Eluru District Latest News
-
దాడి కేసులో ఆరుగురిపై కేసు నమోదు
భీమవరం: రెస్టారెంట్లోని ఆహారం బాగాలేదని వంటమనిషిపై దాడిచేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఏఎస్సై నర్సింహస్వామి సోమవారం చెప్పారు. పట్టణంలోని అజయ్ బార్ అండ్ రెస్టారెంట్కు పట్టణానికే చెందిన సుధీర్, మరో అయిదుగురు వెళ్లారు. అక్కడ ఆహారం బాగాలేదని వంట మనిషి ప్రకాష్పై బీరుబాటిల్ పగులగొట్టి దాడిచేశారు. దీనిపై బార్ అండ్ రెస్టారెంట్ సూపర్వైజర్ దారపురెడ్డి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై నర్సింహస్వామి చెప్పారు. ట్రిపుల్ ఐటీలో మెస్లనిర్వహణపై అభిప్రాయ సేకరణ నూజివీడు: ట్రిపుల్ఐ టీలోని మెస్ల నిర్వహణపై సోమవారం అధికారులు విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. తహసీల్దార్ బీవీ సుబ్బారావు తన సిబ్బందితో వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. మెస్లలో భోజనం ఎలా ఉంది, డైనింగ్ హాల్, కిచెన్లలో శుభ్రత తదితర విషయాలపై అభిప్రాయాన్ని తెలపమని విద్యార్థులకు ప్రింటెండ్ పత్రాలు అందించారు. వాటిల్లో విద్యార్థులు వారి అభిప్రాయాన్ని తెలిపారు. అభిప్రాయ సేకరణను సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ పరిశీలించారు. భోజనం ఎలా ఉందంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పెట్టే భోజనం శుచిగా, రుచిగా ఉండాలన్నారు. ట్రిపుల్ ఐటీ అధికారులు నిరంతరం మెస్లను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు ముదినేపల్లి రూరల్: మండలంలోని పేరూరులో స్థానిక సమస్యలపై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దళితులను కులం పేరుతో దూషించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సేవా నాగజగన్బాబురావు స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన మురళీ, అతని తల్లి ఆ గ్రామంలోని సమస్యలకు సంబంధించి దళితులకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ పెద్దల సమక్షంలో దళితులను కులం పేరుతో దూషించి కించపరిచారంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో దళిత నాయకులు గరికిముక్కుల రాజేష్, భూపతి సునీత, తదితరులున్నారు. మ్యాజిక్ ఫెస్టివల్లో మెరిసిన లేడీ మెజీషియన్ లక్ష్మీప్రసన్న తణుకు అర్బన్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈనెల 27వ తేదీన నిర్వహించిన పల్నాడు మ్యాజిక్ ఫెస్టివల్లో తణుకుకు చెందిన లేడీ మెజీషియన్ దండా లక్ష్మీప్రసన్న తృతీయ స్థానంలో నిలిచారు. దేశం నలుమూలల నుంచి 250 మందికిపైగా హాజరైన ఈ ఫెస్టివల్లో తృతీయ స్థానంలో నిలవడం చాలా సంతృప్తినిచ్చిందని ప్రసన్న తెలిపారు. ఈ ఫెస్టివల్తో వరుసగా మూడేళ్లపాటు మెజీషియన్ ఫెస్టివల్స్లో విజయం సాధించి హాట్రిక్గా నిలిచినట్లు వివరించారు. 2023లో అమరావతి జరిగిన మ్యాజిక్ ఫెస్టివల్లో స్టేట్ ఫస్ట్గాను, 2024లో ఉత్తరప్రదేశ్లో ఆగ్రా తాజ్ మ్యాజిక్ ఫెస్టివల్లో జాతీయస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఫెస్టివల్ నిర్వాహకులు జీవీఆర్, పల్నాడు ఫెస్టివల్ అధ్యక్షుడు బాబునాయుడు, కార్యదర్శి నాగరాజు, గురువు దండా రాములకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఉత్తమ ప్రదర్శనగా ‘స్వేచ్ఛ’ నాటిక
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని శ్రీ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ప్రదర్శితమైన 43వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల్లో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక ఉత్తమ ప్రదర్శనగా మొదటి బహుమతి గెలుచుకుంది. విజేతలకు యూత్ కమిటీ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పాలకొల్లు చాంబర్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ చేగొండి సత్యనారాయణమూర్తి బహుమతులు అందజేశారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్–కొలకులూరు వారి జనరల్ భోగీలు నిలువగా, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నటీ నట సమాక్య–పాలకొల్లు వారి అనూహ్యం నాటిక నిలిచింది. జ్యూరీ విభాగంలో కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారి ద్వారబంధాల చంద్రయ్యనాయుడు నాటిక నిలిచింది. ఈ పోటీలకు కొంతేటి సర్వేశలింగం, గంటా రామమోహనరావు, కొడమంచిలి సత్యప్రసాద్ గుణ నిర్ణేతలుగా వ్యవహరించారు. నిద్రమత్తులో డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి పాలకోడేరు: నిద్ర మత్తులో డాబాపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మోగల్లులో జరిగింది. పాలకోడేరు ఎస్సై ఎం.రవి వర్మ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు నాగేశ్వరరావు (45) ఆదివారం రాత్రి ఎప్పటిలాగానే డాబాపై నిద్రించాడు. మూత్ర విసర్జన నిమిత్తం వేకువజామున కిందికి దిగే క్రమంలో పైనుంచి జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవివర్మ చెప్పారు. -
శ్రీవారి దేవస్థానం కాంట్రాక్ట్ సిబ్బంది నిర్వాకం
దేవస్థానం హైస్కూల్ గ్రౌండ్లో మద్యం సేవించిన ట్రాక్టర్ డ్రైవర్, స్కావెంజర్ ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం హైస్కూల్ గ్రౌండ్లో ఇద్దరు ఆలయ కాంట్రాక్ట్ ఉద్యోగులు సోమవారం మద్యం సేవించడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తోంది. కాంట్రాక్ట్ తరుఫున పనిచేస్తున్న ఒక ట్రాక్టర్ డ్రైవర్, మరో స్కావెంజర్ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్థానిక హైస్కూల్ గ్రౌండ్లోని స్టేజీపై కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పారిశుద్ధ్య పనులకు వినియోగించే ట్రాక్టర్ను సైతం గ్రౌండ్లో వారి వద్దే పెట్టుకున్నారు. మధాహ్నం 3 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉండగా, ఇప్పుడు మద్యం సేవిస్తున్నారేమిటని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు, వేసవికాలం కావడంతో సాయంత్రం 4 గంటలకు విధులకు వెళ్తామని ట్రాక్టర్ డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. అయినా పాఠశాల గ్రౌండ్లో తాగడం ఏమిటని అడిగితే గ్రౌండ్లో ఉన్న ఖాళీ మద్యం బాటిళ్లను చూపించి, ఇవన్నీ అవే కదా అని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బెల్లం అమ్మిన కేసులో రూ.25 వేల జరిమానా కామవరపుకోట: నాటు సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మిన కేసులో ఒక వ్యక్తికి రూ. 25 వేల జరిమానా విధించినట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈస్ట్ యడవల్లికి చెందిన శ్రీ సాయి రంగ ప్రకాష్ గ్రామంలో నాటు సారాయి తయారు చేసే వారికి బెల్లం సరఫరా చేసిన కేసులో తహసీల్దార్ జి.ఎలిసా జరిమానా విధించినట్లు తెలిపారు. -
బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరి
నూజివీడు: ట్రిపుల్ఐటీ.. ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే విద్యాసంస్థ. అయితే ఇందులో పనిచేసే బోధనా సిబ్బందికి బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరిపోతోంది. ట్రిపుల్ ఐటీలో పర్మినెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు, ఐటీ మెంటార్లు పీయూసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. వీరిలో కొందరికి పలు అదనపు బాధ్యతలను అప్పగించారు. తెలుగు డిపార్ట్మెంట్కు చెందిన ఏకంగా ముగ్గురికి అదనపు బాధ్యతలను అప్పగించడంతో వారు నిత్యం అదనపు బాధ్యతల్లోనే మునిగి తేలుతున్నారు. క్యాంపస్ మెయింట్నెన్స్ ఇన్చార్జిగా తెలుగు మెంటార్ ఓ శ్రీహరికి అప్పగించారు. ఈయన సెక్యూరిటీ, హౌస్కీపింగ్, గార్డెనింగ్, గెస్ట్హౌస్ల మెయింట్నెన్స్ను చూసుకుంటున్నారు. మూడు షిఫ్టులలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది విషయాలతో పాటు హౌస్కీపింగ్, గార్డెనింగ్ సిబ్బంది వ్యవహారాలు చూసుకోవడంతోనే ఉన్న సమయం కాస్తా సరిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే తెలుగు సబ్జెక్టు బోధించే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో జడ సీతాపతికి డీన్ స్టూడెంట్ వెల్ఫేర్(బాలుర) బాధ్యతలను, పీ లక్ష్మణరావుకు బాలుర చీఫ్ వార్డెన్ బాధ్యతలను అప్పగించారు. ఇలా ఒకే సబ్జెక్టుకు చెందిన ముగ్గురు బోధన సిబ్బందిని అదనపు బాధ్యతల్లో నియమిస్తే ఆ సబ్జెక్టులో విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫైనాన్స్ ఆఫీసర్గా ఏడాదికో ఫ్యాకల్టీ ట్రిపుల్ఈ విద్యార్థులకు పాఠాలు బోధించే శ్రీనాథ్కు ఫైనాన్స్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పగించారు. ఫైనాన్స్ ఆఫీసర్గా ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఏడీ స్థాయి అధికారిని డిప్యూటేషన్పై నియమించుకోవాలని ట్రిపుల్ ఐటీకి సంబంధించిన యాక్ట్–18లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అదేమీ పాటించకుండా ఏడాదికొక ఫ్యాకల్టీని ఫైనాన్స్ ఆఫీసర్గా నియమిస్తున్నారు. సెంట్రల్ డీన్, సెంట్రల్ ఏఓ, ఏఓ, ప్లేస్మెంట్ ఆఫీసర్ అంటూ కొందరిని నియమించారు. మరికొందరికి మెస్ల ఇన్చార్జిలుగాను బాలికల హాస్టళ్లకు చీఫ్ వార్డెన్గా బాధ్యతలు అప్పగించారు. ఇలా అత్యధిక మంది నిరంతరం అదనపు బాధ్యతల్లోనే మునిగి తేలుతుండటంతో బోధన కొంతమేరకు కుంటుపడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదనపు బాధ్యతలు ఉన్న కొందరు వీటిని సాకుగా చూపించి పరీక్షల సమయంలో ఇన్విజిలేషన్ను సైతం తప్పించుకుంటున్నారు. మరికొందరైతే డబ్బులు వచ్చే సెమిస్టర్ పరీక్షలకు ఇన్విజిలేషన్ వేయించుకుంటూ డబ్బులు రాని మిడ్ పరీక్షల ఇన్విజిలేషన్కు దూరంగా ఉంటున్నారు. కొన్ని బ్రాంచిలకు ఫ్యాకల్టీ తక్కువ మెకానికల్ బ్రాంచికి సంబంధించి నాలుగు సంవత్సరాలకు సంబంధంచి 240 మంది విద్యార్థులకు 11 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచిలకు 1,440 మంది చొప్పున విద్యార్థులండగా సీఎస్ఈకి 20 మంది, ఈసీఈకి 15 మంది మాత్రమే ఫ్యాకల్టీ ఉన్నారు. కెమికల్కు 240 మందికి ఏడుగురు, ట్రిపుల్ ఈ కి 480 మందికి 14 మంది, సివిల్కు 240 మందికి 13 మంది, మెటలర్జీకి 240 మందికి ఐదుగురు ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు. దీంతో కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా పనిభారం ఉండటం జరుగుతోంది. వీటన్నింటిని సరిదిద్ది విద్యార్థులకు మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం ట్రిపుల్ ఐటీ వర్గాల్లోనే వినిపిస్తోంది. తెలుగు డిపార్ట్మెంట్లోనే ముగ్గురికి అదనపు బాధ్యతలు ఫ్యాకల్టీల్లో కొందరికి ఎక్కువ పనిభారం ట్రిపుల్ ఐటీలో కుంటుపడుతున్న బోధన -
ఆన్లైన్లో చాటింగ్.. ఆపై మోసం
ఏలూరు (టూటౌన్): భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆన్లైన్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. భీమడోలు మండలం, ఆగడాలలంక గ్రామానికి చెందిన బలే శైలజ (26)కు ఈలో–ఈలో ఆన్లైన్ యాప్ ద్వారా రాజు యాదవ్ అనే పేరుతో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నని చెప్పి నమ్మించాడు. బాధితురాలి సమస్యలను తెలుసుకొని ప్రైవేట్ బ్యాంక్లలో లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు. లోన్ ప్రొసెసింగ్ ఫీజ్ చెల్లించాలని చెప్పి దఫాదఫాలుగా సుమారు రూ.1,60,900 ఫోన్ పే ద్వారా వసూలు చేశాడు. ఎన్ని రోజులైనా లోన్ రాకపోవడంతో ఆమె నాగరాజును నిలదీయగా నీ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె భీమడోలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు కడప జిల్లా వేములకు చెందిన నారుబోయిన రాజశేఖర్ అలియాస్ రాజుయాదవ్ను గుండుగొలను గ్రామ శివారు పోతునూరు రోడ్డులోని వాటర్ కల్వర్ట్ వద్ద అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు లాప్టాప్లను సీజ్ చేశారు. కేసును ఛేదించిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్, హెచ్సీలు ఎస్కేఎస్ బాజీ, ఎస్.శ్రీనివాస్, పీసీ ఎం.వెంకటేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు. కేసును ఛేదించిన భీమడోలు పోలీసులు -
‘(అ) సత్యం’ నాటికకు మొదటి బహుమతి
భీమవరం: చైతన్య భారతి సంగీత, నృత నాటక పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో నిర్వహించిన 18వ జాతీయస్థాయి నాటికల పోటీల్లో చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారి ‘(అ) సత్యం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ప్రథమ బహుమతిని గెల్చుకుంది. విజేతల వివరాలను సోమవారం నాటిక న్యాయనిర్ణేతలు మానాపురం సత్యనారాయణ, ఎల్ రుద్రమూర్తి, సుసుము నాగ భూషణం వెల్లడించారు. సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ‘జనరల్ భోగీలు’ ద్వితీయ బహుమతి, యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి ‘నా శత్రువు’ తృతీయ బహుమతిని గెల్చుకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి ‘చిగురు మేఘం’, ఉత్తమ రచనగా ‘నా శత్రువు’, ఉత్తమ దర్శకత్వం బాలాజీ నాయక్ ((అ) సత్యం), ఉత్తమ నటుడు కావూరి సత్యనారాయణ (చెన్నయ్య పాత్రధారి – చిగురు మేఘం), ఉత్తమ నటి సురభి ప్రభావతి (సావిత్రమ్మ పాత్రధారిణి – జనరల్ భోగీలు), ఉత్తమ విలన్గా గోపరాజు విజయ్ (సీఐ పాత్రధారి – జనరల్ భోగీలు), ఉత్తమ హాస్యనటుడు పి కోటేశ్వరరావు (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ బాల నటుడు యశ్విత (నా శత్రువు), ద్వితీయ ఉత్తమ నటుడు చెరుకూరి సాంబశివరావు (కిడ్నాప్), ద్వితీయ ఉత్తమ నటి జ్యోతిరాణి (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గంగోత్రి సాయి (విడాకులు కావాలి) ఎం రత్నకుమారి (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ రంగాలంకరణ పీవీ కుమార్ (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ సంగీతం లీలమోహన్ (అ సత్యం), ఉత్తమ మేకప్ థామస్ (ఉక్కు సంకెళ్ళు), జ్యూరీ బహుమతి చిగురు మేఘం, ఇది రహదారి కాదు నాటికలు గెల్చుకున్నాయి. విజేతలకు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్కుమార్రాజు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నాడ శ్రీనివాస్, కృత్తివెంటి సత్యకుమార్ తదితరులు బహుమతులు అందజేశారు. -
ముక్తికి మార్గం.. నత్తా రామేశ్వరుడి దర్శనం
పెనుమంట్ర: నత్తారామేశ్వరం గ్రామంలోని గోస్తనీ నదిలో వేంచేసియున్న పరశురామ ప్రతిష్ఠ శ్రీసప్త రామ కోటిలింగేశ్వరుడు సోమవారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన నత్తారామేశ్వరం గ్రామంలో శ్రీఉమా రామలింగేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడు, సప్త రామ కోటి లింగేశ్వరులను ఒకే సమయంలో దర్శించుకునే అవకాశం ఒక్క వైశాఖమాసంలోనే భక్తులకు దక్కుతుంది. రామేశ్వర క్షేత్రంలో సీతారాములు, లక్ష్మణుడు, పరశురాముడు, స్వయంగా శివలింగాలను ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఏడాదిలో 365 రోజులు ఉమా రామలింగేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడులను దర్శించుకునే అవకాశం ఉన్నా.. నీటిలో ఉండే పరశురామ ప్రతిష్ఠ రామలింగేశ్వరుని దర్శించుకునే అవకాశం కేవలం 30 రోజులు మాత్రమే ఉంటుంది. వైశాఖ మాసం ప్రారంభకావడంతో సోమవారం దేవాదాయశాఖ కోనేరులోని నీటిని పూర్తిగా తొలగించి స్వామిని భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో సోమవారం జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సప్తరామ కోటేశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తులకు దాతలు అన్నసమారాధనతోపాటు చక్రపొంగలి, పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈసందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి బారులు తీరి త్రిలింగాలను దర్శించుకున్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన సప్తకోటి రామలింగేశ్వరుడి దర్శనం ఏడాదిలో వైశాఖ మాసంలోనే స్వామివారి దివ్య దర్శనం బారులు దీరి త్రిలింగాలను దర్శించుకున్న భక్తులు -
ప్రభుత్వాసుపత్రి మార్చురీలో కొత్త దందా
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో మృతదేహాలతో అక్రమ వ్యాపారం సాగించిన సిబ్బంది.. తాజాగా మరో వ్యాపారానికి తెరదీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్చు రీలోని ఫ్రీజర్ బాక్సులు పనిచేయటం లేదు. రెండ్రోజుల క్రితం దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన లింగాల పరశురాం విద్యుత్ షాక్తో మృతిచెందాడు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్లో మార్చురీకి తరలించగా ఫ్రీజర్ బాక్సులో పెట్టారు. సాయంత్రానికి మృతదేహం దుర్వాసన రావడంతో బంధువులు నిలదీశారు. మార్చురీ సిబ్బంది వారిపై ఎదురుదాడికి దిగారు. మీకు అవసరమైతే వెళ్ళి ఫ్రీజర్ బాక్సు తెచ్చుకుని పెట్టుకోండి? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇంత జరుగుతున్నా స్పందించని అధికారులు ఏలూరు జీజీహెచ్లో మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ బాక్సులు పనిచేయకపోవటంతో సిబ్బంది కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారంటున్నారు. వారే ప్రైవేటు ఫ్రీజర్ బాక్సులు పురమాయిస్తారు. రోజుకి రూ.3 వేల నుంచి రూ.3,500 చెల్లిస్తే ఫ్రీజర్ బాక్సు తీసుకొచ్చి దానిలో మృతదేహాన్ని భద్రపరుస్తారు. ఇంత జరుగుతున్నా మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందో అర్థం కావడం లేదని పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది ఈ తరహాలో వ్యాపారం చేస్తుంటే అధికారులకు తెలియదా? లేక వారికీ దీనిలో వాటాలు ఉన్నా యా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా అక్రమ వ్యాపారం సాగిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా? అని మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పనిచేయని ఫ్రీజర్ బాక్సులు రూ. 3 వేలు ఇస్తే ఫ్రీజర్ బాక్సు పురమాయింపు -
ద్వారకాతిరుమలలో గణేష్ శర్మకు శిక్షణ
ద్వారకాతిరుమల: కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్వారకాతిరుమలలో రుగ్వేదాన్ని అభ్యసించారు. 2009లో వేసవి సెలవుల్లో తిరుపతిలోని మేనమావ ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను ఆదే సమయంలో తిరుపతి వచ్చిన కంచికామకోటి పీఠం శంకరాచార్యస్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు. ద్వారకాతిరుమల దేవస్థానం రుగ్వేద సలక్షణ ఘనాపాటి, సకల జ్ఞాన సంపన్నుడైన రత్నాకర్ శర్మ వద్ద చేర్పించాలని ఆదేశించారు. దాంతో ఆయన రత్నాకర శర్మ ఇంటి వద్ద ఉండి 2009 నుంచి దాదాపు 12 ఏళ్లపాటు వేద విద్యను పట్టుదలతో నేర్చుకున్నారు. ఆయన వద్ద రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణ అరణ్యకం, ఉపనిషత్తులు వంటి వాటిలో నిష్ణాతులయ్యారు. సప్తమంజరి, ధాతురూపావళి, సమస కుసుమావళి వంటి ఎన్నో పుస్తకాలను అవపోసన పట్టారు. 12 ఏళ్ల పాటు ద్వారకాతిరుమలలో శిక్షణ పొందిన అన్నవరానికి చెందిన గణేష శర్మ కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులవడం పట్ల ఇక్కడ వేద పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంచి పీఠం ఉత్తరాధికారిగా నియామకం -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
ఆన్లైన్లో చాటింగ్.. ఆపై మోసం భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళకు ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి నమ్మించి బాధితురాలి నుంచి దఫాదఫాలుగా రూ.1,60,900లు స్వాహా చేశాడు. 8లో uఏలూరు(మెట్రో): పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టరు కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులు అందుకు అనుగుణంగా అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టరు హెచ్చరించారు. అధికారులే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి చక్కని పరిష్కారాన్ని చూపించాలన్నారు. ఆర్బీకే నిర్మిస్తే బిల్లులు చెల్లించడం లేదు ఏలూరు (టూటౌన్): భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో ఆర్బీకే కేంద్రం 90 శాతం నిర్మాణం పూర్తయ్యిందని.. కాంట్రాక్టర్ అయిన తనకు అన్యాయం చేసి బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ అంబటి నాగేంద్ర సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రైతు భరోసా కేంద్రంలో మిగిలిన 10 శాతం పనులు సర్పంచ్, ఈఓ, ఎంపీడీఓ కలిసి పూర్తి చేసి రైతు భరోసా కేంద్రాన్ని పంచాయతీగా మార్చి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. తాను 90 శాతం పనులు పూర్తి చేస్తే కేవలం 9.24 లక్షలు చెల్లించారని, మొత్తం గ్రాంటు 23.94 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. -
ముంపు చేలను పరిశీలించిన అధికారులు
నిడమర్రు: ‘అటవీ శాఖ నిర్లక్ష్యం–అన్నదాత ఆక్రోశం’ అని సాక్షి పత్రికలో సోమ వారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తాహసీల్దారు నాగరాజు, వ్యవసాయ అధికారి గీతా కుమారితో కలిసి పెదనిండ్రకొలనులో నీట మునిగిన వరి చేలను పరిశీలించారు. మరో వైపు అటవీ శాఖ అధికారులు ముంపు నీటిని ఇంజిన్లతో, జేసీబీలతో బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారి గంగారత్నం తెలిపారు. తహసీల్దారు మాట్లాడుతూ కౌలు రైతు వెంకన్న సాగు చేస్తున్న 7 ఎకరాల్లోని ముంపు నీటిని పూర్తిగా బయటకు తోడిన తర్వాత పంట నష్ట నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామన్నారు. -
ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలి
ఏలూరు(టూటౌన్)/చింతలపూడి: ఖైదీలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. తక్షణం వైద్య సదుపాయం కల్పించాలని ఉభయ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఆదేశించారు. ఏలూరు కోటదిబ్బలోని జిల్లా కారాగారాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ వంటకాలను పరిశీలించి రుచి చూశారు. కారాగారంలోని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందించే ఆహారం, మంచి నీరు విషయంలో రాజీ పడొద్దన్నారు. చింతలపూడి సబ్ జైలును ఆయన తనిఖీ చేశారు. ఉచిత న్యాయ సలహాలు, ముద్దాయిలకు అందించిన సాయంపై ఆరాతీశారు. వంటశాల, స్టోర్ రూం తనిఖీ చేశారు. 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో 2024–25 రబీ సీజన్కు సంబంధించి 12,380 మంది రైతుల నుంచి 1,55,529 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి చెప్పారు. సోమవారం గోదావరి సమావేశ మందిరంలో రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఇంతవరకు రూ.359.27 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా రూ.206.71 కోట్లను ఖాతాల్లో జమచేశామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఫిర్యాదు చేసేందుకు 08812–230448, 77020 03584, 75695 62076 నెంబర్లకు తెలియజేయాలన్నారు. బీమా అని చెప్పి టీడీపీ సభ్యత్వం ఉంగుటూరు: ఉంగుటూరు మండలం వెల్లమిల్లి పంచాయితీ లంబాడి గూడెం గ్రామానికి చెందిన వడితే లాలు మండల వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ కన్వీనర్గా ఉన్నారు. ఇటీవల గ్రామంలో టీడీపీ నాయకులు బీమా అని ఇంటింటికీ తిరిగారు. లాలు ఇంటికొచ్చి బీమా అని నమ్మించి రూ. 200 కట్టించుకున్నారు. సోమవారం టీడీపీ నాయకులు వచ్చి సభ్యత్వ నమోదు కార్డు ఇచ్చారు. అయితే తాము ఆ పార్టీలో చేరలేదని.. తమకు కార్డు ఎందుకు ఇచ్చారని లాలు గట్టిగా ప్రశ్నించారు. బీమా పేరుతో తెలుగుదేశం నాయకులు మోసం చేశారని, తాము ఎప్పుడూ వైఎస్సార్సీపీ పార్టీయేనని ఆయన తెలిపారు. వృద్ధుడిని అనాథగా వదిలేసిన కొడుకు తణుకు అర్బన్: వృద్ధుడిని అతని కుటుంబ సభ్యులు తణుకు రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లిన ఘటన సోమ వారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన్లో మూలుగుతూ ఇబ్బందిపడుతున్న వృద్ధుడిని ప్రయాణికులు ప్రశ్నించగా.. తన పేరు ముత్యాల పల్లపరాజు అని తణుకు ముత్యాలవారి వీధిలో ఉంటున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధుడిని రైల్వే స్టేషన్లో వదలివెళ్లినట్లుగా రైల్వే పోలీసులు చెప్పారు. వృద్ధుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడని, కాలుపై పుండు పడి దుర్వాసన వస్తుండడంతోపాటు రాత్రి నుంచి ఆహారం కూడా తీసుకోకపోవడంతో బాగా నీరసించిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కుటుంబసభ్యులు వదిలించుకోవాలని చూడడం బాధాకరమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వృద్ధుడి వ్యవహారం వైరల్ కావడంతో చివరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతని కుమారుడు వచ్చి తీసుకువెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. -
భూసేకరణ పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ రహదారి భూసేకరణ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, భూ యజమానులకు వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమ వారం జిల్లాలో 365 బిజి (గ్రీన్ ఫీల్డ్ హైవే), 165 జాతీయ రహదారుల నిర్మాణ, భూసేకరణ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులకు భూములు అందించిన వారికి వెంటనే పరిహారం అందించి, భూములు స్వాధీనం చేసుకుని రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ హాలులో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎంహెచ్ఓ ఆర్.మాలిని, డీసీహెచ్ఎస్ డా.పాల్ సతీష్ కుమార్తో కలెక్టర్ సమీక్షించారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పరచాలన్నారు. -
చేపల సాగులో కోడి వ్యర్థాలు
కై కలూరు: కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, చనిపోయిన కోడి పిల్లలు, పాడైన కోడిగుడ్లు ఇవి కొల్లేరు ప్రాంతమైన చటాకాయి గ్రామంలో ఫంగస్ చేపలకు వేస్తున్న ఆహారం. వీటిని తిన్న చేపలను మనం తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం. అయినా కొందరు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపల సాగు, 1.10 ఎకరాల్లో రొయ్యల సాగు వెరసి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో 84,852.4 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 30,972 మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో ఫంగసీస్ సాగు సుమారు 8 వేల ఎకరాల్లో జరుగుతుందని అంచనా. ఫంగసిస్ చేపలు వ్యాధులను తట్టుకుని, ఎలాంటి మేతనైన జీర్ణం చేసుకునే గుణం కలిగి ఉంటాయి. దీంతో వీటికి కోడి వ్యర్థాలు ఆహారంగా వేస్తున్నారు. కేరాఫ్గా చటాకాయి: కై కలూరు మండలం చటాకాయి గ్రామం వ్యర్థాల సాగునకు కేరాఫ్గా మారుతోంది. గతంలో నిషేధిత క్యాట్ ఫిష్ సాగుకు అడ్డాగా గ్రామం ఉండేది. అనేక సందర్భాల్లో కోడి వ్యర్థాల వ్యాన్లు పట్టుబడ్డాయి. తాజాగా ఆదివారం రాత్రి గ్రామ పెద్దగా చాలామణి అవుతున్న వ్యక్తి చెరువులో కోడి వ్యర్థాలు విడిచిపెట్టారు. పోలీసులు ఆలస్యంగా రావడంతో అప్పటికే చెరువులో కోడి వ్యర్థాలు చల్లాడు. ఇదే గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో ఫంగసీస్ సాగులో కోడి వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు సమాచారం. మచిలీపట్నం, విజయవాడ నుంచి ఈ వ్యర్థాలు వస్తున్నాయి. హైదరాబాదు, విజయవాడ నుంచి కుళ్ళిన కోడిగుడ్లను ఆమ్లెట్ రూపంలో ట్రేలలో తీసు కొచ్చి వినియోగిస్తున్నారు. కోడి వ్యర్థాలు కేజీ రూ. 15కి విక్రయిస్తోండగా, కోడి గుడ్ల ఆమ్లెట్ కేజీ రూ. 20కి కొనుగోలు చేస్తున్నారు. చేపల మేత ఫిల్లెట్ ధరలు కేజీ రూ.40కి చేరడంతో మేత ధరలను తగ్గించుకోడానికి వ్యర్థాల వైపు మళ్ళుతున్నారు. జీవో 56 అమలులో విఫలం : కోడి వ్యర్థాలు, ఇతర వ్యర్థాలతో చేపల సాగు చేసి పర్యావరణానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో 56ను తీసుకొచ్చింది. వీటిని నియంత్రించడానికి చైర్పర్సన్గా తహసీల్దారు, సభ్యులుగా వీఆర్వో, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్సై, మెంబరు కన్వీనర్గా ఫిషరీస్ డెవలప్మెంటు ఆఫీసర్ను నియమించారు. చటాకాయిలో వ్యర్థాల సాగుపై కై కలూరు రూరల్ ఎస్సైను వివరణ కోరగా వాహనాన్ని సీజ్ చేశామని, లక్ష పూచికత్తుతో తహసీల్దారుకు బైండోవర్ చేశామన్నారు. ఆరోగ్యానికి ముప్పు వ్యర్థాలతో సాగు చేసిన చేపలు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రధానంగా ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తుతాయి. నరాల బలహీనతలు, కడుపునొప్పి, వాంతులతో పాటు ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి. – డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు, సూపరింటెండెంటు, ఏరియా ఆస్పత్రి, కై కలూరు. ఆక్వా రంగానికి చెడ్డ పేరు కొందరు చేసే తప్పు వల్ల మొత్తం ఆక్వా రంగానికి చెడ్డ పేరు వస్తుంది. పలు సమావేశాల్లో వ్యర్థాలతో సాగు చేయవద్దని హెచ్చరిస్తున్నాం. కొందరు పెడచెవిన పెడుతున్నారు. కలెక్టరు, ఎస్పీలకు వ్యర్థాల సాగుపై ఫిర్యాదు చేస్తాం. – నంబూరి వెంకటరామరాజు, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు, తాడినాడ ఆరోగ్యానికి ప్రమాదమంటున్న వైద్యులు చటాకాయి గ్రామంలో ఫంగస్ చేపలకు మేతగా కోడి వ్యర్థాలు జీవో 56 అమలులో అధికారుల విఫలం -
కొల్లేరు అతిథి పక్షుల తిరోగమనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆహారం, ఆవాసం కోసం వేల మైళ్ల దూరం నుంచి కొల్లేరుకు వలస వస్తున్న విదేశీ అతిథి పక్షులు తిరుగుబాట పడుతున్నాయి. రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు కొల్లేరు పక్షి జాతుల ఉసురు తీస్తున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కొల్లేరు సరస్సుపై పడింది. దీంతో జల సిరులతో కళకళలాడే సరస్సు ఎడారిని తలపిస్తోంది. కొల్లేరు భూమి నెర్రలతో కళావిహీనంగా మారింది. విదేశీ, స్వదేశీ పక్షులకు నీరు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు పయనమవుతున్నాయి. అభయారణ్య పరిధిలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులను, 81,495 పక్షులను గుర్తించారు. వీటిలో 16 రకాల జాతులు సైబీరియా, యూరప్, చైనా, ఇండోనేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, నైజీరియా, శ్రీలంక వంటి దేశాల నుంచి ఏటా వలస వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏలూరు జిల్లా కై కలూరు, మాధవపురం పక్షి సంరక్షణ కేంద్రాలకు పెలికాన్ పక్షులు వేలల్లో విచ్చేస్తాయి. దాదాపు వీటి సంఖ్య 7వేల పైనే ఉంటాయి. వీటిలో పాటు సూదితోక బాతు (నార్తరన్ పిన్ టయల్), కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), నల్ల రెక్కల ఉల్లంకి (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్), బంగారు ఉల్లంకి(పసిఫిక్ గోల్డెన్ ప్లోవర్), చిన్న నీటి కాకి (లిటిల్ కార్మోరెంట్) వంటివి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లేరులో నీరు లేకపోవడంతో సుమారు 35 వేల పైనే పక్షులు వెనుదిరుగుతున్నాయి. గోదావరి జలాలు మళ్లించాలి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కొల్లేరుకు మళ్లించాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం అవశ్యమని కొల్లేరుపై అధ్యయనం చేసిన మిత్రా, శ్రీరామకృష్ణయ్య కమిటీలు తేల్చిచెప్పాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీటి నిర్మాణాలకు నిధులు సైతం కేటాయించారు. ప్రభుత్వం మారడంతో రెగ్యులేటర్ల అంశం అటకెక్కింది. కూటమి ప్రభుత్వం రెగ్యులేటర్లను నిర్మిస్తే వర్షాకాలం, వరదల సమయంలో కొల్లేరుకు వచ్చే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. నీరు లేక ఎడారిగా మారిన కొల్లేరు సరస్సు సుమారు 35 వేల పక్షులు వెళ్లిపోయాయని అంచనా గోదావరి జలాలు కొల్లేరుకు పంపాలని డిమాండ్ కొల్లేరులో సహజ సిద్ధ చేపలు మృత్యువాత రెగ్యులేటర్లు నిర్మించండి కొల్లేరులో ఎల్లప్పుడూ నీరు ఉండాలంటే రెగ్యులేటర్లు నిర్మిం చాలి. దీనివల్ల వరదల సమ యంలో వచ్చే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఏటా సముద్రపు ఉప్పునీరు కొల్లేరుకు చేరుతోంది. ఈ నీటి వల్ల కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే చేపలు అంతరించిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం రెగ్యులేటర్ల నిర్మాణంపై దృష్టి సారించాలి. – ముంగర నరసింహారావు, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు పక్షులకు వేసవిలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి. వేసవికి ముందుగానే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అరుదైన పక్షులు కొల్లేరుకు వలస వస్తున్నాయి. సామాజిక బాధ్యతగా పలు స్వచ్ఛంద సంస్థలు నీటి తొట్టెల ఏర్పాటుకు ముందుకు రావాలి. – ఎం.హరిప్రసాద్, హిస్టరీ హెచ్ఓడీ, వైవీఎన్నార్ డిగ్రీ కాలేజీ, కై కలూరు నెర్రలిచ్చిన కొల్లేరు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. మొత్తం 122 కొల్లేరు గ్రామాల్లో దాదాపు 3 లక్షల మంది జీవిస్తున్నారు. కొల్లేరు సరస్సుకు 67 డ్రెయిన్ల ద్వారా 1.11 లక్షల క్యూసెక్కుల నీరు ఏటా చేరుతోంది. కృష్ణా, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో తూర్పు కనుమల కొండ ప్రాంతాల నుంచి వచ్చే రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు వాగులు కొల్లేరుకు ప్రధాన నీటి వనరులు. గత తెలుగుదేశం పాలనలో వెలగలేరు వద్ద రామిలేరు, తమ్మిలేరును పోలవరం కుడి కాల్వకు, అదే విధంగా చిన్న కాల్వలు, డ్రెయిన్లను పట్టిసీమ ప్రాజెక్టు కాల్వలోకి మళ్ళించారు. దీంతో కొల్లేరుకు వచ్చే నీరు తగ్గింది. కొల్లేరు సరస్సులో అక్రమ చేపల చెరువులు వేల ఎకరాల్లో విస్తరించడం, ఎగువ నుంచి వచ్చే నీటిని చెరువుల్లో నింపుకోవడం వల్ల కొల్లేరులో నీటి జాడ కనిపించడం లేదు. నీరు లేకపోవడంతో కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే అనేక నల్ల జాతి చేపలు మృత్యువాత పడుతున్నాయి. -
అటవీ శాఖ నిర్లక్ష్యం.. అన్నదాత ఆక్రోశం
నిడమర్రు: అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కోత కు సిద్ధంగా ఉన్న ఏడెకరాల వరి పంట నీటి పాలైన సంఘటన పెదనిండ్రకొలనులో చోటుచేసుకుంది. రైతులు, అధికారుల వివరాల ప్రకారం.. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అన్సర్వే భూముల్లో అనధికారంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారంటూ అటవీ శాఖ అధికారులు శనివారం 17 ఎకరాల చేప ల చెరువుకు గండి కొట్టారు. దీంతో చెరువు నీరు పంట కాలువలు, బోదెల్లో నీరు ఎగదన్నడంతో సరి హద్దుల్లోని వరి చేలు ఆదివారం ముంపు బారిన ప డ్డాయి. కౌలు రైతు చెన్నుబోయిన వెంకన్నకు చెందిన ఏడెకరాల వరి చేను పూర్తిగా నీటమునిగి సు మారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేశామని బాధిత రైతు వాపోయాడు. సమాచారం ఇవ్వకుండా.. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమ చేపల సా గు చేస్తున్న వారికి, అటవీ శాఖ సిబ్బందికి మధ్య ఇటీవల వ్యవహారం చెడింది. దీంతో పట్టుబడికి వచ్చిన చెరువులను గండి కొడతామని క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బందులు పెడుతూ సొమ్ములు వసూ లు చేస్తున్నారని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నిడమర్రు కొల్లేరు పాయలో అన్సర్వే, జిరాయి తీ భూముల లెక్కలు తేల్చాలని రైతులు సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 29న సర్వేకు సిద్ధమవుతున్నట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేష్, వ్యవసాయ శాఖ సి బ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అటవీ శాఖ అధికారులు ఓ చెరువుకు గండి కొట్టారు. దీ నిపై అటవీ శాఖ డీఎఫ్ఓ డి.విజయను వివరణ కో రగా పూర్తి వివరాలు తెలియదని, తమ సిబ్బందిని విచారణకు ఆదేశించానని, నివేదిక అనంతరం ఉ న్నతాధికారులకు తెలుపుతామని సమాధానమిచ్చారు. పరిహారంపై సందిగ్ధం గండి విషయంలో తమకు సమాచారం లేదని, ఉంటే పంటను ఒబ్బిడి చేసుకోవాలని రైతును అప్రమ త్తం చేసేవారమని మండల వ్యవసాయ అధికారి పి.గీతాదేవి అన్నారు. ఈ–క్రాప్లో పంట నమోదు చేశామని, నష్టం విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ముంపు చేనును ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు. కొల్లేరులో అక్రమ చెరువుకు గండి నీరు ఎగదన్ని సమీపంలోనిఏడు ఎకరాల వరి పంట మునక లబోదిబోమంటున్న రైతు మరోసారి కూటమి మోసం కొల్లేరును 3వ కాంటూరుకి కుదిస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు అభయా రణ్యం పరిధిలో జిరాయితీ పట్టా భూములన్న వారిపైకి అధికారులను పంపి వేధిస్తున్నారు. ఇలా మరోమారు చంద్రబాబు సర్కారు కొల్లేరు రైతులను మోసం చేసింది. కౌలు రైతు వెంకన్నకు నష్టపరిహారం ఇవ్వాలి. –కోడే కాశి, జెడ్పీటీసీ, నిడమర్రు అధికారులను వేడుకున్నా.. మా భూముల లెక్కల తేల్చాలని సర్వేకు నెల రోజుల క్రితమే ఆయ కట్టు జిరాయితీ రైతులంతా దరఖాస్తు చేసుకున్నాం. గండి కొట్టడానికి వచ్చిన అధికారులకు సర్వే అనంతరం అన్సర్వే, జిరాయితీ విడదీసిన తర్వాత గండి కొట్టాలని వేడుకున్నా అటవీ శాఖ సిబ్బంది వినలేదు. – వగ్వాల సుబ్బారావు, జిరాయితీ భూమి రైతు, నిడమర్రుమా గోడు వినలేదు ఒక్క రోజు సమయం ఇవ్వండి కోత యంత్రంతో పంటను ఒబ్బిడి చేసుకుంటామని చెప్పి నా అధికారులు వినలేదు. చెరువుకు గండి కొట్టారు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 60 బస్తాల వరకూ పండింది. ఆదివారం కోతకు సిద్ధ మయ్యాం. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో మా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. –బోరున విలపిస్తున్న చెన్నుబోని వెంకన్న, సుబ్బాయమ్మ దంపతులు -
ఆశల పల్లకీలో కొల్లేరు
●● హద్దులను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశం ● ప్రభుత్వమే అఫిడవిట్ వేయాలని కొల్లేరు ప్రజల డిమాండ్ ● కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేనా? ● అత్యున్నత న్యాయస్థానం సూచనలను అనుకూలంగా మార్చుకుంటున్న నేతలు ● రెగ్యులేటర్ల నిర్మాణం మాటెత్తని కూటమి ప్రభుత్వం రాజకీయం చేయొద్దు కొల్లేరు కాంటూరు కుదింపు చేస్తామని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ముందుగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఏళ్లు గడిచిపోయాయి. అమాయకులైన కొల్లేరు ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పాలి. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అమలు చేయడానికి కూటమి నేతలు కృషి చేయాలి. –బలే గణేష్, శృంగవరప్పాడు, కై కలూరు మండలం రెగ్యులేటర్లు నిర్మించాలి కొల్లేరు అభయారణ్యంలో ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో 10వ కాంటూరు వరకు నిబంధనలు విస్తరించాలని చూస్తున్నారు. మరోవైపు కాంటూరు 5 నుంచి 3నకు కుదిస్తానని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు. కొల్లేరులో నీరు లేక ఎడారిగా మారింది. ప్రజల వలసలు తగ్గాలంటే ప్రభుత్వం ముందుగా రెగ్యులేటర్లు నిర్మించాలి. – ఎల్ఎస్ భాస్కరరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండవల్లి మండలం సాక్షి టాస్క్ఫోర్స్: కొల్లేరు అనే ఈ మూడక్షరాల పదం రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు చెబుతున్న సూచనలతో రా జకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. తాజాగా మరోసారి కొల్లేరు సరిహద్దులను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీని ఆదేశించింది. కొల్లేరు ఆపరేషన్ ద్వారా అక్రమ చెరువులను ధ్వంసం చేసి 19 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అభయారణ్యం ఆక్రమణల చెరలోనే చిక్కుకుంది. కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యం కాదని అధ్యయన కమిటీలు గతంలోనే నివేదిక ఇచ్చాయి. కొల్లేరుకు శాశ్వత పరి ష్కారం చూపుతామంటున్న నేతల వాగ్దానాలు నెరవేరేనా అనే అనుమానాలు కొల్లేరు ప్రజల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోమారు తెరపైకి.. కొల్లేరు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతర్జాతీయ రామ్సర్ ఒడంబడిక ప్రకారం 1999 అక్టోబరు 4న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 120ను తీసుకొచ్చింది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లో + 5 కాంటూరు పరిధి వరకు 77,138 ఎకరాలను అభయారణ్యంగా నిర్ణయించారు. అక్రమ చేపల చెరువుల సంఖ్య అభయారణ్యంలో పెరగడంతో 2006లో కొల్లేరు ఆపరేషన్ ద్వారా వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. కొల్లేరు సంరక్షణకు 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు అమలు చేయలేదని ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కాకినాడకు చెందిన కె.మృత్యుంజయరావు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ప్రధాని హామీ అమలు చేయాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014లో భీమవరం వచ్చిన ప్రధాని మోదీ కొల్లేరు కాంటూరును కుదిస్తానని హామీ ఇచ్చారు. ఆ సభలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. 2015 జూలైలో అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొల్లేరుపై సమావేశం నిర్వహించారు. అనంతరం కాంటూరు కుదింపుపై త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్, రివ్యూ పిటీషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించాలని కొల్లేరు ప్రజలు కోరుతున్నారు. కాంటూరు కుదింపు జరగాలంటే జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు (ఎన్టీడబ్ల్యూఎల్) ఆమోదం కోసం రాష్ట్ర బోర్డు తీర్మానం చేయాల్సి ఉంది. అలాగే కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం జరగాలి. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని పలువురు కోరుతున్నారు. కాంటూరు కుదింపు సాధ్యమయ్యేనా..? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. 10వ కాంటూరు పై వరకు కొల్లేరు విస్తరించి ఉన్నప్పటికీ 5వ కాంటూరు వరకు మాత్రమే 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదిస్తే 48,777 ఎకరాలు మిగులుతుంది. అభయారణ్యంలో పట్టా భూములు 14,932 ఎకరాలు, సొసైటీ భూములు 5,510 ఎకరాలు ఉన్నాయి. గతంలో నష్టపరిహారం చెల్లించకుండా ధ్వంసం చేశారని కొల్లేరు ప్రజలు వాదన వినిపిస్తున్నారు. కొల్లేరుపై అధ్యయనం చేసిన పలు కమిటీలు కాంటూరు కుదింపు సాధ్యం కాదని నివేదికలు అందించాయి. కూటమి నేతలు మాత్రం కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేసినట్లుగానే ప్రచారం చేస్తున్నారు. -
ప్రజా పంపిణీ.. పర్యవేక్షణ లేమి
ఏలూరు (మెట్రో): ఇంతన్నారు.. అంతన్నారు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు ఇది రాష్ట్రంలో కూటమి సర్కారు తీరు. ప్రజాపంపిణీ వ్యవస్థపై నిండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే నిత్యాసరాల సరఫరాలో కోతలు విధిస్తున్నారు. ప్రజా పంపిణీని నిర్వీర్యం చేసేలా.. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలను గుర్తించే ఆహార సలహా సంఘాల (ఫుడ్ అడ్వయిజరీ కమిటీ) ఏర్పాటులో నూ నిర్లక్ష్యం చూపుతోంది. దీంతో రేషన్ సరఫరా లో లోటుపాట్లు, డీలర్ల మోసాలు, కార్డుదారుల సమస్యలు, వారి డిమాండ్లు వంటి వాటిపై చర్చించాల్సిన అవసరమే లేకుండా పోతుంది. తద్వారా ప్రజలు రేషన్ విషయంలో ఏ ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టనట్టుగా మారింది. ఆహార సలహా సంఘాలు ఇలా.. రేషన్ సరుకులు సక్రమంగా అందేలా ఆహార సల హా సంఘాలు బాధ్యతలు నిర్వహిస్తాయి. ఆయా సలహా సంఘాలకు చైర్మన్గా సబ్కలెక్టర్ లేకుంటే డిప్యూటీ కలెక్టర్ వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్గా ఎంపీపీ, కన్వీనర్గా తహసీల్దార్, సభ్యులుగా ఎంపీడీఓ, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నా యకులు, డీలర్ల సంఘం అధ్యక్షులు, పాత్రికేయు లు, ఉపాధ్యాయులు ఉంటారు. రేషన్ షాపుల తనిఖీలు, బియ్యం సరఫరాపై నిఘా, తూకాల్లో మోసాలు వంటి బాధ్యతలను ఈ సంఘాలు నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఈ సంఘాలు ఏర్పాటు కాకపోవడంతో రేషన్ సరుకుల పంపిణీపై పర్యవేక్షణ పూర్తిస్థాయిలో కొరవడింది. మధ్యాహ్న భోజనాన్నీ.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అ మలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం నాణ్యత ప్రమాణాలను సైతం ఆహార సలహా సంఘాల సభ్యులు పరిశీలిస్తారు. అయితే ఇవి ఏర్పాటుకాకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వహణపైనా పర్యవేక్షణ కొరవడింది. దీంతో చిన్నారులకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు కొరవడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కందిపప్పు లేదు నిత్యావసరాల సరఫరా విషయంలోనూ కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికే రేషన్ అందించగా.. వాహనాలను తొలగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. వీటి స్థానంలో రేషన్ దుకాణాలు పెంచుతామని ప్రకటించింది. అలాగే పూర్తిస్థాయిలో సరుకులను కూడా పంపిణీ చేయడం లేదు. గత ప్రభుత్వం సరఫరా చేసిన కందిపప్పుకు మంగళం పాడింది. పంచదార కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం బియ్యం పంపిణీతోనే ప్రభుత్వం సరిపెడుతోంది. ఆహార సలహా సంఘాల ఏర్పాటుఊసెత్తని ప్రభుత్వం ప్రజా పంపిణీని పట్టించుకోని వైనం సరుకుల్లో కోతలు.. మరో వైపు నిర్లక్ష్యం కానరాని పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు మధ్యాహ్న భోజన నిర్వహణపైనా పర్యవేక్షణ కరువు జిల్లాలో వివరాలు రేషన్ దుకాణాలు 1,123 ఎండీయూ వాహనాలు 395 రేషన్ కార్డులు 6,31,044 బియ్యం సరఫరా (నెలకు) 8,701.03 టన్నులు పంచదార 218.75 టన్నులు -
పేదల ఇళ్లు కూల్చడమే అభివృద్ధా?
