
కేసినో ప్రవీణ్ ఎవరో తనకి అసలు తెలియదని, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు.
సాక్షి, ప్రకాశం జిల్లా: కేసినో వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసినో ప్రవీణ్ ఎవరో తనకి అసలు తెలియదని, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. ఒంగోలు నగరాన్ని ఈ రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని బాలినేని అన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధికి రూ.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్న ఆయన, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని బాలినేని అన్నారు.
చదవండి: చంద్రబాబు పాలనలో జరిగింది డీపీటీ: సీఎం జగన్