్పీ చైర్మన్గా ఎంపిక కావడం ఇష్టంలేని దామచర్ల చివరకు ఆయనను జెడ్పీ చైర్మన్ స్థానంలో కొనసాగకుండా చేసేందుకు ఎంతోమందిపై ఎన్నోరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు.కాపులపైనా కేసులుఅధికారంలో ఉన్నప్పుడు కాపులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జనార్దన్ నేడు జనసేన పొత్తు కలవడంతో కుల రాజకీయాలకు తెరతీశారు. నేతలను తమ వైపునకు తిప్పుకుంటే ఓట్లు వాటంతట అవే పడతాయనే భావనతో నేతలపై ఆకర్ష పథకాన్ని ప్రారంభించారు. నాడు కాపు సోదరునిపై గంజాయి కేసు పెట్టించారు. అంతే కాదు ముద్రగడపై టీడీపీ ప్రభుత్వ దమన కాండను నిరశిస్తూ కంచాలు మోగిస్తే దానిపై సైతం కేసులు పెట్టించిన విషయాన్ని కాపులు మర్చిపోలేదు. ఇలా అన్ని రకాలుగా నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన దామచర్లను జనం ‘నిన్ను నమ్మం’ బాబూ అంటున్నారు. -
దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు యుక్తాయుక్త విచక్షణ మరిచి ‘రాళ్లతో కొట్టండి.. కర్రలతో బాదండి..’ అని సెలవిస్తే పచ్చదండు ఊరుకుంటుందా? ‘నిన్ను చంపితే ఏం చేస్తావ్..’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నేతల గత వైఖరిని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ‘ఓటు వేయకుంటే పోటు.. అడ్డు తగిలితే వేటు’.. స్థూలంగా చెప్పాలంటే టీడీపీ సిద్ధాంతం ఇదే. ప్రజల ఆశీస్సులతో గద్దెనెక్కాలనే ఆలోచనకే తావు లేకుండా తమకు తెలిసిన ‘దండన’ విద్యనే పచ్చ నేతలు నమ్ముకున్నారు. నిత్యం తగువులే తలంపుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పారీ్టల నాయకులు, కార్యకర్తలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో టీడీపీ నేతల వికృత క్రీడకు బలైన రాజకీయ నాయకులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారు. అంతకు పది రెట్ల మంది అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చుపెట్టడమే కాకుండా తమ అహానికి, అవినీతికి అడ్డు వస్తున్నారనే కారణంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు మళ్లీ బరితెగించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని పచ్చమూకలు రెచ్చిపోయాయి. పల్లెల్లో దాడులకు తెగబడ్డాయి. తమకు అడ్డువస్తే అంతమొందించడమే లక్ష్యంగా రెచ్చిపోయాయి. నేడు అధికార పక్షంపై వికృత రాతలతో శునకానందాన్ని పొందుతున్న పచ్చమీడియా నాడు కళ్లుండి చూడలేదని కబోదుల్లా చోధ్యం చూశాయి. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అరాచకాల్లో కొన్ని ప్రధాన ఘటనలు ఎంపీటీసీ భర్తను చంపారు 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపూడి మండలం కెల్లంపల్లి సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా తేలుకుట్ల గురవమ్మ పోటీ చేశారు. ఏప్రిల్ 11న గోసుకొండ అగ్రహారంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడటంతో గురవమ్మ భర్త వెంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒంగోలులో చికిత్స ΄పొందుతూ మృతి చెందారు. ఏడాది వ్యవధికే దిగులుతో గురవమ్మ కూడా కన్నుమూసింది.దాడులకు అంతే లేదు..పీసీపల్లిలో 2017 జూలైలో వైఎస్సార్ సీపీ ఎంపీపీ బత్తుల అంజయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. 2015 ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నారాయణ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై ప్రశ్నించిన అప్పటి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్తోపాటు మరో ఏడుగురిపై అక్రమంగా కేసులు బనాయించారు. కొండపి నియోజకవర్గంలో అయ్యప్పరాజుపాలెంలో ఎంపీటీసీ ఎన్నికల రోజున ఐదుగురిపై దాడి చేసి గాయపరిచారు. జరుగుమల్లి మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయబాబుపై టీడీపీ నేతలు దుర్మార్గంగా రేప్ కేసు పెట్టించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో సాధారణ ఎన్నికల సమయంలో వెంకట్రావు అనే వ్యక్తి ఏజెంట్గా కూర్చున్నాడని అతనికి చెందిన రూ.5 లక్షల విలువ చేసే పొగాకును టీడీపీ నాయకులు తగలబెట్టారు. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సమయంలో టీడీపీ బరితెగించింది. మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డి ఓటింగ్లో పాల్గొనకుండా చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పేరుతో అరెస్టు చేయించారు. గాజులపల్లెలో దాష్టీకం2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని పుల్లలచెరువు మండలం మర్రివేముల నుంచి ఆ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో గాజులపల్లెలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను రెచ్చగొట్టడమే కాకుండా మర్రివేముల నుంచి 100 మంది టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్లి దమనకాండ సృష్టించారు. ఇళ్లలోకి చొరబడి ఆడామగా తేడా లేకుండా బయటకు లాక్కుని వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు. బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల సొమ్ము లూటీ చేశారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని కాలితో తన్నడంతో ఆమెకు అబార్షన్ చేయాల్సి వచ్చింది. మమ్ము చిన్న అంజయ్య అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఎముకలన్నీ విరిగి ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. సుమారు పది వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పురుగుమందు డబ్బాలు తెచ్చి కొందరిపై పోసి రాక్షసానందం పొందారు. రాళ్లదాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త బలి పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామంలో 2018 సెపె్టంబర్లో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రంగునీళ్లు చల్లి రెచ్చగొట్టారు. మరుసటి రోజు ఉదయం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కొందరు బహిర్భుమికి వెళ్లి వస్తున్న సమయంలో మాటువేసిన టీడీపీ నాయకులు కొందరు ఇంటిపైకి ఎక్కి ఒక్కసారిగా ఇటుక రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎనిమిరెడ్డి పెదబ్రహ్మయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.రెచ్చగొట్టి.. అక్రమ కేసులు పెట్టి.. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో ఆలూరి శ్రీహరి ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని 2019లో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ పెట్టడమే కాకుండా, బూతులు తిడుతూ.. తొడలు చరుస్తూ టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దాడికి దిగడమే కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్రెడ్డి, మరికొందరిపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టించారు. కమ్మపాలెంలో దళితులు నివసించే ప్రాంతాల్లో డ్రెయినేజీ, రోడ్లు, పబ్లిక్ టాయ్లెట్కు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా టీడీపీ నేతలు అడ్డుపుల్ల వేశారు. కమ్మపాలెంలో 119 మంది దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లోకి వారిని వెళ్లనివ్వకుండా దామచర్ల అడ్డుకున్నారు. దళితులు మొత్తుకుంటున్నా వినకుండా ఆ స్థలంలో గుండా డ్రెయినేజీ నిర్మించి జులుం ప్రదర్శించారు. ఒంగోలు సమతా నగర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారానికి ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలిన పచ్చ మందలో మేడికొండ మోహన్రావు, ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చౌదరి, ఆయన భార్య కీలకంగా ఉన్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఏఆర్ కానిస్టేబుల్ భార్య మాట్లాడిన బూతులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయిన రోజున బండ్లమిట్టలోని దుకాణాలపై టీడీపీ నేతలు తెగబడ్డారు. ఓ ముస్లిం యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా, దుకాణం షట్టర్ మూతవేసి హల్చల్ చేశారు. గాయపడిన ముస్లిం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో కీలక సూత్రధారి, సమతానగర్లో రచ్చకు కారణమైన మేడికొండ మోహన్రావే. నగరంలో రాజకీయ ఘర్షణలు ఎక్కడ జరిగినా మోహన్రావు పేరే ప్రధానంగా వినిపిస్తోంది. మోటా నవీన్ అనే ఎస్టీ యువకుడిని చితకబాది ముఖంపై మూత్రం పోసిన కేసులో నిందితుడు రామాంజనేయ చౌదరికి ఆశ్రయం కలి్పంచి పోలీసులకు చిక్కకుండా కొద్ది రోజులపాటు అడ్డుపడింది మోహన్రావే అన్న ఆరోపణలున్నాయి. దాడి కేసులో జైలుకు వళ్లి వచ్చిన మోహన్రావును ముందు పెట్టి దామచర్ల జనార్దన్ ఆడిస్తున్న డ్రామాలను ఎల్లో పత్రిక ప్రముఖంగా ప్రచురించడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
ABN కి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్ పై రాళ్ళు...బాబు హస్తం జాగ్రత్త పవన్
-
సీఎం జగన్ కంటికి తగిలి వుంటే.. బాలినేని వార్నింగ్
-
కావాలనే సీఎం జగన్ ను టార్గెట్ చేశారు: బాలినేని
-
చాలా ఓర్పుతో ఉన్నాం...మీరు ఎన్ని దాడులు చేసిన 150 సీట్లు పక్కా..