కాళ్ల: పేదల ఇళ్లు కూల్చడమే కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధా అని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నర్సింహరాజు ప్రశ్నించా రు. మండలంలోని పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏర్పడేది ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకే కానీ ఇబ్బందులకు గురిచేసేందుకు కాదన్నారు. ఉండి నియోజకవర్గంలో కొంతకాలంగా ఇళ్లను తొలగిస్తున్నారని, దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఆక్రమణలో ఉన్న ఇళ్లు ఇబ్బందికరంగా ఉంటే నివాసితులకు సమయం ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించి తొలగించాలి తప్ప దుర్మార్గంగా ఇళ్లను కూలగొట్టడం సరికాదన్నారు. ఇళ్ల తొలగింపుతో రోడ్డున పడి ఇబ్బందులు పడుతున్న బాధితులను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధితులు నానా కష్టాలు పడుతున్నా గ్రామ, మండల స్థాయి, కనీసం జిల్లా అధికారులు కూడా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో గ్రామాలు ఏర్పడ్డాయని, గృహ నిర్మాణాలకు సాయం కూడా చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ సుఖసంతోషాలతో ఉండేవారని గుర్తుచేశారు. అయితే కూటమి పాలనలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పులపాలవుతున్నారని పీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త పీవీఎల్ -
ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్షలు
ఏలూరు (టూటౌన్) : మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి (2025–26) ఆదివారం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వీ నాగరాణి తెలిపారు. ఏలూరు బాలికల గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏలూరులో పాఠశాలలో 80 సీట్లకు 147 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేయగా 116 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లా సమన్వ యకర్త, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్ లక్ష్మి ఉన్నారు. ఆప్కాస్ రద్దు యోచన తగదు ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని, ఆప్కాస్ రద్దు ఆ లోచన విరమించుకుని, ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డి మాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఏ లూరులో జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు కోరుతూ మే 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు బి.బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఎ.జానుబాబు, జంగారెడ్డిగూడెం అధ్యక్షుడు ఆర్.నాగరాజు, నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జయలక్ష్మి ఉంగుటూరు: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉంగుటూరుకి చెందిన మంద జయలక్ష్మి నియమితులయ్యారు. ఆమె మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా, జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర పదవి వరించింది. మండల నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తనకు రాష్ట్ర పదవి కేటాయించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సహకరించిన మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబా బుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి నిరంతం కృషి చేస్తానని, మహిళల్లో చైత న్యం తీసుకువస్తానని జయలక్ష్మి అన్నారు.ఏలూరు రైల్వేస్టేషన్లో తనిఖీలు ఏలూరు టౌన్ : అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు, ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు, పవర్పేట స్టేషన్లలో రైల్వే ఎస్సై పి.సైమన్ ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఏలూరు స్టేషన్లోని ప్లాట్ ఫామ్స్, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్ కేంద్రాల్లో ముమ్మరంగా సోదాలు చేశారు. ఆర్పీఎఫ్, రైల్వే పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రైల్వేస్ డీఎస్పీ జి.రత్నరాజు, సీఐ ఎంవీ దుర్గారావు సిబ్బందికి సూచించారు. అనుమానిత వ్యక్తులపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఆదేశించారు. పాలిసెట్కు పటిష్ట ఏర్పాట్లు పెంటపాడు: జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ఈనెల 30న జరిగే పాలిసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి.ఫణీంద్రప్రసాద్ ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిగూడెం, తణు కు, భీమవరం, నరసాపురంలో కేంద్రాలు ఏ ర్పాటుచేశామని, 7,254 మంది పరీక్షలకు హా జరుకానున్నారన్నారు. -
పాదయాత్ర భక్తులను ఢీకొట్టిన లారీ
ద్వారకాతిరుమల: మొక్కుబడులు తీర్చుకునేందుకు ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి కాలినడకన వెళుతున్న ముగ్గురు యువకులను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు యువకుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం, పుల్లలపాడులోని పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రకారం.. దేవరపల్లి గ్రామానికి చెందిన దాసు దుర్గాప్రసాద్, బిరదా అంజి(20), జాజుమొగ్గల సాయిచరణ్ తేజ ద్వారకాతిరుమల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్నారు. మార్గమధ్యంలో పుల్లలపాడు వద్దకు వచ్చేసరికి రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు వెళ్తున్న కర్నాటకకు చెందిన లారీ వీరిని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలై రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బిరదా అంజి మృతి చెందినట్టు అతని మేనమామ శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంచాయతీ పరిధిలో వెంకటరామానుజపురం గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం ఎడమ చేతిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు దీనిని గుర్తించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వైఎస్సార్ విగ్రహం చేతిని ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇర్ల విజయశాంతి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, దోరేపల్లి సుబ్బారావు, మర్రెడ్డి పెద రామాజంనేయులు, డి.సుబ్బారావు, జె.కమలాకరరెడ్డి, కఠారి నారాయణరావు, కఠారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన బాస్కెట్బాల్ జట్టు ఎంపిక ఏలూరు రూరల్: ఆదివారం ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు ఎంపిక పోటీలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలకు నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కలిగిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీను, కోశాధికారి కె.మురళీకృష్ణ వెల్లడించారు. మే 15 నుంచి 18 వరకూ చిత్తూరులో అంతర జిల్లాల అండర్–14 సబ్ జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జట్టు పాల్గొంటుందన్నారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. -
కొబ్బరి బొండాలకు గిరాకీ
ఉంగుటూరు: ఏప్రిల్లోనే ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం సహజమైన కొబ్బరి నీరు తాగే ఎండ తీవ్రత పెరగడంతో కొబ్బరి బొండాలకు గిరాకీ పెరిగింది. బాటిల్ కొబ్బరి నీరు ధర రూ.120 నుంచి రూ.150 పలుకుతోంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. శక్తి నివ్వడంతో పాటు డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. శరీరంలో నీటి శాతం పెంచి శక్తిని ఇస్తుంది. బొండంలో సుమారు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. మూత్ర, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఇది చక్కగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు ఒంటిలో వేడిని తగ్గిస్తాయి. అలాగే మంచి ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది. ఎండ దెబ్బకు పెరిగిన అమ్మకాలు ఎండలు పెరగడంతో ఉమ్మడి ఏలూరు జిల్లా నుంచి కొబరి బొండాల అమ్మకాలు బాగా పెరిగాయి. దాంతో కొబ్బరి రైతులకు గిట్టుబాటు అవుతోంది. వ్యాపారులు ఆటోలు, మిని లారీలు, లారీల మీద బొండాల తీసుకెళ్లి చిల్లర వ్యాపారులకు అమ్ముతున్నారు. అలాగే లారీల మీద ఏలూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయి. పలు చోట్ల జాతీయ రహదారి మీద చిరు వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి ఏలూరు జిల్లాలో 35,000 ఎకరాలలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. పెదవేగి, పెదపాడు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల, కామవరపుకోట, టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో కొబ్బరి తోటలు విస్తారంగా ఉన్నాయి. అక్కడనుంచి కొబ్బరి బొండాలు ఎగుమతులు సాగుతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతంలో చేపలు చెరువుల గట్ల మీద పెంచిన కొబ్బరి చెట్ల నుంచి బొండాలు దింపుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం ధర పెరగడంతో రైతులకు గిట్టుబాటు గిరాకీ పెరగడంతో రైతులకు లాభం కొబ్బరి బొండాలకు గిరాకీ పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర వస్తోంది. ఇటీవల కొబ్బరి బొండాలు అమ్మకాలు భారీగా పెరిగాయి. వైద్యులు కూడా బొండాలు తాగమని సూచించడంతో ఎక్కువ మంది తాగుతున్నారు. ఎకరాకు రూ.60 వేలకు తక్కువ కాకుండా ఆదాయం వస్తోంది. –దేవదానం, హార్టీకల్చర్ ఏఓ, ఉంగుటూరు -
వేరుశెనగ కోత తర్వాత జాగ్రత్తలు
చింతలపూడి: దేశంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశెనగ అతి ముఖ్యమైంది. వేరుశెనగ కోతలు పూర్తయ్యాక సరైన జాగ్రత్తలు పాటిస్తే విత్తనాలు రాబోయే కాలంలో పనికొస్తాయి. లేదంటే పుచ్చుపట్టి పనికి రాకుండా పోతాయి. వేరుశనగలో కోసిన పంటను తగిన తేమ (9 శాతం) వచ్చే వరకు మొక్కనుంచి కాయలను వేరు చేయడానికి ముందు ఎండ బెట్టాలి. విత్తనాలను భద్రపరుచుకుని వచ్చే పంటకు ఉపయోగించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వేసవిలో అవలంభించాల్సిన పద్ధతుల గురించి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు బి.నాగకుమార్ రైతులకు సూచించారు. ఎండబెట్టే విధానం వేరుశెనగ కాయలు పై భాగానికి వచ్చేటట్లు చెట్లను చిన్న, చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలను పక్కలకు వచ్చేలా చేసి ఎండబెట్టుకోవచ్చు. తేమశాతం తగ్గించడం ఇలా కాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7, 8 శాతానికి తీసుకురావాలి. వేడి గాలులను వదిలే పరికరాలను ఇందుకు ఉపయోగించవచ్చు. వేరుశెనగ పంటను నిల్వ చేయడానికి ఒకసారి వాడిన సంచులను మళ్లీ వాడకూడదు. పాలిథీన్ పేపర్ ఉన్న గోనె సంచులు బాగా ఎండిన వేరుశెనగ కాయలను నిల్వ చేయడానికి ఉపయోగం. ఎండలో ఆరబెట్టకూడదు రబీలో పీకేటప్పుడు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి. ఎండ తీవ్రత ఉదయం 11 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల తరువాత తక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో ఆరబెట్టుకోవాలి. ఎండబెట్టే సమయంలో వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. నిల్వ చేసుకునే విధానం విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ చేసుకోవాలి. కాయలను కదిలిస్తే ఘల్లుమని శబ్దం రావాలి. అప్పుడే బాగా ఎండినట్లు అర్ధం. కాయలను నిల్వ చేసుకోవడానికి శుభ్రమైన పాలిధిన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5 శాతం మలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టుకోవాలి. దీని వల్ల కాయల్లోని గింజలకు శిలీంధ్రాల బెడద ఉండదు. బి నాగకుమార్ –సహాయ వ్యవసాయ సంచాలకులు -
కళారంగానికి చేయూతనిస్తాం
భీమవరం: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు పుంజుకున్న తరువాత కళారంగానికి చేయూతనిస్తామని సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న చైతన్య భారతి సంగీత, నృత్య నాటక పరిషత్ 18వ జాతీయస్థాయి నాటికల పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నాటకాలపై ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదని ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేయడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. కళా పరిషత్ల ద్వారా నాటకరంగం నిరంతరం కొనసాగడానికి పరిషత్ నిర్వహణ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి సమావేశం నిర్వహణకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం చవాకుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు బాలాజీ నాయక్కు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారంతో సత్కరించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పెన్మెత్స కృష్ణంరాజును ఆత్మీయ చైతన్య పురస్కారంతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులపర్తి అంజిబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్, తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పుటేరు ఆక్రమణల తొలగింపునకు సహకరించండి
కై కలూరు : వరదల సమయంలో కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించడానికి ప్రధాన భూమిక వహించే ఉప్పుటేరు ఆక్రమణల తొలగింపునకు అందరూ సహకరించాలని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే, ఉప సభాపతి కనుమూరి మురళీకృష్ణంరాజు అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొల్లేరు అంశంపై కమిటీ నివేదిక కోరిన నేపథ్యంలో వారు కొట్టాడ గ్రామం వద్ద ఉప్పుటేరు ఆక్రమణలను డ్రోన్ సాయంతో శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉప్పుటేరులో ఆక్రమణల కారణంగా 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ఉప్పుటేరు 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందన్నారు. ఇలానే కొనసాగితే కొల్లేరు ముంపు మరొకసారి తప్పదన్నారు. వర్షాకాలం వచ్చే నాటికీ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. ఇందుకు ఆక్రమణదారులు డ్రెయినేజీ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు సహకరించాలన్నారు. లేనిపక్షంలో చట్టం తన పని చేసుకుంటుందని ఆక్రమణదారులను పరోక్షంగా హెచ్ఛరించారు. త్వరలో సుప్రీంకోర్టు సాధికారత కమిటీ పర్యటనకు వస్తోందని కొల్లేరు ప్రజలు సమస్యలను విన్నవించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, వడ్డీ సాధికారిత రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు, కూటమి నేతలు పెన్మత్స త్రినాథరాజు, పూలా రాజీ, కొల్లి బాబీ, సర్పంచులు, కొల్లేరు పెద్దలు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
పెదవేగి : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన దిబ్బగూడెంలో చోటుచేసుకుంది. పెదవేగి ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలివి. ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన తేటకాల పావని మొదటి కుమార్తె మీనాక్షికి పెదవేగి మండలం దిబ్బగూడెం గ్రామానికి చెందిన బాల సురేష్తో ఐదేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి 19 నెలల ఆడబిడ్డ సంతానం ఉంది. వివాహ సమయంలో రూ.3 లక్షలు కట్నం ఇవ్వగా మిగిలిన రూ.2 లక్షలు గురించి భర్త, అత్త మామలు వేధిస్తున్నారని ఈనెల 25వ తేదీ రాత్రి మీనాక్షి తల్లి పావనికి ఫోన్ చేసి చెప్పింది. శనివారం మీనాక్షి చనిపోయిందని చెప్పారని, కానీ ఆమె ఒంటిమీద దెబ్బలు ఉన్నాయని మృతురాలు తల్లి పావని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె రామకృష్ణ తెలిపారు. మీనాక్షి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు చెప్పారు. -
రాత్రివేళల్లో జోరుగా మట్టి తవ్వకాలు
బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి పరిసర ప్రాంతాల్లో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు,, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో కొందరు కూటమి నాయకులు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుడు ఒక ట్రక్కు మట్టి కావాలంటే కనీసం అనుమతి కోసం సరైన సమాధానం చెప్పని అధికారులు, యథేచ్ఛగా మట్టి రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం పట్ల పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
ఆ కలపను ఎవరి కోసం వదిలేశారో..?
ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెం–గుణ్ణంపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై ఉన్న భారీ వేప చెట్లను ఒక టీడీపీ నాయకుడు అడ్డగోలుగా నరికివేసిన విషయం తెలిసిందే. అయితే సంబంధిత అధికారులు దీనిపై ఇప్పటివరకు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అంతే కాకుండా నరికిన కొంత కలప కాలువ గట్టుపైనే దర్శనమిస్తున్నా అధికారులు ఇప్పటివరకు దాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఇదేంటని అధికారులను కొందరు అడిగితే చిన్న చెట్లే కదా.. నరికిన వారు తీసుకుంటారని వారు సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి భారీ చెట్ల కలపను ఇప్పటికే బయటకు తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన కలప ఎం.నాగులపల్లి–గుణ్ణంపల్లి మధ్య కాలువ గట్టుపై అక్కడక్కడా గుట్టలుగా ఉన్నాయి. ఈ చెట్ల నరికివేత వెనుక అధికారుల హస్తం ఉన్నట్టు స్థానికులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని అంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చెట్లు నరికిన సదరు నాయకుడిపై, అతనికి సహకరించిన వారిపై, అలాగే జంగిల్ క్లియరెన్స్ కాంట్రాక్టు తీసుకుని ఇష్టానుసారంగా బయట వ్యక్తులతో చెట్లు నరికించిన కాంట్రాక్టరుపై సైతం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా కలపను స్వాధీనం చేసుకుని, వేలం నిర్వహించగా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని అంటున్నారు. దీనిపై కాలువ ఇరిగేషన్ ఏఈ బాపూజీని వివరణ కోరగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం కుడి కాలువ గట్టుపైనే దర్శనమిస్తున్న కలప స్వాధీనం చేసుకోని అధికారులు కలపను అమ్ముకునేందుకు చూస్తున్న పచ్చ నేతలు -
కరెంట్ షాక్తో పెయింటర్ మృతి
ఏలూరు టౌన్: కరెంట్ షాక్తో పెయింటర్ మృతి చెందాడు. దెందులూరు మండలం పోతునూరు కు చెందిన లింగాల పరుశురాం (31) పెయింటర్గా పనిచేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఏలూరు సుబ్రహ్మణ్యం కాలనీలో ఒక భవనానికి మొదటి అంతస్తులో ఐరన్పైపునకు రోలర్ బిగించి గోడకు పెయింటింగ్ వేస్తున్నాడు. సమీపంలో 11కేవీ విద్యుత్ వైర్లు ఐరన్ పైపునకు తగిలి పరశురాం విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఏలూరు వన్టౌన్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరశురాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. గుర్రపుడెక్క తొలగిస్తూ... ఏలూరు టౌన్: గుర్రపుడెక్క తొలగిస్తూ ప్రమాదవశాత్తూ కోనేరులో మునిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు తూర్పువీధికి చెందిన తిర్లంగి జీవరత్నం (36) శనివారం మరో ముగ్గురితో కలిసి ఏలూరు శివారులోని రామయ్యకోనేరులో గుర్రపుడెక్క తొలగింపు పనికి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ జీవరత్నం కోనేరులో ముగిని మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. రూరల్ ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు మట్టి లారీల సీజ్ జంగారెడ్డిగూడెం : కేతవరంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను సీజ్చేశారు. కేతవరం చెరువు నుంచి రాత్రి సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా, వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. తహసీల్దార్ కె.స్లీవజోజి చర్యలు తీసుకుంటారని స్టేషన్ రైటర్ సత్యనారాయణ తెలిపారు. శ్రీవారి కొండపై షార్ట్కట్ మార్గం మూసివేత ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న షార్ట్కట్ మార్గాన్ని ఆలయ అధికారులు పూర్తిగా మూసివేశారు. స్వామివారి దర్శనానంతరం పలువురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలోని మార్గం గుండా కొండపైన నిత్యాన్నదాన భవనం, శివాలయం వద్దకు కాలినడకన వెళుతున్నారు. ఆ ప్రాంతంలో జేసీబీతో పూడిక పనులు జరుగుతున్నాయి. దీనిపై సాక్షి దినపత్రికలో ఈనెల 25న ‘శ్రీవారి కొండపై షార్ట్కట్ మార్గం వద్దు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆలయ అధికారులు ఆ మార్గాన్ని ఇనుప బారిగేట్తో పూర్తిగా మూసివేశారు. -
ధాన్యం లారీ బోల్తా
ఉంగుటూరు: కాకర్లమూడి నుంచి ధాన్యం బస్తాల లోడుతో వెళుతున్న లారీ శుక్రవారం రాత్రి గ్రామాన్ని ఆనుకుని ఉన్న చెరువులోకి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా లారీలో ఉన్న ధాన్యం బస్తాలు మొత్తం తడిచిపోయాయి. సుమారు 5 లక్షలు విలువైన ధాన్యం తడిచిపోయినట్లు గుర్తించి కై కలూరు ఉప్పడు మిల్లుకు తరలించినట్లు డీటీ పూర్ణచంద్రప్రసాదు తెలిపారు. ట్రాక్ షీటు జనరేటర్ అయినందున పూర్తి బాధ్యత రైస్మిల్లర్దే అవుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. -
బీచ్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ద్వారకాతిరుమల: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో శుక్రవారం గల్లంతైన ద్వారకాతిరుమలకు చెందిన యువకుడు లాలూ నాయక్ (17) మృతదేహం శనివారం లభ్యమైంది. మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది స్నేహితులతో కలసి లాలూ నాయక్ పేరుపాలెం బీచ్కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. అర్ధరాత్రి సమయం నుంచి అతడి ఆచూకీ కోసం స్నేహితులు వెదకడం మొదలు పెట్టారు. అయితే నీటి మునిగిన ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలో, బీచ్ ఒడ్డున లాలూ నాయక్ మృత దేహం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అతడి అన్నయ్య చిన్నాకు కనిపించింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు కొవ్వూరు ఘాట్లో ఖననం చేశారు. -
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు కావడంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఎటు చూసినా భక్త జనమే కనిపించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పురాజగోపుర ప్రాంతంలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, స్వామివారి ఉచిత ప్రసాదం పంపిణీ ప్రాంతం, దర్శనం క్యూలైన్లు భక్తులతో పోటెత్తాయి. అలాగే ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
శ్రీవారి చెంత సేద తీరి
●అలసట మాయం ఆలయానికి వచ్చేటప్పుడు ఎండ వేడిమికి భయపడ్డాను. బయట వాతావరణం చూసి దర్శనం క్యూలైన్లలో ఉండగలమా అనిపించింది. కానీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనూ, క్యూలైన్ల వద్ద ఎయిర్ కూలర్ల నుంచి వస్తున్న చల్లదనం అలసటను మాయం చేసింది. క్యూ కాంప్లెక్స్లో ఇంకాసేపు ఉంటే బాగుండేదని అనిపించింది. – కామిశెట్టి దుర్గా లక్ష్మి, భక్తురాలు, పోలవరం మండలం, రేపల్లెవాడ గ్రామం ఏ ఆలయంలోనూ ఇలా లేదు క్యూ కాంప్లెక్స్లో సౌకర్యాలు బాగున్నాయి. ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. అలాగే క్యూ కాంప్లెక్స్లోని స్క్రీన్పై క్షేత్ర చరిత్ర, వేంకటేశ్వర స్వామికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడం బాగుంది. భక్తులందరికీ మజ్జిగను కూడా అందిస్తున్నారు. వేసవిని పురస్కరించుకుని ఆలయ అధికారులు చేపట్టిన చర్యలు అద్భుతంగా ఉన్నాయి. – పరసా రాఘవేంద్ర, మచిలీపట్నం, భక్తుడు ద్వారకాతిరుమల: రాష్ట్రంలో ఏ దేవాలయంలోనూ లేని విధంగా ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కూలర్లు భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం క్షేత్రానికి వస్తున్న భక్తులు ఎండ వేడిమి కారణంగా అలసిపోతున్నారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లలోకి అడుగుపెట్టగానే ఎయిర్ కూలర్ల నుంచి వస్తున్న చల్లదనాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. హమ్మయ్య.. అనుకుంటూ ఉపశమనాన్ని పొందుతున్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే సమయంలో కొందరు భక్తులు, చిన్నారులు అక్కడే విశ్రాంతి పొందుతున్నారు. పిల్లలను వారి తల్లిదండ్రులు కూలర్ల వద్ద ఆడిస్తున్నారు. ఒక్కో కంపార్ట్మెంట్లో నాలుగు కూలర్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మొత్తం ఐదు కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కో కంపార్ట్మెంట్కు నాలుగు కూలర్లు (నాలుగు మూలల) చొప్పున మొత్తం 20 కూలర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలోని క్యూలైన్ల వద్ద మరో 5 కూలర్లను ఏర్పాటు చేశారు. సిబ్బంది నిరంతరాయంగా ఆ కూలర్లను నీటితో తడుపుతున్నారు. భక్తుల పట్ల వారు చూపుతున్న శ్రద్ధను పలువురు కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో కూలర్ ధర రూ. 18 వేలు అని, దాతల సహకారంతో మరికొన్ని కూలర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మరిన్ని సౌకర్యాలు క్యూ కాంప్లెక్స్లో దేవస్థానం సిబ్బంది భక్తులకు మజ్జిగను, మంచి నీటిని అందిస్తున్నారు. అలాగే అందులో ఉన్న స్క్రీన్పై క్షేత్ర చరిత్ర, అన్నమయ్య, దేవతామూర్తుల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. దాంతో చల్లని వాతావరణంలో వాటిని తిలకిస్తూ, దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని భక్తులు మరచిపోతున్నారు. క్షేత్రంలో సౌకర్యాల కల్పనకు అధికారులు చేపడుతున్న చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఎయిర్ కూలర్ల ఏర్పాటు క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలో ఎండ వేడమి నుంచి భక్తులకు ఉపశమనం దాతల సహకారంతో ఇప్పటికే 25 కూలర్ల ఏర్పాటు మరికొన్ని కూలర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్న అధికారులు -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శుల నియామకం
ముసునూరు : వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాల్లో రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా గోపవరం ఎంపీటీసి, వైస్ ఎంపీపీ పాముల గంగాధర్ నియమితులయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు ముఖ్య అనుచరుడుగా ఉన్న ఆయన్ను రాష్ట్ర స్థాయి ప్రచార వింగ్ పదవికి ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం గంగాధర్ మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. కొయ్యలగూడెం నుంచి చిటికెన శ్రీనివాస్ కొయ్యలగూడెం: వైఎస్సార్సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా కొయ్యలగూడెంకి చెందిన చిటికెన శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా గౌడ సంఘం యాక్టివ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం చిటికెన విధులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ పటిష్టతకు కృషి చేస్తానని చిటికెన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీలో నియామకాలు గణపవరం: వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉంగుటూరు నియోజకవర్గంలోని నలుగురు నాయకులకు రాష్ట్ర స్థాయిలో వివిధ అనుబంధ కమిటీల్లో స్థానం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామక ఉత్తర్వులు ఇచ్చింది. వీరిలో ఎలిశెట్టి పాపారావు బాబ్జి (ఉంగుటూరు)ను రాష్ట్ర బూత్కమిటీ వింగ్ కార్యదర్శిగా నియమించింది. ఇదే మండలానికి చెందిన మంద జయలక్ష్మి రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. నడింపల్లి సోమరాజు(గణపవరం)ను రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా, భీమడోలు మండలానికి చెందిన కేతినీడి విశ్వేశ్వరరావును రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా నియమించారు. శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.6 లక్షల విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.6 లక్షలను విరాళంగా అందజేశారు. అందులో భాగంగా తణుకు మండలం కానూరుకు చెందిన వీరమల్లు వెంకట్రావు రూ.5 లక్షలు, కాజా పడమరకు చెందిన గుబ్బల రామారావు రూ.లక్ష ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతలకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు విరాళం బాండ్ పత్రాలను అందించారు. అనంతరం వారికి స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించారు. -
నర్సింగ్ విద్యార్థినులకువసతి వెతలు
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం), బీఎస్సీ నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న పేద వర్గాల బాలికలకు వసతి, ఇతర అవసరాలకు అన్ని విధాల ఆర్థిక సాయం చేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గత పదేళ్ళుగా ప్రభుత్వం జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కాలేజీల్లో విద్యార్థినులకు నర్సింగ్ విద్య ఉచితమంటూనే.. అరకొర స్టైఫండ్తో గడిపేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే కొద్ది మొత్తంతో నెట్టుకురావాల్సి ఉండడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా గాలికి వదిలేస్తోందని, పేద పిల్లలకు కనీసం నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవటం దారుణమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చదువుతున్న 550 మందికి పైగా నర్సింగ్ విద్యార్థినులకు రూ.19 లక్షల స్టైఫండ్ బకాయిలు ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 3, 4 నెలకోసారి స్టైఫండ్ : ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలో జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. జీఎన్ఎం కోర్సులో సుమారుగా 150 మంది విద్యార్థినులు ఉండగా, బీఎస్సీ నర్సింగ్ కోర్సులో 400 మంది ఉన్నారు. వీరిలో మొదటి సంవత్సరం జీఎన్ఎం కోర్సు చదివే విద్యార్థినికి రూ.3 వేలు, రెండు, మూడో ఏడాదిలో రూ.3500 స్టైఫండ్ ఇస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులకు రూ.4 వేల నుంచి రూ. 4500 వరకు ఇస్తారు. ప్రభుత్వం స్టైఫండ్ నెల నెలా ఇస్తే తప్ప గడవని పరిస్థితి. అలాంటిది మూడు, నాలుగు నెలకోసారి స్టైఫండ్ ఇవ్వడంతో ఖర్చులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రతి నెలా స్టైఫండ్ ఇవ్వకపోవడంతో వారి కష్టాలు వర్ణణాతీతం. వసతి, భోజనం ఖర్చులు భరించాల్సిందే.. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, మచిలీపట్నంలో జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. బీఎస్సీ నర్సింగ్కు నీట్ ద్వారా ఎంపికలు చేస్తుండగా, జీఎన్ఎం కోర్సుకు డీఎంఈ నోటిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నర్సింగ్ కాలేజీల నిర్వహణకు, భోజనం, వసతి కోసం నిధులు కేటాయించకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎస్సీ నర్సింగ్లో మెంటల్ హెల్త్ సబ్జెక్టుకు సంబంధించి శిక్షణ కేవలం విశాఖపట్నంలోనే ఉంది. ఈ సబ్జెక్టులో శిక్షణకు విశాఖపట్నం వెళ్లాలి. అక్కడ వసతి, భోజనం ఖర్చులు భరించాల్సి రావటంతో వారిపై పెనుభారం మోపినట్లేనని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలు, శిక్షణల కోసం అదనపు ఆర్థిక భారం వేస్తున్నాయంటున్నారు. నెలకు రూ.3 వేలతోనే నెట్టుకొస్తున్న వైనం 550 మందికి రూ.19 లక్షల స్టైఫండ్ బకాయిలు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇక్కట్లు ప్రభుత్వానికి నివేదించాం ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని జీఎన్ఎం నర్సింగ్ కాలేజీకి సంబంధించి నిర్వహణ, భోజనం నిమిత్తం ప్రత్యేకంగా నిధులు ఏమీ మంజూరు చేయడం లేదు. విద్యార్థినులకు అందిస్తున్న స్టైఫండ్తోనే నిర్వహణ ఖర్చులు, భోజనం ఖర్చులు భరించాలి. ఇప్పటికే చాలా సార్లు నిధులు కేటాయించాలంటూ నివేదికలు పంపించాం. – వరలక్ష్మి, ప్రిన్సిపల్, జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ -
సమాజంలో నాటికలది కీలక పాత్ర
యలమంచిలి: సమాజంలోని రుగ్మతల్ని వేలెత్తి చూపడంలో నేటికీ నాటికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి చెప్పారు. కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరంలో 43వ జాతీయ స్థాయి నాటిక పోటీల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. సినిమాలు, టీవీ, ఓటీటీ వంటి మీడియా ప్రభంజనం సృష్టిస్తున్న నేటి రోజుల్లో కూడా నాటికలకు ఆదరణ లభించడం మంచి పరిణామం అన్నారు. కళలకు కాణాచి వంటి గోదావరి జిల్లాలో జన్మించడం తన అదృష్టమన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) మాట్లాడుతూ కొంతేరు ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఈ నాటిక పోటీలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయిని డాక్టర్ బాబ్జీ, కమిటి సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, కొంతేరు యూత్ క్లబ్ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ, కొంతేటి సర్వేశలింగం, గుండా రామకృష్ణ, ఉన్నమట్ల కబర్ది, బుద్దాల రామారావు, పులపర్తి రాజగోపాలరావు, వంగా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు అలరించిన నాటికలు టెక్నాలజీ అవసరానికి వాడితే మిత్రుడు, అవసరానికి మించి వాడితే శత్రువు అని ‘నా శత్రువు’ నాటిక.. సమాజం బాగు కోసం కళాకారుల్లో ఉండే తపన రాజకీయ నాయకుల్లో ఉంటే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ‘ఆంగికం భువనం యస్య’ నాటికలోను.. జనరల్ బోగీలో ప్రయాణికుల కష్టాలు ఏ విధంగా ఉంటాయో ‘జనరల్ బోగీలు’ నాటికలోను వివరించారు. మూడు నాటికలు అలరించాయి. రెండవ రోజు నాటిక ప్రాంగణానికి బొండాడ వెంకట రాధా రమణ గుప్తా పేరిట నామకరణం చేశారు. ఆకట్టుకున్న నాటికలు భీమవరం: పట్టణంలోని డీఎన్నార్ కళాశాల ఆవరణలోని గన్నాబత్తుల క్రీడామైదానంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీల్లో శనివారం మూడు నాటికలు రసవత్తరంగా సాగాయి. హైదరాబాద్ శ్రీమహతి క్రియేషన్స్ వారి సింహ ప్రసాద్ రచించగా.. ఉప్పలూరి సుబ్బరాయశర్మ దర్శకత్వంలో ప్రదర్శించిన ‘ఉక్కు సంకెళ్లు’ నాటిక ఈస్టిండియా కంపెనీ దురాగతాలను ఎత్తి చూపింది. ఫిలిప్స్ దొర అడిగిన వెంటనే హిల్సా చేప ఇవ్వలేదనే కోపంతో హుగ్లీ నదిలో చేపల వేట నిషేధిస్తే దానికి ఆనాటి జమిందారిణి రాణీ రాస్మణీదేవి ఏ విధంగా అడ్డుకున్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. రెండో ప్రదర్శనగా విశాఖ ఉక్కు నగరం శ్రీచైతన్య కళాస్రవంతి వారి ‘(అ)సత్యం’ నాటిక పి.బాలాజీ నాయక్ దర్శకత్వంలో ప్రదర్శించారు. కంటికి కనిపించేదంతా సత్యం కాదు, కనిపించనిదంతా అసత్యం కాదనే సందేశంతో ప్రదర్శించిన నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. మూడో ప్రదర్శనగా హైదరాబాద్ మిత్రా క్రియేషన్స్ ‘ఇది రహదారి కాదు’ నాటిక ఎస్ఎం బాషా దర్శకత్వంలో ప్రదర్శించారు. సంపాదనే ముద్దు పిల్లలు వద్దు అనే రీతిలో నేటి యువత తీసుకుంటున్న నిర్ణయాలను, దారితప్పిన యువ జంటను చక్కదిద్దిన దృశ్యరూపమే ఈ నాటిక ఇతివృత్తం. కార్యక్రమంలో చైతన్య భారతి అధ్యక్ష, కార్యదర్శులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్కుమార్రాజు, పీఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, పేరిచర్ల లక్ష్మణవర్మ, కట్రెడ్డి సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు. -
ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపాలి
ఆకివీడు: ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని వారి అంతానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని వైఎస్సార్సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఉగ్రదాడులకు నిరసనగా స్థానిక వైఎస్సార్ సెంటర్లో శనివారం కొవ్వొతుల ప్రదర్శన, శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, మండల, పట్టణ కమిటీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, ఏఎంసీ మాజీ చైర్మన్లు మోటుపల్లి గంగాధరరావు, ఎండీ.మస్తాన్ వలీ మాట్లాడుతూ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని కూడా మట్టుబెట్టాలన్నారు. అమరులైన వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎండీ.జహంగీర్, ఎస్కే. ఆరీఫ్, ఎండీ.జక్కీ, ఎండీ.సిద్ధిక్, ఎస్కే.హుస్సేన్, గుండా సుందరరామనాయుడు, జీ.ధనరాజు, మోరా జ్యోతిరెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, నిమ్మల నాగు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన -
జిల్లా వ్యాప్తంగా పోలీసు తనిఖీలు
భీమవరం: కశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడి దృష్ట్యా.. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబు గుర్తింపు బృందం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నేతృత్వంలో జిల్లాలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. హోటళ్లు, లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు తనిఖీ చేశారు. విస్తృత తనిఖీలకు జిల్లా ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనిస్తే తక్షణమే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా శిబిరాలు ఏలూరు (టూటౌన్): జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పాఠశాల విద్యార్థులకు ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణా శిబిరాలు ఉంటాయని, ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు కథ వినడం, 8.30 నుంచి 10 గంటల వరకు పుస్తకాలు చదవడం/కథలు చెప్పడం, 10 గంటల నుంచి 10.10 గంటల వరకు విరామం ఉంటుందన్నారు. 10.10 నుంచి 10.30 వరకు పుస్తక సమీక్ష, 10.30 నుంచి 11 గంటల వరకు స్పోకెన్ ఇంగ్లీష్/డ్రాయింగ్/పెయింటింగ్/పేపర్ క్రాప్ట్స్/డ్యాన్స్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. 28న ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా ఏలూరు (టూటౌన్): జిల్లా ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీఎస్) భాగస్వామ్యంతో ఈ నెల 28న ఉదయం 10:30 గంటలకు ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల పురుష అభ్యర్థులు.. ఆటోమొబైల్ రంగంలో అనుభవం ఉన్నవారు లేదా ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సేల్స్ విభాగానికి డిగ్రీ ఉండాలని, వర్క్షాపు సంబంధిత పోస్టులకు మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో డిప్లమో లేదా బీ.టెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరింత సమాచారం కోసం 8886882032 నెంబరులో సంప్రదించాలన్నారు. మెగా డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాకు చెందిన కాపు అభ్యర్థులకు మెగా డీఎస్సీ –2025 కోసం ఆన్లైన్ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణా కార్యక్రమానికి సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై సమీక్ష భీమవరం (ప్రకాశంచౌక్): ఉజ్వల యోజన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పొంది వినియోగించని లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ చాంబర్లో పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉజ్వల 2.0 పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొంది రెండు సంవత్సరాలుగా రీఫిల్ చేసుకోని లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు మొదటి నోటీసు జారీ చేసిన 15 రోజులలోపు వారికి సంబంధించిన గ్యాస్ పంపిణీదారుల కంపెనీకి వెళ్ళి, వారి ఈకేవైసీ ఫార్మాలిటీలు, బయోమెట్రిక్ మళ్ళీ పూర్తి చేసుకోవాలని చెప్పాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) నారాయణ పేర్కొన్నారు. మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్పెషల్ క్లాస్ల నిర్వహణను శనివారం డీఈఓ పరిశీలించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలపై సమీక్షించారు. -
దళారుల నిలువు దోపిడీ
ఏలూరు (మెట్రో): జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. మద్దతు ధర లభించకపోవడంతో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రకృతి కరుణించడంతో దిగుబడులు బాగానే వచ్చినా.. కూటమి సర్కారు రైతులపై కక్ష కట్టింది. జిల్లాలో ఎక్కువగా మెట్టప్రాంతం ఉండటంతో ప్రస్తుత సీజన్లో రెండో పంటగా రైతులు 48,878 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందపడ్డారు. ప్రకృతి కనికరించడంతో ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది.అయితే మద్దతు ధర లేకపోవడం, దళారులు దోపిడీతో ఆ ఆనందం కాస్తా ఆవిరైంది. క్వింటాల్కు రూ.400 తగ్గింపు గత వైఎస్సార్సీపీ సర్కారు క్వింటాల్కు రు.2600 కనీస మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కంటే ఈ ఏడాది కనీస మద్దతు ధర పెరుగుతుందని రైతులు భావించారు. ప్రస్తుతం రూ.2,225కు ధర తగ్గించడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. క్వింటాల్కు సుమారు రూ.400 తగ్గించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎకరం సాగు చేసేందుకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఖర్చవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.20 వేల వరకే మిగులుతుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఇచ్చిన మద్దతు ధర ఇచ్చినా లాభాలు వచ్చేవని రైతులు అంటున్నారు. గతంలో రైతు భరోసాతో ప్రభుత్వం ఆదుకునేది. రైతులకు కనీస మద్దతు ధర అందించి రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేది. నేరుగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా సాయాన్ని అందిస్తూ రైతులను గత ప్రభుత్వం ఆదుకునేది. ప్రస్తుతం మద్దతు ధర లేదు, రైతులకు సాయం లేదు. బర్డ్ఫ్లూ దెబ్బకు తగ్గిన డిమాండ్ జిల్లాలో మొక్కజొన్నను 80 శాతం పైగా కోళ్ల ఫారాలకు సరఫరా చేసి మేతగా వినియోగించేవారు. ఇటీవల కోళ్లకు బర్డ్ఫ్లూ వ్యాపించడంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది. దీంతో కోళ్ల ఫాంలు మూతపడ్డాయి. దీంతో మొక్కజొన్నకు డిమాండ్ తగ్గడంతో రైతుల పండించిన పంటను దళారులు తమ ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారు. ఒక వైపు రైతులను ప్రభుత్వం ఆదుకోకపోగా మరో వైపు మద్దతు ధర తగ్గించడం వంటి పరిణామాలతో మొక్కజొన్న రైతు లబోదిబోమంటున్నాడు. మొక్కజొన్న రైతు గగ్గోలు మద్దతు ధర తగ్గింపు.. దోచుకుంటున్న దళారులు జిల్లా వ్యాప్తంగా 48,878 ఎకరాల్లో సాగు జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలు జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు: 18,345 మంది జిల్లాలో సాగు: 48,878 ఎకరాలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర: రూ.2,225 దళారులు కొనుగోలు చేస్తున్న ధర: రూ.2 వేల నుంచి 2,200 -
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
ద్వారకాతిరుమల మండలంలో పోలవరం కాలువ గట్టుపై భారీ చెట్లను అడ్డగోలుగా నరికేశారు. చెట్ల కలప సంగతిని అధికారులు ఇంతవరకూ తేల్చలేదు. 11లో uఇసుక పాయింట్ల పరిశీలన ఉంగుటూరు: చేబ్రోలులోని ఇసుక పాయింట్ను కలెక్టరు వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఽకలెక్టర్ మాట్లాడుతూ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్టాకు పాయింట్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తహసీల్దారు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. చేబ్రోలు ఇసుక పాయింట్కు తాడిపూడి నుంచి ఇసుక రవాణా చేస్తారని చెప్పారు. చేబ్రోలు గ్రామంలో పారిశుధ్యం మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచ్ రందే లక్ష్మి సునీతతో సమీక్షించారు. -
యథేచ్ఛగా చెట్ల నరికివేత
నిబంధనలను మీరి మరీ.. ఏలూరు డివిజన్(4, 5 ప్యాకేజీలు) పరిధిలోని పోలవరం కుడి కాలువ వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులు నిర్వహించేందుకు భీమవరానికి చెందిన పంచగర్ల సత్యనారాయణ కాంట్రాక్టుకు తీసుకున్నాడు. నారాయణపురం పరిధిలోని కాలువ వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులను తామే చేసి, అప్పగిస్తామని పార్టీ గ్రామ కమిటీ అద్యక్షుడు కేఎన్ఆర్ కాంట్రాక్టర్తో మాట్లాడుకుని, అక్కడ తుమ్మచెట్లు నరకకుండా మొత్తం వేప చెట్లను నరికేశారు. దీనిపై నాకు శుక్రవారం కొందరు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత వ్యక్తులను ఏలూరు కార్యాలయానికి వచ్చి ఫైన్ కట్టమని హెచ్చరించాను. అలాగే దగ్గరుండి పనులు చేయించాలని కాంట్రాక్టరుకు సూచించాను. – బాపూజీ, ఇరిగేషన్ ఏఈ ●ద్వారకాతిరుమల : ఓ పచ్చనేత పోలవరం కుడి కాలువ గట్టుపై ఉన్న చెట్లపై కన్నేశాడు. ఇంకేముంది పట్టపగలే వాటిని నరికించే పనిలో పడ్డాడు. ఇప్పటికే వేప తదితర జాతులకు చెందిన దశాబ్దాల కాలం నాటి ఎన్నో చెట్లను నరికించేశాడు. ఇప్పటికే కొంత కలపను విక్రయించగా, మరి కొంత కలపను విక్రయించేందుకు సిద్ధం చేశాడు. చెట్లు నరికివేతపై ఆ నాయకుడిని ఎవరైనా ప్రశ్నిస్తే, నేనెవరో తెలుసా..? టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని అంటున్నాడు. దాంతో సంబంధిత అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడడానికి భయపడుతున్నారు. వివరాల ప్రకారం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం–గుణ్ణంపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై గత పది రోజులుగా చెట్లు నరికివేత పనులు జరుగుతున్నాయి. పట్టపగలే ఈ పనులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ఎంతో విలువైన వేప, తదితర జాతులకు చెందిన భారీ వృక్షాలను నరికి వేస్తున్నారు. ఇప్పటికే కొంత కలపను విక్రయించగా, మరి కొంత కలపను అమ్మేందుకు సిద్ధం చేశారు. కాలువ గట్టుపై అక్కడక్కడా ఆ కలపను గుట్టలుగా ఉంచారు. అసలు నేనెవరో తెలుసా..? ఎం.నాగులపల్లి–గుణ్ణంపల్లి మధ్యలో శుక్రవారం చెట్లు నరికే సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్పై అటుగా వెళ్లారు. నరికిన చెట్లను ట్రాక్టర్తో బయటకు లాగడాన్ని చూసి, అక్కడున్న వారిని నిలదీశారు. ఎంతో విలువైన వేప చెట్లను ఎవరి అనుమతులతో నరుకుతున్నారని ప్రశ్నించారు. దాంతో కోపోద్రిక్తుడైన ఒక నాయకుడు అసలు నేనెవరో తెలుసా.. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని, నేను చూసుకుంటాను అంటూ ఊగిపోయాడు. ఫోన్లో వీడియో ఎందుకు తీస్తున్నారని బైక్పై ఉన్న వారితో సదరు నాయకుడు, అతనితో ఉన్నవారు వాగ్వివాదానికి దిగారు. దాంతో ఏం చేస్తారోనన్న భయంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ అక్రమాలను ఆపేదెవరూ? కళ్లముందే పచ్చని చెట్లను నరికేస్తుంటే సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమని స్థానికులు అంటున్నారు. ఎంత అధికార పార్టీ నాయకులైతే మాత్రం అక్రమంగా చెట్లు నరికి, అమ్మేస్తుంటే పట్టించుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. కాలువ గట్టుపై జంతుజాలాలు, పక్షు జాతులకు ఆవాసంగా ఉన్న చెట్లను అక్రమంగా నరికివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, చెట్లను నరికి, అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలవరం కాలువ గట్టుపై ఉన్న చెట్లపై టీడీపీ నేత కన్ను కొంత కలప విక్రయం, మరికొంత అమ్మేందుకు సిద్ధం -
పాలిటెక్నిక్,ఐటీఐ కోర్సులతో ఉద్యోగావకాశాలు
భీమవరం: పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. టెన్త్లో మంచి మార్కులు సాధించి పాలిటెక్నిక్లో చేరాలనుకోవడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కాళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యనభ్యసించిన నిమ్మల యశస్విని పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 586 మార్కులను సాధించిన సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏం చదవాలి? అనుకుంటున్నావని కలెక్టర్ ప్రశ్నించగా పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి పాలిటెక్నిక్ చదవాలనుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేయడంతో మంచి నిర్ణయమంటూ యశస్వినిని కలెక్టర్ నాగరాణి అభినందించారు. టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు కోర్సుల ఎంపికలో యశస్వినిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మంచి ఫలితాల సాధనకు విద్యార్థులను ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయుడు జేఎల్ఎం శాస్త్రి శాలువాతో కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ, ఎంఈఓ ఎ.రవీంద్ర, విద్యార్థిని తల్లిదండ్రులు నిమ్మల శ్రీనివాసరావు, భారతి తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల్లో మట్టిని తోడేస్తున్న మాఫియా
నూజివీడు: అధికార పార్టీ మట్టి మాఫియా చెరువుల్లోని మట్టిని తోడేస్తోంది. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తు న్నా అధికార వర్గాలు కళ్లుమూసుకుని కూర్చుంటున్నారే గానీ వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన టీడీపీ నాయకుడు గ్రామంలో ఉన్న పాలెం చెరువులో మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు చేపట్టి మట్టిని బయటకు తరలిస్తున్నారు. ట్రాక్టరు ట్రక్కు మట్టిని రూ.500ల నుంచి రూ.600లకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇందులో ప్రొక్లెయిన్తో తవ్వి ట్రాక్టర్ నింపడానికి రూ.100లు చెల్లిస్తున్నారు. ఈ చెరువు మట్టి ఓగిరాల తండా, హటియాతండా, హరిశ్చంద్ర తండాలకు వెళ్తోంది. ఆయా గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఎవరైనా తమకు మట్టి కావాలంటే వారికి తోలకుండా కేవలం టీడీపీ వారికే మట్టిని అమ్ముతున్నారని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. చెరువు అనేది గ్రామ ప్రజలందరదీ అయినప్పుడు కొంతమందికి తోలడం, కొంతమందికి తోలకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా మైనింగ్ చేసి మట్టిని అమ్ముకుంటున్నా ఇటు రెవెన్యూ అధికారులు గానీ, అటు ఇరిగేషన్ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ ఏమీ పట్టనట్లు ఉండటం గమనార్హం. అయితే శుక్రవారం మధ్యాహ్నానికి గ్రామస్తుల నుంచి రెవెన్యూ అధికారులకు అక్రమ తవ్వకాలపై పదేపదే ఫోన్లు రావడంతో మట్టి తవ్వకాలను ఆపారు. ఇటీవల ఆగిరిపల్లి మండలం నర్సింగపాలెంలో సీఎం ఇంటి మెరక పనులకు అంటూ కొండ నుంచి గ్రావెల్ను అక్రమంగా తవ్వి టిప్పర్లలో తరలించి అమ్ముకున్నారు. ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతున్న తవ్వకాల గురించి అధికారులు పట్టించుకోకపోయినా గ్రామస్తులే అడ్డుకున్నారు. ఇదే మండలంలోని ఈదరలోని పంగిడమ్మ చెరువులోని మట్టిని సైతం కొల్లగొడుతున్నారు. ఈ చెరువు నుంచి మట్టి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలకు మట్టిమాఫియా సరఫరా చేస్తోంది. నూజివీడు మండలంలో కొన్నంగుంట, పోతురెడ్డిపల్లి, మొర్సపూడి, చాట్రాయి మండలం పోలవరం తదితర గ్రామాల్లో కూడా చెరువుల్లోని మట్టిని అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. -
వారెవ్వా.. షవర్ బాత్
శ్రీవారి కొండపై జల్లు స్నానంతో సేదతీరుతున్న మూగజీవాలు భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. అయితే ద్వారకాతిరుమల క్షేత్రంలోని దేవస్థానం గో సంరక్షణశాలలో మూగజీవాలు షవర్ బాత్లు చేస్తూ ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఎక్కడాలేని విధంగా దేవస్థానం అధికారులు ఈ మూగజీవాల కోసం రూ. 2 లక్షలు పైగా వెచ్చించి గో, గజ శాలల్లో గతంలోనే షవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఆవులు, గిత్తలకు, అలాగే అశ్వానికి షవర్ల కిందే సిబ్బంది జల్లు స్నానం చేయిస్తున్నారు. అదేవిధంగా గజలక్ష్మి సైతం జల్లు స్నానంతో ఉపసమనాన్ని పొందుతోంది. కజానా బాతులైతే ఎక్కువ సమయం గోసంరక్షణశాలలోని కొలనులోనే ఉంటున్నాయి. ఇవి చూపరులను ఆకర్షిస్తున్నాయి. – ద్వారకాతిరుమల -
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
ద్వారకాతిరుమల: పేరుపాలెం బీచ్లో స్నేహితులతో కలసి సరదాగా స్నానం చేస్తుండగా ద్వారకాతిరుమలకు చెందిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. వివరాల ప్రకారం మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది యువకులు శుక్రవారం ఉదయం ఒక ఆటోలో పేరుపాలెం బీచ్కు వెళ్లారు. మధ్యాహ్నం సరదాగా బీచ్లో స్నానం చేస్తున్నారు. అయితే ద్వారకాతిరుమలకు చెందిన లాలూ నాయక్(17), సత్తెన్నగూడెం గ్రామానికి చెందిన మధు బీచ్ లోపలికంటూ వెళ్లారు. దాంతో లాలూ నాయక్ గల్లంతు కాగా, మధు ప్రాణాలతో బయటపడ్డాడు. సహాయక సిబ్బంది నాయక్ కోసం గాలిస్తున్నారు. తొమ్మిది మంది యువకులు ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నారు. -
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
జంగారెడ్డిగూడెం: తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి పట్టపగలు తాళాలు పగులగొట్టి ఇళ్లల్లోకి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టి.నరసాపురం మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఒంటెద్దు క్రాంతికుమార్రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు ఇటీవల డాంగేనగర్ ప్రాంతంలో రెండు చోరీలకు పాల్పడ్డాడని వివరించారు. నిందితుడి వద్ద నుంచి 200 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒంటెద్దు క్రాంతికుమార్రెడ్డి ప్లంబర్ పని చేస్తుంటాడని, ప్లంబింగ్ పనికి ఉపయోగించే కట్టర్లు, స్క్రూడ్రైవర్ల సహాయంతో ఇంటి తాళాలు పగులగొడతాడని డీఎస్పీ చెప్పారు. సీఐ వి.కృష్ణబాబు పర్యవేక్షణలో ఎస్సై షేక్ జబీర్ క్రాంతి కుమార్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. కాగా నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై షేక్ జబీర్, ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుల్ ఎన్.రమేష్, రాజశేఖర్లకు రివార్డుకు జిల్లా ఎస్పీకి సిఫార్సు చేస్తామన్నారు. -
కొంతేరులో నాటిక పోటీలు ప్రారంభం
యలమంచిలి: యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి కళామందిరంలో నిర్వహించిన అఖిల భారత స్థాయి నాటిక పోటీలలో తొలి రోజు రెండు నాటికలు ప్రదర్శించారు. మొదటగా గుడివాడకు చెందిన కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసి యేషన్ వారు ప్రదర్శించిన ద్వారబంధాల చంద్రయ్యనాయుడు నాటిక ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పీవీ సత్యనారాయణ రచించిన ఈ నాటకానికి పి.కృష్ణ హితేష్ దర్శకత్వం వహించారు. రెండవ నాటికగా హైదరాబాద్ విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక అలరించింది. ఈ నాటికను పరమాత్ముని శివరాం రచించారు.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టుపాలకొల్లు (సెంట్రల్): కూటమి నాయకులను ఎక్స్ ఖాతాలో దూషించారంటూ అందిన ఫిర్యాదు మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిగురువాడ గ్రామానికి చెందిన అమితి హరి ప్రసాద్అనే వ్యక్తిని అదుపు తీసుకున్నామని పాలకొల్లు టౌన్ పోలీసులు శుక్రవారం తెలి పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కు టుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం, బూతులు తిడుతూ వారి వ్యక్తిత్వహన నానికి పాల్పడ్డాడని పాలకొల్లుకు చెందిన టీడీపీ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ధనాని సూర్యప్రకాష్ ఫిర్యాదు చేశారన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, లోకేష్లపై కూడా తిడుతూ పోస్టులు పెట్టారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె.రజిని కుమార్ తెలిపారు. ఎంపీడీఓను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం ఉంగుటూరు: ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంజి రాజ్మనోజ్కు శుక్రవారం ఓ వింత అనుభవం ఎదురైంది. శుక్రవారం ఎంపీడీఓకు ఓ నంబర్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. లైన్లో ఉండండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారని ఎంపీడీఓకు ఫోను కలిపారు. నేను పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ త్రివేదిని అంటూ మాట్లాడుతూ మా మేనల్లుడు ఆశ్రం ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు . డబ్బు సర్దండి అంటూ ఒక ఫోను నెంబరు చెప్పారు. పైగా ఈ విషయం ఎవరికి చెప్పకండంటూ చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఎంపీడీఓ ముందు తడబడినా ఆ తర్వాత పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సత్యభూషణ కుమార్ కదా? అని గుర్తు వచ్చి మిన్నకుండిపోయారు. దొంగ అరెస్టుభీమవరం: నడిచి వెళ్తున్న మహిళ మెడలో బంగారుచైన్ లాక్కుని పారిపోతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భీమవరం వన్టౌన్ ఎస్సై కృష్ణాజీ శుక్రవారం చెప్పారు. మెంటేవారితోటకు చెందిన జి.వాసవి బుధవారం మార్కెట్కు రైల్వే అండర్ టన్నెల్ నుంచి నడుచుకుంటూ వస్తుండగా పాలకొల్లుకు చెందిన కొప్పర్తి అలెగ్జాండర్ పౌల్ ఆమె మెడలోని చైన్ లాక్కుని పారిపోతుండగా వాసవి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కలవారు పౌల్ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై కృష్ణాజీ చెప్పారు. లారీ తిరగబడి డ్రైవర్ మృతి జంగారెడ్డిగూడెం: మండలంలోని పుట్లగట్లగూడెం నుంచి పంగిడిగూడెం వైపు వెళ్ళే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రీన్ ఫీల్డ్ హైవే లారీ డ్రైవర్ ధనుంజయ్ సింగ్ (44) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. లక్కవరం ఎస్సై శశాంక తెలిపిన వివరాల ప్రకారం ఝార్ఖండ్ రాష్ట్రం పిప్రా గ్రామానికి చెందిన ధనుంజయ్ సింగ్ కొంత కాలంగా గ్రీన్ ఫీల్డ్ హైవే స్టాక్ పాయింట్లో కాంక్రీట్ మిక్చర్ లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం లారీలో కాంక్రీట్ తీసుకుని పంగిడిగూడెం వైపునకు వెళ్తున్నాడు. రహదారి మధ్యలో లారీ నిలిచిపోవడంతో పదేప దే లారీను స్టార్ట్ చేయగానే లారీ వెనక్కి వెళ్లి డివైడర్ను ఢీకొట్టి తిరగబడింది. ఈ ప్రమాదంలో ధనుంజయ్ సింగ్ తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలం వద్దనే మృతి చెందాడు. ఈ ఘటనపై గ్రీన్ ఫీల్డ్ హైవే సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
దళితుల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఏలూరు (టూటౌన్): చింతలపూడి మండలం బట్టువారిగూడెం గ్రామం విష్ణు సాగర్రోడ్డులో దళిత మహిళ పాము రాణిసాగు చేసుకునే భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి అదనపు విశ్వేశ్వరరావు ని కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ సర్వే నంబర్ 1373/1 కి చెందిన మెట్ట భూమి 2.55 ఎకరాల భూమిని అగ్రవర్ణానికి చెందిన కంభం మెట్టు ఉషశ్రీ తన భర్త శ్యామసుందర్, ఆమె బంధువులు ఆమె తీసుకొచ్చిన కొంతమంది దళారులు కూలీలతో దౌర్జన్యంగా భూమిలోకి చొరబడి నారు పాము రాణిపై ఆమె భర్త పై కులం పేరుతో దూషణకు పాల్పడి వారిని కింద పడేసి కొట్టారన్నారు. దళిత మహిళ నారపాము రాణి జీవనాధారమైన మెట్ట సాగు భూమినే సుమారు 70 సంవత్సరాల నుండి ఆమె పూర్వికులు నుండి ఇప్పటివరకు సాగు చేసుకుని జీవిస్తున్నారు. సదరు భూమిలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ బావి, బోరు ఏర్పాటు చేశారు. ఈ ఆక్రమణపై స్పందించిన డీఆర్ఓ విచారణ నిమిత్తం నూజివీడు ఆర్డీఓకు ఎండార్స్ చేసినట్లు రవిప్రకాష్ తెలిపారు. -
చెల్లి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్య
పెనుగొండ: తోడబుట్టిన చెల్లెలు మరణాన్ని తట్టుకోలేక అమ్మా నేనూ వచ్చేస్తున్నానంటూ అన్న ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సిద్ధాంతం ప్రజలను కలచి వేసింది. సిద్ధాంతానికి చెందిన ఈదుపల్లి లక్ష్మీ నరసింహ(21) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి మృత్యువుతో పోరాడి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచాడు. వివరాల్లోకి వెళితే సిద్ధాంతంకు చెందిన ఈదుపల్లి నాగలక్ష్మీ అనారోగ్యంతో ఈ నెల 10న ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఏసీ మెకానిక్గా జీవనం సాగిస్తున్న అన్న లక్ష్మీ నరసింహ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చెల్లె మరణం జీర్ణించుకోలేక ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లిదండ్రులు వెంటనే గమనించి తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. దీంతో తండ్రి ఈదుబిల్లి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పెనుగొండ ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలూ మృత్యువాత పడడంతో ఈదుబిల్లి సూర్యనారాయణ దంపతులు తల్లడిల్లిపోతున్నారు. పెనుగొండలో చదువుకుంటున్న కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే చేతికందివచ్చి, కుటుంబానికి అండగా నిలుస్తాడునుకున్న కొడుకూ మృతి చెందడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. -
ఉపాధిలో వేతన వెతలు
సాక్షిప్రతినిధి, ఏలూరు: ఉపాధి హామీ కూలీల బకాయిలు నెలనెలకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ. 66.39 కోట్లు బకాయిలున్నాయి. వాస్తవానికి ప్రతి 15 రోజులకోసారి చేసిన పనులకు చెల్లింపులు జరగాల్సి ఉన్నా జిల్లాలో మాత్రం మూడు నెలలుగా బకాయిలు చెల్లించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పనులైతే జరుగుతూ ఉన్నా ఇప్పుడు చేసే పనుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఒక పక్క పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా కూలి డబ్బుల కోసం ఆశపడి పనిచేస్తున్నా వేతనాలు చెల్లించకపోవడంపై కూటమి ప్రభుత్వంపై జిల్లాలోని ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి 15 రోజులకోసారి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించేవారని దానికి భిన్నంగా ప్రస్తుత కూటమి పాలకులు దాదాపు మూడు నెలలు కావస్తున్నా తమకు వేతనాలు చెల్లించకపోవడంపై ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మండిపోతున్న నిత్యావసరాలు, కూరగాయలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు.. మరో పక్క సక్రమంగా అందని ఉపాధి వేతనాలు వెరసి తమ జీవనం మరింత దుర్భరంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తమపై సానుకూలంగా స్పందించి బకాయి వేతనాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు జిల్లాలోని 27 మండలాల పరిధిలో మొత్తం 3.77 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. ప్రతి కూలీకి ఏడాదికి వంద రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉండగా జిల్లాలో సగటున ఒక్కో కూలీకి 46 రోజుల పనిదినాలనే కల్పించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి 15 రోజులకోసారి కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించాలి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్లో భాగంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఇటు ఉపాధి కూలీలు, అటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాల్లో టెంట్, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పనిముట్లు, మేట్లకు రూ.5 అదనపు పారితోషికం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని వాటిని ఎదు ర్కోవటం కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. వేతన పెంపుతో సరి ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.300 చెల్లించేవారు. తాజాగా కేంద్రం 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.7 వేతనం పెంచుతూ రోజుకు కూలీలకు రూ.307 చెల్లించాలని జీఓ విడుదల చేసింది. పెరిగిన ధరలతో పోలిస్తే కేంద్రం పెంచిన రూ.7 ఏ మూలకు సరిపోతాయి అంటూ ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలు.. రూ.66.39 కోట్లు జిల్లావ్యాప్తంగా ఉపాది హామీ పథకంలో కూలీలకు ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో జిల్లాలో కూలీలకు రూ.61.39 కోట్లు వేతన బకాయిలు పేరుకుపోయాయి. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి వేతన బకాయిలు మొత్తం రూ.49.83 కోట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ప్రస్తుత ఏప్రిల్ నెలకు సంబంధించిన బకాయి వేతనాలు రూ.16.56 కోట్లు కలిపి మొత్తం రూ.66.39 కోట్ల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలే ఇంత పెద్ద మొత్తంలో పేరుకుపోతే ఉపాధి కూలీలు ఏం తిని బతుకుతారు అంటూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని దినాలు పెంచాలి ఉపాధి హామీలో పని దినాలు 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి. పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పనికి తగ్గ వేతనం సక్రమంగా ఇవ్వాలి. అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పని చూపించాలి. ఒంటరి మహిళలకు జాబ్ కార్డులు ఇవ్వాలి. – పీవీ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి, ఏలూరు పేదల బతుకులు భారం కూలి డబ్బుల బకాయిలు రూ.66.39 కోట్లు 3 నెలలుగా కూలీల ఎదురుచూపులు 100 రోజుల పని దినాలకు 46 రోజులే పూర్తి గత ప్రభుత్వంలో 15 రోజులకోసారి వేతనాలు జిల్లాలో 5.57 లక్షల మంది కూలీలు -
ఆస్పత్రి ప్రారంభమెప్పుడో?