-
తప్పుడు కేసులు పెడితే ఊరుకోను మాజీ మంత్రి బాలినేని ఫైర్
-
పోలీసులు ఓవర్ యాక్షన్ బాలినేని ఆగ్రహం
-
ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్.. బాలినేని ఆగ్రహం
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు సమతా నగర్ ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. తెల్లవారు జామున 4 గంటలకు వైస్సార్సీపీ కార్యకర్తలు ఇండ్లలోకి వెళ్లి పోలీసులు భయబ్రాంతులకు గురి చేశారు. ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపడ్డారు. తనను కూడా అరెస్ట్ చేయండంటూ వన్ టౌన్ పీఎస్కి బాలినేని వెళ్లారు. ఒంగోలు నగరంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. తప్పులు చేయడం.. ఆ నెపాన్ని అధికార వైఎస్సార్ సీపీపై నెట్టేయడం వారికి రివాజుగా మారింది. ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అండ్ కో అలజడి సృష్టించారు. పక్కా ప్లాన్ ప్రకారం అధికార వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు పన్నాగం పన్నారు. అది బెడిసికొట్టేసరికి ఎదురుదాడికి దిగారు. బుధవారం రాత్రంతా హంగామా సృష్టించారు. ఓటమి భయంతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేలా పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని వాస్తవాలు వక్రీకరిస్తూ రెచ్చిపోయారు. మహిళ అని చూడకుండా ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. అసలు జరిగింది ఇదీ.. పార్టీ ఏదైనా తోటి మనిషి పట్ల సంస్కారవంతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య అన్నారు. నగరంలోని 37వ డివిజన్ సమతానగర్ 4వ లైన్లో శ్రీకావ్య, మరోచోట బాలినేని శచీదేవి వేర్వేరుగా గురువారం మహిళలతో మమేకం–సీ్త్రశక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన సమతానగర్ ఘటనపై బాలినేని శ్రీకావ్య మీడియాతో మాట్లాడారు. తాము ఓట్లు అభ్యర్థించడానికి వచ్చామని, వచ్చిన వారిని అవమానించడం మాత్రం సంస్కారం కాదని అన్నారు. బుధవారం జరిగిన ఘటనలో గేటు వేసి తమను లోపలకు రానివ్వకపోగా తమతో పాటు ఉన్న గర్భిణీ అయిన రాజీనామా చేసిన వలంటీర్పై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. తాము అవతలివైపు ఉన్న నాలుగు ఇళ్లకు వెళ్లి వస్తామని, ఇక్కడే ఉండమని గర్భిణీకి చెప్పామన్నారు. తాము అక్కడకు వెళ్లి వచ్చేసరికి ఆమెతో టీడీపీ వర్గీయులు గొడవపడుతుండటంతో ఎందుకు ఇలా చేస్తున్నారని తాము మాట్లాడామన్నారు. దానికి అవతలి టీడీపీ మహిళ వినలేని, చెప్పలేని బూతు పదజాలంతో మాట్లాడిందని, అవి మహిళలుగా తాము చెప్పలేని పదాలని అన్నారు. చివరకు పైనుంచి వాళ్ల కుమార్తె వీడియో తీస్తుండటంతో.. ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించగా, ఆమె మాట్లాడిన మాటలు కూడా తట్టుకోలేకుండా ఉన్నాయన్నారు. విషయం తెలుసుకుని మా వద్దకు వచ్చిన మా మమయ్య బాలినేని శ్రీనివాసరెడ్డికి పూర్తి విషయం చెప్పకుండా తామే సర్దిచెప్పి పంపామన్నారు. కానీ, వారు మళ్లీ తమ పక్కన ఉన్న మహిళల పట్ల కూడా అవమానకరంగా మాట్లాడి రెచ్చగొట్టారన్నారు. వారు వీడియో తీస్తూనే ఉన్నారని, తమను మెట్ల వద్దనే అడ్డుకున్నారని, అలాంటప్పుడు తాము వారుండే పైఅంతస్తులోని ఇంట్లోకి ఎలా వెళ్లగలమని అన్నారు. తమకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటు వేయమని చెప్పినా పర్వాలేదని, కానీ, అసభ్యపదజాలంతో దూషిస్తే మాత్రం సహించమని అన్నారు. మన ఇంటికి వచ్చిన వ్యక్తితో నవ్వుతూ మాట్లాడటం అనేది సంస్కారమని, వైఎస్సార్ సీపీ వాళ్ల ఇళ్లకు కూడా టీడీపీ వారు ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లరా అంటూ శ్రీకావ్య ప్రశ్నించారు. ముందస్తుగా ఒక పథకం ప్రకారమే వాళ్లు ఉద్రిక్తత సృష్టించి దురదృష్టకర ఘటనకు కారణంగా నిలిచారన్నారు. -
‘ఈనాడు’పై పరువు నష్టం దావా వేస్తా..
ఒంగోలు సబర్బన్: ‘పచ్చ పత్రికల్లో వెధవ రాతలు, పిచ్చి రాతలు రాస్తున్నారు. ఎవరో వెధవలు పేరు లేకుండా కరపత్రాలు వేస్తే.. ఆ కరపత్రాన్నే ఈనాడు పేపర్లో రాస్తారు. అసలు కొంచెం అయినా విలువలున్నాయా’ అని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈనాడు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒంగోలు నగరంలోని రెండో డివిజన్ ముక్తినూతలపాడులో ఇళ్ల పట్టాలు, డాక్యుమెంట్లు లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో బాలినేని, ఆయన సతీమణి శచీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఒంగోలు నగరంలోని సొంత ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలిచ్చి ఇళ్లు కట్టిద్దామనుకుంటే హైకోర్టుకు వెళ్లి అదే పనిగా ఆపేస్తున్న టీడీపీ నాయకులు, మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. అయినా సరే మేం పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీ నాయకుల కడుపు మంట అంతా ఇంతా కాదన్నారు. పట్టాల వ్యవహారాన్ని జీర్ణించుకోలేక కొత్త ఎత్తుగడలు వేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డికి క్రాస్ ఓటింగ్ చేయిస్తానని టీడీపీ వాళ్లు ఎవరో ఊరు, పేరు లేకుండా కరపత్రాలు వేస్తే.. దానిపై ఈనాడు పత్రికలో కథనంగా రాస్తారా.. అసలు ఈనాడు యాజమాన్యానికి సిగ్గుందా? అంటూ నిలదీశారు. అందుకే ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రజ్యోతి పత్రికలో షాదీఖానాను ప్రారంభించిన దానినే రెండో సారి ప్రారంభిస్తున్నానని రాశారని, ఇవేం రాతలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు వస్తే వాస్తవాలు తేలుస్తామన్నారు. చెవిరెడ్డి మాట్లాడుతూ నలుగురు చీఫ్ సెక్రటరీలు వచ్చి, సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలిస్తే దొంగ పట్టాలు అంటున్నారంటే.. టీడీపీ నేతలకు మతి పోయిందంటూ ఎద్దేవా చేశారు. వాసన్నకు తనకు అవినాభావ సంబంధం ఉందని చెవిరెడ్డి పేర్కొన్నారు. అనంతరం బాలినేని దంపతులు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు దుస్తులు పంపిణీచేశారు. -
మళ్ళీ రిపీట్ అయిందో.. ఈనాడుకు బాలినేని సీరియస్ వార్నింగ్
-
రేపు 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒకేసారి 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం ఒక చరిత్ర అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయ మీడియాతో మాట్లాడుతూ, పూరి గుడిసె లేని ఇంటిని చూడాలనిదే లక్ష్యమన్నారు. 536 ఎకరాల్లో సుమారు 25 వేల మందికి ఇంటి స్థలం లేని పేదలకు రేపు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. సీఎం జగన్ మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఈ బృహత్తర కార్యక్రమం నిదర్శనమన్నారు. కష్ట కాలంలో కూడా 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సీఎం జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటా. టీడీపీ ఇన్ని కుట్రలు చేసినా పేదల పక్షాన ముందుకెళ్తూనే ఉంటాం. సీఎం జగన్ చేతుల మీదుగా రేపు లబ్ధిదారులకు స్థల రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తాం. అలాగే 339 కోట్ల రూపాయలతో నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకి సీఎం శంకుస్థాపన చేస్తారు. పేద, మధ్యతరగతి వర్గాల పక్షాన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని, సేవను ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. -
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
-
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25 వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేని తెలిపారు. అర్బన్ లేఔట్ను బాలినేని శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు కోర్టులో పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని.. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకచోట కోర్టుకెళ్లి ఇంటి స్థలాలను అడ్డుకున్న టీడీపీ.. మరోసారి కోర్టులో పిల్ వేయడంపై బాలినేని అసహన వ్యక్తం చేశారు. ఇంత నీచ రాజకీయం నా జీవితంలో చూడలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్ -
‘పట్టాల’పై పేట్రేగితే సహించను
ఒంగోలు : ‘పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే ఎవరైనా సంతోషిస్తారు.. కానీ అందుకు భిన్నంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం ఈ ప్రక్రియను ఎలా ఆపాలా అంటూ రోజూ తప్పుడు కథనాలు రాయడం ఆశ్చర్యంగా ఉంద’ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల పట్టాల పంపిణీ కోసం రాజకీయ జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి తాను పోరాడుతున్నానని, ఇచ్చిన మాటకు కట్టుబడి కృషిచేస్తుంటే, ఎలాగైనా పట్టాల పంపిణీ నిలిచిపోయేలా కుతంత్రాలు చేస్తూ పేట్రేగితే మాత్రం సహించే ప్రసక్తేలేదని ఆ రెండు పత్రికలపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. స్థానిక నర్సాపురం అగ్రహారం–మల్లేశ్వరపురం రైతుల వద్ద నుంచి జగనన్న కాలనీ కోసం పేదలకు పట్టాలిచ్చేందుకు కొనుగోలు చేసిన భూముల్లో అభివృద్ధి పనులను ఆదివారం బాలినేని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల రాతలను తూర్పారబట్టారు. ఒక్క రూపాయి తీసుకున్నా చెప్పుతో కొట్టండి.. తానేదో రైతుల వద్ద నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు కథనాలు రాయడం ఏమిటంటూ బాలినేని మండిపడ్డారు. ఒక్క రూపాయి తాను తీసుకున్నా తనను చెప్పుతో కొట్టాలన్నారు. ఇప్పటికే భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన డబ్బులు రూ.231 కోట్లు కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమయ్యాయని.. ఇందులో ఇప్పటికే 80 శాతం మందికి నగదు కూడా జమచేశారన్నారు. ఆదివారం కూడా 29 మందికి జమచేసినట్లు తెలిపారు. మిగిలిన కొంత భూమికి సంబంధించిన వివాదాలు ఉండడంతో వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని బాలినేని చెప్పారు. రోడ్లు, విద్యుత్, గుడి, బడి, పార్కులు ఇలా అన్ని రకాల మౌలిక వసతులతో ఒక సిటీని నిరి్మస్తున్నామన్నారు. రైతులు కూడా ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇళ్లు కూడా మంజూరు చేయిస్తా.. ఇక ఈనెల 20 నుంచి 25లోగా 25 వేల మందికి సీఎం వైఎస్ చేతుల మీదుగా పట్టాలను ఇప్పించడమే కాక ఇళ్లు కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తానని బాలినేని హామీ ఇచ్చారు. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు తాను ఇంతగా తాపత్రయపడుతుంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రం డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఇవ్వరంటూ అడ్డగోలుగా కథనాలు రాశారని, తీరా నేడు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయగానే కాగితాలు మాత్రమే ఇస్తారు, స్థలం చూపరు అంటూ వేరే కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లకు భూసేకరణ సమయంలో భూములను ఎలా సేకరించారో, ఇప్పుడు భూముల కొనుగోలు ఎలా జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు. అడ్డుకుంటే ముట్టడిస్తా.. ఏదో ఒక రూపంలో పేదల పట్టాలను అడ్డుకోవాలని చూస్తే మాత్రం సహించేదిలేదని, ఇంటికి ముగ్గురు చొప్పున 25 వేల పట్టాలకు సంబంధించి 75 వేల మందితో ఆ రెండు పత్రికల కార్యాలయాలను సైతం ముట్టడిస్తానని బాలినేని హెచ్చరించారు. పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని తనపై ఎన్ని కేసులు పెట్టినా డోంట్ కేర్ అని స్పష్టంచేశారు. సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్రావు తదితరులు ఉన్నారు. నేను పార్టీలోనే ఉంటా.. అనంతరం.. టంగుటూరు మండలం అనంతవరం గ్రామంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ సచివాలయ సముదాయాన్ని మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తో కలిసి బాలినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిమూలపు సురే‹Ùను కొండపి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పారు.. పార్టీ తల్లిలాంటిది.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే.. అధికారం ఉంటేనే ఏ పనైనా చేసుకోగలం. మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయితే చాలు. నా గుండె నుంచి వస్తున్న మాటలివి. నేను పార్టీలోనే ఉంటాను’’ అని బాలినేని స్పష్టంచేశారు. జగనన్న నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. -
వ్యక్తిగతంగా తిట్టమని చెప్పడం తప్పు: విజయసాయిరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: బాలినేని శ్రీనివాస్రెడ్డికి ఎలాంటి సమస్య లేదని.. పార్టీలో ఆయన అత్యంత విలువైన నాయకుడని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజనల్ కోర్దినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యం తగ్గదని, బాలినేని స్థానం ఆయనకు ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో నాలుగో జాబితా ఉంటుందన్నారు. ‘‘చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది.. ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహ ఎలక్షన్ కమిషన్కు వివరించాం. రాజకీయ పార్టీలలో విమర్శలు-ప్రతి విమర్శలు సహజం. కానీ.. పార్టీ అధినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించవలసిన బాధ్యత ఉంది. తిట్టమని చెప్పడం తప్పు. మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ ఆ పదాన్ని ఎందుకు వాడుతుందో తెలియదు. కావాలనే వాళ్లంతా దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ విజయసాయి ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: మాకు అంత కర్మ పట్టలేదు: మంత్రి రోజా -
చంద్రబాబుపై బాలినేని ఫైర్
-
‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్పై వచ్చి పరామర్శించాడా?’