నూజివీడు: జిల్లాలోనే అతిపెద్ద కాలనీగా పేర్గాంచిన నూజివీడు ఎమ్మార్ అప్పారావు కాలనీలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.80 లక్షలతో చేపట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు పూర్తయి ఆరు నెలలు గడిచింది. అయినా ఇప్పటికీ అధికారులు ఈ కేంద్రాన్ని ప్రారంభించలేదు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కృషితో కాలనీలో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రారంభానికి నోచుకోకపోవడంతో కాలనీ వాసులు చిన్నపాటి అనారోగ్యానికీ ఐదు కిలోమీటర్ల దూరంలోని ఏరియా ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది. ఆస్పత్రి ప్రారంభమైతే వైద్య సేవలతో పాటు పది పడకలు అందుబాటులో వస్తాయి. అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్య కేంద్రంలో ఫార్మసీ, ఔట్పేషెంట్ గదులు, రెండు శస్త్రచికిత్స గదులు, లాబోరేటరీ, రోగుల సహాయకులకు విశ్రాంతి గదులు, వైద్యుల గది ఉన్నాయి. ఆస్పత్రికి అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లను సైతం గతంలోనే ప్రభుత్వం నియమించింది. మీ కోసంలో వినతి ఆస్పత్రిని ప్రారంభించాలని కాలనీవాసులు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో అర్జీని సైతం అందజేశారు. మున్సిపల్ అధికారులు వైద్యారోగ్య శాఖకు భవనాన్ని అప్పగించలేదని, అప్పగిస్తే ప్రారంభిస్తామని డీఎంహెచ్ఓ కార్యాలయం అర్జీదారుడికి సమాధానం కూడా పంపించింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆస్పత్రి అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. వెంటనే ప్రారంభించాలి భవన నిర్మాణం పూర్త యినందున ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి. పేదలైన కాలనీవాసులంతా చిన్నపాటి అనారోగ్యానికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిని ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురుచూస్తున్నారు. – షేక్ రజియాబేగం, కౌన్సిలర్, ఎమ్మార్ అప్పారావు కాలనీ, నూజివీడు. నిర్మాణం పూర్తయి 6 నెలలు పట్టించుకోని అధికారులు గత ప్రభుత్వంలో రూ.80 లక్షలతో నిర్మాణం -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
భీమవరం: పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆశా కార్యకర్తల ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఆశా వర్కర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భీమవరం త్యాగరాజ భవనంలో చింతపల్లి లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సర్వీస్ను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వం యాప్తో పనిభారం పెంచిందని విమర్శించారు. ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ, కనీస వేతనాలు లేవని పీఎఫ్, ఈఎస్ఐ ఊసెత్తకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని గోపీమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తేస్తున్న లేబర్ కోడ్స్ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు బి. వాసుదేవరావు, డి.కల్యాణి, ఎ.అజయ్ కుమారి, యూనియన్ జిల్లా కార్యదర్శి డి.జ్యోతి పాల్గొన్నారు. -
ఫెయిల్ అయ్యామని కుంగిపోవద్దు
ఏలూరు(మెట్రో): ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యా ర్థులు ఎంతమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉద్బోధించారు. పబ్లిక్ పరీక్షల్లో చిన్నపాటి పొరపాట్ల వల్ల మార్కులు తగ్గి ఫెయిల్ అయి ఉండొచ్చన్నారు. అంతేగానీ ఫెయిల్ అయిన విద్యార్థులు తెలివితేటలు లేనివారు మాత్రం కాదని స్పష్టం చేశారు. ఈ సమయంలో నిరాశ చెందకుండా సాధన చేసి ఉత్తీర్ణులు కావాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మెరుగైన విద్యాబోధనను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎటువంటి ప్రతికూల ఆలోచనలతో ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా నిర్విరామంగా కృషి చేస్తే విజయం తథ్యమని అన్నారు. మే 19 నుంచి 28వ తేదీ వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో హాజరై ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 22,365 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 17,274 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫెయిలైన 5,091 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వాలని, పునశ్చరణ తరగతులు కూడా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఉత్తీర్ణతకు ఎంఈఓలు, హెచ్ఎంలు కార్యాచరణ తయా రు చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఒకటి, రెండు సబ్జెక్టుల్లో పాస్ కాని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు గురి కాకుండా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
సినిమాల్లో ఇతర భాషల నటులే ఎక్కువ
సినీ నటుడు రావు రమేష్ భీమవరం: తెలుగు సినీ రంగంలో నిర్మాతలు మినహా ఎక్కువ మంది ఇతర భాషల వారే ఉన్నారని సినీ నటుడు రావు రమేష్ అన్నారు. గురువారం రాత్రి భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ 18వ జాతీయస్థాయి సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాటి సినీ నటులు నాటక రంగం నుంచి వెళితే నేడు నాటక రంగంతో ఎలాంటి పరిచయం లేకున్నా ఇన్స్టా గ్రామ్, సోషల్ మీడియాలో స్క్రిట్స్, రీల్స్ వంటివి చూసి నటులను ఎంపిక చేసుకునే రోజులు నడుస్తున్నాయన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ నాటక రంగానికి ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, సినీ పరిశ్రమకు ఇస్తున్న రాయితీలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కళారంగాన్ని ప్రత్యేకించి నాటక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ డిజిటల్ రంగంలో ప్రజలు మునిగి తేలుతున్న సమయంలో కళాపరిషత్లు నాటక రంగాన్ని రక్షించడం గొప్ప విషమని, నాటక రంగాన్ని బతికించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ మాట్లాడుతూ నాలుగు రోజులపాటు 10 నాటికలు ప్రదర్శిస్తామన్నారు. ముందుగా సినీ నటుడు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు, రచయిత ఎస్కే మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి పి.మణిబాలకు పెనుబోతుల శేషగిరిరావు హార్థిక చైతన్య పురస్కారాలతో సత్కరించారు. అనంతరం ప్రదర్శించిన కళానికేతన్ కాట్రపాడు వారి కిడ్నాప్, మైత్రి కళానిలయం హైదరాబాద్ వారి బ్రహ్మ స్వరూపం నాటికలు ఆకట్టుకున్నాయి. డీఎన్నార్ కళాశాల అధ్యక్షుడు గోకరాజు వెంకట నర్సింహరాజు, చిలుకూరి నర్సింహరాజు, మంతెన రామ్కుమార్ రాజు, పీఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, నడింపల్లి మహేష్కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్ర దాడిపై నిరసన
చింతలపూడి: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని చింతలపూడి పట్టణ జామియా మసీదు కమిటీ, పట్టణ జమాతే ఇస్లామీ హింద్ నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం జామియా మసీదు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ రహీమ్ (బాబు) మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుందని, కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి ఉంటున్నారన్నారు. దేశంలో మత సామరస్యాన్ని చూసి ఓర్వలేక ఉగ్ర మూకలు పాశవికంగా కాల్పులు జరపడం పిరికి పంద చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమాత్ ఇస్లామీ హింద్ పెద్దలు ఎండీ అక్బర్ అలీ మాట్లాడుతూ ఇస్లాం అంటేనే శాంతి అని, ఇస్లాంలో హింసకు తావు లేదన్నారు, ఎవరెన్ని కుట్రలు, దాడులు చేసినా దేశంలో మతసామరస్యాన్ని విడదీయలేరన్నారు. మసీదు కమిటీ కార్యదర్శి ఎండీ జిలానీ, కమిటీ ముఖ్య కార్యవర్గ సభ్యులు ఎండీ ఇస్మాయిల్, సయ్యద్ రజాక్, టజు సుభాని తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’పై దాడి అమానుషం
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేయటం, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంలో కంప్యూటర్లు ధ్వంసం చేయటం సరికాదని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, మంచి చేయండి, ప్రజలకు చేరువ కావటానికి ప్రయత్నం చేయండి, పత్రికా స్వేచ్ఛను ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉంటూ బెదిరింపులు, అనుచరులతో దాడులు చేయటం ఏమాత్రం సమర్థనీయం కాదు అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారం తమకు వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. దౌర్జ న్యాలు, అరాచకాలు, లిక్కర్ మాఫియా, కోడిపందాలు, జూదాలు తప్ప ఏమున్నాయని సునీల్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఇన్చార్జి సునీల్ -
పనిచేస్తూ ఉపాధి కూలీ మృతి
నిడమర్రు: ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేస్తూ ఉపాధి కూలి కొరపాటి నాగమణి (48) మృతి చెందిన ఘటన గురువారం పెదనిండ్రకొలను గ్రామంలో చోటుచేసుకుంది. తోటి కూలీల కథనం ప్రకారం నాగమణి పత్తేపురం– పెదనిండ్రకొలను గ్రామాల మధ్య ఉన్న మురుగు కాలువలో తూడు, గుర్రపుడెక్క తొలగించే పనులకు వెళ్లింది. మరి కొద్ది సేపట్లో పనులు ముగుస్తాయనగా కాలువలో తూడూ, గుర్రపు డెక్క తొలగిస్తూ ఒకేసారి కుప్పకూలి కాలువలో పడిపోయింది. తోటి కూలీలు గమనించి కాలువ గట్టుపైకి తీసుకువచ్చారు. అనంతరం నాగమణిని పెదనిండ్రకొలను పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త మంగయ్య, ఇద్దరు పెళ్లైన కుమార్తెలు ఉన్నారు. నిడమర్రు ఎస్సై వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నాగమణి మృతదేహాన్ని తాడేపల్లిగుడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విలేకరిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి ఏలూరు టౌన్: ఓ చానల్ విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్పారు. వివరాల ప్రకారం ఏలూరు టూటౌన్ గిలకలగేటు ప్రాంతానికి చెందిన ఉల్లింగల చంద్రకాంత్ అలియాస్ చందు ఏలూరులో ఒక చానల్ విలేకరిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 23తేదీ అర్థరాత్రి అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దారికాచి మరీ ఇనుపరాడ్లతో దాడి చేశారు. మోటారు సైకిల్పై ఇంటికి వెళుతున్న సమయంలో ఆకస్మికంగా దుండగులు దాడి చేయగా చేతులు అడ్డుపెట్టుకోవటంతో చందుకి చేతివేళ్లు విరిగాయి. ఆ సమయంలో అతను కేకలు వేయడం, స్థానికులు రావడంతో దుండగులు పారిపోయారు. కుటుంబ సభ్యులు చందును ఏలూరు జీజీహెచ్కు తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనపై ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేకులు మీద పడి వ్యక్తి మృతి ఆగిరిపల్లి: మందులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన వ్యక్తిపై ప్రమాదవశాత్తూ రేకులు పడడంతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తోటపల్లికి చెందిన పామర్తి హనుమంతరావు (60) ఆగిరిపల్లిలోని మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేసి వెళ్తుండగా అతడి తలపై దుకాణం పైన ఉన్న రేకులు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హనుమంతరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్యకు దారితీసిన సరిహద్దు తగాదా
యలమంచిలి : సరిహద్దు తగాదాల నేపథ్యంలో కొంతేరు కట్టా వారి పుంతకు చెందిన కత్తుల పౌలు (58)ను అతని ఎదురింటిలో ఉండే బత్తుల ఏసుదాసు (పెద్దోడు), అతని భార్య భారతి కలసి హత్య చేశారు. మృతుడు పౌలు భార్య జానకమ్మ పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పౌలు, ఏసుదాసు స్నేహితులు. కొంతకాలం క్రితం సరిహద్దు తగాదా రావడంతో శత్రువులయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పౌలు ఇంటి తలుపులు చప్పుడు కావడంతో జానకమ్మ తలుపు తీసింది. ఆమెను తోచుకుని లోపలకు వెళ్లి ఏసుదాసు, అతని భార్య భారతి పౌలుపై దాడి చేసి కత్తితో నరికారు. పౌలు మెడ, ఎడమ భుజం, కుడి చేతికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు జానకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరసాపురం డీఎస్పీ శ్రీవేద, పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. పౌలు మృతదేహానికి శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
పచ్చళ్లకు మామిడికాయ రెడీ
తణుకు అర్బన్ : వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఆవకాయ తదితర పచ్చళ్లు పట్టే సందడి నెలకొంటుంది. ఇదే నేపథ్యంలో తణుకు సంత మార్కెట్లో ఆవకాయ పచ్చడి కోసం మాడికాయలు సందడి చేస్తున్నాయి. గత 10 రోజులుగా తెల్లవారుజాము నుంచే వివిధ రకాల జాతులకు చెందిన మామిడి కాయలు తణుకు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. మామిడికాయలు రంగు, రూపుతోపాటు దిగుబడులు కూడా అధికంగానే ఉన్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఇంకా ఊపందుకోలేదు. అనుకున్న మేర అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారులు అమ్మకాల కోసం పడిగాపులు పడాల్సివస్తుంది. కాపు ఎక్కువగా ఉండడంతో ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ప్రజల్లో ఆవకాయ, మాగాయి తదితర పచ్చళ్లు పట్టే ఆసక్తి తగ్గిందని, రెడీమేడ్ పచ్చళ్లకు కొన్ని రకాల ప్రజానీకం అలవాటుపడ్డారని, దానికితోడు జనం దగ్గర డబ్బులు కూడా లేకపోవడంతో ఈ ఏడాది మామిడికాయల కొనుగోళ్లు ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. 15 టన్నుల మామిడి కాయలు దిగుమతి తూర్పుగోదావరి జిల్లా నుంచి అధికంగా తణుకు మార్కెట్లోకి రకరకాల జాతులకు చెందిన మామిడికాయలు రోజుకు సుమారుగా 15 టన్నుల వరకు అందుబాటులోకి వస్తున్నాయి. సంత మార్కెట్ను ఆనుకుని జరుగుతున్న మామిడికాయల అమ్మకాలకు సంబంధించి రాజమండ్రి, తుని, కత్తిపూడి, అన్నవరం తదితర ప్రాంతాల నుంచి కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు, పెద్ద రసాలు, చిన్న రసాలు, సువర్ణరేఖ, దేశవాళి వంటి రకాల మామడికాయలు నిత్యం తణుకు మార్కెట్లో అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా అమ్మకాలు లేకుండా పోయాయని ఈ అమావాస్య గడిస్తే కొంతమేర పచ్చళ్లు పట్టే పరిస్థితులు పెరుగుతాయేమోనంటూ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చడి కోసం ఎక్కువగా వినియోగదారులు ఈ కాయల కోసం మక్కువ చూపుతున్నారని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ముక్కలు కొట్టేందుకు పోటాపోటీ మామిడికాయలు కొనుగోలు చేసుకుని మార్కెట్లోనే ఆవకాయ పచ్చడికి కావాల్సిన సైజులో ముక్కలు కొట్టే కార్మికులు కూడా పోటీపడుతున్నారు. ఎవరు మామిడి కాయలు కొంటారా అని వారి చుట్టూ తిరుగుతూ ముక్కలు కొట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి దుకాణం వద్ద ఒకరు ముక్కలు కొడుతూ ఉపాధి పొందుతున్నారు. కాయ సైజును బట్టి రూ. 2 నుంచి రూ.3 తీసుకుంటున్నారు. రోజుకు 15 టన్నుల మామిడికాయలు తణుకు మార్కెట్కు ఇంకా ఊపందుకోని అమ్మకాలు అమావాస్య దాటాక అమ్మకాలపై ఆశలు మామిడి కాయ నాణ్యతను బట్టి ధరలు ఇలా... కొత్తపల్లి కొబ్బరి కాయ రూ. 25 ఐజర్లు రూ. 25 చిన్నరసాలు రూ. 20 పెద్ద రసాలు రూ. 20 సువర్ణరేఖ రూ. 20 దేశవాళి రూ. 15 ఇంకా ఊపందుకోని అమ్మకాలు ఈ వేసవి సీజన్లో మామిడి కాయ దిగుబడి అధికంగానే ఉన్నపటికీ ప్రస్తుతానికి పచ్చడి కోసం మామడి అమ్మకాలు ఇంకా ఊపందుకోలేదు. గతంలో పచ్చడి మామిడికాయలు ఎప్పుడు వస్తాయా అనే విధంగా ఎదురుచూసేవారు. కానీ నేడు ధరలు అందుబాటులోనే ఉన్నా వ్యాపారాలు పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఆదివారం అమావాస్య అనంతరం అమ్మకాలు పెరుగుతాయని అనుకుంటున్నాము. రెడీమేడ్ పచ్చళ్లతోపాటు జనం దగ్గర డబ్బులు లేకపోవడం కూడా అమ్మకాల తగ్గడానికి కారణం అయివుండవచ్చు. – కొఠారు రామాంజనేయులు, మామిడికాయల వ్యాపారి, తణుకు -
26న జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్
ఏలూరు (టూటౌన్) : ఈనెల 26న ఏలూరు సీపీఐ జిల్లా కార్యాలయం, స్ఫూర్తి భవన్ నందు జిల్లా ఓపెన్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.కృష్ణ్ణమాచార్యులు, జిల్లా నాయకుడు పి కిషోర్ తెలిపారు. సీపీఐ జిల్లా కార్యాలయం నందు చెస్ టోర్నమెంట్ బ్రోచర్ను గురువారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఏఐటీయూసీ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని చెస్ క్రీడాకారులంతా ఈ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు సహాయ కార్యదర్శి కూరెళ్ళ వరప్రసాద్, ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఎస్ అప్పలరాజు, నాయకులు బి జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు. మే 4 నుంచి శంకరమఠంలో వేద పరీక్షలు తాడేపల్లిగూడెం (టీఓసీ): శ్రీ గోదావరీ మండల వేదశాస్త్ర ప్రవర్ధకసభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లా వేద విద్యార్థులకు మే 4, 5, 6 తేదీల్లో తాడేపల్లిగూడెంలోని శంకరమఠంలో వేద పరీక్షలు నిర్వహించనున్నట్లు శంకరమఠం సభ్యులు వెల్లడించారు. సుమారు 450 మంది వేద విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు వేద, శాస్త్ర, శ్రౌత, స్మార్త, ఆగమ, అపర్ణ విద్యలో జరుగుతాయన్నారు. విద్యార్థులందరికీ 3 రోజులు భోజన వసతులు పట్టణంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మే 6 వ తేదీన శంకరమఠంలో పాలకొల్లు వలివేటి శ్రీ హరి శర్మ సన్మానం, వేద సభ జరగనున్నట్లు పేర్కొన్నారు. చోరీ కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష నరసాపురం: పట్టణంలో జరిగిన ఓ దొంగతనం కేసులో నేరం రుజువు కాడడంతో ముద్దాయిలు కొత్తపల్లి రమేష్కు రెండేళ్లు సాధారణ జైలు, రూ 2వేలు జరిమానా, బీర రమేష్, గుబ్బల భాస్కర్కు ఏడాది సాధారణ జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ నరసాపురం జూనియర్ సివిల్ జడ్జి కె.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. నరసాపురం టౌన్ సీఐ బి.యాదగిరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని జోస్యులవారి వీధి కొప్పర్తి వెంకటరత్నం ఇంట్లో జరిగిన దొంగతనం ఘటనలో ముద్దాయిలను 2023 జనవరి 16వ తేదీన అప్పటి ఎస్సై సుధాకరరెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు కోర్టు జైలు శిక్ష విధించినట్టు సీఐ వివరించారు. -
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి
ఏలూరు (టూటౌన్): పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్సీ సర్పంచ్లు హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అన్నారు. పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని స్థానిక ఎన్ఆర్పేటలోని ఎస్సీఆర్పీఎస్ అండ్ ఏఐఏవైఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అత్యంత కీలకమైనదని, మేధావులతో కూడిన అనేక కమిటీలు దీన్ని ఏర్పరిచారన్నారు. కానీ పంచాయతీరాజ్ చట్టాలను అమలు చేయటంలో గ్రామ స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు విఫలమయ్యారని చరిత్ర తెలియజేస్తుందన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు పాలనను వారిని చేయనియ్యకుండా ఎమ్మెల్యేలు హైజాక్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నూకపెయ్యి కార్తీక్ పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్ ఏలూరు టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు కత్తేపువీధికి చెందిన షేక్బాజీ గతంలో బావిశెట్టివారిపేటకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువరి మధ్య వివాదం తలెత్తడంతో ఆమెను వదిలివేశాడు. అయితే అత్త జయలక్ష్మిపై బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈనెల 22న రాత్రివేళ జయలక్ష్మిపై బిర్లాభవన్ సెంటర్ వద్ద షేక్బాజీ ఆకస్మికంగా వెనుకవైపు నుంచి దాడి చేశాడు. తీవ్ర గాయాలైన జయలక్ష్మిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏలూరు వన్టౌన్ పోలీసులు షేక్బాజీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతడ్ని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. నారాయణపురంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఉంగుటూరు: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు నారాయణపురం శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి కే విశ్వేశ్వరరావు తెలిపారు. ఈనెల 26వ తేదీలోగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 81251 55788 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
నర్సింగ్ కాలేజీలో వసూళ్ల పర్వం!
ఏలూరు టౌన్: ఏలూరు జీజీహెచ్ భవనంలో నిర్వహిస్తున్న జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తోంది. అడ్మిషన్ల నుంచి క్యాపింగ్ సెర్మనీ వరకు విద్యార్థినుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు చెల్లించాలంటూ నర్సింగ్ విద్యార్థినులపై కాలేజీ యాజమాన్యం వత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదవర్గాల పిల్లలకు వృత్తివిద్యా కోర్సులు అందించేందుకు ప్రభుత్వం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) మూడున్నర సంవత్సరాల డిప్లమో కోర్సును అందిస్తోంది. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో భవనంలోనే ఒక విభాగంలో జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు అందిస్తూ పూర్తి ఉచితంగా జీఎన్ఎం కోర్సును పేద వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. మూడున్నరేళ్ల కోర్సుకు సంబంధించి ఒక్కో ఏడాది 60 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద వర్గాల పిల్లలకు ఉచితంగా నర్సింగ్ కోర్సును అందిస్తూ వారి కాళ్లపై వారు నిలబడి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పర్చుకోవటమే ప్రభుత్వ లక్ష్యం. కానీ ఏలూరు జీజీహెచ్లోని జీఎన్ఎం కోర్సు చదివే విద్యార్థినులతో యాజమాన్యం దారుణంగా ఆటలాడుతూ భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారీగా వసూళ్లు? ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలోని జీఎన్ఎం నర్సింగ్ కాలేజీలో రెండు రోజుల్లో క్యాపింగ్ సెర్మనీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 240 మంది విద్యార్థినులకు వారి విద్య పూర్తిచేసి ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో క్యాపింగ్ సెర్మనీ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఒక్కో విద్యార్థిని నుంచి రూ.2 వేలు వసూలు చేసేలా యాజమాన్యం టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థినిల నుంచి రూ.4.80 లక్షల సొమ్ములు వసూలు చేసేలా నిర్ణయించారు. కాలేజీ యాజమాన్యం పేరు చెప్పకుండా కాలేజీలోని సీనియర్ విద్యార్థినిలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నర్సింగ్ కాలేజీలోని అధికారులకు బంగారు ఆభరణాలు చేయించాలనీ, ఇతరత్రా ఖర్చులు ఉంటాయనీ, కచ్చితంగా డబ్బులు కట్టాలంటూ వత్తిడి చేస్తున్నారనీ, తమకు తినటానికే డబ్బులు లేకుంటే ఇక రెండు వేలు ఎక్కడి నుంచి తెస్తామంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పేద విద్యార్థినులను వేధిస్తున్న కాలేజీ యాజమాన్యం అడ్మిషన్ల నుంచి క్యాపింగ్ వరకూ భారీగా వసూళ్లు? ఏలూరు జీజీహెచ్లో జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ దుస్థితి డబ్బులు ఇవ్వకుంటే.. వేధింపులే జీఎన్ఎం కోర్సు పూర్తి చేయాలంటే తమ కనుసన్నల్లోనే ఉండాలనీ, తాము తలచుకుంటే మీరు పాస్ కూడా కారంటూ కాలేజీ యాజమాన్యం నిత్యం విద్యార్థినిలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారని చెబుతున్నారు. క్యాపింగ్ సెర్మనీకి రూ.2వేలు చెల్లించకుంటే మీకు సర్టిఫికెట్లు చేతికి రాకుండా ఎలా చేయాలో తమకు తెలుసంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. వృత్తివిద్యా కోర్సు కావటంతో విద్యార్థినులు సైతం మౌనంగా వేధింపులు భరిస్తూ ఉంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
శ్రీవారి కొండపై షార్ట్కట్ మార్గం వద్దు
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో కొందరు భక్తులు ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. కొండపైకి షార్ట్కట్ మార్గంలో వెళుతున్నామని అనుకుంటున్నారే గాని, ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటనేది ఆలోచించడం లేదు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల చినవెంకన్న కొండపైన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానంతరం కొందరు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలోని మార్గం గుండా కొండపైన నిత్యాన్నదాన భవనం, శివాలయం వద్దకు కాలినడకన వెళుతున్నారు. అయితే అటుగా వెళ్లకూడదని ఆలయ అధికారులు ఆ మార్గంలో ఎన్ని అడ్డం పెట్టినా, వాటిని దాటుకుని మరీ భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జేసీబీతో పూడిక పనులు జరుగుతున్నాయి. భక్తులు షార్ట్కట్ మార్గాల్లో వెళ్లకుండా జంటగోపురాల వద్దకు చేరుకుని, అక్కడి నుంచి దేవస్థానం ఉచిత బస్సుల ద్వారా నిత్యాన్నదాన భవనం, శివాలయం, బస్టాండ్లకు చేరుకోవాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దని కోరుతున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో నుంచి భక్తుల రాకపోకలు షార్ట్కట్ మార్గాలు వినియోగించవద్దంటున్న అధికారులు -
ఉగ్రదాడులను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ
ఏలూరు (టూటౌన్): పహల్గాం ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు. కోట దిబ్బ సీతారాం భర్తీయా కళ్యాణ మండపం నుంచి మార్కెట్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీని ఉద్దేశించి సీఐటీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. గత పదేళ్లుగా సైన్యంలో సైతం రిక్రూట్మెంట్ లేకుండా చేసి దేశ భద్రతనే ఫణంగా పెట్టారని విమర్శించారు. దేశ ఐక్యతను కాపాడుకోకుండా మతం పేరుతో చిచ్చుపెడుతూ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే అది మోసపూరితమైన చర్యేనని అన్నారు. ఇప్పటికై నా దేశ సమైక్యతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వీవీఎన్ ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, నాయకులు కే రామాంజనేయులు, ఎం.ఇస్సాకు, కే.పోచమ్మ, కమల తదితరులు పాల్గొన్నారు. -
అమాయకులపై ఉగ్రదాడులు అమానుషం
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ఏలూరు టౌన్ : కశ్మీర్లోని పహల్గాం సమీపంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత అమానుషమైన చర్య అని ప్రపంచ యావత్తు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఏలూరు ఫైర్స్టేషన్ సెంటరులో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ ఉగ్రదాడులను యావత్తు ప్రపంచం వ్యతిరేకించాలని కోరారు. అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఏరివేయాలని కోరారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు, పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహ జ్వాలలు భీమవరం: జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం భీమవరం పట్టణంలో కొవ్వొత్తులతో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ప్రదర్శనలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు మాట్లాడుతూ శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి జీవిస్తున్న భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శనీయమని అలాంటి దేశంలో ఉగ్రవాదుల చర్యలు దారుణమన్నారు. ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇలాంటి ఘటనలు పునరావృతంగాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ఇతర దేశాలు పన్నుతున్న కుట్రలను కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రజలు తీవ్రంగా పరిగణించి ఉగ్రవాదులపై కఠిన చర్యలకు సన్నద్ధం కావాలన్నారు. మరెక్కడా ఇటువంటి ఘటనలు తిరిగి చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఉగ్రదాడిలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పీవీఎల్ నర్సింహరాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, పార్టీ అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, పార్టీ కార్యదర్శి ఏఎస్ రాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కర్రా జయచరిత, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, వైఎస్సార్సేవా దళ్ జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు, పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బంధం పూర్ణచంద్రరావు, భీమవరం పట్టణం, వీరవాసరం, భీమవరం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ, జల్లా కొండయ్య, పార్టీ నాయకులు కోడే యుగంధర్, చిగురుపాటి సందీప్, గంటా సుందరకుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలో.. అత్తిలి: కశ్మీర్లో ఉగ్రదాడి దోషులను కఠినంగా శిక్షించి, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో చనిపోయిన వారికి శాంతి చేకూరాలని వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
ఉంగుటూరు: గోపినాథపట్నం భక్తాంజనేయస్వామి క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో భూదేవి శ్రీదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, సౌధినీ కుమారి దంపతులు, కొట్టు సోదరులు మురళీ, తాతాజీ దంపతులు, కుటుంబసభ్యులు ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. వివిధ నదీ జలాలతో విగ్రహాలకు అభిషేకాలు చేశారు. అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, సంపత్కుమార్, మానుకొండ వేంకటేశ్వరరావు, చెన్నా జనార్దనరావు, గోపినాథపట్నం సర్పంచ్ పుత్సకాయల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. పండితుడు ఆంజనేయ ప్రసాద్కు మాజీ మంత్రి కొట్టు సువర్ణ కంకణం తొడిగి పండిత సత్కారం చేశారు. -
రొయ్యల ఫీడ్ ధరలను తగ్గించాలి
పాలకోడేరు: రొయ్యల ఫీడ్ ధరలు కేవలం రూ.4 తగ్గించడం సబబుకాదని, రూ.20 తగ్గించాలని పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు ఎన్ గజపతిరాజు, కార్యదర్శి జీకేఎఫ్ సుబ్బరాజు, రైతులు డిమాండ్ చేశారు. బుధవారం గొల్లలకోడేరులో నిర్వహించిన జిల్లా సమావేశంలో రైతులు మాట్లాడుతూ రొయ్యల కొనుగోలులో 60–50కి 50–40కి 40–30కి ఇదివరకు ఉన్న శ్లాబులను మళ్లీ పునరుద్ధరించాలని, అలాగే జోన్లు, ఎకరాలతో సంబంధం లేకుండా 1.50కి సబ్సిడీతో కూడిన కరెంటుని తక్షణమే క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని కోరారు. అప్సడా వైస్ చైర్మన్ రమణారెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ధరల స్థిరీకరణ 10 రోజులకీ జరిగినప్పటికీ ఈ మిగతా మూడు అంశాల్లో రైతులకి న్యాయం చేకూరాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించరని యెడల మే 10న జరగనున్న సమాఖ్య సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో వీరవాసరం మండలం తులసి రాంబాబు, ఆకివీడు మండలం బుజ్జి, ఇరగవరం మండలం బుజ్జి, గణపవరం మండలం వినాయక, నిడమర్రు మండలం నాని, ఆక్వా రైతు సోదరులు పాల్గొన్నారు. -
సాక్షిపై దాడులు సిగ్గుచేటు
దాడికి పాల్పడ్డవారిని శిక్షించాలి : సీపీఎం ఏలూరు (టూటౌన్): సాక్షి పత్రికా కార్యాలయంపై దాడిని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీసి, అందుకు కారణమైనవారిని, దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ ఎవరిౖపైనెనా కొన్ని పత్రికలు అవాస్తవాలు ప్రచురిస్తే వాటిని ఖండించేందుకు అనేక మార్గాలున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు దిగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సమస్య ఉంటే చట్ట ప్రకారం వెళ్ళాలేగాని, రాజ్యాంగాన్ని గౌరవించి, ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని రవి కోరారు. ఏలూరు టౌన్ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ బాధితులకు న్యాయం జరిగేలా పనిచేసే ఫోర్త్ ఎస్టేట్పై దాడులు సిగ్గుచేటని, ఇలాంటి విష సంస్కృతికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేపీకే కిషోర్, టైమ్స్ కిషోర్ అన్నారు. ఏలూరు సాక్షి జిల్లా కార్యాలయం వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం విధ్వంసానికి నిరసనగా.. ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. బుధవారం ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా ఏలూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న జర్నలిస్టులు కొద్దిసేపు దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రిక స్వేచ్ఛను హరిస్తూ పత్రికా కార్యాలయాలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని పేర్కొన్నారు. డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సాక్షి కార్యాలయంలోకి అక్రమ చొరబడి, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం ఘటనపై విచారణ చేయాలని, నిందితులను గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరారు. డీఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ మరోసారి ఏలూరులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో నిందితులపై కేసులు నమోదు చేస్తామన్నారు. మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజలకు నష్టం ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేపీకే కిషోర్, టైమ్స్ కిషోర్ మాట్లాడుతూ ... ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతారణాన్ని చెడగొట్టేలా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవటం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రిక, మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజలు నష్టపోతారని, బాధితులకు న్యాయం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఏదైనా తప్పు జరిగితే దానిపై రాజకీయ నేతలు, ప్రతినిధులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి తప్ప దాడులు చేయటం సరైన విధానం కాదన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజు, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు భరత్ మాట్లాడుతూ పత్రిక స్వేచ్చను పరిరక్షించేందుకు అధికారులు తమవంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ప్రజాప్రతినిధులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, వారే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం ఏమాత్రం సమర్ధనీయం కాదని అభిప్రాయపడ్డారు. ఏపీయూడబ్ల్యూజే పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయిబాబా, మహిళా జర్నలిస్ట్ కొమ్మిన రత్నకుమారి మాట్లాడుతూ ఏలూరులోని సాక్షి కార్యాలయంపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు సంయమనంతో వ్యవహరించాలని, ఇష్టారాజ్యంగా దౌర్జన్యాలకు పాల్పడటం మంచి విధానం కాదన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఉర్ల శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు పోతురాజు, పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, ఏపీపీజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే రియాజ్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కే.వంశీ, శ్యామ్, ఎం.రాజేష్కుమార్, కే.శ్రీనివాస్, కర్రి అప్పలరాజు, బీ.రాము, వైవీ శ్రీనివాస్, టీవీఆర్కే ప్రసాద్, ఆర్.వెంకటనాయుడు, ఏడుకొండలు, కే.వినోద్కుమార్, అమీర్ పాషా, గంజి చంటి, బీ.భరత్కుమార్, కురెళ్ళ కిషోర్, ఇబ్రహీం, ప్రసాద్రెడ్డి, ప్రసాద్, బలరాం, గాంధీ తదితరులు ఉన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా దౌర్జన్యాలు దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏలూరులో నిరసన -
విజయపథంలో విద్యావికాస్
జంగారెడ్డిగూడెం: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించినట్లు విద్యావికాస్ పాఠశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల్లో కె.రుష్మిత అత్యధికంగా 596 మార్కులు సాధించిందన్నారు. అలాగే 592 మార్కులు ఎం.జాయ్ నిస్సీ, ఎం.దేవిశ్రీ, ఎం.సంజన సాధించగా, 591 మార్కులు జి.వర్షిత, ఎన్.అక్షర, పి.దీపిక సాధించినట్లు చెప్పారు. 500కు పైబడి 150 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం పి.సతీష్చంద్, వి.శ్రీనివాస్, పి.లక్ష్మీప్రసన్న, ప్రిన్సిపాల్ వి.ప్రసన్నలక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు. -
టీం వర్క్తో పనిచేయాలి
ఏలూరు(మెట్రో): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలు సాధించడానికి అధికారులంతా టీం వర్క్తో పనిచేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ల్యాండ్ అసైన్మెంట్ ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలిసి పనిచేయడం ద్వారా సమస్యలకు మరింత సమగ్ర పరిష్కారాలు కనుగొనవచ్చన్నారు. టీం వర్క్ ద్వారా పనులు వేగంగా, సమర్ధవంతంగా పూర్తవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాను ఐదో స్ధానం నుంచి మూడో స్ధానానికి తీసుకురావాలన్నారు. ల్యాండ్ అసైన్మెంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రణాళిక బద్ధంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్ధితులు కల్పించాలన్నారు. దీపం పథకం మొదటి దశలో సబ్సిడీ అందించామని, రెండో దశలో కూడా అందించడంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు సమీక్షించాలన్నారు. హౌసింగ్ విషయంలో కూడా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలన్నారు. త్వరలో రూ.9,407 కోట్లతో తల్లికి వందనం అమలు చేయబోతున్నామన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వర్తింప చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులకు ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలన్నారు. రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా తహసీల్దార్లు తమ స్ధాయిలో స్పందిస్తే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల వరకు రావని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదును తగ్గిన కొడవలి
గణపవరం: ఒకప్పుడు వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషించిన కొడవలి క్రమంగా తన బాధ్యతలనుంచి దూరమైపోతుంది. గతంలో చేతిలో కొడవలి లేకుండా రైతు కనిపించేవాడు కాదు. ఉదయాన్నే చద్దన్నం తిని భుజాన తుండు వేసుకుని, చేతిలో కొడవలి పట్టుకుని పొలానికి పయనమయ్యేవాడు రైతు. కొడవలికి, రైతులకు అంతటి అనుబంధం ఉండేది. నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కొడవలి దాదాపు రైతుచేతికి దూరమైపోయింది. ఇక వరికోతల సమయంలో కొడవళ్లకు ఎక్కడాలేని గిరాకీ ఉండేది. వ్యవసాయంలో యాంత్రీకరణతో సంప్రదాయ వ్యవసాయ పనిముట్లు కనుమరుగైపోయాయి. వీటి బాటలోనే కొడవలి కూడా చేరింది. దశాబ్దాలుగా వరికోతలకు కొడవళ్లే ఆధారం. వరికోతలు ప్రారంభం అయ్యాయంటే రైతులు, వ్యవసాయ కూలీలు కొత్త కొడవళ్ల కోసం కమ్మరి కొలిమి వద్ద బారులు తీరేవారు. పాత కొడవళ్లకు పదును పెట్టడం, కక్కుళ్లు కోయించడం, చెక్కపిడి వేయించడం, కొత్త కొడవళ్లు కొనుగోలు చేయడంతో కొడవళ్ల తయారీదారులకు ఊపిరి సలపనంతగా చేతినిండా పని ఉండేది. ఇటీవల వరికోతలు కోయడానికి కోత యంత్రాలు రంగప్రవేశం చేయడంతో కొడవళ్లకు పనిలేకుండా పోయింది. దీనితో ఈ వృత్తినే నమ్ముకున్న వారు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారు. కొడవళ్ల తయారీ కేంద్రం ముప్పర్తిపాడు గణపవరం మండలం ముప్పర్తిపాడు గ్రామం కొడవళ్ల తయారీ కేంద్రంగా దశాబ్దాలుగా పేరొందింది. గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, ఉండి, అత్తిలి, పెంటపాడు, తణుకు తదితర మండలాలనుంచి రైతులు, కూలీలు ముప్పర్తిపాడు వచ్చి కొడవళ్లు కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. కణకణలాడే అగ్నికీలల నుంచి ఎగసిపడే అగ్గిరవ్వలు, లయబద్ధమైన సుత్తిదెబ్బల సవ్వడులు, అగ్గిరాయిమీద కొడవళ్లకు పదును పెట్టి కక్కుళ్లుకోసే ధ్వనులు ఆ గ్రామంలో సర్వసాధారణం. ఈ కొడవళ్ల తయారీపై కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉండేవి. ఈ గ్రామంతో పాటు గణపవరం, నిడమర్రు గ్రామాల్లో కూడా కొడవళ్ల తయారు చేసే కమ్మరి కొలుములు ఉండేవి. వరికోతల సీజన్ ఆరంభం అయితే రేయింబవళ్లు కొడవళ్లు తయారు చేస్తూ క్షణం తీరిక లేకుండా కమ్మరి కార్మికులు ఇప్పుడు పనిలేక గోళ్లు గిల్లుకుంటున్నారు. గణపవరం, నిడమర్రు మండలాల్లో సుమారు 150 మంది వరకూ ఈ కమ్మరి కార్ఖానాలలో పనిచేస్తూ జీవనం సాగించేవారు. వేలాదిగా కొడవళ్లు తయారు చేసి స్థానికంగా అమ్మడమే కాక, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేసేవారు. ఒక్కో కొడవలి నాణ్యతను బట్టి రూ.100 నుంచి రూ.150 వరకూ విక్రయించేవారు. పదును పెట్టడానికి, కొడవలికి పళ్లు(కక్కుళ్లు) కోయడానికి రూ.20 తీసుకునేవారు. ఇప్పుడు రోజుకు పదో, పరకో కొడవళ్లు మాత్రమే అమ్ముతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. కొలిమిలో కాలి.. పదునైన కొడవలిగా మారి కొడవలి తయారీకి ప్రత్యేకమైన ముడి ఇనుమును(లారీలకు వాడే కమానుకట్టలు) బద్దలుగా తీసుకువచ్చి కొలిమిలో బాగా కాల్చి కొడవలి ఆకారంలో మలుస్తారు. దానికి సానపట్టి పళ్లు కోసిన తర్వాత చెక్కపిడిని అమరుస్తారు. ఈవిధంగా ఒక్కో కొలిమిలో రోజుకు సుమారు 200 కొడవళ్లను తయారు చేస్తారు. నాణ్యతను బట్టి మూడు రకాలుగా కొడవళ్లు తయారు చేస్తారు. రూ.80, రూ.100, రూ.150 ధరలలో తయారుచేస్తారు. ప్రత్యేక ఇనుముతో పాటు ప్రత్యేకమైన రేకుతో కూడా కొడవళ్లు తయారు చేస్తారు. కోత యంత్రాలతో కనుమరుగవుతున్న కొడవళ్లు వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక, నూతన సాంకేతిక పద్ధతులతో సంప్రదాయ పద్ధతులు కనుమరుగవుతున్నాయి. దీనిలో భాగంగా వరికోతకు యంత్రాల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇటీవలి వరకూ పశువులమేత కోసమైనా కొందరు రైతులు కూలీలతో వరికోతలు కోయించేవారు. రానురాను కూలీలతో కోత కోయించడం మానుకుని రైతులంతా వరికోత యంత్రాలమీదనే ఆధారపడటంతో కొడవళ్లు కొనే నాధుడు కనిపించడంలేదు. ఇతర ప్రాంతాల నుంచి ముడిసరుకు కొడవళ్ల తయారీకి ఉపయోగించే బేల్ బద్దలను చైన్నె, విశాఖ, కాకినాడ, విజయవాడ పట్టణాల నుంచి కిలోల లెక్కన దిగుమతి చేసుకుంటారు. ముడిసరుకు ధరలు కూడా ఏటికేడు పెరగడంతో కొడవళ్ల తయారీ గిట్టుబాటు కావడంలేదని తయారీదారులు వాపోతున్నారు. గత ఏడాది లోడు బేల్బద్దలు రూ.50 వేలు పలుకగా ఈ ఏడాది రూ.65 వేలకు చేరిందని, ఆమేరకు కొడవళ్ల ధర పెంచితే కొనుగోలు దారులు వెనుకంజ వేస్తున్నారని వాపోతున్నారు. అలాగే కొలిమిలోకి వాడే బొగ్గు, ఊక ధరలు కూడా పెరిగిపోయాయని, పనిలోకి వచ్చేవారికి కూలీ ధరకూడా పెరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాంత్రీకరణతో కనుమరుగు ఆదరణ తగ్గుతున్న వైనం కొడవళ్ల తయారీకి ముప్పర్తిపాడు ప్రసిద్ధి ఆదరణ తగ్గుతుంది నేను 50 ఏళ్లుగా కొడవళ్లు తయారు చేస్తున్నాను. తాతలనాటి నుంచి వచ్చిన కమ్మరి వృత్తిలో ఇప్పుడు కుటుంబం గడవడమే గగనంగా ఉంది. గతంలో రోజుకు 100 వరకూ కొడవళ్లు అమ్మేవాళ్లం. దశాబ్ద కాలంగా కొడవళ్ల అమ్మకాలు బాగా పడిపోయాయి. ఇప్పుడు రోజుకు ఐదారు కొడవళ్లు కూడా అమ్ముడుపోవడం లేదు. వీటితో పాటు కత్తులు, పారలు, గునపాలు తయారు చేస్తున్నాం. రానున్న కాలంలో ఈవృత్తి బతికి బట్ట కట్టాలంటే ప్రభుత్వం కమ్మరి వృత్తిదారులకు సబ్సిడీ రుణాలు ఇచ్చి, సబ్సిడీ ధరలకు ముడిసరుకులు అందించాలి. – సత్యనారాయణ, కమ్మరి వృత్తిదారు -
సివిల్స్లో ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థినికి 11వ ర్యాంక్
నూజివీడు : రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఒంగోలు క్యాంపస్లో 2016–22 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థిని సాయి శివాని యూపీఎస్సీ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించింది. గ్రామీణ నేపథ్యాన్ని అధిగమించి దేశంలో అత్యున్నత స్థాయిలో ర్యాంకు సాధించడం ఆమె కృషికి, పట్టుదలకు, అభ్యాసన పట్ల చూపిన నిబద్ధతకు నిదర్శనం. సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో ట్రిపుల్ ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్చార్జి చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి, ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.విజయ్కుమార్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఒంగోలు డైరెక్టర్ భాస్కర్ పటేల్ ఆమెకు అభినందనలు తెలిపారు.త్రుటిలో తప్పించుకున్నాంపాలకోడేరు: వారంతా కశ్మీర్లోని పహల్గాంలో కొద్దిలో ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షానికి చెందిన సోము చైతన్య దీపక్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. చైతన్య, అతని సోదరి అరుణ, స్నేహితుడు చిన్నారావులు వారి కుటుంబాలతో కలిసి ఈ నెల 20న పహల్గాం, గుల్మార్గ్ వెళ్ళి ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే గడిపారు. సోమవారం రాత్రి అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్లిపోయారు. సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం వారు గడిపిన ప్రదేశంలోనే టూరిస్ట్లపై ఉగ్రదాడుల ఘటన తెలియడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బంధువులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి శ్రీనగర్లో రూంకే పరిమితమయ్యామని, గురువారం సాయంత్రం ఫ్లైట్కు తిరుగు ప్రయాణమవ్వాలని వారు తెలిపారు.సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లుఏలూరు(మెట్రో): సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు కావాల్సిన రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ పీవీఎస్ రవికుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి సూక్ష్మ సేద్య పథకంలో 8,500 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేస్తుందని, జిల్లాలో ఈ పథకం కింద 2003 నుంచి నేటి వరకు 1,15,329 హెక్టార్లకు సంబంధించి 93,003 మంది రైతులు లబ్ధి పొందారన్నారు. ప్రస్తుతం ఈ పథకం అమలుకు 84,810 హెక్టార్లు అందుబాటులో ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులకు (5 ఎకరాల వరకు) 100 శాతం సబ్సిడీ, ఇతర చిన్న, సన్నకారు రైతులకు (5 ఎకరాలకు మించకుండా) 90 శాతం రాయితీ పొందవచ్చు. మధ్య తరహా రైతులకు 70 శాతం రాయితీ, పెద్ద రైతులకు 50 శాతం రాయితీ పొందవచ్చును.పాలిసెట్కు ఏర్పాట్లు డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లుభీమవరం: పాలీసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వీఆర్వో పాలిశెట్టి–2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కో ఆర్డినేటర్లు, అసిస్టెంట్ కో ఆర్డినేటర్లు, సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ఏప్రిల్ 30న జరగనున్న పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 18 సెంటర్ల పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయగా వీటిలో భీమవరంలో 4, తాడేపల్లిగూడెంలో 2, తణుకులో 8, నరసాపురంలో 4 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. మొత్తం 7,254 మంది విద్యార్థులు పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30న ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. పరీక్షా కేంద్రాలు దగ్గరలో జిరాక్స్ షాపులు మూసివేయాలని, పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. సమావేశంలో జిల్లా ఖజానా అధికారి ఏ గణేష్, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సన్యాసిరావు, జిల్లా కోఆర్డినేటర్ డి.ఫణీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: క్షేత్రంలో శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మే 7 నుంచి 14 వరకు జరగనున్న చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా 11న రాత్రి స్వామివారి కల్యాణం, 12న రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఆలయ పరిసరాలను, దర్శనం క్యూలైన్లను రంగులతో ముస్తాబు చేసేందుకు, అలాగే స్వామివారి పాదుకా మండప ప్రాంతంలో, ఆలయ ధ్వజస్తంభం వద్ద తాటాకు పందిళ్లు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం గుడి సెంటర్లోని ప్రధాన కూడలిలో 40 అడుగుల శ్రీవారి భారీ విద్యుత్ కటౌట్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయ గోపురాలకు, పరిసరాలకు విద్యుద్దీప తోరణాలను అమర్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు. మే 7 నుంచి ఉత్సవాలు ప్రారంభం 11న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం, 12న రథోత్సవం -
అమ్మోనియా గ్యాస్ లీక్.. ఐదుగురికి అస్వస్థత
పాలకోడేరు: పాలకోడేరు మండలంలోని మోగల్లు గ్రామంలోని వశిష్ట ఆక్వా మైరెన్ పరిశ్రమలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో అమ్మోనియా గ్యాస్ లీకై ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కార్మికుల కథనం ప్రకారం.. ఫీజర్ కూలింగ్ కోసం పైపు లైన్ ద్వారా అమ్మోనియా గ్యాస్ పంపుతుండగా హఠాత్తుగా పైపు పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. దీంతో కొందరు కింద పడి గాయాలపాలుకాగా మరికొందరు గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో బిటిక గీతకు (ఒడిశా రాష్ట్రం రాయగడ), కౌసల్య ఒడిశా (కరిది), శ్యామ్ (రాయగడ)కు గాయాలు కాగా సునమ్ (రాయగడ), బి రాణి అమ్మోనియా గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యం భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇందులో ఇద్దరు కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రశ్నార్థకంగా రక్షణ చర్యలు ఆక్వా పరిశ్రమల్లో రక్షణ చర్యలు ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి బాల కార్మికులు కూడా ఇక్కడ ఆక్వా పరిశ్రమల్లో పనులు చేస్తుండడం ఆందోళన కలిగించే విషయం. దీనిపై కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఏ రాణి స్పందిస్తూ బాధితుల్లో, కార్మికుల్లో మైనర్లు ఉంటే శాఖ పరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా మైరెన్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవివర్మ తెలిపారు. -
సత్తా చాటిన మానస విద్యార్థులు
భీమడోలు: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భీమడోలు మానస ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని ప్రిన్సిపాల్ యలమర్తి రవీంద్రకుమార్ తెలిపారు. విద్యార్థులు అత్యధికంగా రామిశెట్టి నాగ మణికంఠ 592 మార్కులు, జే.రేవంత్ 590, బండారు యశస్విని 586, రంకిరెడ్డి యోగేష్శ్రీ 582, బొమ్ము నాగలక్ష్మీకుమార్ 581, మేడపాటి దివ్య 579, పెరీం మానస 579 మార్కులు సాధించినట్లు చెప్పారు. మొత్తం 139 మంది పరీక్షలకు హాజరు కాగా 138 మంది ఉత్తీర్ణులయ్యారని, వీరిలో 38 మందికి 550 మార్కులకు పైగా సాధించారని, 84 మంది 500కు పైగా సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి రామిశెట్టి నాగ మణికంఠ, వారి తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం దుశ్శాలువాతో సత్కరించింది. రూ.10వేల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. -
పార్శిల్ సర్వీస్ సెంటర్ల తనిఖీ
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో విజిలెన్సు, జీఎస్టీ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా పట్టణంలోని పార్శిల్ సర్వీసు కార్యాలయాలు ఎస్ఆర్ఎంటీ, నవత, సింధు పార్శిల్ సర్వీస్లను బుధవారం తనిఖీ చేశారు. జగదీశ్వర్రావుకు చెందిన రూ.1,88,800 విలువ కలిగిన 116 లీటర్లు నిషేధిత గ్లైఫోసైట్, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన డైక్టోరావోస్ పురుగు మందులు ఎటువంటి లైసెన్స్, బిల్లులు లేకుండా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎసై కె.సీతారాము, జీఎస్టీ అధికారి బి.దానేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి ఆర్ఎస్.ప్రసాద్ తెలిపారు. ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్గా రాజ్కుమార్ రాజమహేంద్రవరం సిటీ: ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్గా కత్తుల రాజ్కుమార్ బుధవారం రాజమహేంద్రవరంలోని జోనల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కరీంనగర్ జోన్ నుంచి పదోన్నతిపై ఇక్కడకు బదిలీపై వచ్చారు. రాజమహేంద్రవరం జోన్ పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటి వరకు జోనల్ కార్యాలయం పరిధిలో రూ.10,037 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపారు. తప్పిపోయిన బాలిక అప్పగింత గంటల వ్యవధిలో ఆచూకీ కనుగొన్న పోలీసులు భీమవరం: సాంకేతిక పరిజ్ఞనాన్ని వినియోగించి గంటల వ్యవధిలో మైనర్ బాలిక మిస్సింగ్ కేసును ఛేదించినట్లు భీమవరం టూటౌన్ సీఐ జి కాళీచరణ్ బుధవారం చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన 8వ తరగతి విద్యార్థి బాలిక (14 ఏళ్లు) ఈనెల 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు కన్పించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టపక్కల, సమీప బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆ రోజు రాత్రి 11 గంటలకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సదరు బాలిక ఆచూకీ కోసం ముందుగా జిల్లా వ్యాప్తంగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి డాగ్ స్క్వాడ్, డ్రోన్స్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. అనంతరం చుట్టుప్రక్కల ప్రదేశాల్లోని సీసీ టీవీ కెమేరాల ఫుటేజ్ పరిశీలించి, సదరు బాలిక పూరీ – తిరుపతి ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్నట్లు గ్రహించి తుని, అనకాపల్లి, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలోని జీఆర్పీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. బుధవారం విశాఖపట్టణం రైల్వే స్టేషన్న్లో బాలికను విశాఖ రైల్వే పోలీసులు గుర్తించి భీమవరం టూటౌన్ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికెళ్లి బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ కాళీచరణ్ చెప్పారు. వ్యక్తి ఆత్మహత్య ఉంగుటూరు: యర్రమళ్ల గ్రామంలో ఓ వ్యక్తి ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానుకొండ బాబూరావు (50), అతని భార్య పదేళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి బాబూరావు ఇంటి సమీపంలోని చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. బాబూరావు మృతదేహానికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బుధవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. -
ధాన్యం సేకరణకు అన్ని చర్యలు చేపట్టాం
భీమడోలు: ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి అన్నారు. గుండుగొలనులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయాధికారి హబీబ్ బాషాతో కలిసి ఆమె సందర్శించారు. ధాన్యం కేంద్రంలోని గోనె సంచుల వివరాలు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన లక్ష్యాలను వ్యవసాయ శాఖ సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి సమస్యలు ఆరా తీశారు. లారీలో దిగుమతవుతున్న గోనె సంచుల నాణ్యతను పరిశీలించారు. రైతులు సైతం చిల్లులు లేని సంచులు రావడంతో సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల లక్ష్యాలు పూర్తి కాగానే వెంటనే టార్గెట్లను నిర్ణయించి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామన్నామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసకుంటుందన్నారు. ఆపోహాలు తావివ్వవద్దని సూచించారు. ఏడీఏ డాక్టర్ పి.రాజకుమారి, ఏవో ఎస్పీవీ ఉషారాణి, మాజీ ఎంపీపీ కొండబాబు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని మోదేలు గ్రామంలో నివసిస్తున్న 30 కుటుంబాల కొండరెడ్డి గిరిజనులు ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని కోరుతూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బుధవారం పీఆర్గూడెంలో పర్యటిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతిపత్రం అందజేశారు. ఆ పార్టీ నాయకులు కారం రాఘవ మాట్లాడుతూ మోదేలు గ్రామానికి రహదారి నిర్మాణానికి, కరెంట్ సదుపాయానికి నిధులు మంజురైనప్పటికీ ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాల మేరకు నిలిచిపోయాయని తెలిపారు. అలాగే ప్రధాన మంత్రి యోజన పథకంలో 27 ఇళ్లు మంజూరయ్యాయని అవి కూడా ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలతో నిలిచిపోయాయని తెలిపారు. పీడీఎస్యూ నాయకులు ఈ. భూషణం, బి. వినోద్ పాల్గొన్నారు. హస్తకళలను పరిశీలించిన మంత్రి బుట్టాయగూడెం మండలంలో రెండో రోజు పర్యటించిన జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం పులిరామన్నగూడెంను సందర్శించారు. గ్రామంలోని వెదురు హస్తకళా తయారీ కేంద్రాన్ని సందర్శించి గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. కేఆర్పురం ఐటీడీఏ వద్ద నూతన అంబులెన్స్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు. మంత్రి నాదెండ్లకు న్యూడెమోక్రసీ నాయకుల వినతి -
మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏలూరు సాక్షి కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. పత్రికలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉంటే వివరణ ఇచ్చి సవరణ కోరాలని.. ఇలా దాడి చేయడం ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు అని జిల్లా కమిటీ సభ్యులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్య వాదులు, మీడియా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను ఆకాంక్షించే వారంతా ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీఎస్ సాయిబాబా, గజపతి ప్రసాద్ కోరారు. ప్రజాస్వామ్యానికి మచ్చ చింతలపూడి: పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటూ దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ఇలాంటి సంఘటనలు చెడు సంప్రదాయానికి బీజం వేస్తాయని ఏపీయుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అజాద్ అన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, జర్నలిస్టులు ఇలాంటి సంఘటనలపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. -
కలగానే ఫిషింగ్ హార్బర్
● కూటమి సర్కారు రాకతో అటకెక్కిన పనులు ● రూ.429.43 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ ● గత 9 నెలల్లో ఒక్క అడుగూ ముందుకు పడని వైనం నరసాపురం: నరసాపురంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కలగానే మిగిలిపోనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో జిల్లాకు మంజూరు చేసిన ఈ భారీ ప్రాజెక్టు గత 9 నెలలుగా పడకేసింది. ఎన్నికలకు ముందు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి, పనులు ప్రారంభమవుతాయనుకున్న సమయంలో.. నేడు హార్బర్ నిర్మాణం ఇక లేనట్టే అన్న చందంగా మారిపోయింది. గోదావరి జిల్లాలకు మణిహారంగా నరసాపురంలో మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో ఈ హార్బర్ నిర్మాణానికి 2022 మే నెలలో ఏపీ మారిటైం బోర్డు టెండర్లు పిలవగా, విశ్వసముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్ట్కు పర్యావరణ అనుమతులతో పాటు ఇతర సాంకేతిక అనుమతులు వచ్చాయి. టెండర్లు పిలవడంతో విశ్వ సముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. రూ.429.43 కోట్లతో నిర్మించే హార్బర్కు సంబంధించిన ప్రాథమిక పనులు 2023, ఫిబ్రవరిలో ప్రారంభించారు. మత్స్య ఎగుమతులు పెంచే లక్ష్యంతో.. తీరప్రాంతంలో సముద్ర మత్స్య సంపదతో భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువచేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. కానీ హార్బర్ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి పూనుకుంది. బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ను 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల భారీ వ్యయంతో నిర్మించతలపెట్టి పనులు మొదలుపెట్టారు. అయితే కూటమి సర్కార్ ప్రాజెక్ట్ను పూర్తిగా అటకెక్కించింది. హార్బర్ నిర్మాణం పూర్తి చేయించాలి బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని దశాబ్దాలుగా మత్స్యకా రులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం చేశారు. టెండర్లు పిలిచి, పనులు విశ్వసముద్ర సంస్థకు అప్పగించాం. పనులు ప్రాథమికంగా ప్రారంభమయ్యాయి. నిర్మాణం చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది. నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కూటమి సర్కారు రాకతో సీన్ రివర్స్ కూటమి సర్కారు వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టు అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత వైఎస్సార్సీపీ హయాంలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం, ప్రాథమికంగా పనులు ప్రారంభం కావడం జరిగింది. కూటమి సర్కారు గద్దెనెక్కిన తరువాత పనులు చేపట్టడంలో విశ్వసముద్ర సంస్థ వెనకడుగు వేసినట్టు సమాచారం. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఓ ప్రకటన కూడా చేయలేదు. దీంతో అసలు హార్బర్ సాకారమవుతుందా? లేదా? అనే సందేహం వ్యక్తమవుతోంది. 19 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. -
సామాజిక న్యాయం కోసం అవిశ్రాంత పోరు
ఏలూరు (టూటౌన్): రోమన్ క్యాథలిక్ అత్యున్నత మతగురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఏలూరు మేత్రాసన పీఠాధిపతి పొలిమేర జయరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. మంగళవారం బిషప్ హౌస్లో పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. పోప్ ఫ్రాన్సిస్ అందించిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోప్ ఫ్రాన్సిస్ అవిశ్రాంతంగా పోరాటం చేశారని కొనియాడారు. ప్రొక్యురేటర్ ఫాదర్ బి.రాజు, మైకేల్ చర్చ్ ఫాదర్ దిరిసిన ఆరోన్, ఏలూరు వికార్ జనరల్ ఫాదర్ పి.బాల, అమలోద్భవి కెథడ్రల్ చర్చి విచారణ గురువు ఫాదర్ ఐ.మైఖేల్ పాల్గొన్నారు. -
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య
మే 15 వరకు అవకాశం ఈ నెల 28 నుంచి మే 15 లోగా దరఖాస్తు చేసుకో వాలి. విద్యార్థులను లాటరీ ద్వారా పారదర్శ కంగా ఎంపిక చేస్తాం. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థల వద్ద ఫీజులు వసూలు చేసే స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం. – పి శ్యామ్సుందర్, జిల్లా సమగ్రశిక్షా అదనపుప్రాజెక్టు కోఆర్డినేటర్, భీమవరం భీమవరం: ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చదివించాలనే పేదల కోరిక నెరవేర్చేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానిని కొనసాగింపుగా ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరడానికి ఈనెల 28వ నుంచి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించారు. జిల్లాలో 2023లో 1,162 మంది విద్యార్థలు ప్రైవేటు స్కూళ్లలో సీట్లు దక్కించుకోగా 2024లో 1,163 మంది విద్యా ర్థులు అడ్మిషన్లు పొందారు. తల్లికి వందనం పథకంలో అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ అమలుచేయకపోవడంతో ఇప్పుడు పేదలు ఫీజుల భారం తగ్గించుకోడానికి ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యనైనా పొందాలని ఎదురుచూస్తున్నారు. ఒకటో తరగతిలో ప్రైవేటు స్కూల్స్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. గతంలో ఉన్నత వర్గాలకు మాత్రమే ప్రైవేటు, కార్పోరేట్ స్కూళ్లలో చదువుకునే పరిస్థితి ఉండగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరే విద్యార్థలకు ఖర్చులేకుండా చదువుకునే అవకాశం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 705 ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకుగాను ఒకటో తరగతిలో 25 శాతం పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. ముందుగా ఆయా స్కూల్స్ ఉచిత విద్యకు రిజిస్ట్రర్ చేయించుకోవాలి. రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను ఆడ పిల్లలు, హెచ్ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం సీట్లు, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 6 శాతం ఇవ్వాల్సి ఉంది. 5 ఏళ్లు నిండిన వారికి ఒకటో తరగతిలో ప్రవేశం ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తుకు అవకాశం -
మొదటి అదనపు సివిల్ జడ్జిగా లలితాదేవి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం మొదటి అదనపు సివిల్ జడ్జిగా కె.లలితాదేవి నియమితులయ్యారు. విశాఖ 7వ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ (స్పెషల్ మొబైల్ కోర్టు) నుంచి బదిలీపై వస్తున్నారు. పట్టణంలో మొదటి అదనపు సివిల్ జడ్జిగా ఉన్న డి.అరుంధతి గుడివాడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయ్యారు. పంట పొలాల్లో మైనింగ్ వద్దు ఆగిరిపల్లి: పంట పొలాల్లో మైనింగ్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనసానపల్లిలో కర్రగట్టు వద్ద 2.40 ఎకరాల అసైన్డ్ భూమిని గుంటూరుకు చెందిన వ్యక్తి కొనుగోలు చేశాడు. వ్యవసాయానికి కొను గోలు చేసిన భూమిలో క్వారీ ఏర్పాటుకు ప్రయ త్నాలు ముమ్మరం చేశారు. దీంతో గ్రామంలోని రైతులు, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల మధ్య క్వారీకి అనుమతిస్తే పర్యావరణంతో పాటు, వ్యవసాయం కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ని కలిసి గోడు వెళ్ళబోసుకున్నారు. రెండు రోజుల నుంచి మైనింగ్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిశీలన బుట్టాయగూడెం: జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఏజెన్సీలో పర్యటించారు. ఈ సందర్భంగా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలు సందర్శించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చిన నాదెండ్లకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి కూడా గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె.వెట్రి సెల్వి, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, ఆర్డీఓ ఎన్వి.రమణ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్టం సారాంశం వివరిస్తూ కరపత్రం ఏలూరు (టూటౌన్): దశాబ్దాలుగా పేద ముస్లింలు, ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికి వక్ఫ్ చట్టాన్ని ప్రధాని మోదీ తీసుకొచ్చారని.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విక్రమ్ కిషోర్ అన్నారు. స్థానిక అశోక్ నగర్ బీజేపీ కార్యాలయంలో వక్ఫ్ చట్టం (సవరణ )2025 సారాంశం వివరణ కరపత్రాన్ని మంగళవారం విడుదల చేశారు. ఈ చట్టంపై అన్ని వర్గాల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగించటానికి జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందన్నారు. వేతన బకాయిలు చెల్లించాలి భీమవరం: ఉపాధి హామీ కూలీల వేతన బకా యిలు తక్షణం విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు హెచ్చరించారు. భీమవరంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉపాధి హామీ కూలీల సమస్యలపై ధర్నా నిర్వహించారు. గోనె సంచుల కొరతపై ఫిర్యాదు ఉండి: ధాన్యం అమ్మకంలో గోనె సంచుల కొరత ఉందని, రైతులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం ఉండి మండలం యండగండి రైతు సేవా కేంద్రాన్ని జేసీ పరిశీలించారు. ధాన్యం అమ్మకానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని.. అయితే గోనె సంచుల కొరత ఉందని రైతులు చెప్పారు. దీనిపై స్పందించిన జేసీ రైసుమిల్లర్లతో నేరుగా మాట్లాడి రైతులకు 20 వేల గోనె సంచులు వెంటనే అందుబాటులో ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రైతులతో కలసి తేమశాతం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు అధికారులు సహకరించకపోతే తెలియచేయాలని సూచించారు. మిల్లుకు ధాన్యం తోలిన 48 గంటల వ్యవధిలోనే రైతు ఖాతాలో నగదు జమచేస్తామన్నారు. గోనె సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు. -
పెట్టుబడి సాయానికి ఎగనామం
సాక్షి, భీమవరం: కూటమి ప్రభుత్వంలో వ్యవసాయా నికి పెద్దపీట వేస్తామన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. సాగు పెట్టుబడుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామన్నారు. పాలన చేపట్టడమే ఆలస్యం.. ఏటా రూ.20,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామంటూ కూటమి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఊదరగొట్టారు. కూటమి పాలన చేపట్టి అప్పుడే 11 నెలలు కావస్తోంది. 2024–25 సీజన్కు పీఎం కిసాన్ సాయాన్ని కేంద్రం ఎప్పుడో రైతుల ఖాతాలకు జమ చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం ‘అన్నదాత సుఖీభవ’ అమలు ఊసేత్తడం లేదు. ఈ సీజన్లో రూ.20 వేల చొప్పున అందాల్సిన సాయాన్ని నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలోని 2.10 లక్షల ఎకరాల్లో ఖరీఫ్, 2.3 లక్షల ఎకరాల్లో రబీ సాగవుతున్నాయి. 2024–25 వ్యవసాయ సీజన్లో రైతులకు కలిసి రాలేదు. భారీ వర్షాలు, వరదల రూపంలో సాగు ప్రారంభంలోనే 38 వేల ఎకరాల్లోని పంట దెబ్బతిని రెండోసారి నాట్లు వేయాల్సి వచ్చింది. చివర్లో ఫెంగల్ తుఫాన్ కంటి మీద కునుకు లేకుండా చేసింది. తేమ శాతం పేరిట దళారులు, మిల్లర్లు బస్తాకు రూ.300 వరకు కోతపెట్టి రైతుల కష్టాన్ని దోచుకున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా 30 బస్తాల లోపే వచ్చింది. పెట్టుబడులు పెట్టేందుకు డబ్బుల్లేక రబీ సాగు ఆలస్యమైంది. ఎరువుల ధరలు బస్తాకు రూ. 50 నుంచి రూ. 230 వరకు పెరగడంతో ఎకరాకు రూ. 500 వరకు అదనపు భారం పడింది. ప్రతికూల వాతావరణంతో పంటకు తెగుళ్ల బెడద ఎక్కువై సాగు పెట్టుబడులు పెరిగిపోయాయి. సీజన్ ముగుస్తున్నా.. సుఖీభవ సాయం లేదు ప్రస్తుతం జిల్లా అంతటా రబీ మాసూళ్లు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ రైతులు కోతలు, ధాన్యం ఆరబెట్టుకోవడం, పట్టుబడుల్లో నిమగ్నమయ్యారు. మరో రెండు మూడు వారాల్లో రబీ తుది దశ పనులు పూర్తి కానుండగా అన్నదాత సుఖీభవ సాయం విడుదలపై పాలకులు నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వం చేసిన దగాతో ఈ ఏడాది ఒక్కో రైతు రూ. 20 వేలు చొప్పున జిల్లాలోని దాదాపు 1,17,999 రైతులు రూ.235.99 కోట్లు నష్టపోతున్నట్టు అంచనా. పంటల బీమాకు ఎసరు అన్నదాత సుఖీభవ సాయం అందించకపోగా ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ఎసరుపెట్టింది. ఎకరాకు రూ.615 చొప్పున రబీ నుంచి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలోని 2.3 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరగగా.. ప్రీమియం రూపంలో జిల్లా రైతులపై రూ.14.15 కోట్ల భారం పడింది. గత ఐదేళ్లలో దాదాపు రూ.140 కోట్ల ప్రీమియం సొమ్మును రైతుల తరఫున వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించడం గమనార్హం. అన్నదాత సుఖీభవ ఊసెత్తని కూటమి ఈ సీజన్లో రూ.235.99 కోట్ల సాయాన్ని నష్టపోయిన రైతులు ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో రైతుపై రూ.14 కోట్ల భారం వైఎస్సార్సీపీ హయాంలో రైతులకు రూ.796.49 కోట్ల సాయం గత ప్రభుత్వంలో అందించిన రైతు భరోసా సాయం సంవత్సరం రైతులు ప్రభుత్వం సాయం (రూ.కోట్లలో) 2019–20 1,09,302 147.56 2020–21 1,24,664 168.3 2021–22 1,17,791 159.02 2022–23 1,13,597 153.36 2023–24 1,24,645 168.17 గతంలో సాగుకు ముందే సాయం వైఎస్సార్ రైతు భరోసాగా గత ప్రభుత్వంలో సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించేవారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సాయం రూ.6000కు రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 జతచేసి ఏటా రూ. 13,500 మొత్తాన్ని ఖరీఫ్ ప్రారంభం, కోతలు, రబీ ప్రారంభంలో మూడు విడతలుగా అందించేవారు. తొలి విడతగా మే నెలలో రూ.7500, ఖరీఫ్ చివరిలో రెండో విడతగా రూ.4000, రబీ ప్రారంభ సమయంలో మూడో విడతగా రూ.2,000 సాయం అందించేవారు. గత ఐదేళ్లలో 1,17,999 మంది రైతులకు రూ.796.49 కోట్లు సాయం అందించారు. -
దళారులను ఆశ్రయిస్తున్నాం
నేను మూడెకరాలు కౌలుకు చేస్తున్నాను. రైతులకు అందిస్తామన్న పెట్టుబడి సాయం ఇంతవరకు ఇవ్వలేదు. పెట్టుబడుల నిమిత్తం దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి పూర్తి అగమ్యగోచరంగా తయారైంది. – తామరపల్లి ముసలయ్య, కౌలు రైతు, పద్దిరెడ్డిపాలెం ఒక్క రూపాయి కూడా సాయం లేదు ఎకరం సొంత భూమితోపాటు 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా సాయం అందించేవారు. ఏడాది కాలంగా ఒక్క రూపాయి అందలేదు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. – కోరుకొల్లు వెంకట్రావు, రైతు, కంచుమర్రు ఏడాది గడిచినా సాయం ఊసే లేదు అన్నదాత సుఖీభవగా ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది కావస్తోంది. ఇంతవరకు సాయం ఊసు ఎత్తడం లేదు. చిన్న, సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నాం. – గుంటపల్లి వెంకన్న, రైతు, గరగపర్రు ● -
రెచ్చిపోయిన చింతమనేని
ఈవీల చోరీ ముఠా అరెస్టు ఎలక్ట్రిక్ స్కూటర్లు చోరీ చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి విజయవాడ పోలీసులు 22 ఎలక్ట్రిక్ స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. 8లో uఏలూరు టౌన్: ఏలూరు ఎన్ఆర్ పేటలోని సాక్షి జిల్లా కార్యాలయం వద్ద చింతమనేని ప్రభాకర్ తో పాటు అతని అనుచరులు మంగళవారం మధ్యాహ్నం హల్చల్ చేస్తూ గందరగోళం సృష్టిం చారు. వంద మందికిపైగా టీడీపీ నేతలు, కార్య కర్తలతో హంగామా సృష్టించారు. సాక్షి కార్యాలయంలో కంప్యూటర్లు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ డీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు కోటేశ్వరరావు, అశోక్ కుమార్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, పలువురు ఎస్సైలు, ఏఆర్ పోలీస్ సిబ్బంది సాక్షి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీస్ సిబ్బంది రోప్ తీసుకువస్తుండగా ఎందుకు తీసుకువస్తున్నారని టీడీపీ కార్యకర్త ప్రశ్నించాడు. నీకెందుకని స్పెషల్ పార్టీ సిబ్బంది చెప్పి పక్కకు నెట్టడంతో టీడీపీ కార్యకర్త స్పెషల్ పార్టీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. వాస్తవం జీర్ణించుకోలేకే దాడి: బాలరాజు బుట్టాయగూడెం: ఏలూరు సాక్షి జిల్లా కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తన అనుచరులు దాడిని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు రాసే పత్రికలపై అక్కసుతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు వైఎస్సార్సీపీ నాయకులపైన, వాస్తవాలు రాసే పత్రికలపైన కూటమి నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. -
ఉండిలో రాక్షస రారాజు పాలన
సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ పాలకోడేరు: ఉండి నియోజకవర్గంలో ఈ ఆరు నెలల కాలంలో రాక్షస రారాజు పాలన సాగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ విమర్శించారు. నియోజకవర్గంలో వందలాది పేదల ఇళ్లు తొలగించారని మండిపడ్డారు. ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్లో మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ కూలగొట్టిన పేదల ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ ఇకపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆటలు సాగనివ్వబోమని, ట్రిపుల్ ఆర్ అంటే రాక్షస రారాజు అని అర్థమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన పీ–4 ఉండి నియోజకవర్గంలో రివర్స్లో ఉందని విమర్శించారు. సంపన్నుల సహకారంతో పేదలను అభివృద్ధి చేయాలని చెబుతుంటే, ఇక్కడ మాత్రం పేదలను కొట్టి సంపన్నులకు ఆస్తులను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కల్చరల్ ప్రోగ్రాంలో వేసిన దుర్యోధన పాత్రని ఎమ్మెల్యే నియోజకవర్గంలో అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భూములు పంచకుంటే భూ పోరాటానికి సిద్ధం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని, లేని పక్షంలో భూ పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. పేదల గుడిసెలు మాత్రమే అధికారులకు, ఎమ్మెల్యేకు కనిపించాయా? భూస్వాముల చేతుల్లో ఉన్న వందలాది ఎకరాలు కనబడవా? అని ప్రశ్నించారు. భూస్వామ్య భావజాలంతో రఘు రామకృష్ణరాజు అహంకార పాలన చేస్తున్నాడని, ఇందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఎం సీనియర్ నేత మంతెన సీతారాం, కార్యదర్శివర్గ సభ్యుడు బి.వాసుదేవరావు, కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, దూసి కళ్యాణి, మామిడి శెట్టి రామాంజనేయులు, కె.క్రాంతి బాబు, ధనికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
ఏలూరు (టూటౌన్): పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లింలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏలూరు అంజుమన్ మోహాఫీజువల్ ఇస్లాం సంస్థ హాల్లో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ సలహాదారుడు మాజీ మండలి చైర్మన్ ఎండీ షరీఫ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ నల్ల చట్టం అని అది ముస్లింల మనోభావాలను దేశవ్యాప్తంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మీ పార్టీకు చెందిన ముస్లిం, మైనారిటీ నాయకులు రాజీనామా చేస్తున్నారా? అనే విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజీనామాలు చేయడంలో ప్రయోజనం ఉండదని పార్టీలో ఉండే తమ హక్కులు సాధించుకుంటామని అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి 41 మంది ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్తున్నారని తెలిపారు. వీళ్ళకి గతంలో ఏలూరులో వ్యాక్సినేషన్ సౌకర్యం ఉండేది కాదని యునైటెడ్ ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి హజ్ సర్వీసె సొసైటీ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం పెట్టడం అభినందనీయమన్నారు. హజ్ యాత్రకు వెళుతున్న వారికి లక్ష రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తున్నామన్నారు. తొలుత అంజుమాన్ సంస్థ అధ్యక్షుడు జబివుల్లా కమిటీ, సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు షేక్ నసిరుద్దీన్ కమిటీ నాయకులు ఎండీ షరీఫ్ను సన్మానించారు. కార్యక్రమంలో హజ్ సర్వీసెస్ సొసైటీ ఎస్కే నాగూర్ జానీ, జనరల్ సెక్రెటరీ ఎండీ ఖాలిద్ అహ్మద్, జాయింట్ సెక్రెటరీ ఎండీ హుస్సేన్ షరీఫ్, ట్రెజరర్ ఎస్.కె జావీర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్టు
మధురానగర్ (విజయవాడసెంట్రల్): ఎలక్ట్రిక్ స్కూటర్లను చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద 22 ఎలక్ట్రిక్ స్కూటర్లను స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ ఏసీపీ కె.దామోదర్ తెలిపారు. స్థానిక మాచవరం పోలీస్స్టేషన్లో ఆయన మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎస్కే బాషా (35), ఉండికి చెందిన జక్కంశెట్టి దుర్గాప్రసాద్ (26), విజయవాడ వాంబేకాలనీకు చెందిన సయ్యద్ యూసఫ్ (28) స్నేహితులు. కారు డ్రైవర్గా పనిచేసే బాషా వచ్చే ఆదాయం సరిపోక ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేరింగ్ నేర్చుకుని మెకానిక్ షాపు పెట్టుకున్నాడు. అందులోనూ ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో తాను నేర్చుకున్న విద్యను ఉపయోగించి ఎలక్ట్రిక్ స్కూటర్లను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. తన స్నేహితులైన దుర్గాప్రసాద్, యూసఫ్తో కలిసి చోరీలు ప్రారంభించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కై కలూరు, తాడేపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో 22 వాహనాలను చోరీ చేశారు. మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ స్కూటర్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. స్పందించిన పోలీసులు మాచవరం ఇన్స్పెక్టర్ సీహెచ్ ప్రకాష్ తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎలక్ట్రికల్ స్కూటర్ల చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నెల 21న మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు ఈవీ స్కూటర్లపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో వారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల చోరీల విషయం బయటపడింది. వారు దొంగిలించిన 22 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం ఇన్స్పెక్టర్ సీహెచ్ ప్రకాష్, ఎస్సై ఏవీ శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు. -
నివేదిక అందించాలని డిప్యూటీ డైరెక్టర్ ఆదేశం