సాక్షి, ప్రకాశం: గ్రేటర్ హైదరాబాద్లో సెటిలర్స్ ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది.. అదే కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ టీడీపీ వాళ్లు ఇప్పటికీ కూడా సంబరాలు చేసుకునేవాళ్లని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ‘‘తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్కి సపోర్ట్.. పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు. ఆంధ్రాలో పవన్, చంద్రబాబు కలిసి పోటీనా? వీళ్లకు నైతికత లేదు. వీళ్ల అనైతిక పొత్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. బాపట్లకి సీఎం వస్తే అసత్య ప్రచారాలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్పై వచ్చి పరామర్శించాడా? తుపానుకు సంబంధించి సీఎం జగన్ ముందుగానే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు కాబట్టే ప్రజలు సంతోషంగా ఉన్నారు’’ అని బాలినేని పేర్కొన్నారు. గతంలో వర్షం వస్తే ఒంగోలు జలమయమయ్యేది.. కానీ ఇప్పుడు చుక్కనీరు కూడా నిలబడకుండా అభివృద్ధి చేసి చూపించాం. గుండ్లకమ్మ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే ఇప్పుడు ఈ శిక్ష. 2024లో అత్యధిక మెజార్టీతో గెలుస్తా.. మరలా సీఎం జగన్మోహన్రెడ్డి అని నిక్కచ్చిగా చెప్తున్నానని బాలినేని అన్నారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
ఏపీలో స్కీములు పక్క రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు.. అది సీఎం జగన్ గొప్పతనం..
-
ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యాత్ర
-
ఒంగోలులో సామజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు
-
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే 50 కోట్లు ఆస్తి పోతుంది
-
ప్రమాణం చేద్దామా?.. దామచర్లకు బాలినేని సవాల్
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో జరిగే అన్ని మీటింగ్లకు నన్ను పిలిచారని, మీడియా వాళ్లు అనవసరంగా ప్రతీది రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్కి అబద్ధాలు మాట్లాడటం అలవాటు. కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు డబ్బులు తీసున్నారో ప్రమాణం చేద్దామా?. చీము, నెత్తురు, సిగ్గు ఉంటే నా ఛాలెంజ్కు స్పందించు’’ అంటూ సవాల్ విసిరారు. కొత్తపట్నం బ్రిడ్జి మెటీరియల్ కొనుగోలుకు నేను రూ.40 లక్షలు ఇచ్చా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే పద్దతిగా ఉండదు’’ అని బాలినేని హెచ్చరించారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? -
నిజాయితీని నిరూపించుకున్న బాలినేని
సాక్షి, అమరావతి/ఒంగోలు: నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణల మీద మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా విచారణ కోరి తన నిజాయితీని నిరూపించుకున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదో ఒక విషయం వెలుగులోకి రాగానే దానిని అధికార పార్టీకి అంటగట్టి రాజకీయాలు చేయాలని చూడటం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. అందులో భాగంగానే నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వివాదంలోకి బాలినేనిని లాగాలని టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించి అభాసుపాలయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న బాలినేని ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ స్వయంగా పోలీసు, రెవెన్యూ అధికారులను కోరారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మలికాగర్గ్, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ విచారణ చేసి వాస్తవాలను మీడియాకు వివరించి, ఇందులో బాలినేని, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర లేదని చెప్పారని వివరించారు. దీంతో బాలినేని నిజాయితి నిరూపితమైందని, తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ అభాసుపాలైందని పేర్కొన్నారు. కంచికచర్ల ఘటనపైనా దుష్ప్రచారం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడిపై దాడి ఘటనలో నిందితుల తరఫున తాను జోక్యం చేసుకున్నట్లు టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. యువకుడిపై దాడి చాలా బాధాకరమని, తక్షణమే పోలీసులు స్పందించి దాడి చేసినవారిపై కేసు నమోదు చేయడంతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. కంచికచర్ల పోలీసులతో తాను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ చేశారు. -
బాలినేని కుటుంబానికి సంబంధం లేదు
ఒంగోలు అర్బన్/సబర్బన్: ‘నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు, ఫోర్జరీలతో ఒంగోలులో జరిగిన భూ అక్రమాలతో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ స్పష్టంచేశారు. బాలినేనిపైన, ప్రభుత్వంపైన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఒంగోలు భూదందాపై సిట్ దర్యాప్తును బాలినేని కుటుంబం ముందుకు సాగనివ్వడంలేదంటూ కథనాలు ప్రచురించటం సరికాదని చెప్పారు. బాలినేని కుటుంబం దర్యాప్తును ఎప్పుడూ అడ్డుకోలేదని అన్నారు. అవాస్తవాలను, అసత్య కథనాలను ప్రచురిస్తే అవి రాజకీయ జీవితంలో ఉండేవారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఇలాంటి కథనాలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు సరైన వివరణ తీసుకోవాలని చెప్పారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వివరాలను కలెక్టర్, ఎస్పీ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. భూ కబ్జాలపై ఒంగోలు జెడ్పీటీసీ, మేయర్ గంగాడ సుజాత, మరికొందరు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు సిట్ ద్వారా నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే బాలినేని సోదరుడు వేణుగోపాల్రెడ్డి భూమి వివాదంలో ఉందని, దాన్ని భూ కబ్జా కోవలోకి తేవటం çసరికాదని అన్నారు. ఆ భూమి 40 ఏళ్లుగా బ్యాంకు లావాదేవీల ప్రక్రియలో ఉందన్నారు. సివిల్ పంచాయితీలను కూడా భూ కబ్జాల కింద కథనాలుగా ఇవ్వడం వల్ల సిట్ దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారన్నారు. సిట్లో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పని చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ విభాగం తరఫున జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శాఖ, మార్కాపురం, కనిగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు సిట్ సబ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఫోర్జరీ, నకిలీ స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంపై ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ఒకరు సెప్టెంబర్ 28న ఫిర్యాదు ఇవ్వడంతో భూ కబ్జాల వ్యవహారం వెలుగు చూసిందని కలెక్టర్ చెప్పారు. దీనిపై విచారణ చేపట్టగా లాయర్పేటలోని ఒక ఇంట్లో పూర్ణచంద్రరావు, మరికొందరితో కూడిన బృందం ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆ ఇంట్లో మీ సేవ బ్లాంక్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు, పలు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు లభించాయన్నారు. ఇటువంటి అనేక ఫిర్యాదులు రావడంతో సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 572 డాక్యుమెంట్లు, 60 రబ్బర్ స్టాంప్లు, 1,224 జ్యుడిషియల్ స్టాంప్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మార్కాపురం, కనిగిరి పరిధిలో కూడా 5 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు ప్రభుత్వ భూముల డీకే పట్టాల విషయంలోనూ నకిలీ వ్యవహారాలు జరిగాయని తెలిపారు. ఈ దందా పన్నెండేళ్లకు పైగా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కువ కాలం ఎటువంటి లావాదేవీలు జరగని ఖాళీ స్థలాలకు నకిలీ వీలునామా, జీపీఏ వంటివి సృష్టించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఎటువంటి సమస్యలు లేని స్థలాలకు సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటిని గొడవల్లోకి తెచ్చి, కోర్టుల్లో స్టే ఆర్డర్ వంటివి పొందినట్లు కూడా తెలిసిందన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావం లేకుండా పూర్తి స్వేచ్ఛగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాలపై ఆరోపణలు చేయడం వారిని వ్యక్తిగతంగా బాధించడమే అవుతుందని చెప్పారు. విషయాలను పూర్తిగా తెలుసుకుని వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం చేయాలన్నారు. ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నామని, సిట్ బృందం వేగంగా, నిరంతరాయంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు 54 కేసులు నమోదయ్యాయన్నారు. పూర్ణచంద్రరావు బృందంలో 72 మంది ఉన్నారని, వారిలో 38 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. సిట్ దర్యాప్తుపై బాలినేని ప్రభావం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. -
టీడీపీ నేతలకి బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్
-
‘ఎల్లో మీడియా వార్తలను నేను అప్పుడే ఖండించా’
సాక్షి, తాడేపల్లి: తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను గతంలోనే ఖండించానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) సీఎం జగన్ను కలిసిన తర్వాత బాలినేని మాట్లాడుతూ..‘ ఇళ్ల స్థలాలు, నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎంతో మాట్లాడాను. భూ ఆక్రమణల మీద మా నియోజకవర్గంలో చర్చ జరిగింది. ఇవన్నీ టీడీపీ నేతలు కావాలనే ప్రచారం చేశారు. ఈ ఆరోపణలపై పోలీసు అధికారులతో మాట్లాడాను. వారిని అరెస్ట్ చేయమని చెప్తే కొంత ఆలస్యం చేశారు. అందుకని కోపం వచ్చి నా గన్మెన్లను సరెండర్ చేశాను. ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. 40 మందిని అరెస్ట్ చేశారు. పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను నేను అప్పుడే ఖండించా. పేదల ఇళ్ల స్థలాలకు సేకరించిన స్థలం మీద టీడీపీ వారు కోర్టుకు వెళ్లారు. 25వేల మందికి సరిపడా స్థలం ఇప్పుడు వేరేగా తీసుకుంటున్నాం. త్వరలోనే సీఎం జగన్ వచ్చి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. భూకబ్జాలు ఎవరు చేసినా అరెస్టులు చేయమని గట్టిగా చెప్పాం. నేను విలువైన రాజకీయాలే చేస్తాను. టీడీపీ నేత జనార్థన్ నాకు వ్యతిరేంగా వార్తలు రాయిస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద వార్తలు రాగానే ఫీలవుతున్నారు. మరి నా మీద వార్తలు రాయించినప్పుడు ఆ బాధ తెలీదా? అని ప్రశ్నించారు బాలినేని. -
ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త బాధ, విస్మయం కల్గించింది: బాలినేని
-
ఫేక్ డాక్యుమెంట్లపై ముమ్మర దర్యాప్తు
ఒంగోలు: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయరెడ్డితో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శుక్రవారం భేటీ అయ్యారు. ఒంగోలులో గత పది సంవత్సరాలకుపైగా జరుగుతున్న ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణం అంశాలపై నిష్పాక్షిక దర్యాప్తు ద్వారా నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా గురువారం సీఎంవోలో భేటీ అయిన అంశాలపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం అయ్యాయని, అందుకు గల కారణం ఏమిటనేది కూడా విచారించాల్సిన అవసరాన్ని వివరించారు. అయితే బాలినేని తెలియజేసిన అంశాలపై సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి తక్షణమే కలెక్టర్, ఎస్పీలను సీఎంవోకు పిలిపించుకుని ముగ్గురి సమక్షంలో చర్చించడం, అనంతరం ఒంగోలు నియోజకవర్గ ప్రజలు, నాయకులు బాలినేని భద్రతను దృష్టిలో ఉంచుకుని వెనక్కు పంపిన గన్మెన్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎంవో అధికారులు సూచించడంతో బాలినేని అంగీకరించారు. అలాగే ఈ వ్యవహారాన్ని తొందరగా తేల్చాలని, అవసరమైతే సీఐడీ సహకారాన్ని తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించినట్టు తెలిసింది. ఫేక్ డాక్యుమెంట్స్, భూ రిజిస్ట్రేషన్ వివాదాలను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల దృష్టికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధానంగా తీసుకెళ్లారు. ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో వాటన్నింటిపై విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రస్తావించారు. విచారణకు సంబంధించిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించగలుగుతామన్నారు. దీనిలో జరుగుతున్న జాప్యం వల్లే తాను మనస్తాపానికి గురయ్యానని, అందువల్లే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి సమస్యను తీసుకొచ్చామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, వారిలో నెలకొన్న ఆందోళన తొలగించాలనే ఉద్దేశంతోనే కేవలం పోలీసు డిపార్టుమెంట్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా వారి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకుపోయేందుకు గన్మన్లను వెనక్కు పంపినట్లు పేర్కొన్నారు. దీనిపై ధనుంజయరెడ్డి కలెక్టర్తో, ఎస్పీతో చర్చించారు. విచారణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు అవసరమైతే సీఐడీ సహకారం కూడా తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించారు. శుక్ర, శనివారాల్లో సీఎంవో అధికారులతో బాలినేని భేటీ అంశాలపై మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలను సీఎంవో కార్యాలయం కూడా ఖండిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అంతే కాకుండా తప్పుడు కథనాల అంశాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, దానిపై ఆయన ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించినట్లు సీఎంవో అధికారులు బాలినేనికి వివరించారు. అదే విధంగా ఒంగోలులో సుమారు 25 వేలమందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నిధుల విడుదలపై జరుగుతున్న జాప్యాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షించి అతి త్వరలోనే నిధులు విడుదలచేసి పట్టాల పంపిణీ చేస్తారని తెలిపారు. ఒంగోలులో ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి సరఫరా స్కీము టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడానికి ఉన్న జాప్యాన్ని కూడా సీఎంవో కార్యాలయం దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు బాలినేనికి స్పష్టం చేశారు. కొత్తపట్నం బకింగ్హాంపై కెనాల్పై జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి, ఆర్యవైశ్య ఆరామక్షేత్రం పనులు గురించి చర్చించారు. -
టీడీపీకి సవాల్ విసిరినా ఎమ్మెల్యే బాలినేని
-
బాలినేని సవాల్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఇళ్ల పట్టాలలో స్కాం చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ‘‘నిస్వార్దంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నాం. బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే పేదలు క్షమించరు. స్కామ్లు నిరూపించలేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా?. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరతా’’ అని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: దళిత గళం గొంతు నొక్కి! -
పేదల ఇళ్ల కోసం తగ్గేదేలే..!
గూడులేని పేదల కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ‘మహాయజ్ఞం’లా చేపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఒంగోలు నగరంలో పేదలందరికీ ఒకే డిజైన్ లో ఇళ్లు నిర్మించి శాటిలైట్ సిటీని రూపొందించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తలంచారు. దీనికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సైంధవుడిలా అడ్డుపడ్డారు. తన అనుచరులతో న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. ఫలితంగా పేదలు సొంతగూడుకు దూరమయ్యారు. ఒక వైపు దేశం నేతల కుట్రలు ఎదుర్కొంటూనే మరో వైపు పేదలకు ఎలాగైనా గృహాలు నిర్మించాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే బాలినేని అడుగులు వేశారు. దీనికి సీఎం నుంచి సానుకూలంగా స్పందన రావడం, భూముల కొనుగోలుకు రూ. 200 కోట్లు మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. నగర పరిసరాల్లో 508 ఎకరాల భూసేకరణ కూడా జరిగిపోయింది. ఇలా పచ్చ నేతలకు బాలినేని షాక్ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనివిధంగా ఒకేచోట భారీ స్థాయిలో ప్రభుత్వ భూమిని సేకరించి నగరంలోని వేలాది మంది పేదలకు ఇళ్లు నిర్మించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. కొత్తగా ఒక శాటిలైట్ సిటీని నిర్మించాలని అనుకున్నారు. నగర శివారు యరజర్ల గ్రామంలో 818 ఎకరాలు సేకరించారు. దాదాపు 23,531 మందికి సొంత ఇంటి కల నిజం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హద్దురాళ్లు కూడా వేయించారు. ఇది పచ్చనేతలకు కంటగింపుగా మారింది. ఇంతమంది నిరుపేదలకు ఇళ్లు ఇస్తే తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి కుట్రలకు తెరతీశారు. తన ప్రధాన అనుచరుడైన ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించారు. గతంలో ఈ స్థలాన్ని ఐరన్ ఓర్ మైనింగ్కు ఇచ్చారని హైకోర్టుకు వెళ్లాడు. దీంతో హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీనిపై పేదలు దామచర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ రాజకీయ భవిష్యత్కు మేము బలికావాలా అంటూ నిలదీస్తున్నారు. ఇళ్లులేని నిరుపేదలపై టీడీపీకి ఎందుకింత కక్ష అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. పేదల ఇళ్ల కోసం ఎందాకై నా అంటున్న బాలినేని... టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరాలన్న దృఢ సంకల్పంతో బాలినేని శ్రీనివాస రెడ్డి అడుగులు ముందుకేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసైనా ఇళ్లు ఇద్దామని సీఎం భరోసా ఇచ్చారు. రైతుల వద్ద భూములు కొనుగోలు చేయటానికి రూ.200 కోట్లు విడుదల చేశారు. దీంతో రెవెన్యూ అధికారులను రైతుల నుంచి భూములు కొనుగోలు చేసేందుకు బాలినేని పరుగులు పెట్టించారు. అగ్రహారం, వెంగముక్కల పాలెంలలో భూముల సర్వే చేపట్టారు. రైతుల వద్ద నుంచి 508 ఎకరాలు కొనుగోలు చేశారు. లే అవుట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో ఇళ్లులేని నిరుపేదలు 23,531 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పుడా సంఖ్య 28 వేలమందికి చేరింది. అయినా సరే వెనక్కి తగ్గేదే లేదంటూ దరఖాస్తు చేసుకున్న అందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్లు కూడా నిర్మించాలన్న నిర్ణయంతో బాలినేని అడుగులు ముందుకేస్తున్నారు. టీడీపీ అడ్డుకోవటం... పేదలకు మంచే జరిగింది: యరజర్లలో శాటిలైట్ టౌన్షిప్ నిర్మించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని తలిస్తే దానిని పూర్తి కానీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు పేదలకు చెడుచేయాలని తలంచినా... అంతా మన మంచికే అన్న చందంగా నిరుపేదలకు ఇంకా మేలే జరిగింది. అక్కడి టౌన్షిప్ ఆగిపోవటంతో బాలినేని అగ్రహారం, వెంగముక్కల పాలెంలలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పూనుకున్నాడు. దీంతో ఇప్పుడు ఇవ్వదలచుకున్న ప్లాట్లు ఇంకా ఒంగోలు నగర పరిధిలోనే కావటంతో సొంతింటి కల నెరవేరుతున్న నిరుపేదల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. పేదలకు సేవ చేయాలనే నాయకుడి సంకల్పం బలంగా ఉండాలే కానీ పేదలకు ఎప్పుడూ అన్యాయం జరగదు అని ఈ ఉదంతంతో తేటతెల్లమైంది. బాలినేని శ్రీనివాస రెడ్డి సంకల్పం బలంగా ఉంది కాబట్టే ప్రైవేటు భూములు కొనుగోలు చేసి ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా పట్టాలు ఇప్పిస్తా ఒక్క ఎకరా కూడా ప్రైవేటు భూమి కొనుగోలు చేయకుండా ప్రభుత్వ భూమిలోనే పెద్ద ఎత్తున యరజర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో కూడా ఇంతపెద్ద ప్రభుత్వ స్థలం లేదని, ఒంగోలులోనే ఇది సాధ్యమైందని అందరూ భావించారు. అయితే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యరజర్లలో శాటిలైట్ టౌన్ షిప్ను మాజీ ఎమ్మెల్యే దామచర్ల అడ్డుకున్నాడు. న్యాయపరమైన అడ్డంకులు సృష్టించాడు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి తీరుతాం. అందుకే అగ్రహారం, వెంగముక్కల పాలెంలలో 508 ఎకరాలు కొనుగోలు చేయించాం. ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది. త్వరలో లే అవుట్లు సిద్ధం చేయిస్తాం. సొంత ఇంటికల నెరవేర్చి నిరుపేదల కళ్లలో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి లక్ష్యం. త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా పేదల పట్టాల పంపిణీ చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. – బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే -
అందరూ సుభిక్షంగా ఉండాలి