దెందులూరు: కొంప ముంచిన నకిలీ మొక్కలు శీర్షికతో సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. చల్ల చింతలపూడిలో కమ్మ బ్రహ్మాజీ అనే రైతుకు ఇచ్చిన పామాయిల్ మొక్కల్లో బెరుకు మొక్కలు రావడంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయాడు. ఈ మేరకు దెందులూరు నియోజకవర్గ హార్టికల్చర్ అధికారి, సైంటిస్టులు పామాయిల్ కంపెనీ ప్రతినిధులను వెంటనే బాధిత రైతు గ్రామానికి వెళ్లి పామాయిల్ బెరుకు మొక్కలను పరిశీలించి తనకు నివేదిక అందజేయాలని హార్టికల్చర్ ఏలూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహనరావు ఆదేశించారు. నేడు ఏలూరులో మాదిగ సంక్షేమ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పర్యటన ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి బుధవారం ఏలూరు జిల్లాలో పర్యటిస్తారని, ఎస్సీ సొసైటీ కార్యనిర్వాహక సంచాలకుడు ఎం.ముక్కంటి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11.30కు కలెక్టరేట్ కాంపౌండ్లో మీడియా సమావేశం నిర్వహిస్తారని స్పష్టం చేశారు. -
లోయలోకి దూసుకెళ్లిన కారు
వైఎస్సార్సీపీ నాయకుడు నాగరాజు మృతి బుట్టాయగూడెం: మండలంలోని బూరుగువాడకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుంజా నాగరాజు(45) మంగళవారం కారు ప్రమాదంలో మృతి చెందాడు. పులిరాముడుగూడెం నుంచి రవ్వారిగూడెం మీదుగా అడ్డదారిలో కామయ్యకుంట వెళ్తున్న సమయంలో నాగరాజు డ్రైవింగ్ చేస్తున్న కారు లోయలోకి దూసుకువెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ సమయంలో స్టీరింగ్ నాగరాజు శరీరానికి గుద్దుకోవడంతో మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు యు.ఏసుబాబు, రవ్వారిగూడెం గ్రామస్తులు, బంధువులు నాగరాజు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా నాగరాజు మృతిపై మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలిపారు. -
మండుతున్న ఎండలతో జనం బెంబేలు
ఎండలను తట్టుకోలేక నెత్తిన ముసుగులేసుకుని పనుల నుంచి వస్తున్న ఉపాధి కూలీలు చింతలపూడి: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలు ఇప్పుడే ఇంత తీవ్రంగా ఉంటే రోహిణీ కార్తె ప్రారంభమైతే ఇంకెంత దారుణంగా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మండే ఎండల నుంచి ఎలా కాపాడుకోవాలా అని ఆందోళన చెందుతున్నారు. పిల్లలను కోచింగ్లకు పంపాలన్నా, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలంటే దడ, ఎక్కడ ఎండ దెబ్బకు బలైపోతామోనని భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ళల్లో నుండి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ తాకిడికి తట్టుకోలేక పోతున్నారు.ఈ పరిస్థితుల్లో ఎండలు, వడగాడ్పులు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రసూల్ సూచించారు. ఆ సూచనలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం ఎండల వల్ల వచ్చే వ్యాధులు ● వేసవి నేపథ్యంలో బ్యాక్టీరియా ఎఫెక్ట్ వల్ల పెద్ద వారిలో సెగ్గెడ్డలు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి డాక్టర్ సలహాతో నోటితో తీసుకునే యాంటీబయోటిక్ మందులు వాడాలి. ● ఎండలకు జుట్టుపై ఉండే క్యూటికల్ పొర దెబ్బతిని జుట్టు సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. వేసవిలో ఎక్కువగా మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. వేసవిలో వాడాల్సిన దుస్తులు ● ఎండాకాలంలో వదులుగా ఉండే దుస్తులు వాడాలి. చెమటను పీల్చుకునే కాటన్ దుస్తులు వాడాలి. ● టైట్ జీన్స్ ఫ్యాంట్లు వాడకూడదు. ● తెల్లని దుస్తులు వాడితే మంచిది. నల్లని దుస్తులు వాడకుండా ఉంటే ఉత్తమం. ● చిన్నపిల్లలకు ఎక్కువగా వదులుగా ఉండే దుస్తులు వాడాలి. ● రంధ్రాలు ఉండే టోపీలను వాడితే జుట్టుకు చెమట పట్టకుండా ఉంటుంది. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● వేసవిలో రోజూ నాలుగు నీటర్ల కంటే ఎక్కువ నీరు తాగాలి. చిన్న పిల్లలు, వృద్ధులకు ఎక్కువ నీరు దఫదఫాలుగా ఇస్తూ ఉండాలి. ● మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ● పిల్లలను ఎక్కువగా ఫ్యాన్ కింద ఉంచితే చర్మ వ్యాధులు రావు. ఆర్డినరీ టాల్కమ్ పౌడర్ వాడితే చెమట కాయల నుంచి రక్షణ పొందవచ్చు. ● పెద్దలకు చర్మ వ్యాధులు వస్తే యాంటీబయోటిక్స్ వాడాల్సి ఉంది. ● చల్లని ఏసీ ప్రదేశం నుంచి వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. వేసవిలో బయటికి వెళ్లేటప్పుడు తప్పని సరిగా గొడుగు వేసుకోవాలి. ● ద్విచక్ర వాహన చోదకులు కళ్లకు కూలింగ్ కళ్లజోళ్లు, నెత్తిన టోపీ వాడాలి. క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు జిల్లాలో గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా పట్టణం గరిష్టం కనిష్టం 22–04–2025 జంగారెడ్డిగూడెం 42 25 ఏలూరు 42 25 నూజివీడు 42 26 21–04–2025 జంగారెడ్డిగూడెం 41 26 ఏలూరు 42 25 నూజివీడు 41 26 20–04–2025 జంగారెడ్డిగూడెం 38 28 ఏలూరు 37 29 నూజివీడు 37 27 19–04–2025 జంగారెడ్డిగూడెం 40 27 ఏలూరు 39 27 నూజివీడు 39 27 -
రాయితీ ఇచ్చినా రాబడి అంతంతే
నూజివీడు: మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయతీల్లో ముందస్తుగానే ఆస్తి పన్ను మొత్తం చెల్లిస్తే ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రాయితీపై ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఏప్రిల్ 30లోగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్ను బకాయిలను ఏకమొత్తంలో ఒకేసారి చెల్లిస్తే 50 శాతం రాయితీని ఇస్తూ బకాయిదారులకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం ఎంత అవకాశం కల్పించినా పన్నుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరో వారం రోజుల్లో (ఏప్రిల్ 30)తో గడువు ముగియనుంది. ఏలూరు జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలలో పది శాతం మాత్రమే ముందస్తుగా వసూలు కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో 13 శాతం నుంచి 15 శాతం ఆస్తి పన్ను ముందస్తుగా వసూలైంది. ప్రచారం ఏది? ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ముందుగానే చెల్లిస్తే ఐదు శాతం రాయితీ లభిస్తుందన్న విషయాన్ని పెద్దగా ప్రచారం చేయలేదు. దీంతో చాలా మంది ప్రజలకు తెలియకపోవడం, అరకొరగా రాయితీ ఇవ్వడం కూడా వసూళ్లు మందగించడానికి ఐదు శాతం మాత్రమే రాయితీ ఇవ్వడం వల్ల కూడా తక్కువ మొత్తం ఆస్తి పన్ను చెల్లించే వారు దీని గురించి పట్టించుకోలేదు. పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించే వారే రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. పది శాతం వరకు రాయితీ ఇస్తే దాదాపు 40 నుంచి 50శాతం వరకు వసూలై ఉండేదని పురపాలక సంఘం వర్గాలే పేర్కొంటున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వసూళ్లు ఇలా ఏలూరు జిల్లాలో ఆస్తి పన్నును అత్యధికంగా వసూలు చేసి ఏలూరు కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ డిమాండ్ రూ.49 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రూ.5.40 కోట్లు వసూలైంది. చింతలపూడి నగర పంచాయతీలో డిమాండ్ రూ.2.58 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ.16లక్షలు మాత్రమే వసూలైంది. పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు మున్సిపాలిటీలో రూ.15.28కోట్ల డిమాండ్కు గాను రూ.2.29 కోట్లు వసూలు చేసిప్రథమ స్థానంలో ఉండగా, ఆకివీడు నగర పంచాయతీ కేవలం రూ.27లక్షలు మాత్రమే వసూలు చేసి చివరి స్థానంలో ఉంది. ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపునుపట్టించుకోని ప్రజలు మరో వారమే గడువు మున్సిపాలిటీ మొత్తం అసెస్మెంట్లు డిమాండ్ వసూళ్లు ఏలూరు 70461 రూ.48.90 కోట్లు రూ.5.33 కోట్లు జంగారెడ్డిగూడెం 14651 రూ.08.47 కోట్లు రూ.0.88 కోట్లు నూజివీడు 13732 రూ.07.16 కోట్లు రూ.0.83 కోట్లు చింతలపూడి 7262 రూ.02.58 కోట్లు రూ.0.16 కోట్లు భీమవరం 32130 రూ.25.57 కోట్లు రూ.3.58 కోట్లు తాడేపల్లిగూడెం 25508 రూ.16.49 కోట్లు రూ.2.02 కోట్లు తణుకు 21450 రూ.15.28 కోట్లు రూ.2.29 కోట్లు పాలకొల్లు 15092 రూ.08.68 కోట్లు రూ.1.08 కోట్లు నర్సాపురం 14800 రూ.07.92 కోట్లు రూ.0.71 కోట్లు ఆకివీడు 8048 రూ.03.42 కోట్లు రూ.0.27 కోట్లు -
మద్ది క్షేత్రంలో భక్తుల రద్దీ
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. ముందుగా స్వామి వారిని ఆలయ అర్చకలు ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారికి ప్రభాత సేవ మొదలుకుని, నిత్యకై ంకర్యాలతో విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని ఏలూరు జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సూర్యచంద్రరావు దర్శించుకున్నారు. వారి వెంట లక్కవరం ఎస్సై శశాంక ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,66,246 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్.. రూ.10 వేల జరిమానా భీమవరం: స్థానిక వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ముద్దాయికి రూ. 10 వేలు జరిమానా విధించినట్లు వన్టౌన్ సీఐ ఎం నాగరాజు మంగళవారం చెప్పారు. పట్టణానికి చెందిన నెలపర్తి ప్రెక్షన్ మద్యం సేవించి మోటారుసైకిల్ నడుపుతుండగా అదుపులోనికి తీసుకుని భీమవరం స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం హాజరు పర్చారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ ఎంవీఎన్ రాజారావు జరిమానా విధించారని నాగరాజు చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి భీమడోలు: ధాన్యం సేకరణ లక్ష్యాల పేరుతో రైతులు, కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గుండుగొలను, పాతూరు, భీమడోలు తదితర గ్రామాల్లోనిఽ ధాన్యం కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రైతు సంఘం నాయకులు పరిశీలించారు. అక్కడ అన్నదాతలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్లు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో రైతు పండించిన పంటలో 50 శాతం మాత్రమే కొనుగోలు చేయాలని లక్ష్యాలు నిర్ణయించడం దుర్మార్గమని విమర్శించారు. ధాన్యం లక్ష్యాలు చేరుకోవడంతో ఆరుదల కు వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి లక్ష్యాలతో సంబంధం లేకుండా రైతుల వద్ద నుంచి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బి.నాగేంద్ర, సీహెచ్ రమణ, జి.దుర్గారావు, ఎం.శ్రీనివాసరావు, పి.రాము పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం ఇలాకాలో సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు
దెందులూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గం లో మల్లం గ్రామంలో దళిత కుటుంబాన్ని పెత్తందారులు సామాజిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటని ఏలూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్ బాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షులు తెర ఆనంద్, ఫారెస్ట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పల్లం ప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మోరు రామరాజు, పార్టీ జిల్లా కార్యదర్శులు గొల్ల కిరణ్ దేవదాసు ప్రేమ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ షాక్ వల్ల దళితుడు సురేష్ మృతి చెందడం, అతనికి న్యాయం చేయాలని దళితులు, గ్రామస్తులు, మద్దతుదారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం, మద్దతు తెలియజేయడం నేరమా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి స్పందించకపోవడం దళితులపై ఆయన వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. దళిత కుటుంబాన్ని వెలివేసిన వారిని, సహకరించిన వారిని, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లేరు భూములన్నీ చిత్తడి నేలలేనా? సుప్రీంకోర్టు ఆర్డర్ అంటూ అటవీ అధికారులు వేధింపులు దెందులూరు: కొల్లేరు భూములన్నీ జిరాయితీ భూములంటూ, సుప్రీం కోర్టు ఆర్డర్ అని చెబుతూ అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత మోరు రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఏలూరు రూరల్ మండలం కొల్లేరులో కలకుర్రు, పెద్ద ఎడ్ల గాడితో పాటు పలు గ్రామాల్లో జిరాయితీ భూములను విలేకరులకు చూపించారు. ఇవి చిత్తడి నేలలని అటవీ అధికారులు అనడం విడ్డూరంగా ఉందని ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులు కొల్లేరు ప్రాంతం జిరాయితీ చిత్తడి భూములు చెరువులు కొల్లేరు ప్రాంత జీవన విధానం వృత్తి ఇవన్నీ ఏమి తెలుసు? అని ఆయన ప్రశ్నించారు. కొల్లేరు ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు చేపల సాగు చేసుకుని దశాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్నారన్నారు. కొల్లేరు ప్రాంత వ్యక్తుల జిరాయితీ భూములను వారికే ఇచ్చేయాలని లేదా ప్రభుత్వం నష్టపరిహారమైన చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఫారెస్ట్ అధికారులు మానవతా దృక్పథంతో దశాబ్దాలుగా కొల్లేరుని నమ్ముకుని జీవిస్తున్న లక్షలాదిమంది జీవన విధానాన్ని, భవిష్యత్ను, భద్రతను పరిరక్షించాలని రాష్ట్ర నాయకులు మోరు రామరాజు కోరారు. -
ఆటోల చోరీ.. నిందితుడి అరెస్టు
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంతో పాటు ఇతర జిల్లాల్లో రాత్రి సమయాల్లో ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోలను చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్స్టేషన్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డి.విశ్వనాథ్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ములగాల వెంకటేశ్వరావు (పొట్టి) తాడేపల్లిగూడెం తోపాటు ఇతర జిలాల్ల్లో రాత్రి సమయాల్లో ఇళ్ల ముందు ఉన్న ఆటోలను చోరీ చేస్తుంటాడు. నిందితుడిపై పిఠాపురం, మండపేట, నిడదవోలు తదితర ప్రాంతాల్లో ఆటోలు చోరీ చేసినట్లు కేసులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో పట్టణ సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్సైలు పి.నాగరాజు, బి.శ్రీనివాస్లు సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టి ఆటోల చోరీలకు పాల్పడుతున్న ములగాల వెంకటేశ్వరరావును అరెస్టు చేశారన్నారు. ఇతని వద్ద నుంచి రూ.14 లక్షలు విలువ చేసే 7 ఆటోలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ముద్దాయిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
బుల్లెట్టు.. వీరి టార్గెట్టు
అంతర్రాష్ట్ర బైక్ దొంగలను తణుకు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.13.40 లక్షల విలువైన 11 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 8లో uసమరగ అభివృద్ధి లక్ష్యం కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్ రూపొందించడంపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర–2047 విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు అధికారులకు రెండు రోజుల వర్క్షాపు సోమవారం ప్రారంభమైంది. ఉభయ జిల్లాల చీఫ్ ప్లానింగ్ అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ సిబ్బందికి కలెక్టర్ సూచనలు ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల మనోభావాలు అనుగుణంగా యాక్షన్ ప్లాన్కు రూపొందించాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, సుస్థిర, పర్యావరణ అనుకూలమైన వృద్ధి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపు, భవిష్యత్ నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, శ్రామికశక్తిని ప్రోత్సాహం అందించడంపై దృష్టి సారించాలన్నారు. నియోజక వర్గాల వారీ గా సమర్థవంతమైన ప్రణాళికలు అమలుచేయాల్సి ఉందన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య రంగాల్లో ప్రస్తుత విస్తరణ, దిగు బడులు, రానున్న రోజుల్లో అంతర సాగు విధానం, ఆదాయం పెంపు, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంపు తదితర అంశాలను ప్రణాళికలో పొందుపరచాలన్నారు. ఉమ్మడి జిల్లాల ముఖ్య ప్రణాళిక అధికారులు సీహెచ్ వాసుదేవరావు, కె.శ్రీనివాసరావు, రిటైర్డ్ జేడీ డీవీవీ సీతాపతిరావు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాతో ఒప్పందం మరణ శాసనం
ద్వారకాతిరుమల: అమెరికాతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పాడి, వ్యవసాయ రంగాలకు మరణ శాసనమని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. ఈ ఒప్పందం కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేపట్టిన భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ ‘వాన్స్ గో బ్యాక్.. భారతదేశం అమ్మకానికి లేదు’ నినాదంతో రైతు సంఘం ఆధ్వర్యంలో ఎం.నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద రైతులు సోమవారం ఆందోళన చేశారు. వాన్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సుంకాలు, మార్కెట్ పరిమితులు తొలగిస్తే అమెరికా పాడి ఉత్పత్తులు మన దేశానికి దిగుమతి అయ్యి ఇక్కడి పాడి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అలాగే అమెరికా ఉత్పత్తులతో దేశంలో వ్యవసాయ రంగం దెబ్బతింటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీకి దరఖాస్తులు ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,035 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వి డుదల చేసిందని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రక టనలో తెలిపారు. అభ్యర్థులు మే 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారని, వివరాలు సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్, ఏపీడీఎస్సీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్లో అందుబాటులో ఉన్నాయన్నారు. -
జిల్లా జడ్జికి అభినందనలు
ఏలూరు (టూటౌన్): జిల్లా ప్రధాన సివిల్ న్యాయమూర్తిగా (ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి) పదవీ బాధ్యతలు స్వీకరించిన సిరిపురం శ్రీదేవిని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆమెకు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజల న్యాయ అవసరాలు తీర్చేందుకు సంబంధిత విభాగాల మధ్య సమన్వయంతో కేసుల విచారణ, మహిళా భద్రత, నేర నిరోధక చర్యలపై వారు చర్చించారు. పోలీస్శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ శివకిషోర్ ఆమెకు వివరించారు. ‘ఉపాధి’ బకాయిలు చెల్లించాలి ఆగిరిపల్లి: ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఆగిరిపల్లి మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సత్తు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూలీలతో కలిసి నిరసన తెలిపారు. మూడు నె లలుగా కూలి డబ్బులు జమ కాలేదని, పని ప్ర దేశాల్లో కనీస సౌకర్యాలు లేవని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో ఆదివాసీలకు అన్యాయం బుట్టాయగూడెం: ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ ఆర్డినెన్స్ ద్వారా యువతకు న్యాయం చేయాలని, మెగా డీఎస్సీలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ అన్నారు. జైనవారిగూడెంలో సోమవారం సంఘ సమావేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ పాడేరులో జరిగిన ఎన్నికల సభలో చంద్రబాబు జీఓ 3కు చట్టభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. ఉమ్మ జిల్లా పరిధిలో డీఎస్సీలో 1,035 పోస్టులకు ఎస్టీలకు కేవలం 61 పోస్టు లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిగా శేఖర్బాబు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారిగా టి.శేఖర్బా బు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా పెనుమాక ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రిన్స్పాల్గా పనిచేస్తున్నారు. పదోన్నతిపై ఇక్కడకు వచ్చిన ఆయన సోమ వారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంచినీటి చెరువుకు గండి దెందులూరు: ఏలూరు నగర ప్రజలకు మంచినీటిని అందించే దెందులూరులోని గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండి పడింది. విషయం తెలిసిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరపాలక సంస్థ కో–ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు వేకువజామున పంపుల చెరువు వద్దకు చేరుకొని యుద్ధప్రాతిపదికన గండి పూడ్చివేతకు పనులు చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్, మున్సిపల్ అధికారులు పనులను పర్యవేక్షించారు. ఫ్లెక్సీలు, ఇ సుక బస్తాలు, మట్టి, రాళ్లతో లీకేజీని అరికట్టేందుకు పనులు చేపట్టారు. రాత్రికి 90 శాతం లీకేజీని అరికట్టినట్టు అధికారులు తెలిపారు. 24 నుంచి ఉపాధ్యాయులకు వైద్య శిబిరం ఏలూరు (ఆర్ఆర్పేట): పూర్వ పశ్చిమగోదా వరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రిఫరెన్షియల్ కేటగిరీ/స్పెషల్ పాయింట్లు పొందాల్సిన వారు వైద్య శిబిరాలకు హాజరుకావాలని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 26 వరకు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందని తెలిపారు. -
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఎస్ఈ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్, శ్రీనివాసరావు, ఏడీ సర్వే ఎండీ అన్సారీలతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నాణ్యమైన ఎండార్స్మెంట్ అందజేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీల్లో కొన్ని.. ● జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడేనికి చెందిన గెల్లానాగ తనకు తాడువాయి పంచాయతీలో ఉన్న 1.38 సెంట్లు భూమి ఆక్రమణకు గురైందని, సమస్య పరిష్కరించాలని కోరారు. ● దెందులూరుకు చెందిన బూరుగుపల్లి నాగేశ్వర రావు తాను నివసిస్తున్న ఇంటి కోసం కుమారుడు బెదిరిస్తున్నాడని రక్షణ కల్పించాలని కోరారు. ● ముసునూరు మండలం గోపవరానికి చెందిన కొయ్యూరి తిరుపతమ్మ గోపవరంలోని అసైన్డ్ భూమికి సర్వే చేయించాలని అర్జీ అందించారు. ● నిడమర్రుకు చెందిన బత్తుల చంద్రమౌళి తమకు చెందిన 34 సెంట్లు భూమి మరొకరి పేరుతో మ్యుటేషన్ చేశారని, న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. ● భీమడోలుకు చెందిన నందవరపు సత్యవతి పెన్షన్ పొందుతూ తన భర్త మరణించారని ఆ స్థానంలో తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ● లింగపాలెం మండలం భోగోలుకు చెందిన నిమ్మగడ్డ శ్రీనివాసరావు తమ భూమిని ఆన్లైన్ లో ఎంట్రీ చేసేందుకు దరఖాస్తు చేశానని, చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ● జంగారెడ్డిగూడేనికి చెందిన వీరవల్లి శంకరరావు శారీరక దివ్యాంగుడైన తనకు స్కూటీని మంజూరు చేయాలని కోరారు. -
ఆక్వా వర్సిటీకి చంద్ర గ్రహణం
సాక్షి, భీమవరం: జిల్లాలోని ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య గ్రహణం పట్టింది. నిధులు లేక నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. రెండేళ్లలో పూర్తికాల్సిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. మరో పక్క ఆక్వా వర్సిటీని ప్రైవేట్పరం చేసే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆక్వా హబ్గా ఉమ్మడి జిల్లా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 2.53 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు, 40కు పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్, సీడ్ కంపెనీలు, ఆక్వా అనుబంధ వ్యాపారాలతో ఆక్వా హబ్గా పేరొందింది. చేపలు, రొయ్యల మేతలు, చెరువుల నిర్వహణ సామగ్రి అమ్మకాలు, పట్టుబడి, ప్రాసెసింగ్ ప్లాంట్లు, రవాణా తదితర రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వే లాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ఆక్వాను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో గత సీఎం జగన్మోహన్రెడ్డి ఆక్వా యూనివర్సిటీని మంజూరు చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం, జిల్లాలోని ఉండిలోని ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్లను యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చారు. యూనివర్సిటీ కోసం నరసాపురం సమీపంలోని లిఖితపూడిలో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్యాంపస్ కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవన నిర్మాణాల నిమిత్తం రూ.100 కోట్లు మంజూరు చేశారు. తాత్కాలికంగా నరసాపురంలోని తుఫాన్ షెల్టర్ భవనంలో 2022 నవంబరు నుంచి 66 సీట్లతో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ తరగతులను ప్రారంభించారు. గతే డాది నూతన భవనాల్లో ఆక్వా వర్సిటీ, క్యాంపస్ కళాశాలను ప్రారంభించే లక్ష్యంతో అప్పట్లో పనులు వేగవంతం చేశారు. ఆర్బీకేలో సెకండ్ బ్యాచ్కు తరగతులు నరసాపురంలోని 12 గదులతో ఉన్న తుఫాను షె ల్టర్ భవనంలో తాత్కాలికంగా కళాశాలను నిర్వహి స్తున్నారు. తరగతి గదులు, ల్యాబ్, ఆఫీస్, లైబర్రీ, స్టాఫ్ రూమ్ ప్రస్తుతం ఉన్న భవనం ఒక బ్యాచ్కు మాత్రమే సరిపోతుంది. గతేడాది సెకెండ్ బ్యాచ్కు క్లాసులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న భవనం సరిపోక ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలోని ఫిషరీస్కు సంబంధించిన భవనాల్లోకి కళాశాలను తరలించాలని అధికారులు భావించారు. స్థానికంగా వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు ఆ ప్రయత్నాన్ని నిలిపివేసినట్టు సమాచారం. దీంతో రైతు భరోసా కేంద్రాన్ని తరగతుల నిర్వహణకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరితగతిన యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష ్యంతోనే.. ఈ ప్రాంతంలో ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందేందుకు ఆక్వా వర్సిటీ దోహదపడుతుంది. ప్రైవేట్ సంస్థలకు ఆక్వా వర్సిటీని అప్పగించే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పేద విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే విరమించుకుని త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. – వడ్డి రఘురాం, అప్సడా మాజీ వైస్ చైర్మన్, తాడేపల్లిగూడెం విద్యపై కూటమి కత్తి గత ప్రభుత్వంలో జిల్లాకు తలమానికంగా ఆక్వా వర్సిటీ భవన నిర్మాణాలకు రూ.100 కోట్ల మంజూరు రెండేళ్లలో పనులు పూర్తిచేసేలా లక్ష్యం బిల్లుల విడుదలలో కూటమి సర్కారు జాప్యం ఏడాదిగా నత్తనడకన పనులు ప్రైవేట్పరం చేసే ఆలోచన ? ముందుకు సాగని పనులు అడ్మినిస్ట్రేటివ్, కళాశాల భవనాల పనులు శ్లాబ్ దశకు చేరుకోగా బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాలకు పునాదులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.35 కోట్ల విలువైన పనులు జరగ్గా కేవలం రూ.15 కోట్లు మాత్రమే బిల్లులు విడుదలయ్యాయి. తాజా బడ్జెట్లో ప్రభుత్వం కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఆక్వా వర్సిటీకి కేటాయించడంతో ఈ ఏడాది పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పనులు ఎప్పుడు పూర్తవుతాయనేది చెప్పలేమని అధికార, నిర్మాణ సంస్థ వర్గాలంటున్నాయి. ఆక్వా వర్సిటీని ప్రైవేట్పరం చేసే ఆలోచనతోనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే గత ప్రభుత్వం ఉన్నతాశయంతో తలపెట్టిన ఈ కార్యక్రమం నీరుగారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఈఏపీ సెట్కు దరఖాస్తు ఇలా..
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు తమ తొలి అడుగు వేయడానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఆయా కోర్సుల్లో ప్రవేశించడానికి గతంలో ఎంసెట్ నిర్వహించేవారు. ఎంసెట్ ద్వారా వైద్య విద్యలో కూడా ప్రవేశించే వెసులుబాటు ఉండేది. అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు మాత్రం రాష్ట్రస్థాయిలోనే ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఏపీఈఏపీ సెట్) నిర్వహిస్తున్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశించడానికి ఈఏపీ సెట్ పరీక్ష రాయడం తప్పనిసరి. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24వ తేదీతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగియనుంది. వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోలేని వారు ఇప్పుడు తొందరపడకపోతే తమ ఇంజనీరింగ్ చదువు కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లేదా తమ తోటివారికంటే ఒక ఏడాది ఆలస్యంగా ప్రవేశించాల్సి వస్తుంది. ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా జిల్లాతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సీఈటీఆర్.ఏపీఆర్సీహెచ్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఏపీ ఈఏసీసెట్–2025ను ఎంపిక చేసుకోవాలి. ఏపీఈ ఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీ ఈఏపీ సెట్కు సంబంధించిన తేదీలు, సూచనలు తదితర పూర్తి వివరాలు పొందవచ్చు. ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవడం మరువద్దు ఈ పరీక్షకు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవడం మరిచిపోవద్దు. ముఖ్యంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పీహెచ్సీ కేటగిరిల వారీగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్లో క్లిక్ చేయాలి. అలాగే ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన నంబర్ను దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువపత్రాల నంబరును సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ తరువాత తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకున్నారు. విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు ఏ విద్యా సంస్థల్లో చదివారు, ఏ ఊరిలో చదివారనే వివరాలు ఆయా విద్యా సంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివరలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్ చేయాల్సి ఉంటుంది. సొంత జిల్లాకు చెందిన విద్యార్థి తమ సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతర కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. ప్రింటౌట్ తీసుకోండి ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేసిన తరువాత ప్రింటౌట్ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్తో పాటు ఆన్లైన్ ప్రింటౌట్ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్కు అందజేయాలి. ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్, పుట్టిన తేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్ హాల్ టికెట్, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి కనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి. 5 దశలుగా దరఖాస్తు ప్రక్రియ ఏపీఈఏపీ సెట్–2025 సైట్లో లాగిన్ అయిన తరువాత ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఐదు దశల్లోని ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజు పేమెంట్కు లాగిన్ అయి సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ నమోదు చేయాలి. దీంతోపాటు ఇంజనీరింగ్ ఫార్మా, అగ్రికల్చర్ ఫార్మసీ, బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరిపై క్లిక్ చేసి ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయాలి. క్రెడిట్, డెబిట్కార్డు, నెట్ బ్యాకింగ్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నో యువర్ పేమెంట్ స్టేటస్పై క్లిక్ చేసి సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి. అనంతరం విద్యార్థి చేరనున్న కోర్సుల వారీగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్ చేయడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఫిల్ అప్లికేషన్లో పేమెంట్ చేసిన ఐడీతోపాటు సీనియర్ ఇంటర్ హాల్టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేసి పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ్ క్లిక్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి. మూడు రోజుల్లో ముగియనున్న గడువు.. దరఖాస్తులు ఆన్లైన్లోనే సమర్పించాలి -
కొంపముంచిన నకిలీ మొక్కలు
దెందులూరు: నకిలీ మొక్కలు, విత్తనాలు తమ కొంప ముంచాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తే తీరని నష్టం కలిగిందని లబోదిబోమంటున్నారు. దెందులూరు మండలం చల్ల చింతలపూడి గ్రామంలో ఖమ్మ బ్రహ్మాజీ తన ఐదెకరాల పొలంలో ఒక మొక్క రూ.211 చొప్పున 337 పామాయిల్ మొక్కలు రూ.71 వేలకు 2018లో ఓ ప్రైవేటు కంపెనీ నుంచి కొనుగోలు చేసి సాగు చేశాడు. మొత్తం 36 మొక్కలు బెరుకు మొక్కలు వచ్చాయని, దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి వృథా అయ్యిందని, నకిలీ విత్తనాలు తన పాలిట శాపంగా మారాయని రైతు బ్రహ్మాజీ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై రెండు రోజుల్లో హార్టికల్చర్ శాఖ, విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోకుంటే తన పొలంలోనే దీక్షలు చేస్తానని హెచ్చరించారు. హార్టికల్చర్ ఆఫీసర్ కరణ్ స్పందిస్తూ పామాయిల్ సాగులో బెరుకు మొక్కలు వచ్చిన సంగతి వాస్తవమే అన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుందన్నారు. మరోవైపు ఇదే గ్రామంలో పుచ్చ విత్తనాలు తనకు నష్టం మిగిల్చాయని రైతు బోప్పన శ్రీను కన్నీటి పర్యంతమయ్యాడు. తనకున్న రెండున్నర ఎకరాల్లో రూ.22 వేలతో పుచ్చ విత్తనాలు వేశానని, సాగు, డ్రిప్పు మల్చింగ్ నిమిత్తం రూ.55 వేలు పెట్టుబడి పెట్టానని, కానీ 40 శాతం మాత్రమే మొలకలు వచ్చాయని వాపోయాడు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసగిస్తున్న కంపెనీలపై వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గగ్గోలు పెడుతున్న రైతన్నలు -
పోగొట్టుకున్న బ్రాస్లెట్ భక్తుడికి అప్పగింత
జంగారెడ్డిగూడెం: ఆలయ పరిసరాల్లో పొగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ను సోమవారం బాధితుడికి నూకాలమ్మ ఆలయ కమిటీ అందజేసింది. మూడు రోజుల క్రితం కొప్పుల దుర్గాప్రసాద్, అశ్విని దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళుతున్న సమయంలో చేతికి ఉన్న బ్రాస్లెట్ కనిపించకపోవడంతో ఆలయ కమిటీకి తెలియజేసి దొరికితే ఇప్పించాలని కోరాడు. కాగా, ఆలయ సమీపంలో నివసించే మహాలక్ష్మికి ఈ బ్రాస్లెట్ దొరకగా ఎవరిదో విచారించి వారికి ఇవ్వాలని ఆలయ కమిటీని కోరింది. సోమవారం బ్రాస్లెట్ను దుర్గాప్రసాద్ దంపతులకు మహాలక్ష్మి చేతుల మీదుగా ఆలయ కమిటీ అందజేసింది. ఈ సందర్భంగా మహాలక్ష్మిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు. కాగా బ్రాస్లెట్ విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు దెందులూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో దళిత కుటుంబాన్ని పెత్తందారులు సామాజిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటని దళిత ప్రజాప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సర్క్యూట్ వల్ల దళితుడు సురేష్ మృతి చెందడం, అతనికి న్యాయం చేయాలని దళితులు, గ్రామస్తులు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం నేరమా అని ప్రశ్నించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా బాధిత కుటుంబాన్ని పవన్కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు నాకు ఓటేయండి నన్ను గెలిపించండి దేశమంతా తలెత్తుకొని చూసేలా చేస్తానని అన్ని మీటింగ్లో చెప్పారని, దాని అర్థం ఇదేనా అని దళిత ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. దళిత కుటుంబాన్ని వెలివేసిన వారిని, ఇందుకు సహకరించిన వారిని జిల్లా బహిష్కరణ చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 48 గంటలలోగా ఈ ఘటనపై పవన్కళ్యాణ్ చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తామని దళిత ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఏలూరు జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తెర ఆనంద్, ఫారెస్ట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పల్లం ప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు మోరు రామరాజు, పార్టీ జిల్లా కార్యదర్శులు గొల్ల కిరణ్ దేవదాసు ప్రేమ్ బాబు ఉన్నారు. -
ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్కు చెందిన ముగ్గురు ఉద్యోగులు శ్రీజీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డును అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన దెందులూరు ఆపరేటింగ్ విభాగంలోని స్టేషన్ సూపరింటెండెంట్ టీవీఎంయూ మహేశ్వర్, రాజమండ్రి ఆపరేటింగ్ విభాగంలోని పాయింట్ మెన్ కె.నథానియేల్, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ లోకేష్కుమార్లకు జీఎం అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ కల్పించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ సంస్థల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పెన్షన్, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సాధన సమితి ఉమ్మడి డిమాండ్ చేసింది. ఈమేరకు జిల్లా పర్యటనకు సోమవారం సాయంత్రం నగరానికి వచ్చిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ను సంఘ అధ్యక్షుడు పీ శ్రీనివాస్, కన్వీనర్ కే కృష్ణకుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్, 1980 ని సవరించి 2004 సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర – ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును అమలులోకి తెచ్చినా విద్యుత్ ఉద్యోగులు మాత్రం జీపీఎఫ్ పరిధిలోనే ఉన్నారన్నారు. దీనివల్ల 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగష్టు 31 మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో నియమతులైన సుమారు 6,200 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అంతే కాకుండా, ఉద్యోగ నిర్వహణలో భాగంగా ప్రమాదాలకు గురై మరణించిన ఉద్యోగుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం పెన్షన్ సౌకర్యం, జీపీఎఫ్ సౌకర్యం విద్యుత్ ఉద్యోగులకు అందరికీ కల్పించాలని మంత్రిని కోరారు. నియోజకవర్గాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయాలిఏలూరు (మెట్రో): జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఉచిత సరఫరా, వేసవిలో తాగునీటి సరఫరా, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి రానున్న వర్షాకాలంలో ఇసుక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి స్టాక్ పాయింట్లో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ కూలీలకు వారంలోగా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యేలు డా. కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నాగులదేవునిపాడులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు దెందులూరు: గాలాయిగూడెం పంచాయతీ నాగులదేవునిపాడు గ్రామంలో ఇరుకుటుంబాల మధ్య ఏర్పడిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి మురుగునీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసిందన్నారు. గుజ్జుల నాగేంద్రబాబు చాకుతో గూడపాటి చందు, గూడపాటి జోషిలపై దాడికి పాల్పడగా.. జోషి కుమారుడు సుమంత్ రాయితో గుజ్జుల నాగేంద్రబాబుపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించమన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివాజీ తెలిపారు. -
అగ్నిమాపక సిబ్బంది ఔదార్యం
చింతలపూడి: ప్రమాదవశాత్తూ నేల బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండు శునకాలను గ్రామస్తుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. చింతలపూడి మండలం, శెట్టివారిగూడెం గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శెట్టివారిగూడెం పొలాల్లో ఉన్న ఇరవై అడుగుల బావిలో రెండు కుక్కలు ప్రమాదవశాత్తూ పడిపోయాయి. బావి నుంచి కుక్కల అరుపులు విన్న రైతులు వాటిని బయటికి తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి చింతలపూడి అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో సిబ్బందిని బావి దగ్గరకు పంపించారు. ఫైర్మెన్ రామకృష్ణ, ఫైర్ హోంగార్డ్ బాబురావు బావిలోకి దిగి కుక్కల్ని సురక్షితంగా బయటికి తీశారు. మూగ జీవాల ప్రాణాలు కాపాడిన ఫైర్ సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. బావిలో పడ్డ శునకాల్ని బయటికి తీసిన వైనం -
కళావిహీనం.. ఆటపాక కేంద్రం
కై కలూరు: రాష్ట్రంలో పక్షి ప్రేమికుల స్వర్గధామంగా ఉన్న ఆటపాక పక్షుల విహార కేంద్రం కళావిహీనంగా మారింది. తీవ్ర నీటి కొరతతో పక్షులు అల్లాడుతున్నాయి. ఆహారం, ఆవాసం కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఏటా నీటి కొరత ఏర్పడుతుందని తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టడంలో అటవీ అధికారులు అలసత్వం వహిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. ఆటపాకలో బోటు షికారు నిలిచిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు నిరుత్సాహంతో తిరిగి వెళ్తున్నారు. ప్రపంచంలోనే అరుదైన పెలికాన్(గూడబాతు) పక్షులు ఆటపాక పక్షుల కేంద్రానికి సంతానోత్పత్తి కోసం వలస వస్తాయి. దీంతో ఈ కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్గా పిలుస్తారు. పక్షుల విహారానికి 286 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఇక్కడ అందుబాటులో ఉంది. విదేశీ పక్షుల గూడు నిమిత్తం, సంతానోత్పత్తికి వీలుగా 156 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. కొల్లేరులో సాధారణంగా పెలికాన్, పెయింటెడ్ స్టోక్, టీల్స్, నైట్ హెరాన్, కింగ్ ఫిషర్స్, గ్లోబీ ఐబీస్, స్టిల్ట్, షావలర్స్, స్పూన్ బిల్స్ వంటి దాదాపు 189 రకాల పక్షులు విహరిస్తాయని అంచనా. పక్షుల సంతానోత్పత్తికి ఆటపాక పక్షుల కేంద్రం అనుకూలంగా ఉండటంతో ఎక్కువగా పక్షులు విచ్చేస్తున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేంద్రాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి సర్వత్రా వినిపిస్తున్నాయి. గట్ల ఎత్తు పెంచాలి ఆటపాక పక్షుల కేంద్రంలో ప్రధానమైంది విహార చెరువు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ఈ ప్రాంతంలో తొలగించిన చెరువులన్నింటినీ ఒక్కటిగా చేయడంతో చెరువు విస్తీర్ణం మరింతగా పెరిగింది. సాధారణంగా చెరువులో 6 అడుగులు నీటిని నిల్వ చేసుకోవచ్చు. గట్లు బలహీనంగా ఉండటంతో 4 అడుగులకు మించడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో చెరువు పూర్తిగా అడుగంటుతోంది. పక్షులు ఆహారంగా తీసుకునే చేపలు చనిపోతున్నాయి. చెరువు గట్ల ఎత్తు పెంచాలని ప్రతిపాదనలు పంపుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. మే నెలలో ఏకంగా చెరువు బీటలు వారుతోంది. దీంతో పక్షులకు ఆహార కొరత ఏర్పడడంతో కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. నీటి తరలింపులో జాప్యం ఏటా పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపడం పెద్ద ప్రహసనంలా మారుతోంది. సమీప కోమటిలంక నాగరాజు డ్రెయిన్ నుంచి పక్షుల కేంద్రం చెరువుకు నీటిని నింపుతారు. వర్షాలు అధికంగా కురిస్తే డ్రెయిన్లో నీరు పెరుగుతుంది. ఆ సమయంలో తూములు తీసి చెరువుకు నీటిని పంపుతారు. ప్రస్తుతం నాగరాజు డ్రెయిన్ నీటిలో 8కిపైగా ఉప్పు శాతం ఉందని పరీక్షల్లో తేలింది. ఈ నీటిని నింపితే చెరువులో సహజసిద్ధంగా పెరిగిన చేపలు మరణిస్తాయి. ఈ కారణంతో నీటిని నింపడం లేదు. ఆటపాక గ్రామం పంట కాల్వ నుంచి నీటిని పైపుల ద్వారా నేరుగా పక్షుల కేంద్రం చెరువులోకి తరలించాలని ప్రతిపాదనలు చేస్తున్న ఆచరణ సాధ్యం కావడం లేదు. అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పక్షుల కేంద్రాన్ని స్వయంగా సందర్శించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. నీటి కోసం అల్లాడుతున్న పక్షులు నిలిచిన బోటు షికారు చెరువు నీటిని నింపడంలో అధికారులు విఫలం ప్రతిపాదనలు పంపాం ఆటపాక పక్షుల కేంద్రంలో చెరువు గట్ల ఎత్తు పెంచడానికి ప్రతిపాదనలు పంపించాం. కోమటిలంక సమీప గట్లను మరమ్మతులు చేయించాం. చెరువు విస్తీర్ణం అధికంగా ఉండటంతో పూర్తి స్థాయిలో నీటిని నింపడానికి సాధ్యసాధ్యాలను పరిశీస్తున్నారు. ప్రస్తుతం ఆటపాకలో నీరు అడుగంటింది. బోటు షికారు నిలిపేశాం. చెరువులో పక్షుల ఆహారానికి కొరత లేదు. – ఎం.రంజిత్కుమార్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కై కలూరు. వేసవికి ముందుగానే నీటిని నింపాలి వేసవికి ముందుగానే అటవీ అధికారులు ఆటపాక పక్షుల చెరువులో నీటిని నింపాలి. ఆటపాక పంట కాల్వ నుంచి రామాలయం మీదుగా నేరుగా పక్షుల కేంద్రం చెరువుకు అండర్ గ్రౌండ్ పైపులైన్లు ఏర్పాటు చేయాలి. పోల్రాజ్ డ్రెయిన్(నాగరాజు కాల్వ) నుంచి వర్షాల సమయంలో నీటిని చెరువులో నింపేందుకు మరిన్ని లాకులను ఏర్పాటు చేయాలి. – ఎల్ఎస్.భాస్కరరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
కై కలూరు: కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇటీవల కొల్లేరు సమస్యపై సుప్రీంకోర్టు 12 వారాల గడువు ఇవ్వడంపై వడ్డీ సాధికారిత రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు అధ్యక్షతన కై కలూరు ట్రావెలర్స్ బంగ్లాలో ఏలూరు జిల్లా కొల్లేరు పెద్దలతో సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ)ని సుప్రీంకోర్టు క్షేత్రస్థాయిలో కొల్లేరు సమస్యపై నివేదిక కోరిందన్నారు. త్వరలో సీఈసీ సభ్యులు కొల్లేరు అధ్యయనానికి వస్తారన్నారు. ఆయా గ్రామాల ప్రజలు అర్జీలతో సమస్య చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పర్యావరణంతో పాటు ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలనే వాదాన్ని ప్రజాప్రతినిధులందరూ తెలుపుతున్నామన్నారు. కొల్లేరు అభయారణ్య విస్తీర్ణం 77,535 ఎకరాలను 55,000గా నిర్ణయించి మిగిలినవి కొల్లేరు పేదలకు పంపిణీ జరిగేలా కృషి చేస్తామన్నారు. కొల్లేరు తరపున సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ చేపల రైతుల సంఘం దాఖలు చేసిందని, దాంతో పాటు కొల్లేరు సంఘాల తరుపున ఇంప్లీడ్కు అవకాశం కల్పించాలని నాయకులు కోరారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు వడ్డీల సాధికారిత కన్వీనర్ బలే ఏసురాజు, సాహితీవేత్త వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి క్షేత్రంలో భక్తజన సందోహం
ద్వారకాతిరుమల: సెలవుదినం కావడంతో ద్వారకాతిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. దానికి తోడు ఆలయ అనివేటి మండపంలో, పరిసర ప్రాంతాల్లో వివాహాలు, ఒడుగులు, అన్నప్రాసన వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. దాంతో క్షేత్ర పరిసరాలు కళకళలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం సిబ్బంది మజ్జిగ అందజేశారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై వీరిశెట్టిగూడెంకు చెందిన జానపద వృత్తి కళాకారుల సంఘం వారు నిర్వహించిన భజనలు భక్తులను అలరించాయి. క్షేత్రంలో రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. -
రాట్నాలమ్మకు రూ.56,105 ఆదాయం
పెదవేగి: రాట్నాలమ్మకు భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన రాట్నాలమ్మను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ.26,300, విరాళంగా రూ.4,230, లడ్డూప్రసాదంపై రూ.23,175, ఫొటోల అమ్మకంపై రూ.2,400 కలిపి మొత్తం రూ.56,105 ఆదాయం లభించిందని దేవస్థాన ఈవో ఎన్.సతీష్కుమార్ చెప్పారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగమ్మతల్లి గుడి భక్తులతో కిటకిటలాడింది. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. క్యూలో నిలుచున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కోడి వ్యర్థాలు తరలిస్తున్న వ్యాన్ స్వాధీనం భీమడోలు: కోడి వ్యర్థాలు తరలిస్తున్న ముగ్గురిని ఆదివారం భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐషర్ వ్యాన్ను సీజ్ చేశారు. విజయవాడకు చెందిన ఎం.రాంబాబు, ముసునూరు మండలం రంగంపేటకు చెందిన పిల్లి వెంకట రమణ హైదరాబాద్ నుంచి కోడి వ్యర్థాలను లింగంపాడులోని గంటా మోహనరావు ఆక్వా చెరువుకు తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వై.సుధాకర్ తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని సీజ్ చేసారు. -
క్రమశిక్షణతో పాటు విద్య, విజ్ఞానం
తాడేపల్లిగూడెం (టీఓసీ): శశి విద్యా సంస్థల్లో క్రమశిక్షణతో పాటు విద్య, విజ్ఞానం నేర్పిస్తామని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అన్నారు. శశి తాడేపల్లిగూడెం క్యాంపస్లో 7, 8, 9, 10, 10 ప్లస్ 1 విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్పై ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. దాదాపు 5 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సదస్సులో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులను ఒత్తిడి చేయకుండా వారు ఏదైతే చేయగలుగుతారో ఆ కోర్సులు మాత్రమే చేయగలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. సంస్థ వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ మాట్లాడుతూ స్కూల్కి మార్కులు, ర్యాంకులు కోసమే కాకుండా విజ్ఞానం కోసం పంపాలని చెప్పారు. విద్యార్తులు ఫోన్ అవసరానికి వాడాలని, బానిస కాకూడదన్నారు. ఐఐటీ, నీట్పై తల్లిదండ్రులు అడిగిన సందేహాలు నివృత్తి చేశారు. సదస్సులో డైరెక్టర్ మేకా క్రాంతి సుధ, క్యాంపస్ ఇన్చార్జి కె.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
గోపీనాథపట్నంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం భక్తాంజనేయ స్వామి ఆలయ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవదాయ ధర్మదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆయన సతీమణి సౌదిని కుమారి రెండో రోజు ఆదివారం విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. శృంగేరి పీఠంలో పీఠాధిపతి చేత అభిషేకాలు, పూజలు అందుకున్న శివలింగం ఆదివారం ఇక్కడికి చేరుకుంది. పంచామృతాలతో విగ్రహలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జలాదివాసం నిర్వహించారు. విశేష పూజల నడుమ ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోపాలకృష్ణ చక్రవర్తి బ్రహ్మత్వంలో వేద పండితుల మంత్రోచ్ఛరణలతో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పేదలకు అప్పుల తిప్పలు
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వ పాలనలో పనులు లేక.. చిరు వ్యాపారాలకు పెట్టుబడులు దొరక్క.. సంక్షేమ పథకాలు అందక.. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం రాక.. పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు యంత్రాలతో చేస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు చేతినిండా పని దొరకని పరిస్థితి. ఈ క్రమంలో కుటుంబ పో షణ భారం కాగా.. పిల్లలు చదువులు, వైద్యం, ఇతర ఖర్చులకు అప్పుల బాటపడుతున్నారు. కు టుంబ పోషణ, డ్వాక్రా రుణాల చెల్లింపునకు మహిళలు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ల ఖర్చు, బీమా తదితరాల కింద 10 శాతం రుణంలో మినహాయించుకుని ఇస్తున్నాయి. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. 2014లో చంద్రబాబు పాలనలోనూ ఇదే తరహా పరిస్థితులు ఉండగా అప్పట్లో చాలా మంది ప్రైవేట్ బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వేధింపులతో కాల్మనీ వ్యవహరంలో ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు పేదలకు కేవలం డ్వాక్రా రుణాలతోనే సరిపెడుతున్నాయి. సూపర్ సిక్స్.. మోసం ఫిక్స్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడిచినా ఇప్పటికీ ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్సిక్స్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. కేవలం పింఛన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలు మినహా మిగిలినవి అటకెక్కించింది. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వ్యాపారాలూ అంతంతమాత్రంగా సాగుతున్నాయి. ప్రధానంగా మహిళలకు ఎలాంటి పథకాలు అందడం లేదు. కంటి తుడుపుగా కార్పొరేషన్ రుణాలు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నామమాత్రంగా బీసీ, ఎస్సీ, కాపు కార్పొరేషన్ రుణాల పేరిట గ్రామం, వార్డుకు ఇద్దరు ముగ్గురికి చొప్పున రుణాలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. దీంతో అర్హులకు రుణాలు అందని పరిస్థితి. పనులు లేక.. సంక్షేమం కానరాక.. అప్పుల బాటపడుతున్న ప్రజలు విద్య, వైద్యానికి వడ్డీ వ్యాపారుల చెంతకు.. నామమాత్రంగానే కార్పొరేషన్ రుణాలు పథకాలపై కూటమి కత్తి గత ఐదేళ్లలో సంక్షేమం పరవళ్లు భీమవరానికి చెందిన లక్ష్మి అనే మహిళ నాటి జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన వైఎస్సార్ చేయూత ఆర్థిక సాయంతో అద్దెకు షాపు తీసుకుని చిన్నపాటి బట్టల దుకాణం పెట్టుకుంది. నాలుగేళ్ల పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం అందడం, కొనుగోళ్లు బాగుండటంతో వ్యాపారం బాగా జరిగింది. భర్త సంపాదనతో పాటు ఆమె ఆదాయంతో కుటుంబ చక్కగా నడిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో కొనుగోళ్లు లేక షాపు అద్దె చెల్లించడం కూడా భారంగా మారింది. దీంతో ఆమె బట్టల దుకాణం మూసివేసే పరిస్థితి వచ్చింది. పాలకోడేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కుటుంబం పిల్లల ఫీజులు, డ్వాక్రా రుణాల చెల్లింపు కోసం ప్రైవేట్ బ్యాంకు వద్ద రూ.50 వేలు రుణం తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక కొరతతో కొన్ని నెలలు భవన నిర్మాణ పనులు, వ్యవసాయ పనులు సరిగా లేక జీవనం కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో వారం వారం బ్యాంకు వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఒత్తిళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కుటుంబాలు జిల్లాలో వందలాదిగా ఉన్నాయి. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పథకాల లబ్ధి పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో) చేయూత 2,72,111 552.88 ఆసరా 1,02,352 1,067.35 అమ్మఒడి 2,25,525 597.62 కాపు నేస్తం 2,24,286 79.40 ఈబీసీ నేస్తం 12,286 19.02 సున్నా వడ్డీ రుణాలు 2,64,719 14.02 సున్నా వడ్డీ (డ్వాక్రా) 11,65,513 110.51 నేతన్న నేస్తం 2,286 10.98 గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా సాయం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పేద, మధ్యతరగతి ప్రజలకు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాల లబ్ధి అందింది. ముఖ్యంగా మహిళల పేరిట పథకాలను అమలు చేయడంతో కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు ఇబ్బందులు ఉండేవి కావు. కరోనా విపత్తు సమయంలోనూ రెండేళ్ల పాటు సంక్షేమ పథకాలు ఎన్నో పేద కుటుంబాల జీవనానికి భరోసాగా నిలిచాయి. వైఎస్సార్ చేయూత, ఆసరా (డ్వాక్రా రుణమాఫీ), అమ్మఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల సాయంతో ఎందరో మహిళలు స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. పిల్లల స్కూల్, కళాశాల ఫీజులు, వైద్య ఖర్చులు కూడా నాటి ప్రభుత్వం భరించడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం ఉండేది కాదు. దీంతో వారు అప్పులు చేసే పరిస్థితులు లేవు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. -
మధుర ఫలం.. ధర పతనం
●రోజురోజుకూ ధర తగ్గుతూ.. ఈ ఏడాది మామిడి దిగుబడి బాగా తగ్గినా ధర పెరగకుండా తగ్గుతోంది. రోజురోజు కూ ధర తగ్గిపోతుండటంతో పెట్టుబడులు కూడా వస్తాయోరావోనని ఆందోళన పెరుగుతోంది. రసాయన మందుల పిచికారీ, తోట కాపలా, ఇతర ఖర్చులు కలిపి పెట్టుబడులు తడిసి మోపెడవుతుండగా మామిడికి మాత్రం ధర పెరగడం లేదు. – యర్రంశెట్టి రవితేజ, నూజివీడు నిరాశాజనకంగా ధరలు ఈ ఏడాది కాపు తక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటుందని అనుకున్నాం. అయితే ఇప్పుడు పరిస్థితిని చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సేట్లందరూ సిండికేట్ అయ్యి ధరను తగ్గించేస్తున్నారు తప్పితే పెంచడం లేదు. దీంతో పెట్టుబడులు ఏ మాత్రం రావు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. – బాణావతు రాజు, లైన్తండా, నూజివీడు మండలం నూజివీడు: మామిడి దిగుబడి ఈ ఏడాది తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందన్న మామిడి రైతుల, తోటలు కొనుగోలు చేసిన వ్యాపారుల ఆశలు అడియాశలవుతున్నాయి. పండ్లలో రారాజుగా కీర్తిని సంపాదించుకున్న మామి డిని సాగు చేసిన రైతులకు నష్టాలను పంచుతోంది. రోజురోజుకూ మామిడి ధరలు పతనమవుతుండటంతో ఏంచేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో మామిడి రైతులు, వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. మామిడి దిగుబడి ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో మామిడి ధరలు బాగానే ఉన్నా రానురానూ పతనమవుతూ రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. కాయలకు డిమాండ్ ఉన్నా ధర మాత్రం పెరగడం లేదు. దీనంతటికీ మామిడి కాయలు కొనుగోలు చేసే సేట్లు సిండికేట్ కావడమే కారణమని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు ఈదురుగాలులు వీచి ఉన్న కాయలు ఎక్కడ రాలిపోతాయోనని రైతులు, తోటలు కొనుగోలు చేసిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభంలో రూ.1.20 లక్షలు మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో ముంబై మార్కెట్లో బంగినపల్లి రకం టన్ను రూ.1.20 లక్షల ధర పలికింది. క్రమేణా ఆ ధర రూ.90 వేలకు, రూ.60 వేలకు తగ్గి ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. దీంతో కిరాయిలు, కోతఖర్చులు పోను రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కలెక్టర్ (తోతాపురి) రకం పరిస్థితి సైతం అలాగే ఉంది. టన్ను ధర రూ.9 వేల నుంచి రూ.11 వేలు మాత్రమే లభిస్తోంది. పెట్టుబడులు పెరగడం, దిగుబడి పడిపోవడం, ధర తగ్గడంతో తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు లబోదిబోమంటున్నారు. స్థానిక మార్కెట్లలో సైతం.. మామిడి దిగుబడి లేనప్పటికీ స్థానికంగా ఏర్పాటు చేసిన కమీషన్ దుకాణాల్లో కూడా ధర తక్కువగానే ఉంది. ఆగిరిపల్లి మండలం ఈదర, ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం, విస్సన్నపేటలో మామిడి కమీషన్ దుకాణాలు ఉన్నాయి. అక్కడ కూడా బంగినిపల్లి టన్నుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల ధర మాత్రమే లభిస్తోంది. అలాగే తోతాపురికి రూ.9 వేలు లభిస్తోంది. లోకల్ దుకాణాల్లో సూటు పేరుతో టన్నుకు 100 కిలోల కాయలను తీసుకుంటున్నారని, కమీషన్ 10 శాతం వసూలు చేస్తున్నారని, వీటితో పాటు హమాలీ చార్జీలు తీసుకుంటుండటంతో రైతుకు మిగిలేది ఏమీ ఉండటం లేదని రైతులు అంటున్నారు. విజయవాడ సమీపంలోని నున్న మార్కెట్కు కాయలను తరలించే వారే కనిపించడం లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి మామిడి రైతులకు ఈ ఏడాది ఆదాయం పూర్తిగా పడిపోయిన క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాలనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన పంటలకు మాదిరిగా మామిడికి కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మామిడి పంట లాటరీగా మారిందని, ఇవే పరిస్థితులు కొనసాగితే రాబోయే రోజుల్లో మామిడి పంట మనుగడ ప్రశ్నార్థకరంగా మారనుందని వాపోతున్నారు. మామిడి.. తడబడి బంగినపల్లి, కలెక్టర్ రకాల ధరలు దారుణం దిగుబడి తక్కువే.. ధరా తక్కువే.. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల డిమాండ్. కాపు కలవరపాటు మామిడికి పెట్టింది పేరైన నూజివీడు నియోజకవర్గంతో పాటు చింతలపూడి ప్రాంతంతో కలుపుకుంటే జి ల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పూతలు బాగా వచ్చినా అందులో 20 శాతం కూడా పిందె నిలవలేదు. దీంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. అయితే దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర బాగా ఉంటుందనుకుంటే అది కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు
డీఎస్పీ ప్రసాద్ హెచ్చరిక నూజివీడు : మైనర్లకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వొద్దని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి మైనర్లు నడుపుతున్న ద్విచక్ర వాహనలను స్వాధీనం చేసుకున్నారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పట్టణ పోలీస్స్టేషన్కు పిలిపించి శనివారం రాత్రి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వడం, నడపమని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపైనా, వాహన యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్ల డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఎవరైనా మైనర్లు బైక్లు నడుపుతుంటే రూ.5 వేల జరిమానాతో పాటు బైక్ను స్వా ధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మైనర్ల డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పట్టణ సీఐ పి.సత్యశ్రీనివాస్ను అభినందించారు. నేడు ఇన్చార్జి మంత్రి రాక ఏలూరు (మెట్రో): జిల్లా ఇన్చార్జి మంత్రి నా దెండ్ల మనోహర్ సోమవారం జిల్లాకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 22న బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం, రౌతుగూడెం, బర్రెంకలపాడు, చంద్రన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పా ల్గొంటారు. కేఆర్పురంలోని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు. 23న పులిరామన్నగూడెం, బుట్టాయగూడెంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఏలూరు చేరుకుని కలెక్టరేట్లో జరిగే ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. మాలలకు కూటమి ద్రోహంపెనుగొండ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ను తక్షణం ఉపసంహరించుకోవాలని మాల సంఘాల జేఏసీ నాయకుడు ఉన్నమట్ల మునిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆచంట మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొడమంచిలి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాలల ఆక్రోశానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి కులాల మధ్య చిచ్చుపెట్టడమే తప్ప సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వానికి చేతకాదని విమర్శించారు. ఆర్డినెన్స్కు టీడీపీ మాల నాయకులు మ ద్దతు పలకడం మాలజాతికి ద్రోహం చేసినట్లేన ని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ సుంకర సీతారామ్, గౌరవాధ్యక్షుడు బీరా మధు, మండల జేఏసీ నాయకుడు కోట వెంకటేశ్వరరావు, జెంట్రీ శ్రీను, మట్టా చంటి, గుండే నరేష్ తదితరులు పాల్గొన్నారు. పేద ముస్లింల కోసమే వక్ఫ్ చట్టం భీమవరం: పేద ముస్లింలకు న్యాయం జరగాలనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ ముద్రించిన వక్ఫ్ సవరణ చట్టం ప్రయోజనాలను తెలియజెప్పే కర పత్రాలను ఆయన ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 20 వేల కరపత్రాలను అన్ని మండలాల అధ్యక్షులకు పంపిస్తామని, ముస్లింలలో ఈ చ ట్టంపై ఉన్న సందేహాలు తొలగిపోయేలా అన్ని వివరాలు ఇందులో పొందుపరిచినట్టు జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. -
వాచ్మేనే వైద్యుడు
పెనుగొండ: అది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్.. జనరల్ ఫిజీషియన్ తప్ప మిగిలిన అన్ని విభాగాల్లోనూ వైద్యులు ఉన్నారు. అయితే ఆదివారం, పండుగ రోజుల్లో వైద్యులు అందుబాటులో ఉండరు. నర్సులు కనీసం ప్రథమ చికిత్స కూడా చేయరు. దీంతో బాధితులకు వాచ్మేన్ వైద్యం అందిస్తుంటారు. ఇది పెనుగొండ సీహెచ్సీలో పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. ములపర్రులో ఆదివారం బాలుడు శ్రీనివాస్ సైకిల్పై వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో తలకు గాయమైంది. దీంతో శ్రీనివాస్ ను మేనమామ ప్రదీప్ మోటార్సైకిల్పై పెనుగొండ సీహెచ్సీకి తీసుకువచ్చారు. ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోగా కనీసం నర్సులు బాలుడిని పరీక్షించి ప్రథమ చికిత్స అందించే పరిస్థితి లేకపోవడంతో అవాక్కయ్యారు. నర్సులు కనీసం చూడకపోవడంతో వాచ్మేన్ వచ్చి గాయపడిన బాలుడి తలను శుభ్రం చేసి బ్యాండేజ్ వేశారు. నర్సులు బాలుడిని కనీసం ముట్టుకోకుండా మందులు ఇచ్చి పంపించడం విశేషం. ఇది దారుణమంటూ బాలుడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. వాచ్మేన్ వైద్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్ కా వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. -
నేడు నూజివీడులో బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
నూజివీడు: నూజివీడులోని వీటీహెచ్ గ్రౌండ్లో ఈనెల 20న ఉదయం 7 నుంచి బాస్కెట్బాల్ ఉమ్మడి కృష్ణాజిల్లా సబ్జూనియర్, జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ సుభాష్ చంద్రబోస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని, ఆధార్ కార్డు, పాస్పోర్టు, స్టాంపు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు. సబ్జూనియర్ విభాగంలో పాల్గొనేందుకు 2012 జనవరి ఒకటి, జూనియర్ విభాగంలో పాల్గొనేందుకు 2008 జనవరి ఒకటి తరువాత జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపిక చేసిన జట్లు మే 15 నుంచి 18 వరకు చిత్తూరులో నిర్వహించే 8వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ నందు, అలాగే జూన్లో నిర్వహించే 10వ ఏపీ స్టేట్ జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. -
గుడ్ఫ్రైడే వేడుకల్లో అపశ్రుతి
పేరుపాలెం బీచ్లో స్నానానికి దిగి ఒకరి మృతి నరసాపురం రూరల్ : క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించి జరుపుకునే గుడ్ఫ్రైడే వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పేరుపాలెం బీచ్లో స్నానానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 40 రోజుల ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన విశ్వాసులు పేరుపాలెం తీరంలోని వేళాంకణ్ణి మాత ఆలయం వద్ద మాల విరమణ చేసేందుకు శుక్రవారం రాత్రినుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇందులో శనివారం వేకువ జామున సముద్రస్నానానికి దిగిన ఇద్దరు యువకులు సముద్రపు అలలకు ఉక్కిరి బిక్కిరై ఒడ్డుకు ప్రాణాలతో కొట్టుకు వచ్చారు. వీరిలో నల్లజర్ల మండలం ప్రకాశపాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్కుమార్ (19) అనే యువకుడిని స్థానికులు, పోలీస్ సిబ్బంది మొగల్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉండటంతో నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయకుమార్ తండ్రి చిన్న తనంలోనే మృతి చెందగా తల్లి విజయలక్ష్మి బిడ్డను చూసుకుంటోంది. ఈ ఘటనపై మృతుడి అక్క విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్తూరు 2వ ఎస్సై వై నాగలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే ప్రమాదంలో బయట పడిన మరో వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కుటుంబ సభ్యులు భీమవరంలో చికిత్స చేయించి సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. -
జేఈఈ మెయిన్స్లో శశి వేలివెన్ను విజయభేరి
ఉండ్రాజవరం: జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో మరోసారి సత్తా చాటారని వేలివెన్ను శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శనివారం తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీల్లో జి.అనూప్రాజ్ 26, డి.మణికంఠరెడ్డి 63, ఎ.శివరామ్ 142, బి.నిఖిల 159, ఏఎల్ జ్ఞాన ప్రకాష్ 168, కె.జైకిశాన్ 225, కె.ఆనంద్ 266, ఎం.సాయి కిరణ్ 292, పి.సుకుమార్ 363, పీవై సుందరరెడ్డి 436, డి.శర్వాన్ 448, ఐ.రామచరణ్ 477, కె.శివ సత్యదేవ్ 543, సీహెచ్ యశస్విని 623, షేక్ అబ్దుల్ వహబ్ 671, కె.ఆనంద్పాల్ 756, కె.ఉజ్వల్ కిరణ్ 859, కె.చరణ్దీప్ 871, బి.చైతన్య 913 ర్యాంకులు సాధించారని వివరించారు. 100 లోపు ఇద్దరు, 500 లోపు 12 మంది, 1,000 లోపు 19 మంది, 5,000 లోపు 58 మంది, 10,000 లోపు 101 మంది, 15,000 లోపు 134 మంది, 20,000 లోపు 161 మంది, 30,000 లోపు 219 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని విద్యా సంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు. శ్రీషిర్డీసాయి విద్యార్థుల ప్రతిభకంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాల్లో శ్రీ షిర్డీసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ విషయాన్ని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య శనివారం విలేకరులకు తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీసాయి హిమ్నీష్ జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడన్నారు. సీహెచ్ మోక్షిత్ 35, ఎం.మధులిక రెడ్డి 169, మోహన్ శ్రీరామ్ జీ 287 ర్యాంకులు కై వసం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనపరచారన్నారు. మొత్తం 10 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించగా, 23 మంది 2,000 లోపు, 45 మంది 5,000 లోపు, 64 మంది 10,000 లోపు, 88 మంది 20,000 లోపు ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. మొత్తం 245 మంది విద్యార్థులు హాజరుకాగా 186 మంది విద్యార్థులు అడ్వాన్స్కు అర్హత సాధించారన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ చంద్రశేఖర్ అభినందించారు. -
శ్రీవారి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దివ్య క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు వెలువడటంతో వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. భక్తులతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద ఉచిత అన్నప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. పార్కింగ్ ప్రదేశాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
వాహన దొంగల అరెస్టు
కై కలూరు: వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇరువురు స్థానిక దొంగలను కలిదిండి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కలిదిండి పోలీసు స్టేషన్లో రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్, ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. పేట కలిదిండికి చెందిన వనమాల జగదీష్(31), కలిదిండికి చెందిన చేబోయిన శ్యాంతేజా(28) ఇటీవల ఈ ప్రాంతంలో 5 వాహనాలను దొంగతనం చేశారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు వీరిని అదుపులోకి తీసుకుని మొత్తం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల విలువ మార్కెట్లో రూ.3.50 లక్షలు ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ఏఎస్సై కె.వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు బి.రమేష్, డి.వడ్డీ కాసులు, హోంగార్డు కట్టా శ్రీనులను సీఐ రవికుమార్ అభినందించారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి భీమవరం: మోటారుసైకిల్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై ఇజ్రాయిల్ శనివారం చెప్పారు. వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న రాజమహేంద్రవరానికి చెందిన ఎం జ్ఞానసాగర్(21) శుక్రవారం రాత్రి తన స్నేహితుడు కె సాయిభరత్తో కలసి గరగపర్రు రోడ్డులోని తన రూమ్ నుంచి మోటారు సైకిల్పై పట్టణంలోకి వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మోటారుసైకిల్ను తప్పించబోయి అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మోటారుసైకిల్ నడుపుతున్న జ్ఞానసాగర్ తలకు తీవ్ర గాయాలు కాగా సాయిభరత్కు స్వల్పగాయలయ్యాయి. వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా జ్ఞానసాగర్ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సాయిభరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇజ్రాయిల్ చెప్పారు. ప్రేమ పేరిట మోసం.. యువకుడి అరెస్ట్ ఉంగుటూరు: ప్రేమ పేరిట మోసం చేసిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై సూర్యభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలుకు చెందిన పొట్ల పండుబాబు అదే గ్రామానికి చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అనంతరం పండుబాబు ఆమెను మోసం చేసిన నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పండుబాబును అరెస్ట్ చేసి కోర్టుకు పంపగా రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు. -
మా రొయ్యను మేమే అమ్ముకుంటాం
పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రోడ్డెక్కినా ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో రైతులు తమ పంటను తామే విక్రయించుకోవాలనే సంకల్పంతో డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం శనివారం పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్ రోడ్డు నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లే మార్గ మధ్యలో ఓ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘ సెక్రటరీ బోణం చినబాబు మాట్లాడుతూ ప్రాసెసింగ్ ప్లాంట్లపై ఆధారపడి ఇప్పటివరకూ ఆక్వా రైతులు చాలా నష్టపోయారన్నారు. డొమెస్టిక్ సేల్స్ కేంద్రం ఇటు వినియోగదారుడు, అటు ఆక్వా రైతుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అలాగే కొందరు మహిళలకు ఉపాది కూడా కల్పించినట్లు అవుతుందన్నారు. ఈ నెల 30 వ తేదీన శంకుస్థాపన చేస్తామని, అనంతరం మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పక్కాగా ప్రారంభోత్సవం చేయాలనే సంకల్పంతో తమ సంఘం ఉందన్నారు. ప్రారంభం అయిన వెంటనే ఇక్కడ రూ.100కు రొయ్యలను అందజేస్తామన్నారు. అంతా రెడీ కుక్లా ప్యాకింగ్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా రైతు 100 కౌంట్కు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్న సమయంలో నేరుగా ఈ కౌంటర్ వద్దకు తీసుకువచ్చి తన రొయ్యను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. లోకల్ సేల్స్ పెరిగిందంటే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసే కౌంటర్ మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కూడా అమలైందంటే ఈ కార్యక్రమం విజయవంతమైనట్టేనని అన్నారు. ఆక్వా సంఘ సభ్యులు మేడిది జాన్రాజు, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం ఏర్పాట్లు చేస్తున్న జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం -
ఒలింపియాడ్లో 29 మంది విద్యార్థులకు ర్యాంకులు
తాడేపల్లిగూడెం రూరల్: ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ సంస్థ (గురుగ్రామ్) వారు నిర్వహించిన గణిత, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, జనరల్ నాలెడ్జ్ పరీక్షల్లో మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ బి.రాజారావు శనివారం తెలిపారు. మ్యాథ్స్ ఒలింపియాడ్లో 30 మందికి గాను ఐదుగురు, ఇంగ్లీష్ పరీక్షలో 20 మందికి గాను ముగ్గురు, సైన్స్ పరీక్షలో 62 మందికి గాను 12 మంది, జనరల్ నాలెడ్జ్లో ముగ్గురికి ముగ్గురు ఇంటర్నేషనల్, సోషల్ విభాగంలో 34 మందికి గాను ఆరుగురు ఇంటర్నేషనల్ ర్యాంకులతో పాటు జోనల్, క్లాస్ ర్యాంకులు, గోల్డ్ మెడల్స్ సాధించినట్లు వివరించారు. సైన్స్ ఒలింపియాడ్లో రోషన్ (ఏడవ తరగతి), పృధ్వీ (8వ తరగతి), చిగురుపల్లి వివేక్ (9వ తరగతి), పిట్టా తంబి, అరవింద్ సాగర్బాబు (10వ తరగతి) మొదటి ర్యాంకులు సాధించారన్నారు. అలాగే ఇంగ్లీష్ ఒలింపియాడ్లో కంకిపాటి శాండీ రేవంత్ (8వ తరగతి) మొదటి ర్యాంకు సాధించినట్లు తెలిపారు. మొత్తం 149 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 29 మంది ప్రతిభ కనబర్చారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయాధికారిణి బి.ఉమాకుమారి, ప్రిన్సిపాల్ బి.రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ బి.ప్రతాప్, ఉపాధ్యాయులు అభినందించారు. -
పేదల ఇళ్ల తొలగింపు దుర్మార్గం
భీమవరం: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను తొలగించడానికి అక్కడి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక శాఖను అప్పగించినట్టుగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరామ్ దుయ్యబట్టారు. పేదల ఇళ్ల తొలగింపును నిరసిస్తూ శనివారం భీమవరం ప్రకాశంచౌక్లో నిరసన తెలిపారు. పాలకోడేరు మండలంలో ఎన్నో ఏళ్లుగా పేదలు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తుంటే అధికార దురహంకారంతో ఉండి ఎమ్మెల్యే దుర్యోధన పర్వానికి తెరదీశారని మండిపడ్డారు. ఇళ్లు తొలగింపు సందర్భాల్లో భౌతిక దాడుల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో పేదలపై దాడులు, దౌర్జన్యాలు తప్ప ఒనగూరిందేమి లేదన్నారు. పాలకోడేరులో పుంత పొడవునా సుమారు 50 సెంట్ల పోరంబోకు భూమిని పెత్తందారులు ఆక్రమించుకుని పొలాల్లో కలిపేసుకున్నారని, వారి జోలికి వెళ్లే దమ్ము ఉండి ఎమ్మెల్యేకు లేదని విరుచుకుపడ్డారు. పేదలపై ప్రభుత్వ వైఖరి ఇలానే కొనసాగితే ప్రభుత్వ పతనం తప్పదని గ్రహించాలన్నారు. సీపీఎం జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం. వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డి.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. బొండాడలో నిరసన కాళ్ల: పేదల ఇళ్ల తొలగింపు దారుణమని సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ అన్నారు. శనివా రం బొండాడలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పోలీసులు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఇంత దారుణానికి ఒడిగట్టడం సరికాదన్నారు. ఇ లానే ఇళ్లు కూల్చుకుంటే పోతే రానున్న రోజుల్లో ఉండి నియోజకవర్గం శ్మశానంగా మారుతుందన్నా రు. పేదలంటే చులకనగా చూస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
విలీన మండలాల్లో కరెంట్ కష్టాలు
కుక్కునూరు: విలీన మండలాలను విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. వేసవి వచ్చిందంటే విద్యుత్ సమస్యతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి కుక్కునూరు మధ్యలో ఎక్కడ బలంగా గాలులు వీచినా గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో సరఫరా పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి రావాల్సిందే.. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు విద్యుత్ సబ్స్టేషన్లకు జంగారెడ్డిగూడెంలోని 132 కేవీ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కుక్కునూరు మండలంలోని 33 కేవీ సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా కావాలంటే జంగారెడ్డిగూడెం నుంచి మైసన్నగూడెం, ములగలంపల్లి, పి.నారాయణపురం, రాచన్నగూడెం, వేలేరుపాడు గ్రామాల్లోని సబ్స్టేషన్ల నుంచి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ మధ్యలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఏర్పడినా విలీన మండలాల ప్రజలు చీకట్లలో మగ్గాల్సిందే. అటవీ ప్రాంతం కావడంతో.. జంగారెడ్డిగూడెం నుంచి కుక్కునూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరం. ములగలంపల్లి నుంచి కుక్కునూరు మధ్య అటవీ ప్రాంతం మీదుగా విద్యుత్ లైన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం కావడంతో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుండటంతో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రా విలీనమైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య తీవ్రంగా మారింది. దీనిపై పలుమార్లు ప్రజలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. అల్లూరి జిల్లాలోని ఎటపాక 132 కేవీ సబ్స్టేషన్ నుంచి గోదావరి మీదుగా టవర్లు ఏర్పాటు చేసి విద్యుత్ను అందించాలని, లేకుంటే వేలేరుపాడు మండలంలోని మేడిపల్లి వద్ద 132 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటుచేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఆ దిశగా అధికారులు కూడా సర్వే చేసినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఈదురుగాలులతో తరచూ నిలిచిపోతున్న విద్యుత్ జంగారెడ్డిగూడెం నుంచి సరఫరాలో అవాంతరాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న ప్రజలు లోఓల్టేజీ సమస్య తెలంగాణలో ఉన్నప్పుడు సమస్య వస్తే బూర్గంపాడు నుంచి లేకపోతే అశ్వారావు పేట నుంచి విద్యుత్ సరఫరా చేసేవారు. అయితే ఆంధ్రప్రదేశ్లో విలీనమైనప్పటి నుంచి లోఓల్టేజీ సమస్య వేదిస్తోంది. ఇప్పటికీ మా ఊరిలో లోఓల్టేజీతో గృహోపకరణాలు సరిగా పనిచేయడంలేదు. దీనిపై గ్రీవెన్స్లో దరఖాస్తు చేసినా ఫలితం లేదు. – నకిరికంటి వెంకటేశ్వర్లు, కొండపల్లి, కుక్కునూరు గంటల తరబడి అంతరాయం వేసవి కాలం వచ్చిందంటే విద్యుత్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. గడిచిన వారం రోజుల్లో కూడా రాత్రి మొత్తం విద్యుత్ సరఫరా లేక పిల్లాపాపలతో చాలా ఇబ్బంది పడ్డాం. పోలవరం ప్రాజెక్టు పేరుతో మా మండలాలను విలీనం చేసుకుని మా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. – పేరాల నరసింహారావు, కొండపల్లి, కుక్కునూరు -
ఆ ఊరంతా నారసింహులే..