ఒంగోలు: ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారిని బాలినేని దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలినేని దంపతులు అందించిన పట్టువస్త్రాలను స్వామివారికి అర్చక పండితులు వేదోక్తంగా సమర్పించారు. స్వామివారి ఆలయ ఆవరణంలో ఉన్న రంగనాయక మండపంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవిలకు వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపల బాలినేని మీడియాతో మాట్లాడుతూ స్వామివారి వస్త్ర సేవ దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. పేదలకు అండగా ఉంటూ సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని స్వామిని కోరుకున్నానన్నారు. సమృద్ధిగా వర్షాలు పడి రైతులకు సిరులు కురవాలని స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: తనపై కొద్ది రోజులుగా పనిగట్టుకుని ఆరోపణ చేస్తున్నారని, రాజకీయంగా తనను హింసించడమే ధ్యేయంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ మరణం తర్వాత పార్టీని అంటిపెట్టుకొని ఉన్నానని అయినా తనపైన నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని వాపోయారు. హవాలా కుంభకోణం నుంచి భూ కుంభకోణం దాకా అన్నీ నా మీద రుద్ది ఒక పద్ధతి ప్రకారం అభాసుపాలు చేస్తున్నారని బాలినేని మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. తనను తన కుమారుడిని రాజకీయంగా వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఎవరు ఏం చేసినా తాను వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని బాలినేని స్పష్టం చేశారు. పార్టీలో బాధ్యత గల వ్యక్తిగా తను ఒకరి గురించి మాట్లాడనని బాలినేని అన్నారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్సిగ్నల్ -
బాలినేని నిర్ణయంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్ణయంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బాలినేని అంశం తమ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అంతర్గతం అని సజ్జల పేర్కొన్నారు. ‘‘బాలినేని స్పష్టమైన కారణం చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని అంటున్నారు. వైఎస్సార్సీపీలో ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రయత్నం చేస్తోంది. టీ కప్పులో తుఫాను కాదు కదా.. అందులో టీ కూడా లేదు. వివాదాలేమీ లేవు.. అంతా మీడియా హడావుడి తప్ప మరేమీలేదు. మాట్లాడేందుకు ఏమీలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పదవికి రాజీనామా...సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ
-
మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని
సాక్షి, ప్రకాశం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కాగా, బాలినేని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు. 40 మంది మా పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్లో ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను ఎందుకు కొనుకున్నారు?. ఒంగోలులో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకంది టీడీపీనే. పేదల స్థలాలపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని దేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. -
2024 ఎన్నికల్లో వార్ వన్సైడ్: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తిరుపతి: 2024 ఎన్నికల్లో కూడా వార్ వన్సైడ్ ఉంటుందని.. గాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తామే గెలుస్తామని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుస్తారని బాలినేని అన్నారు. 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 మంది బీసీలే ఉన్నారని బాలినేని పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట: మంత్రి పెద్దిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధిస్తామని.. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను సీఎం జగన్ 98.5 శాతం అమలు చేశారన్నారు. కరోనా సమయంలోనూ సీఎం సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి అన్నారు. చదవండి: Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ -
కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అవాస్తవం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: తన ఫోన్ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన ఆరోపణలను వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవాలని చెప్పారు. ఆయన టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని, అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని వాస్తవాలను బట్టబయలు చేశారు. కోటంరెడ్డి వినిపిస్తున్న మాటలు ఎవరో రికార్డింగ్ చేసినవే తప్ప, ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదని స్పష్టంచేశారు. ఎవరితోనో కోటంరెడ్డి మాట్లాడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేస్తే.. వాటిని మరెవరో రికార్డు చేసి సర్క్యులేట్ చేస్తే.. దాన్నే కోటంరెడ్డికి శ్రేయోభిలాషిగా ఇంటెలిజెన్స్ చీఫ్ పంపి ఉండొచ్చని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎవరి ఫోన్లూ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యాకే కోటంరెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆయనకు వైఎస్ జగన్ సముచిత గౌరవం ఇచ్చారన్నారు. కోరుకున్న పదవులు రాలేదనే అసంతృప్తి ఉన్నట్లు కోటంరెడ్డే అన్నారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో కూడా సర్క్యులేట్ అవుతోందని, దాన్ని కూడా ట్యాపింగ్ చేశారంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి కోటంరెడ్డి, ఆనం ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని తెలిపారు. ఆ బురదలో వారే కొట్టుకుపోతారని చెప్పారు. చంద్రబాబు, రామోజీరావులతో ఎవరైనా మాట్లాడాలంటే వారి సహాయకులకే ఫోన్ చేస్తారని అన్నారు. అదే రీతిలో వైఎస్ వివేకా మరణించారనే సమాచారాన్ని ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ ఇంట్లో పనిచేసే నవీన్కు వైఎస్ అవినాష్రెడ్డి ఫోన్ చేశారని, ఇందులో అసహజం ఏముందని ప్రశ్నించారు. దీన్ని పట్టుకుని చంద్రబాబు, ఎల్లో మీడియా బురదజల్లడం రాక్షసత్వమని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణతోనే సమతుల అభివృద్ధి సాధ్యమని సీఎం వైఎస్ జగన్ ఆదిలోనే ఆయన విధానాన్ని ప్రకటించారన్నారు. అందులో భాగంగా మూడు రాజధానులను ప్రకటించారని తెలిపారు. 3 నెలల కిందటే ఎందుకు చెప్పలా? : మాజీ మంత్రి పేర్ని నాని మూడు నెలలుగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే అప్పుడే ఎందుకు చెప్పలేదని, ఇప్పుడెందుకు చెబుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య(నాని) నిలదీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ పెట్టకపోతే ఇంత మంది ఎమ్మెల్యేలు అయ్యేవారా? ఒక్కసారి కోటంరెడ్డి ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి శ్రీధర్రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ సామాన్లు కొనలేదని, ట్యాపింగ్ చేసే సదుపాయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. శ్రీధర్రెడ్డిది అవకాశవాద రాజకీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోటంరెడ్డిలాంటి వారు పోతే పార్టీకి దరిద్రం పోతుంది: కొడాలి నాని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి లాంటి నాయకులు వెళ్లిపోతే వైఎస్సార్సీపీకి దరి ద్రం పోతుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు (నాని) అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. కోటంరెడ్డిని సీఎం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఉంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబే సీఎం అయ్యే పరిస్థితిలేదని, కోటంరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేది ఎక్కడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే అలవాటు చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్ ఎవరినీ మభ్య పెట్టరని, ఉన్నది ఉన్నట్లు చెబుతారని తెలిపారు. ఈ పనికిమాలిన వారు ఏమి మాట్లాడుతారో వినే సమయం సీఎంకు ఉంటుందా అని ప్రశ్నించారు. అది రికార్డింగ్ వాయిస్ : మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సాక్షి ప్రతినిధి నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేస్తున్న ఆరోపణలు అర్థరహితమైనవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. శ్రీధర్రెడ్డి పార్టీని వీడి వెళ్లిపోవడానికి ఏదో కారణం చూపించాలన్న ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫోన్ టాపింగ్ అనేదే లేదని మంత్రి స్పష్టం చేశారు. రికార్డింగ్ మెసేజ్ను పట్టుకుని యాగీ చేయడం సరైన పద్ధతి కాదన్నారు.పోన్లో మాట్లాడింది ట్యాపింగా లేదా రికార్డింగా అనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా, కోర్టు ద్వారా దర్యాప్తు చేయించినా అభ్యంతరం లేదన్నారు. ట్యాపింగ్ అని నిరూపిస్తే రాజకీయాలకు నేను దూరం: బాలినేని సాక్షి ఒంగోలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఫోన్ ట్యాపింగ్ నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, నిరూపించలేకపోతే శ్రీధర్రెడ్డి రాజకీయాలకు దూరమవుతారా అని నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కోటంరెడ్డి పక్కన ఉండే స్నేహితుడే ఆయన కాల్ను రికార్డు చేసి పార్టీ అధిష్టానానికి పంపారన్నారు. అది తెలుసుకున్న ఇంటెలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కోటంరెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా దానిని ఫోన్లో వినిపించారని తెలిపారు. దానిని పట్టుకుని ఫోన్ ట్యాపింగ్ అనడం అర్థరహితమని చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్న చనువుతోనే ఇంటెలిజెన్స్ అధికారి శ్రీధర్రెడ్డిని అడిగారని, చివరకు ఆ స్నేహంపైనే మచ్చ వేయడం దారుణమని అన్నారు. కాల్ రికార్డు చేసిన వ్యక్తిని ప్రెస్మీట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమన్నారు. ఆయన స్నేహితుడు రామశివారెడ్డినే అడిగి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు టిక్కెట్ ఇస్తానని చెప్పకపోతే 20 24లో టీడీపీ తరఫున పోటీచేస్తానని ఎలా ప్రకటిస్తారని అన్నారు. ఆనం రామనారాయణరెడ్డికి భద్రత తగ్గించలేదని తెలిపారు. ఫోన్ట్యాపింగ్ రాజకీయ ఆరోపణ: మిథున్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ : ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనడం రాజకీయ ఆరోపణ అని వైఎస్సార్సీపీఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. రాజకీయ స్వార్ధంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. -
ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయం..
ఒంగోలు: స్థానిక గద్దలగుంట పారువేట కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలు గద్దలగుంట పారువేటకు వచ్చారు. గద్దలగుంట ముఖ ద్వారంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు నేతృత్వంలో ఏర్పాటైన పాటకచ్చేరికి బాలినేని, ఎంపీ పాల్గొన్నారు. అనంతరం స్థానిక గద్దలగుంటలోని నాగార్పమ్మతల్లి, అంకమ్మ తల్లి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, శ్రీకోదండ రామస్వామి ఆలయం, అంకమ్మ తల్లి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోదండ రామస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన పాటకచ్చేరి కార్యక్రమానికి బాలినేని, మాగుంట ఇరువురు హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సంయుక్తంగా వాల్తేరు వీరయ్య సినిమా కేక్ను కట్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయం మొత్తం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు. అందరం ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి వేగం అవుతుందన్నారు. చిరంజీవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, ఆయన సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో తమ కుటుంబానికి మంచి బంధం ఉందని అన్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య అయితే ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వీరయ్యగా చిరంజీవి అభిమానులు పేర్కొంటుండడం మరింత ఆనందంగా ఉందన్నారు. అనంతరం అక్కడ నుంచి గాంధీబొమ్మ సెంటర్లో 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఏర్పాటు చేసిన పాటకచ్చేరిలో ఇరువురు పాల్గొన్నారు. ఇక్కడ బాలినేని, మాగుంటను వైఎస్సార్ సీపీ నాయకులు ఓగిరాల వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, కార్పొరేటర్ తాడి కృష్ణలత సత్కరించారు. రాజరాజేశ్వరస్వామి అమ్మవారు, గద్దలగుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇరువురు గద్దలగుంట నెహ్రూబొమ్మ సెంటర్లోని పాట కచ్చేరిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. మీ వాడిని.. ఎప్పుడూ అందుబాటులో ఉంటా ‘‘నేను మీ వాడిని... మీతో కలిసి పెరిగిన వాడ్ని..తిరిగిన వాడ్ని... నా బాల్యం అంతా గద్దలగుంటలోనే గడిచింది. ఇక్కడి ప్రజల ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... గద్దలగుంటతో తన అనుబంధం విడదీయరానిదన్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. ఇప్పటికే గద్దలగుంటలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని, మరో వారం రోజుల్లో రూ.10 లక్షలతో మహిళా భవన్కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో గద్దలగుంటలో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివిధ పోటీల్లో విజేతలకు శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డిని కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించారు. బహుమతి ప్రధానోత్సవ సభకు కమిటి అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు సభా నిర్వాహకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్బాబు, కాపు కళ్యాణ మండపం చైర్మన్ టీవి రంగారావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సాంబశివరావు, కమిటీ సభ్యులు ఈదుపల్లి అంకబాబు, కాటా నాగేశ్వరరావు, ఈదుపల్లి కోటేశ్వరరావు, చిట్టెం వెంకటేశ్వర్లు, తోటకూర చైతన్య, మలిశెట్టి రాజేంద్రప్రసాద్, దండే వెంకటేశ్వర్లు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. (క్లిక్ చేయండి: 2024 ఎన్నికల్లో జగనే సీఎం.. ఇది పక్కా) -
టీడీపీ కుట్రలకు చెక్..పేదల గూడుకు ఎందాకైనా
సీన్ 1: పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒంగోలు నగరంలో శాటిలైట్ టౌన్ షిప్ నిర్మించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి యోచించారు. నిరుపేదలకు సొంత ఇంటికల నిజం చేయాలన్న సదుద్దేశంతో బాలినేని నగర సమీపంలో ప్రభుత్వ స్థలం అన్వేషించిమరీ లే అవుట్ తయారు చేయించారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనివిధంగా ఒకేచోట భారీ స్థాయిలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి వేల సంఖ్యలో పేదలకు ఒకేచోట ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని భావించి వడివడిగా చదును చేయించారు. యరజర్ల గ్రామంలోని 818 ఎకరాల్లో 24 వేల మందికి ఇళ్లు నిర్మించాలనుకున్నారు. సీన్ 2: ఇంత మంది పేదలకు ఇళ్లు కట్టిస్తే ప్రభుత్వానికి, బాలినేనికి ఎక్కడ పేరు వస్తుందోనని భావించిన తెలుగుదేశం పార్టీ కుట్రలకు తెరతీసింది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుయుక్తులు పన్నారు. న్యాయపరమై ఇబ్బందులు సృష్టించి పేదలకు గృహాలను దూరం చేశారు. తన అనుచరుడు మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చారు. ఫలితంగా నిరుపేదల ఆశపై నీళ్లుజల్లారు. సీన్ 3: పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఎందాకైనా వెళ్లాలని బాలినేని నిర్ణయించారు. పచ్చ కుట్రలను తిప్పికొట్టి నిరుపేదలను ఆదుకోవాలనుకున్నారు. నగర పరిసర ప్రాంతాల్లో 500 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని సేకరించాలని రంగం సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంచారు. సీఎం బాలినేని ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరం చుట్టూ ఉన్న ఆరు గ్రామాల్లో స్థలాలు ఎంపిక చేసేపనిలో పడ్డారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదవారి సొంతింటి కల సాకారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలంచారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున గృహాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ఒంగోలు నగరంలో పేదలకు ఒకే ప్రాంతంలో ఇళ్లు నిర్మించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక శాటిలైట్ సిటీని కట్టాలని, ఆమేరకు చర్యలు చేపట్టారు. యరజర్ల గ్రామంలోని 818 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. దాదాపు 24 వేల మందికి సొంత ఇంటి కల నిజం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హద్దురాళ్లు సైతం వేయించారు. పనులు వేగంగా జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు సైంధవుడిలా అడ్డుపడ్డారు. ఇంతమంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇక తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భావించి కుట్రలకు తెరతీశారు. తన ప్రధాన అనుచరుడు అయిన ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించాడు. దీంతో హైకోర్టు నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను ఇవ్వకుండా నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది. మైనింగ్ పేరుతో అడ్డుపుల్ల: యరజర్ల గ్రామంలోని ప్రస్తుతం ఇళ్లపట్టాలకు ఇవ్వాలని భావించిన స్థలం గతంలో ఐరన్ ఓర్ మైనింగ్కు ఇచ్చారంటూ మక్కెన శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్లాడు. అయితే గతంలో మైనింగ్కు ఇచ్చినప్పుడు ఇదే మక్కెన శ్రీనివాసరావు మైనింగ్కు ఇవ్వటానికి వీలులేదని ఆందోళనలు చేశాడు. మైనింగ్ లీజులు రద్దుచేసి ఐఐఐటీకి ఇవ్వాలని కూడా ఆందోళనలు చేపట్టాడు. ఇదంతా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆడుతున్న కుట్రలో భాగంగానే జరిగిందని అందరూ గుర్తించారు. టీడీపీ కుట్రలకు చెక్ నగరంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి బలంగా భావించారు. ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంచారు. దీనికి ఆయన అంగీకరించారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల పరిధిలో 500 ఎకరాలు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భూములు కొనేందుకు రూ.200 కోట్లు కేటాయించారు. ఆరు గ్రామాల్లో స్థలాల గుర్తింపు.. ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఆరు గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మొత్తం దాదాపు 25 వేల మందికి ఇచ్చేలా స్థలాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. మల్లేశ్వరపురం, పెళ్లూరు, అగ్రహారం, సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కల పాలెం, కరవది గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా స్థలాలను ఇప్పటికే గుర్తించారు. సర్వే నంబర్ల వారీగా అనుభవదారులు, హక్కుదారులను గుర్తించి వారి వద్ద నుంచి కొనుగోలు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పదిహేను రోజుల్లోపు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. మార్చి నెలాఖరుకల్లా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం టీడీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా మార్చి నెలాఖరుకల్లా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకుంటాం. సీఎం వైఎస్ జగన్కు ఇళ్ల పట్టాల విషయం చెప్పాను. కోర్టు అడ్డంకులు ఉన్నందున ప్రైవేటు స్థలాలైనా కొనుగోలు చేసి ఇద్దామని హామీ ఇచ్చారు. దీంతో ఒంగోలు నగర పరసర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వటానికి భూముల గుర్తింపు ప్రారంభించాం. అందుకోసం రూ.200 కోట్లు కేటాయించారు. ఇప్పటికే భూముల గుర్తింపు కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. – బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే -
చంద్రబాబు మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారు : బాలినేని
-
Prakasam District: వికేంద్రీకరణకు మద్దతుగా మానవహారం
సాక్షి, ప్రకాశం జిల్లా: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. అనంతరం వందలాది మంది కార్యకర్తలతో మానవహారం నిర్వహించి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై ఇంచార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్తో మురిపించి రాష్ట్ర ప్రజలను మోసం చేసారని బాలినేని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ తప్ప వెలగబెట్టింది ఏమి లేదని బాలినేని మండిపడ్డారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో శాసన రాజధాని ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ముళ్ళకంపళ్లలో రాజధాని పెట్టి ఒక వర్గాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు కలలు కన్నారని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రాన్నీ కొల్లగొట్టేశాడని మంత్రి మండిపడ్డారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష -
అభివృద్ధే మన అజెండా.. ప్రతి ఒక్కరికీ సంక్షేమం
ఒంగోలు: అభివృద్ధే మన అజెండా అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మూడో డివిజన్ అయిన కరుణాకాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లింల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. వాసన్నా అంటూ ఆప్యాయతను కనబరిచారు. కరుణాకాలనీలో కబేలా స్థలం ఖాళీగా ఉందని, దానిని కమ్యూనిటీ స్థలం కోసం కేటాయిస్తే తమ ప్రాంతంలో ఇబ్బందులు తొలగిపోతాయంటూ పలువురు ప్రజలు బాలినేనికి విజ్ఞప్తి చేశారు. దీనిని వెంటనే పరిశీలించి నివేదిక అందజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ను బాలినేని ఆదేశించారు. అదే విధంగా కొంతమంది పరిస్థితి దయనీయంగా ఉండడం చూసి చలించిన బాలినేని అక్కడికక్కడే వారికి కొంత మొత్తం ఆర్థిక సాయం అందించారు. అదే విధంగా మరికొంతమంది డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యుత్ లైన్లు ఇళ్లకు అందుబాటులో ఉంటున్నాయని, తద్వారా ప్రమాదం జరిగే ఉందంటూ వివరించారు. రేషన్ బియ్యం, సంక్షేమ ఫలాలతోపాటు ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదా అంటూ బాలినేని అడిగి తెలుసుకున్నారు. గతంలో పెన్షన్ కోసం తిండీ తిప్పలు లేకుండా ఒకటికి రెండు రోజులు పడిగాపులు పడాల్సి వచ్చేదని, అప్పుడు కూడా వేలిముద్రలు పడడంలేదంటూ అధికారులు తిప్పి పంపేవారన్నారు. కానీ నేడు ఒకటో తేదీ నిద్రలేచే సరికే పెన్షన్ చేతిలో పెడుతున్నారని, నిజంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చల్లగా ఉండాలంటూ వృద్ధులు దీవించారు. సాయంత్రం ప్రకాశం కాలనీలో పర్యటించారు. బాలినేని వెంట స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, ఆమె భర్త గండు మధు, 3వ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, నగర మేయర్ గంగాడ సుజాత, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జిలాని, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్ కళాపరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ దస్తగిరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, బడుగు ఇందిర, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, అయినాబత్తిన ఘనశ్యాం, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షేక్ మీరావలి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు, ఒంగోలు సూపర్బజార్ డైరెక్టర్ వల్లెపు మురళి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖుద్దూస్, షేక్ రజాక్, వైఎస్సార్సీపీ నగర కార్యదర్శి షేక్ సలాం, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గోవర్థన్రెడ్డి, వీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ దుగ్గిరెడ్డి వీరాంజనేయరెడ్డి, కొమ్మూరి రవిచంద్ర, కార్పొరేటర్లు అంగిరేకుల గురవయ్య, తాడి కృష్ణలత ఉన్నారు. -
గడపగడపకు మన ప్రభుత్వం: శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
ఒంగోలు సబర్బన్: నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని మూడో డివిజన్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. తొలుత డివిజన్ ప్రారంభంలోని బలరాం కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు దంపతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు బాలినేనికి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం మిలటరీ కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని స్థానికులను అడిగి బాలినేని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో డివిజన్లో ఎక్కువ భాగం స్లమ్ ఏరియా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మూడో డివిజన్లో రోడ్లు వేశామని ప్రగల్భాలు పలికారంటూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై ధ్వజమెత్తారు. నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ, ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. మూడో డివిజన్లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. ఈ డివిజన్లో ఎక్కువ అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. డివిజన్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. వలంటీర్ల పనితీరు కూడా సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మళ్లీ సీఎంగా వైఎస్ జగన్, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని గెలవాలని నినాదాలు చేశారు. మిలటరీ కాలనీలో ఒక మహిళ మంచినీటి ట్యాప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇవ్వలేదని బాలినేని దృష్టికి తీసుకురాగా, ఎంఈ కే మాల్యాద్రిని పిలిచి బాలినేని ప్రశ్నించారు. మూడు రోజుల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తామని ఎంఈ తెలిపారు. ఓ ఇంటి వాకిటికి ఎదురుగా విద్యుత్ స్తంభం ఉండటాన్ని బాలినేని గమనించారు. అక్కడకు వెళ్లినప్పుడు ఆ ఇంటి మహిళ కూడా విద్యుత్ స్తంభం సమస్యను బాలినేని దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ ఏఈని పిలిపించిన బాలినేని.. ఆ స్తంభాన్ని పక్కకు మార్చాలని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కాలువల నిర్మాణానికి శంకుస్థాపన... గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మిలటరీ కాలనీలో కాలువ నిర్మాణానికి బాలినేని శంకుస్థాపన చేశారు. టెంకాయలు కొట్టి భూమి పూజ చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మిలటరీ కాలనీ, మసీదు కాలనీ, బాలినేని భరత్ కాలనీల్లో కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ.30 లక్షలు మంజూరు చేశామని, తొలుత మిలటరీ కాలనీలో కాలువ పనులు ప్రారంభించామని బాలినేని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే జాఫర్, కార్పొరేటర్లు ఎందేటి పద్మావతి రంగారావు, చల్లా తిరుమల రావు, తాడి కృష్ణలత, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాకా బసివిరెడ్డి, ఇస్లాంపేట జిలానీ, బేతంశెట్టి శైలజ, యరజర్ల రమేష్, ఊసా మధుబాబు, డివిజన్ నాయకులు సుల్తాన్, రమీజా, కోటయ్య, చిన్నా, పేరిరెడ్డి, రాజేంద్ర, హబీబ్, వెంకట్, సుజాత, డానియేలు, అమర్, తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు పోటీ చేయాలన్నా భయపడాలి
నెల్లూరు(సెంట్రల్): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ప్రకటించారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్లో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్రెడ్డి, మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కిలివేటి సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మానుగుంట మహీధర్రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మంత్రి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల మొదటి నుంచి ఓటర్ జాబితాలో పేర్ల నమోదు ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లను గుర్తించి నమోదు చేసే ప్రక్రియపై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. పట్టభద్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వాటిని కూడా గుర్తు చేయాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో అధిక ఓట్లు ఉన్నాయని, పూర్తిగా వైఎస్సార్సీపీ వైపే పట్టభద్రులు ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు భయపడాలి పట్టభద్రుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి వచ్చే మెజార్టీ చూసి ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా తీర్పును తీసుకువద్దామన్నారు. ఓటరు లిస్టులో పేర్లు నమోదు అనేది అత్యంత ప్రతిష్టాత్మంగా జరగాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటు నమోదు చేయించడంతో పాటు, ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. పట్టభద్రుల ఓట్లు చాలా కీలకమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వాళ్లు గమనిస్తున్నారని, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రత్యేక ఆదరాభిమానాలు వాళ్లకు ఉన్నాయన్నారు. ప్రతి ఓటు ఎంతో కీలకంగా భావించి మెజార్టీ వచ్చే విధంగా చూడాలన్నారు. చాలా కాలం తర్వాత జిల్లాలో తిరిగి పట్టభద్రుల ఎన్నికల వాతావరణం వస్తోందని, ఈ విషయంపై ప్రతి ఒక్కరం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గెలవడం ఖాయమని, మెజార్టీని చూసి ప్రతిపక్షాలు భయపడే విధంగా తీసుకుని వద్దామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, పి రూప్కుమార్, నిరంజన్బాబురెడ్డి, వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ఆర్ సీపీలోనే ఉంటాను : బాలినేని
-
నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీతోనే: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు. తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: దూషించిన నోటితోనే పులకింతా? చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానని అన్నారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్తో మాట్లాడతానని బాలినేని తెలిపారు. గోరంట్ల మాధవ్ విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయాయని తెలిపారు. -
కేసినో వ్యవహారానికి నాకు సంబంధం లేదు: మాజీ మంత్రి బాలినేని
-
‘చీకోటి’ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: కేసినో వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసినో ప్రవీణ్ ఎవరో తనకి అసలు తెలియదని, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. ఒంగోలు నగరాన్ని ఈ రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని బాలినేని అన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధికి రూ.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్న ఆయన, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని బాలినేని అన్నారు. చదవండి: చంద్రబాబు పాలనలో జరిగింది డీపీటీ: సీఎం జగన్ -
నా కుటుంబంపై కుట్ర జరుగుతోంది: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: తనకు సంబంధం లేని విషయాలపై కొందరు గొడవ చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీని వెనుక టీడీ జనార్ధన్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న చెన్నైలో పట్టుబడ్డ డబ్బుపై మరోసారి దుష్ప్రచారం చేశారన్నారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. ఇకనైనా వారు పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే పదవి నుంచి తప్పకుంటానని బాలినేని సవాల్ విసిరారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ఓపెన్ సవాల్ -
ఒంగోలు జేఎంబీ చర్చిలో గొడవలు బాధాకరం: బాలినేని
-
ఎంతటికైనా దిగజారతాడు.. బాబు వీక్నెస్ అదే..
సాక్షి, ప్రకాశం జిల్లా: తెలుగుదేశం పార్టీపై నమ్మకం కోల్పోయి వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో అన్న అభద్రతా భావంలో చంద్రబాబు ఉన్నాడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఎంతటికైనా దిగజారతాడని బాలినేని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సింగిల్గా ఎదుర్కోలేకే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చదవండి: తిరుపతి: పోలీసులపై జనసేన నాయకుల దాడి హోంమంత్రి వనితపై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను బాలినేని ఖండించారు. తన తోబుట్టువుతో సమానమైన హోంమంత్రి వనితను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. హోం మంత్రి మా ఆడపడుచు అనే ఉద్దేశ్యంతోనే ఓన్ చేసుకొని మాట్లాడాననీ దాన్ని వర్ల రామయ్య వక్రీకరించి మాట్లాడడం సిగుచేటు అన్నారు. తన మీద ఏదో తీస్తున్నా.. తవ్వుతున్నా అన్న వర్ల రామయ్యకు బాలినేని సవాల్ విసిరారు. దమ్ముంటే వర్ల రామయ్య తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని ఆయన అన్నారు. -
సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా
ఒంగోలు: సీఎం జగన్ మాటే తమకు శాసనమని, ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం సోమవారం జిల్లాకు వచ్చిన ఆయనకు అభిమానులు అడుగడుగునా భారీ ర్యాలీలతో స్వాగతం పలికారు. అనంతరం తన నివాసంలో బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ‘మంత్రిగా ఉన్నప్పటి కంటే మంత్రి పదవికి రాజీనామా చేశాక వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు నాపై ఎక్కువ అభిమానాన్ని చాటారు. పెద్దఎత్తున వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు కృషి చేస్తాను’ అని చెప్పారు. ఈనెల 22న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించేందుకు ఒంగోలుకు వస్తున్నందున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు మహిళలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. తొలుత మార్టూరు మండలం బొప్పూడి వద్ద ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలినేని అనంతరం ర్యాలీగా ఒంగోలు బయలుదేరారు. బొప్పూడి వద్ద ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, అన్నా వెంకటరాంబాబు, పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి రావి రామనాథంబాబు, బొల్లాపల్లి టోల్గేట్ వద్ద ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఏపీ శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బంటు: మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
-
టెరాసాఫ్ట్ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు
సాక్షి, అమరావతి: టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకు సన్నిహితుడని అందుకే నిబంధనలు పక్కనపెట్టి ఫైబర్నెట్ ప్రాజెక్టు టెండర్లను దానికి కట్టబెట్టారని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ఫైబర్నెట్ టెండర్ల గోల్మాల్పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ టెండర్లలో చాలా అవకతవకలు జరిగాయని, ఇతర కంపెనీల కంటే ఎక్కువకు కోట్ చేసినా ఆ సంస్థకే పనులు అప్పగించారని తెలిపారు. అప్పటి సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే రూ.307 కోట్ల ఈ టెండర్ల ప్రక్రియ జరిగిందన్నారు. ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఎండీ హరికృష్ణప్రసాద్నే టెండర్ పత్రాల మదింపు కమిటీ సభ్యుడిగా నియమించారని తెలిపారు. టెండర్లు వేయడానికి ఒకరోజు ముందు ఈ కంపెనీని బ్లాక్లిస్ట్ నుంచి తొలగించారని, అది కూడా బ్లాక్లిస్ట్లో పెట్టిన అధికారి కాకుండా కిందిస్థాయి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చేశారని చెప్పారు. ఈ కంపెనీ సరఫరా చేసిన సెట్టాప్ బాక్సులు వంటి పరికరాల్లో 20% మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని, 80 % పనిచేయడంలేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించామని, దర్యాప్తు వేగవంతంగా చేపట్టి దోషులను శిక్షిస్తామన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దీనిపై మాట్లాడుతూ ఫైబర్గ్రిడ్ టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయన్నారు. కంపెనీ ఏర్పాటు చేసి మూడేళ్లు నిండాలి, కనీసం రూ.350 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనలు పాటించకుండా ఈ కాంట్రాక్టును టెరాసాఫ్ట్కు అప్పగించారని తెలిపారు. ఇది అవినీతి గ్రిడ్ దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టును అవినీతి గ్రిడ్గా మార్చారని విమర్శించారు. మార్కెట్లో రూ.2,200కు దొరికే సెట్టాప్ బాక్సుని రూ.4,400కి కొనుగోలు చేశారని తెలిపారు. ఫైబర్నెట్ ప్రాజెక్టు ఉన్న శాఖ చంద్రబాబు చేతిలో ఉంటే చినబాబు సంతకం పెట్టారని చెప్పారు. ఇలా ఎలా, ఎందుకు చేశారో బయటపెట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, అమ్మఒడి పథకానికి సంబంధించిన ప్రశ్నలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియం బోధన కోసం టీచర్లకు మూడుదశల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కీ రీసోర్స్ పర్సన్స్కి మూడు వర్సిటీలకు చెందిన నిష్ణాతులైన ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించామన్నారు. వారిద్వారా జిల్లా, మండల స్థాయిలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు జూన్లో ప్రొబేషన్ ఖరారు జూన్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ను ఖరారు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సచివాలయ ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల కొంతమంది సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులను తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగాలను తమ హయాంలో ఇచ్చినట్లు టీడీపీ మాట్లాడుతోందని, ఆ ఉద్యోగాలను సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. వారి పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉందని తెలిపారు. -
టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు: బాలినేని
-
పవన్.. బీజేపీని రోడ్ మ్యాప్ అడగటం ఏంటి?: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: గత ఎన్నికల్లో చంద్రబాబును తిట్టి ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుల కోసం వెంపర్లడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును తిట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆయనతో కలసి పొత్తుపెట్టుకోవడాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు. జనసేన పార్టీ పెట్టి.. బీజేపీని రోడ్ మ్యాప్ అడగటం ఏంటని బాలినేని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలవుతున్నాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ -
వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): వేసవిలో డిమాండ్కు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని రాష్ట్ర ఇంధన శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. విజయవాడ 30వ డివిజన్ దేవీనగర్ ట్రెండ్సెట్ మెడోస్లో రూ.3.60 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ..వేసవిలో ఎటువంటి పవర్కట్ లేకుండా నిరాటంకంగా విద్యుత్ సరఫరా అందించాలని, అవసరమైతే అదనంగా విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. టీడీపీ హయాంలోని రూ.26 వేల కోట్ల బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో వసూలు చేసిన ట్రూఅప్ చార్జీలను సైతం తిరిగి చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. రూ.2.49కు లభించే విద్యుత్ రూ.4.84 చెల్లించడానికి గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పీపీఏ చేసుకున్నారో టీడీపీ నేతలు చెప్పాలని అన్నారు. 86 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు. తమ పథకాలే తమ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని, వచ్చే ఎన్నికల్లో 150కు పైగా సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. -
గౌతమ్ రెడ్డి బంగారంలాంటి మనిషి
-
టీడీపీ వల్లే డిస్కమ్లపై రూ.30వేల కోట్ల భారం
ఒంగోలు: గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకంవల్లే విద్యుత్ డిస్కమ్లు రూ.30వేల కోట్ల భారాన్ని భరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఐదేళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తోందని.. ఇది ప్రభుత్వానికి భారంగా మారడంతో ఇబ్బందిగా ఉందన్నారు. ప్రైవేటుకు లీజుకిచ్చే అంశంపై విద్యుత్ జేఏసీ అడిగిన విజ్ఞప్తికి తాము ఎటువంటి స్పష్టమైన హామీని ఇవ్వలేదన్నారు. అయినా వారి విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇక విద్యుత్ జేఏసీతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ్రారెడ్డి, తాను మాట్లాడామని.. జేఏసీ కోరికలన్నీ దాదాపుగా నెరవేరుస్తున్నామన్నారు. అలాగే పీఆర్సీకి సంబంధించి కమిషన్ కాదు.. కమిటీ వేయాలంటూ విజ్ఞప్తి వచ్చిందని, దీనిని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ సమస్యలను వక్రీకరించడం సబబుకాదు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని బాలినేని స్పష్టంచేశారు. ఎప్పుడైనా ఒకటి అరా సమస్యలు రావడం సహజమని, దానిని వక్రీకరించాలని చూస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ విద్యుత్ రూ.2.50కు అందుబాటులో ఉంటే ఏకంగా రూ.4.87లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందన్నారు. దీనివల్ల విద్యుత్ డిస్కంలు ఏకంగా రూ.30 వేల కోట్ల భారాన్ని మోస్తున్నాయన్నారు. అయినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు విచిత్రంగా ఉంటున్నాయని.. కేంద్రం నిధులు ఇస్తామంటే వద్దని, అప్పులు ఎవరైనా చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడడం సరికాదన్నారు. నిజంగా సోము వీర్రాజుకు రాష్ట్రంపై ప్రేమే ఉంటే మోదీతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కోరాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. -
విద్యుత్పై టీడీపీ అనవసర రాద్ధాంతం
ఒంగోలు సబర్బన్: విద్యుత్ విషయంలో తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా విద్యుత్ కోతలు లేవని చెప్పారు. సాంకేతిక సమస్య కారణంగా రెండు రోజులుగా కొంతమేర విద్యుత్ సమస్య నెలకొందన్నారు. దీనిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి విద్యుత్ సంస్థల మెడకు బకాయిల బండను కట్టి వెళ్లారని ధ్వజమెత్తారు. ఆ భారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మంత్రి బాలినేని ఇంకా ఏమన్నారంటే.. ఎన్టీఆర్పై బాబుకు దొంగ ప్రేమ ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఒక జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా ఆయనకు గౌరవం కల్పించారు. చంద్రబాబు మాత్రం ఓట్ల కోసమే ఎన్టీఆర్కు దండం పెడుతున్నాడు. మనసులో ఏమాత్రం ప్రేమ ఉండడు. పైకి చూపించేదంతా దొంగ ప్రేమ. ► తను ముఖ్యమంత్రిగా పని చేసి కూడా.. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదో సినీ నటుడు బాలకృష్ణ తన బావ చంద్రబాబును నిలదీయాలి. ఆ పని చేయకుండా పుట్టపర్తి జిల్లా విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ► రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు, సత్య సాయిబాబాకు దేశ, విదేశాల్లో ఉన్న ప్రేమ పూర్వక, మంచి పేరును దృష్టిలో ఉంచుకొని సీఎం వైఎస్ జగన్ పుట్టపర్తిని జిల్లాగా ప్రకటించారు. ► ఉద్యోగులతో జరుపుతున్న చర్చలు తప్పక ఫలిస్తాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు ఎన్నో రకాలుగా మేలు చేస్తోంది. చంద్రబాబు కేసులు పెట్టి వేధిస్తే, సీఎం వైఎస్ జగన్ ఆ కేసులు ఎత్తివేశారు. ► కొంత మంది వ్యక్తులు వెనుక ఉండి సుబ్బారావు గుప్తాను ప్రోత్సహిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి బాగోలేదు. -
‘చిన్న సమస్యను ఉద్యోగులు రాద్ధాంతం చేయడం సరికాదు’
సాక్షి, ప్రకాశం: చర్చల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఉద్యోగులు వచ్చి చర్చిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. చిన్న సమస్యను ఉద్యోగులు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని మంత్రి బాలినేని అన్నారు. విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నా విద్యుత్ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా అవకాశం ఉన్నంతమేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. -
వంగవీటి రాధాది చారిత్రక తప్పిదం
ఒంగోలు: వంగవీటి రాధా టీడీపీలో చేరి చారిత్రక తప్పిదం చేశారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తండ్రిని హత్య చేయించిన పార్టీలో రాధా చేరకుండా ఉండాల్సిందన్నారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నా, రంగా కుటుంబంపై సీఎం వైఎస్ జగన్కు, తమకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు. తనను హత్య చేసేందుకు నెల కిందట రెక్కీ నిర్వహించారని రాధా ప్రకటన చేయడంతో ప్రభుత్వం గన్మెన్లను కేటాయించిందని చెప్పారు. గన్మెన్లను వద్దనుకోవడం రాధా వ్యక్తిగతమని పేర్కొన్నారు. రాధా చేసిన రెక్కీ ఆరోపణలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు. చంద్రబాబు ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాధా ఇప్పటికైనా తండ్రిని చంపిన పార్టీలో కొనసాగడంపై పునరాలోచించుకోవాలని ఒక మిత్రుడిగా తాను సూచిస్తున్నానని చెప్పారు.