నంబర్తో పిలిచేవారు మా గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో రాజవరంలోని పాఠశాలకు వెళ్లి చదువుకునే వాళ్లం. మా గ్రామం నుంచి వెళ్లిన వారిలో ఎక్కువ మంది నరసింహమూర్తి పేరుగల వారం ఉండేవారం. దాంతో ఉపాధ్యాయులు ఒకటి, రెండు, మూడు ఇలా పది మందికి నంబర్లు పెట్టారు. అటెండెన్స్ వేసేటప్పుడు కూడా ఒకటి గాడు వచ్చాడా.. రెండు గాడు వచ్చాడా.. అని పిలిచేవారు. నా నంబర్ ఏడు కాబట్టి నన్ను ఏడు గాడు వచ్చాడా అని పిలిచేవారు. – పసుపులేటి నరసింహమూర్తి ఆనవాయితీగా మారింది లక్ష్మీనరసింహ స్వామివారి పేరును పిల్లలకు పెట్టడం ఈ గ్రామంలో ఆనవాయితీగా మారింది. ఆ క్రమంలోనే నా తల్లిదండ్రులు నాకు నరసమ్మ అని పేరు పెట్టారు. లక్ష్మీనరసింహ స్వామివారిపై ఉన్న భక్తి, నమ్మకంతో ఆయన పేరును నామకరణం చేస్తున్నారు. ఆ స్వామి పేరులోనే ఏదో మహత్యం ఉంది. – బోయిన నరసమ్మ నా మనుమరాలికి కూడా స్వామి పేరే పెడతా.. నా తండ్రి పేరు నరసయ్య, నా భార్య పేరు లక్ష్మీ నరసమ్మ, నా కుమార్తె పేరు నాగవెంకట నరసమ్మ. నా మనుమరాలికి మరి కొద్దిరోజుల్లో పేరు పెట్టాల్సి ఉంది. ఆమె పేరు కూడా స్వామివారి పేరే పెడతాను. నా పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో గ్రామంలో నన్ను ఒకటి గాడు అని పిలుస్తారు. – ముత్తింటి నరసింహమూర్తి ద్వారకాతిరుమల: ఆ ఊరిలో వెలసిన నారసింహుడంటే వారికెంతో నమ్మకం. ఆ ఊరిలో మగబిడ్డ పుట్టినా.. ఆడ బిడ్డ పుట్టినా.. ఆ స్వామివారి పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ ఊరిలో ఏ గడప తొక్కినా.. నరసింహ, నరసయ్య, నరసింహమూర్తి, నరసింహస్వామి, లక్ష్మీనరసమ్మ, నరసమ్మ వంటి పేర్లే వినిపిస్తాయి. ఇప్పటికే నరసింహమూర్తి పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో కొంత మందిని నంబర్లతో పిలుస్తున్నారు. ఇదే ఈ ఊరి ప్రత్యేకత. ఇక్కడ ఏ ఇంట శుభకార్యం జరగాలన్నా ముందు ఆ స్వామిని దర్శించి, పూజలు జరుపుకుంటారు. ఆ తరువాతే అడుగు ముందుకు వేస్తారు. ఎన్నికల సమయాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ ఊరి నుంచే ప్రచారాలను మొదలు పెడతారు. ఎందుకంటే ఈశాన్యం మూల ఉన్న ఊరు ఇది.. అందులోనూ నారసింహుని సన్నిధి నుంచి ప్రచారం మొదలు పెడితే ఇక తిరుగు ఉండదన్న నమ్మకం వారిది. అందరికీ అంత సెంటిమెంట్ ఆ స్వామివారంటే. ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురం గ్రామం నారసింహుని క్షేత్రంగా విరాజిల్లుతోంది. సుమారు వెయ్యి మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో, రెండు వందల మందికి పైగా స్వామివారి పేరుగల వారు ఉన్నారంటే అతిశయోక్తికాదు. నామకరణం వెనుక చరిత్ర ఇదీ.. సుమారు వందేళ్ల క్రితం అప్పటి ఠాణేదారు అయిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చర్లకోట రామారావు, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెంది గూడూరు అయ్యన్న, బెల్లన్న అరణ్యప్రాంతమైన ఈ మార్గం గుండా వెళుతున్నారు. కొందరు పశువుల కాపర్లు కొండపైన ఏదో ఉందని, అప్పుడప్పుడు పశువుల కోసం కూత వేస్తుంటే తిరిగి కూత వినిపిస్తోందని వారికి చెప్పారు. దాంతో వారు డొంకలు నరుక్కుంటూ కొండపైకి చేరుకుని అక్కడ స్వయంభూ నరసింహ స్వామిని గుర్తించి పాల పొంగలిచేసి స్వామివారికి నివేదించారు. ఆ వెంటనే మండు వేసవి రోజున వర్షం కురిసింది. దాంతో స్వామివారు ఎంతో మహిమాన్వితుడని రామారావు నమ్మారు. తనకు సంతానం లేకపోవడంతో స్వామివారిని మొక్కుకున్నారు. దాంతో ఆయనకు కలిగిన మొదటి సంతానమైన కుమారుడికి స్వామివారి పేరు పెట్టుకుని, ఇలవేల్పుగా కొలిచారు. ఆ తర్వాత ఆయన మనుమడికి సైతం కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆయనే గురూజీగా ప్రతి ఏటా శివరాత్రి నాడు ఈ నారసింహుని క్షేత్రంలో మహా యజ్ఞాన్ని నిర్వహిస్తూ, స్వామివారి కీర్తిని చాటుతున్నారు. తికమక పడకుండా నరసింహమూర్తి పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో పిలిచేవారు అలాగే పలికేవారు తికమక పడేవారట. దాంతో వారు చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు కొంత మంది నరసింహమూర్తులకు నంబర్లు పెట్టారు. ఒకటి గాడు, రెండు గాడు, మూడు గాడు ఇలా పది నంబర్ల వరకు పెట్టారు. క్లాస్కి వచ్చే ఉపాధ్యాయులు ఏరా.. ఒకటి గాడు వచ్చాడా.. రెండు గాడు వచ్చాడా.. అని పిలిచేవారట. ఇప్పటికీ గ్రామంలో వారిని ఆ నంబర్లతోనే పిలుస్తుండటం విశేషం. పుట్టిన ప్రతి బిడ్డకూ నరసింహ నామకరణం నరసింహమూర్తి, నరసమ్మల పేర్లే అధికం ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండటంతో నంబర్లతో పిలుపు ఐఎస్ జగన్నాధపురంలో అదే ప్రత్యేకత లక్ష్మీనరసింహ స్వామివారే ఆ గ్రామ ప్రజల ఆరాధ్య ధైవం ప్రతి ఇంట్లోనూ నారసింహుని పేరుతో.. నా పేరు పసుపులేటి నరసింహమూర్తి. నా కుమార్తెకు కూడా నరసమ్మ అని పేరుపెట్టాను. ఆ లక్ష్మీనరసింహ స్వామివారిని మదినిండా నింపుకున్నాం. అందుకే మా గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ నారసింహుని పేరుగల వారు ఉంటారు. – పసుపులేటి నరసింహమూర్తిఎక్కడా ఇలా లేదు ఎన్నో గ్రామాల్లో క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఎక్కడా దేవుళ్ల పేరును ఇంతిలా పెట్టుకున్న వారు లేరు. నరసింహమూర్తి అనే పేరు ఎంత మందికి ఉన్నా.. ఇంకా పుడుతున్న బిడ్డలకు ఆ పేరునే పెట్టుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొందరు ఆడపిల్లలకు నర్సవేణి, నకవల్లి పేర్లు కూడా పెడుతున్నారు. అందుకే ఈ గ్రామ ప్రజలపై స్వామివారి కృపా కటాక్షాలు ఉంటున్నాయి. – కోడూరి ఈశ్వర శర్మ, లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు -
ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో శనివారం క్రైస్తవులు నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ వసంతమహల్ సెంటర్, జ్యూట్మిల్లు, ఓవర్బ్రిడ్జి, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ఇండోర్ స్టేడియం వద్దకు చేరింది. ముఖ్య అతిథులుగా ఐసీఎం సంఘాల అగ్రపీఠాధిపతి బిషప్ జాన్ ఎస్డీ రాజు, మన్నా చర్చ్ బిషప్ ఎలీషా రాజు హాజరయ్యారు. రన్ ఫర్ జీసస్ క్రైస్తవ సమాజంలో భాగమైపోయిందని, రాబోయే సంవత్సరాల్లోనూ కొనసాగించాలని బిషప్ జాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితానికి అద్దం పడుతుందని బిషప్ ఎలీషా రాజు అన్నారు. ఇదే క్రమశిక్షణను క్రైస్తవులు నిరంతరం కొనసాగించాలని అమలోధ్బవి కథీడ్రల్ గురువులు ఫాదర్ మైఖేల్ ఇంజమాల అన్నారు. శ్యామ్ బాబు, రాజకుమార్ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లూథరన్ సంఘ సీనియర్ గురువులు మిల్టన్, పీపీఎస్ కిరణ్, ఎంఎం కుమార్, యు.విలియమ్ కేరీ, పి.శ్యామ్ పాలీనా తదితరులు సందేశాలు అందించారు. ఫైర్స్టేషన్ సెంటర్లో మానవహారం చేపట్టి డి.యోబు, కె.కిరణ్, జెర్మియా, కె.డేవిడ్ తదితరులు ప్రార్థనలు చేశారు. వందలాది మంది క్రైస్తవులు ర్యాలీలో పాల్గొన్నారు. -
నూక శాతం పేరుతో రైతులకు ఇబ్బందులు
ఏలూరు (టూటౌన్): ధాన్యంలో నూక శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, కృష్ణా డెల్టా పరిధిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పెసలు అమ్మిన రైతులకు బకాయిలు చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. ఏలూరు అన్నే భవనంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం తడిచినా, అధికంగా ఆరబెట్టినా ఒక వైపు తేమ శాతం, మరో వైపు నూక శాతం వంటి నిబంధనలు రైతులకు శాపంగా మారాయన్నారు. కొనుగోలు నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశారు. రైతులు పెసలు అమ్మి 20 రోజులు గడించిందని, ప్రభుత్వం వెంటనే సొమ్ములు విడుదల చేయాలని కోరారు. నాయకులు చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఉపాధి రుణాలకు దరఖాస్తులు ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఎస్సీల స్వయం ఉపాధి యూనిట్లకు రాయితీతో కూడిన రుణాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,111 మంది లబ్ధిదారులకు రూ.46.44 కోట్లు రుణాలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ కింద రూ.25.77 కోట్లు మంజూరు చేసిందన్నారు. అభ్యర్థులు మే 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్థిక స్వావలంబన కోసమే పథకాలు ఏలూరు (టూటౌన్): అట్టడుగు ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయని ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. నగరంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో ఉమ్మడి జిల్లాలో పథకాలు అమలుచేసే అధికారులతో సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ సంస్థల సమన్వయంతో పథకాలు అమలు చేసి ప్రజల సంక్షేమం, సమాజాభివృద్ధికి కృషిచేయాలన్నారు. ప్రజలు పథకాలను పొందటంలో న్యాయ సమస్యలు ఎదురైతే న్యాయ సేవాధికార సంస్థలను 08812 22455 లేదా 15100 టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఏలూరు ఆర్డీఓ అంబరీష్ మాట్లాడుతూ సాంకేతిక లోపాలతో తాత్కాలికంగా కొందరికి పథకాలు అందడం లేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. భీమవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులను ఎంపిక చేసి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్తున్నామన్నారు. లీగల్ లేడి చీఫ్ రేగలే డిఫెన్స్ కౌన్సిల్ పీఎన్వీ మునీశ్వరరావు, న్యాయవాది పి.రత్నరాజు అధికారులు పాల్గొన్నారు. పథకం ప్రకారం బీజేపీ ఆరోపణలు టీడీపీ నేతల ఆగ్రహం లింగపాలెం: బీజేపీ మండల నాయకులు ఒక పథకం ప్రకారమే విలేకరుల సమావేశం పెట్టి తమపై ఆరోపణలు చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ నేతలు విలేకరుల సమావేశంలో చేసిన విమర్శలపై శనివారం వారు స్పందించారు. మండలంలోని ధర్మాజీగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమిలో భాగమైన బీజేపీకి చెందిన కొందరు నాయకులు టీడీపీ నాయకులపై నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. టీడీపీ మండలాధ్యక్షుడు గరిమళ్ల చలపతిరావు, సీనియర్ నాయకుడు గుత్తా సాయి సత్యవరప్రసాద్ (పెదబాబు)లపై రేషన్, మట్టి మాఫియా, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించడం సరికాదన్నారు. పార్టీ అధిష్టానం అంతర్గతంగా జరిగే అన్ని విషయాలను పరిశీలిస్తుందని, పార్టీ ఆదేశాలను ధిక్కరించేవారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోదని స్పష్టం చేశారు. జర్మన్ భాషపై శిక్షణ ఏలూరు (టూటౌన్): బీఎస్సీ నర్సింగ్ జీఎన్ఎం పూర్తిచేసిన యువకు 8 నెలలపాటు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ, భోజన నివాస సదుపాయాలు కల్పిస్తున్నట్టు డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు శనివారం ప్రకటనలో తెలిపారు. బి2 లెవిల్ పరీక్ష ద్వారా జర్మనీలో ఉద్యోగావకా శాలు పొందవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 21న గుంటూరులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 90307 44877, 98666 56743 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
కంటి వెలుగు లేదు
గత ప్రభుత్వంలో పెద్దపీట ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కంటి పరీక్షలు కొనసాగించాలి గతంలో ఆస్పత్రిలోని ఈఐ కేంద్రంలో, పాఠశాలలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి కంటి పరీక్షలు చేసేవారు. మందులు, కళ్లజోళ్లు ఇవ్వడంతో పాటు శస్త్రచికిత్సలు చేసేవారు. ఇలానే సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం చొరవ చూపాలి. – వర్ధనపు సుధాకర్, రుస్తుంబాద పేదలకు ఇబ్బంది ఈఐ కేంద్రాల్లో కంటి పరీక్షలు నిలిపివేయడంతో పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సేవలందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటంతో పరీక్షలకు చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. – కురెళ్ల పౌలు, దుంపగడప, ఆకివీడు మండలం సాక్షి, భీమవరం: పేదల కంటి వైద్యానికి కూటమి ఎగనామం పెట్టింది. సీహెచ్సీల్లోని ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల కాంట్రాక్టు గడువు ముగిసి ఎనిమిది నెలలుగా సేవలు నిలిచినా పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అంతంతమాత్రంగానే ఉండటంతో పేదవర్గాలు కంటి పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో.. జిల్లాలోని భీమవరం, ఆచంట, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ల్లో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా ప్రజలకు ఉచితంగా కంటి వైద్యసేవలు అందించే వారు. ప్రభుత్వం ఈ కేంద్రాల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఒక్కో కేంద్రంలో ఒక ఆఫ్త్త మాలజీ అసిస్టెంట్, ఒక ఎక్యూప్మెంట్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేవారు. ఆధునాతన ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, కంటి లోపల భాగాలను పరీక్షించే ఫండస్ కెమెరాలతో కంప్యూటర్ ద్వారా డీఆర్, గ్లకోమా, కాటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్, హైపర్టెన్సీవ్ రెటీనోపతి తదితర సుమారు రూ.3 వేల విలువైన పరీక్షలు చేసేవారు. అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందించేవారు. కంటి సమస్యలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్య నిమిత్తం సమీపంలోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులకు పంపేవారు. 8 నెలలుగా నిలిచిన సేవలు కాంట్రాక్టు సంస్థతో ఉన్న మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) గతేడాది సెప్టెంబరు 4తో ముగిసింది. సేవలను కొనసాగించే నిమిత్తం ఎంఓయూను రెన్యువల్ చేసేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఈఐ కేంద్రాల సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లోని ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, ఫండస్ కెమెరాలు, ఇతర సామగ్రిని అప్పట్లోనే కాంట్రాక్టు సంస్థ తరలించుకుపోయింది. ఈఐ కేంద్రాల గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ ఉచిత కంటి వైద్య పరీక్షల నిర్వహణపై కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. న్యూస్రీల్కూటమి చిన్నచూపు 8 నెలలుగా నిలిచిన ఈఐ కేంద్రం సేవలు కాంట్రాక్టు సంస్థతో గత సెప్టెంబరులో ముగిసిన ఎంఓయూ రెన్యువల్కు చొరవ చూపని కూటమి ప్రభుత్వం కంటి వైద్య సేవల కోసంపేదల ఇబ్బందులు గత ప్రభుత్వంలో జిల్లాలో 1,30,733 మందికి కంటి పరీక్షలు 90,059 మందికి కళ్లజోళ్ల పంపిణీ గత ప్రభుత్వంలో ఈఐ కేంద్రాల్లో అందించిన సేవలు ఈఐ కేంద్రం వైద్య పరీక్షలు రిఫ్రాక్షన్ చెక్స్ కళ్లజోళ్లు పంపిణీ ఫండస్ చెక్స్ ఆచంట 27,970 27,832 18,131 13,831 ఆకివీడు 20,576 20,407 13,688 7,246 భీమవరం 23,944 23,638 17,807 8,899 పాలకొల్లు 30,553 29,815 21,443 12,491 నరసాపురం 27,690 26,666 18,990 10,635 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. 2018లో ఏర్పాటైన ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల నిర్వహణతో పాటు వృద్ధులు, విద్యార్థుల కోసం గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్సార్ కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కేంద్రాల్లో సేవలకు ఆంటంకం కలగకుండా కాంట్రాక్టు సంస్థతో ఎంఓయూ గడువును ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేస్తూ వచ్చారు. ఈఐ కేంద్రాల ద్వారా మొత్తంగా 1,30,733 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 1,28,358 మందికి రిఫ్రాక్షన్ చెక్స్, 53,102 మందికి ఫండస్ చెక్స్, 90,059 మందికి కళ్లజోళ్లు అందజేశారు. 884 డీఆర్, 626 గ్లకోమా, 140 మాక్యులర్ డిజనరేషన్, 14,080 కాటరాక్ట్, 76 హైపర్టెన్సివ్ రెటినోపతి రోగులను గుర్తించి సంబంధిత వైద్యసేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున వంద మందికి పైగా రోగులు వచ్చి కంటి వైద్యసేవలను ఉచితంగా పొందేవారు. -
జిల్లా అధికారుల శ్రమదానం
రొయ్యను మేమే అమ్ముకుంటాం రొయ్య రైతులు తమ పంటను తామే విక్రయించుకోవాలనే సంకల్పంతో డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 4లో uఏలూరు (టూటౌన్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరులో కృష్ణా కాలువ గట్లపై అధికారులు శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. చెత్తాచెదారాలు, వ్యర్థాలను తొలగించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి స్వయంగా పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపాలిటీ వారికి అప్పగించాలని కోరారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందన్నారు. జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఏలూరులోని కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఆహ్లాదకర ప్రదేశాలుగా మా ర్చడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. డీఆర్వో వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, డిఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై మంత్రి అసహనం
చెప్పిన పనులు చేయడం లేదంటూ నిమ్మల ఆగ్రహం పాలకొల్లు సెంట్రల్: ‘పోలీసులూ.. ఎందుకయ్యా నా చుట్టూ తిరుగుతారు.. మీరు స్టేషన్లలో ఉండి ప్రజలకు సేవ చేయండి.. (చెప్పింది చేయరు గాని) నా చుట్టూ చక్కర్లు కొట్టకండి.. నాకు సెక్యూరిటీ అవసరం లేదు..’ అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. పోడూరు, యలమంచిలిలో మంత్రి అధికారిక కార్యక్రమంలో బందోబస్తులో ఉన్న ఎస్సైలు, కానిస్టేబుళ్లపై ఇలా విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల క్రితం ఇదే రీతిలో పాలకొల్లు టౌన్ సీఐపైనా అసహనం వ్యక్తం చేశారు. అంతకు ముందు రూరల్ సీఐపై, డీఎస్పీపై ఇలానే అసహనం వ్యక్తం చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తాను చెప్పిన పనులు చేయలేదంటూ.. మంత్రి నిమ్మల పోలీసుల తీరుపై తీవ్ర ఫ్రస్టేషన్లో ఉన్నారు. తాను చెప్పిన పనులు చేయడం లేదని.. ప్రజలకు సేవ చేసుకోండి అంటూ తరచూ సైటెర్లు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సీఐ, ఎస్సైల పోస్టింగ్లు నిమ్మల కనుసన్నల్లోనే జరిగాయి. ఈ క్రమంలో ఇటీవల యలమంచిలి ఎంపీపీ ఉప ఎన్నికల సమయంలో పోలీసులు తనకు సహకరించలేదని, తాను చెప్పినట్లు వైఎస్సార్సీపీ నాయకులపై అ క్రమ కేసులు పెట్టి కనీసం నలుగురిని కూడా లో పల వేయలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారుల వద్ద ఇదే అసంతృప్తిని వ్యక్తం చేయడంతో సదరు అధికారి అడ్డగోలుగా పనిచేయలేమంటూ బదులివ్వడం మంత్రి ఆగ్రహానికి కారణమనే ప్రచారం సాగుతోంది. దీనిపై పోలీస్ శాఖ తర్జనభర్జనల అనంతరం తప్పనిసరిగా మూడు కేసులు నమోదు చేశారు. అయినా మంత్రికి ఆగ్రహం తగ్గలేదని సమాచారం. ఎస్కార్ట్ వద్దంటూ.. శుక్రవారం పోడూరు, యలమంచిలిలో ఎస్సైలపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేసి, వెళ్లిపోండని హుకుం జారీ చేయగా ఏం చేయాలో తెలియక వారు మంత్రి కార్యక్రమానికి కొద్ది దూరంలో విధులు నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం పట్టణంలోని ఓ రోడ్డులో ముగ్గు వేసి టెంట్ ఉండటంతో మంత్రి కాన్వాయ్ని సీఐ అటుగా తీసుకువెళ్లారు. అయితే ఆ కార్యక్రమానికి మంత్రికి ఆహ్వానం లేకపోవడంతో ‘దారీతెన్నూ లేకుండా రోడ్లన్నీ తిప్పుతున్నారు.. మీరంతా నాతో రావాల్సిన పని లేదు.. మీరు వచ్చి సంధులన్నీ తిప్పి నా టైం వెస్ట్ చేస్తున్నారు, కనీసం రూట్ మ్యాప్ కూడా తెలియకుండా ఏం పనిచేస్తారు వెళ్లిపోండి’ అంటూ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కార్యాలయం పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. మంత్రి తనకు ఎస్కార్ట్ అక్కర్లేదని చెప్పడంతో ఏం జరిగిందనే దానిపై శాఖాపరంగా పరిశీలిస్తున్నారు. -
రైతులకు తీరని అన్యాయం
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పొగాకు, వేరుశనగ, మొక్కజొన్న పంటలను మండల పార్టీ నాయకులతో కలిసి పరీశీలించారు. పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో వేరుశనగ పంటను రూ.9,200కు కొనుగోలు చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.6,500 ధరతో కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పొగాకు రైతులకు కూడా గిటుబాటు ధర లభించక కష్టాల ఊబిలో కూరుకు పోయే పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పండించిన రైతులకు ఆ పంటను విక్రయించేందుకు తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం లేదన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. రైతు భరోసా సొమ్ములు చెల్లించకపోవడం వల్ల పెట్టుబడి కోసం అప్పుల పాలయ్యారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, నాయకులు ఉప్పల రాంపండు, ములకాల బాబు, తట్టుకొల్ల అంజి తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ బిల్లుపై ఎగసిన నిరసన
నూజివీడు: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని రక్షించాలని, కేంద్ర ప్రభుత్వం మత వివక్షన వీడాలంటూ నూజివీడులో శుక్రవారం ముస్లింలు గళమెత్తారు. పట్టణంలోని హనుమాన్ జంక్షన్ రోడ్డులోని పెద్ద మసీదు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మార్గమధ్యలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్కచేయకుండా జాతీయ జెండాలు, నల్ల జెండాలు, ప్లకార్డులతో వేలాది మంది తరలివచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చలసాని వెంకట రామారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ, ముస్లింల మధ్య అనైక్యతను సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లింల త్యాగనిరతిని ప్రశంసించారు. సీపీఎం నాయకుడు జి.రాజు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని, బిల్లుకు వ్యతిరేకంగా పలు సవరణలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తోందని, ప్రజలంతా ఐక్యం పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ పట్టణ కార్యదర్శి చాట్ల పుల్లారావు, సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.హనుమానులు, వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ యూనస్పాషా (గబ్బర్), ఫాస్టింగ్ అబ్దుల్ హక్, ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. -
మే 10, 11 తేదీల్లో తెలుగు సాహితీ సంబరాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో వచ్చే మే నెల 10, 11 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు కార్యక్రమం జయప్రదం చేయాలని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కోరారు. స్థానిక మహలక్ష్మి గోపాలస్వామి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక ద్వారా ఇంతవరకూ వివిధ ప్రాంతాలలో 147 శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించి 148వ కార్యక్రమాన్ని శ్రీప్రపంచ తెలుగు సాహితీ సంబరాల్ఙు పేరుతో మే నెల 10, 11 తేదీల్లో ప్రపంచ రికార్డు స్థాయిలో ఏలూరులో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక ప్రతినిధులు కొల్లిరమావతి, జీ.ఈశ్వరీ భూషణం, టీ.పార్థసారథి, శ్రీహరికోటి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ట్రస్ట్కు రూ.18 లక్షల విరాళం ద్వారకాతిరుమల: దీపక్ నెక్స్జెన్ ఫీడ్ కంపెనీ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, కంపెనీ ప్రతినిధులు శుక్రవారం నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ. 18 లక్షలను జమ చేశారు. ఈ విరాళం చెక్కును ఆలయ ఈఓకు అందించారు. ఈఓ వారికి కండువాలు కప్పి ఘనంగా సత్కరించగా, ఆలయ అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనాన్ని, ప్రసాదాలను అందజేశారు. అంతక ముందు దాతలు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఇంతవ వరకు నెక్స్జెన్ నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.1,29,08,007లు అందించినట్టు ఈఓ తెలిపారు. ఏలూరు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చింది. నగరంతోపాటు, ఆయా పట్టణాలు, పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. గురువారం అర్థరాత్రి వరకూ పోలీసులు భారీ ఎత్తున మోహరించి తనిఖీ చేశారు. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ స్వయంగా తనిఖీలు పర్యవేక్షించారు. ఆశ్రం సెంటర్, కలపర్రు టోల్ప్లాజా, తంగెళ్ళమూడి, కండ్రికగూడెం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ నేరాలు నివారించటం, నేరస్తుల కదలికలపై నిఘా ఉంచుతూ వారిని కట్టడి చేయటమే పోలీసుల లక్ష్యం అన్నారు. -
లేబర్ కోడ్లపై ఉద్యమం
జంగారెడ్డిగూడెం: కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ రమణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బోసు బొమ్మ సెంటర్, ప్రభుత్వ టింబర్ డిపోల వద్ద పట్టణ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. కార్మిక వర్గం పోరాటాల ఫలితంగా సాధించిన చట్టాలన్నింటినీ రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లు తీసుకువచ్చిందని విమర్శించారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా తయారు చేయడమే కేంద్రం ఉద్దేశమని, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు. హమాలీల నాయకులు పాల్గొన్నారు. నవయుగ వైతాళికులను విస్మరించడం బాధాకరం ఏలూరు (ఆర్ఆర్పేట): 2025లో ప్రముఖుల జయంతులు, వర్ధంతుల్ని ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పలువురు నవయుగ వైతాళికులను విస్మరించడం బాధాకరమని జిల్లా రచయితల సంఘ ప్రతినిధులు లంకా వెంకటేశ్వర్లు, నాగాస్త్ర, లేళ్ల వెంకటేశ్వరావు ప్రకటనలో ఖండించారు. గురజాడ వెంకట అప్పారావు, కందుకూరి వీరేశలింగం, మహాకవి శ్రీశ్రీ, గుర్రం జాషువా, అయ్యంకి వెంకటరమణయ్య, గిడుగు వెంకట రామమూర్తి పంతులు, డాక్టర్ యల్లాప్రగడ సు బ్బారావు, పింగళి వెంకయ్య, ఘంటసాల వెంకటేశ్వరావు తదితరుల పేర్లను ఈ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. పాక్ జలసంధిని ఈదిన పారా స్విమ్మర్ ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్, పారా స్విమ్మర్ బలగా గణేష్ అరుదైన ఘనత సాదించారు. శుక్రవారం భారత్, శ్రీలంక మధ్య తలైమనార్ నుంచి ధనుష్కోటి వరకూ పాక్ జలసంధి ఈదిన పారా స్విమ్మర్గా చరిత్ర సృష్టించారు. నిర్వాహకుల సమక్షంలో ఉదయం 5.50 గంటలకు ఈత ప్రారంభించి సాయంత్రం 4.20 నిమిషాలకు ముగించారు. 28 కిలోమీటర్ల దూరం 10 గంటల 30 నిమిషాల్లో ఈది మన్ననలు అందుకున్నారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి పారా స్విమ్మర్గా నిలిచారు. శాప్ చైర్మన్ రవినాయుడు, డీఎస్ఏ చీఫ్ కోచ్ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. శ్రీవారి దేవస్థానంసూపరింటెండెంట్గా రామారావు ద్వారకాతిరుమల: అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ ఐవీ రామారావు ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రామారావు ఇక్కడ చార్జ్ తీసుకోనున్నారు. బంగారం షాపుల్లో సోదాలు నరసాపురం: పట్టణంలోని బంగారం షాపుల పై శుక్రవారం జీఎస్టీ, తూనికలు, కొలతలు, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్ సీఐ కె.శివరామకృష్ణ వివరాలను వెల్లడించారు. జైన్ జ్యూయల్ పార్క్ షాపులో 622.37 గ్రాముల బంగారం, 4,907 గ్రాముల వెండి స్టాక్ రిజిస్టర్లో కన్నా తక్కువగా ఉన్నట్టుగా గుర్తించి జీఎస్టీ అధికారులు రూ.3,51,004 అపరాధ రుసుం విధించారన్నారు. అలాగే ఎలాంటి ధ్రువీకరణ లేని ఎలక్ట్రానిక్ కాటాను గుర్తించి తూనికలు, కొలతల అధికారులు రూ.25 వేలు అపరాధ రుసుం విధించారని చెప్పారు. అంబిక సంఘవి జ్యూయల్ షాపులో ఎలాంటి ధ్రువీకరణ లేని ఎలక్ట్రానిక్ కాటా గుర్తించి రూ.25 వేలు ఫైన్ వేసినట్టు తెలిపారు. విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము పాల్గొన్నారు. -
అలరిస్తున్న నాటిక పోటీలు
భీమవరం: భీమవరం కళరంజని నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. శ్రీసోమేశ్వర, జనార్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఈ నాటిక పోటీలో మూడో రోజు శుక్రవారం రాత్రి రెండు నాటికలు ప్రదర్శించారు. అనంతరం హైదరాబాదుకు చెందిన ప్రముఖ రంగస్థల నటీమణి ఎస్.మాధవికి మహానటి సావిత్రి స్మాకర పురస్కారం, కళారంజని యువతేజం పురస్కారాన్ని హైదరాబాద్కు చెందిన మంజునాథ్కు అందించారు. సమాజంలోని కుటుంబాలు, ప్రేమ, ఆదరణ కన్నా ఆస్తుల కోసం, హక్కుల కోసం కుటుంబాల మధ్య జరుగుతున్న సంఘర్షణలు ప్రతిరూపంగా సాగిన హక్కు నాటిక ఆకట్టుకుంది. రెండో నాటికగా సౌజన్య కళాస్రవంతి వారి దేవరాగం ప్రదర్శించారు. దాడి కేసులో ముగ్గురి అరెస్టు ముదినేపల్లి రూరల్: వ్యక్తిపై దాడి ఘటనలో స్థానిక పోలీసులు ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సింగరాయపాలెంకు చెందిన చేబోయిన పోతురాజుపై అదే గ్రామానికి చెందిన బి.రాధాకృష్ణ, కుమారులు కుమారస్వామి, ఏడుకొండలు గత నెల 2 దాడి చేసి గాయపరిచినట్లు చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ నిమిత్తం తరలించినట్లు చెప్పారు. -
ప్రభుత్వాసుపత్రికి సుస్తీ
●టాయిలెట్స్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మా పాపకు డెలివరీ అయ్యింది. ఆస్పత్రిలో వారం రోజుగా ఉంటున్నాం. బాలింతల వార్డులో ఉన్న టాయిలెట్స్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు సక్రమంగా రావడం లేదు. బాలింతలు టాయిలెట్లకు వెళితే ఇబ్బంది పడుతున్నారు. ఏసీలు ఒకటి పనిచేస్తే మరొకటి పనిచేయడం లేదు. – కె.సుభాషణి, మొగల్తూరు పాడైన బెడ్లపై ఎలా పడుకునేది? బాలింతలు పడుకునే బెడ్లు దెబ్బతిన్నాయి. చిరిగిపోయి, గుంతలు పడ్డాయి. వాటిపై బాలింతలు పడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. బెడ్పై తల్లీ బిడ్డ పడుకోవడానికి సరిపోక ఇబ్బంది పడుతున్నారు. తల్లి బెడ్ పక్కన చంటి బిడ్డకు ఊయల సౌకర్యం కల్పించాల్సి ఉన్నా చర్యలు లేవు. – ఎ.అన్నమ్మ, మోగల్లు భీమవరం(ప్రకాశం చౌక్) : పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల జిల్లా కేంద్రమైన భీమవరం ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. సరిగా పనిచేయని ఏసీలు, పాడైన బెడ్లు, సరైన సౌకర్యాలు లేని టాయిలెట్లతో పేషెంట్లు అవస్థలు పడాల్సి వస్తోంది. 50 పడకల సదుపాయం ఉన్న ఈ ఆస్పత్రికి భీమవరం, ఉండి, నర్సాపురం నియోజకవర్గాలతో పాటు కృష్ణా జిల్లాలోని సమీప గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. రోజూ 400కు పైగా ఓపీ నమోదవుతుంటే ఆస్పత్రిలో చేరే పేషెంట్లు సంఖ్య నెలకు 200 వరకు ఉంటుంది. ఆస్పత్రిలో రెండు బాలింతల వార్డులు, ఇతర రోగులకు మూడు వార్డులు ఉన్నాయి. బాలింతల వార్డుల్లో నాలుగు ఏసీలకు గాను రెండు మొత్తానికి పనిచేయకుండా నిరుపయోగంగా మిగిలాయి. మరో రెండు తరచూ మరమ్మతులతో అక్కరకు రావడం లేదు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత వల్ల ఫ్యాన్లు ఉన్నా వేడిగాలులకు బాలింతలు, శిశువులు విలవిల్లాడాల్సి వస్తోంది. బాలింతలు, రోగుల వార్డుల్లోని మంచాలపై ఉన్న పరుపులు చిరిగిపోయాయి. ఎత్తుపల్లాలుగా ఉన్న వాటిపై పడుకోవడానికి బాలింతలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్పై చంటి బిడ్డతో పడుకోవడానికి సరిపోవడం లేదని బాలింతలు అంటున్నారు. శిశువుల కోసం బెడ్ పక్కన బాస్కెట్ బెడ్ల సౌకర్యం లేదు. వేధిస్తున్న సౌకర్యాల కొరత ఆస్పత్రిలోని వార్డుల్లో టాయిలెట్స్, ఆవరణలోని అవుట్ పేషెంట్లు కోసం ఏర్పాటుచేసిన టాయిలెట్లలో సరైన సౌకర్యాలు లేక బాలింతలు, వారి సహాయకులు, పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం వచ్చిన అవుట్ పేషెంట్లు, గర్భిణులు కూర్చునేందుకు కుర్చీలు, బెంచీలు లేవు. ఎక్స్రే విభాగం వద్ద కూర్చునేందుకు సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.. మరోపక్క ఆస్పత్రిలో మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేదు. బాలింతలు, పేషెంట్లు మంచినీళ్లు బయట నుంచి తెచ్చుకుని తాగుతున్నారు. జేసీ రావడంతో బెడ్ షీట్లు మార్చారు బాలింతల వార్డుల్లో బెడ్లపై కనీసం బెడ్షీట్లు వేయడం లేదు. బాలింతలు ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లు, బెడ్ షీట్లు వేసుకుంటున్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ విజిట్కు రావడంతో అప్పటికప్పుడు ఆస్పత్రి సిబ్బంది బాలింతల వార్డులో బెడ్ షీట్లు వేశారు. పట్టించుకోని అధికారులు: ప్రభుత్వ ఆస్పత్రిని సమస్యలు పీడిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించి రోగులకు అవసరమైన వసతులు కల్పించే దిశగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో ఆస్పత్రి స్థితిగతులపై అధికారులతో సమీక్షించిన దాఖలాలు లేవు. పనిచేయని ఏసీలు, పాడైన బెడ్లు టాయిలెట్లు సరిగా లేక ఇక్కట్లు అవస్థలు పడుతున్న రోగులు, బాలింతలు -
చల్లచింతలపూడిలో గ్రావెల్ అక్రమ దందా
టాస్క్ఫోర్స్: దెందులూరు మండలంలోని చల్లచింతలపూడిలో అక్రమ గ్రావెల్ దందా మళ్లీ ప్రారంభమైంది. పొలం యజమాని గ్రావెల్ తవ్వకాలు అడ్డుకోవడంతో పాటు.. ఎస్ఐ, తహశీల్దార్, ఎస్పీ, కలెక్టర్, మైనింగ్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం అక్రమ తవ్వకాలు చేస్తున్నారని తెలుసుకుని పొలం యజమాని జేసీబీలకు ఎదురుగా వాహనం పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కారుకు తాడు కట్టి జేసీబీతో మూడు కిలోమీటర్ల అవతలకు తీసుకువెళ్ళి వాహనాన్ని వదిలారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. స్థల యజమాని బాబురావు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని తన సొంత భూమిలో రక్షణ లేకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నాడు. -
యథేచ్ఛగా మట్టి దందా
ఆగిరిపల్లి: కూటమి నాయకుల అక్రమ మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని నరసింగపాలెంలోని బ్రహ్మ లింగయ్య చెరువు వద్ద ఉన్న బండ్లమూరు కొండపై అనుమతి లేకుండానే మట్టి తవ్వకాలు చేపట్టి లక్షలు ఆర్జిస్తున్నారు. పది రోజుల నుంచి జేసీబీ సాయంతో కొండను తవుతున్నారు. అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నరసింగపాలెంకు చెందిన టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో ఈ మట్టి దందా సాగుతుంది. అధికారులు, గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం మట్టిని లారీలలో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా సాగుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రసాద్ను సంప్రదించగా అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రైతులను వంచించి.. ప్రాధాన్యం తగ్గించి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో పండించే చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. ధాన్యం రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.. రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం.. ప్రతి చోటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.. రైతు ఎంత పండిస్తే అంతా సేకరించి 24 గంటల్లోనే ఖాతాల్లోకి నగదు జమచేస్తాం.. ఇవి జిల్లా ఇన్చార్జి మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి వరకూ ప్రతి సమావేశంలో చెప్పిన మాటలు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వచ్చిన దిగుబడుల్లో 62 శాతం మాత్రమే ధాన్యం కొనుగోలును లక్ష్యంగా నిర్దేశించారు. అందులోనూ పీఆర్ 126, ఎస్–10 రకాలపై సరికొత్త ఆంక్షలు తీసుకువచ్చారు. తేమ శాతం పేరుతో యథావిధిగా దోపిడీ, చిరిగిన గోనె సంచులు అవి కూడా నామమాత్రంగా అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇవేం టార్గెట్లు ఏలూరు జిల్లాలో 3.53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కాగా ముందుగా లక్షన్నర టన్నుల సేకరణ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. స్థానికంగా వినతులు రావడంతో ఈ లక్ష్యాన్ని 2 లక్షల టన్నులకు పెంచింది. దీంతో అనివార్యంగా రైతులు మిగిలిన 1.53 లక్షల టన్నులను దళారులకు విక్రయించాల్సిందే. జిల్లాలో ఇప్పటివరకు 45,128 టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 9.25 లక్షల టన్నుల అంచనా కాగా 6 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించింది. ఇక్కడ కూడా మిగిలిన 3.25 లక్షల టన్నులను మధ్యవర్తులకు విక్రయించాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి 25 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తికాగా వచ్చే వారం నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు జోరందుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో దళారులు వచ్చి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లు మొదలు ఉమ్మడి పశ్చిమగోదావరిలో రబీ సాగు పూర్తయి ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఏలూ రు జిల్లాలో 77,466 ఎకరాల విస్తీర్ణంలో 3.53 లక్షల టన్నులు దిగుబడి అంచనా కాగా 118 రైతు సేవా కేంద్రాలు, 65 ప్రాథమిక సహకార సొసైటీల ద్వారా ఈనెల 2 నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2,19,064 ఎకరాల్లో 9.25 లక్షల టన్నులు దిగుబడి అంచనా వేసి 365 రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 206 రైస్ మిల్లులకు ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చారు. ని‘బంధనాలు’ కొనుగోళ్లల్లో సరికొత్త నిబంధనలు విధించడం, దిగుబడి కంటే తక్కువ మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో సమస్యలు మొదలయ్యాయి. గురువారం జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు కొనుగోళ్లలో ఇబ్బందులున్నాయని, కొన్ని రకాలు కొనుగోలు చేయడం లేదని, ఒత్తిడితో కొనుగోలు చేసినా అతి తక్కువ మాత్రమే కొనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. తేమ శాతం సాకు రబీ సీజన్లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దిగుబడి అధికంగా వచ్చే పీఆర్–126 రకాన్ని ఎక్కువ సాగు చేశారు. ఎకరాకు సగటున 60 నుంచి 70 బస్తాల దిగుబడి వస్తుండటంతో తేమ శాతం సాకుగా చూపి ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎస్–10 రకం గింజ సరిగ్గా లేదనే కారణంతో కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతు లు పండించిన పంటలో సగానికి మించి ప్రభుత్వానికి విక్రయించలేని పరిస్థితి ఉండటంతో దళారులను తప్పనిసరిగా ఆశ్రయిస్తున్నారు. ఏలూరు జిల్లా వరి సాగు 77,466 ఎకరాలు దిగుబడి అంచనా 3.53 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం 2 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 183 పశ్చిమగోదావరి జిల్లా వరి సాగు 2,19,064 ఎకరాలు దిగుబడి అంచనా 9.25 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం 6 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 365 కొనుగోల్ మాయ రబీ ధాన్యం సేకరణలో ఆంక్షలు దిగుబడుల కంటే తక్కువగా కొనుగోలు లక్ష్యాలు ఉమ్మడి జిల్లాలో 62 శాతం మాత్రమే సేకరణ పీఆర్ 126 రకం కొనుగోలుకు షరతులు ప్రభుత్వ ఆర్భాటానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇష్టారాజ్యంగా దళారుల కొనుగోలు కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో దళారులది ఇష్టారాజ్యంగా మారింది. వైఎస్సార్సీపీ పాలనలో నూరు శాతం ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో దళారులకు అడ్డకట్ట పడింది. కూటమి పాలనలో రైతుసేవా కేంద్రాల ద్వారా నచ్చిన మిల్లులో విక్రయించుకోవచ్చని, ఎక్కడైనా అమ్మవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో దళారుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. క్వింటాల్ ఏ–గ్రేడ్ రకానికి రూ.2,320, కామన్ వైరెటీకి రూ.2,300 మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దళారులు పొలాల్లోనే 75 కేజీల బస్తాను రూ.1,300 నుంచి రూ.1,500 ధరతో కొనుగోలు చేస్తున్నారు. -
రేంజ్ పరిధిలో పటిష్ట పోలీసింగ్
జంగారెడ్డిగూడెం: జిల్లాలో పటిష్ట పోలీసింగ్కు చర్యలు తీసుకున్నట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో ట్రాఫిక్, టౌన్ పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం తెలంగాణకు సరిహద్దున ఉండటం, జాతీయరహదారి సైతం పట్టణాన్ని ఆనుకుని వెళ్లడం, వ్యాపార కేంద్రంగా ఉండటంతో నేరస్తులకు సెంటర్ పాయింట్గా మారుతోందని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణాకు ఈ మార్గం అనువుగా ఉండటంతో నేరాల అదుపుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణంలో రూ.35 లక్షలతో 70 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. పట్టణంలో పోలీస్స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్కు, క్రైమ్కు ఎస్సైలు ఉండేలా ఆలోచన ఉందన్నారు. 22 సీసీ కెమెరాలు : రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాలో 22 వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. మహా నాయకుల విగ్రహాల సమీపంలో సీసీ కెమెరాల ఏ ర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపామన్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పో క్సో కేసులు నమోదవుతున్నాయని, మహిళా పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తం ఇటీవల డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరాలు పెరిగాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐజీ సూచించారు. ఎవరైనా డిజిటల్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడితే 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రేంజ్ పరిధిలో నక్సలైట్ల ప్రభావం లేదని, పోలవరం ప్రాజెక్టు వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రతా చర్యలు చేపట్టిందని చెప్పారు. వీఐపీల పర్యటనలో భాగంగా మరింత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐలు వి.కృష్ణబాబు, రాజశేఖర్, ఎస్సైలు పాల్గొన్నారు. ఐజీ అశోక్కుమార్ -
మద్యం మత్తులో ముంచుతున్న ప్రభుత్వం
తణుకు అర్బన్: రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచేస్తూ ఇది మంచి ప్రభుత్వంగా కూటమి సర్కారు పేరు సంపాదించిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ అన్నారు.. సంక్రాంతికి రోడ్లన్నీ వేసేస్తామన్నారు.. కరెంటు బిల్లులు పెంచమన్నారు.. ఇవేమీ జరగలేదు కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా నైట్ పాయింట్ల ద్వారా 24 గంటలు అమ్మిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జగన్ పారదర్శకంగా పథకాలు అందించారని, కూటమి పాలనలో సూపర్సిక్స్ అమలు చేయకుండా, ప్రశ్నించిన వా రిపై కేసులు, దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆరిమిల్లీ నాకు సంస్కారం ఉంది తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తనను ఇష్టానుసారంగా దూషించారని, చదుకున్న అజ్ఞానిగా ఉన్నారంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా దూషించగలనని, అయితే సంస్కారం ఉంది కాబట్టే సంస్కారవంతంగా సమాధానం చెబుతున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పేకాటలు, కోతాటలు ఇళ్లలోనే నిర్వహిస్తున్నారని కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, తణుకులో ఒక టీడీపీ నేత హోటల్లోనే కోతాటలో 45 మందిని జిల్లాస్థాయి పోలీసు ఉన్నతాధికారులు పట్టుకున్నారని గుర్తుచేశారు. ప్రశాంతంగా ఉండే తణుకులో గంజాయి విచ్చలవిడి అయిపోయిందని దాడులు, చోరీలకు నిలయంగా మారిందని విమర్శించారు. గత టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ టీడీఆర్ బాండ్ల జారీలో రూ.800 కోట్లు డబ్బులు తీసుకున్నారని ప్రజలే చెప్పుకుంటున్నారని ఆరోపించారు. వారానికోసారి తణుకు వచ్చి ప్రెస్మీట్ పెట్టి తనపై విమర్శలు చేస్తున్నారని కారుమూరి ధ్వజమెత్తారు. నాది రాష్ట్రస్థాయి.. నీది తణుకు నియోజకవర్గస్థాయి మాత్రమే అని ఆరిమిల్లికి చురకలు వేశారు. ఆరిమిల్లి భాష మార్చుకో వాలని లేకుంటే ప్రజలు రోడ్లపై తిరగనివ్వరని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ కారుమూరి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు ఫణీంద్రకుమార్ వీరమల్లు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి ధ్వజం -
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
బుట్టాయగూడెం: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ప్రజలకు మంచి పాలనను చేరువ చేసే దిశగా ఇంటి వద్దకే సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డుల పరిధిలో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ సేవల్లో ఎలాంటి కష్టం కలగకుండా విస్తృత సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ్చ్ఛ కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గ్రామ సచివాలయాల కుదింపునకు రంగం సిద్ధం చేసింది. జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ఉండేలా చర్యలు చేపట్టింది. క్లస్టరైజేషన్లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1,165 గ్రామ సచివాలయాలు సగానికి తగ్గించి 582కే పరిమితం చేయనున్నారు. సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని గ్రేడ్ల వారీగా సర్దుబాటు చేయనున్నారు. ప్రభుత్వ చర్యలతో ఇటు ప్రజలు, అటు సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దేశానికే ఆదర్శం సచివాలయ సేవలు వైఎస్సార్సీపీ పాలనలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1,165 సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాల ద్వారా సుమారు 142 సేవలు గ్రామాల్లోని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నారు. 938 గ్రామ సచివాలయాలు, 227 వార్డు సచివాలయాల్లో 8,468 మంది సచివాలయ సిబ్బందితో పాటుగా పంచాయతీ కార్యదర్శులను సైతం కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,165 గ్రామ సచివాలయాల్లో 9,099 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయల్లో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, సిబ్బంది, కార్యదర్శి అందుబాటులో ఉండేవారు. వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక కంప్యూటర్లను సైతం కేటాయించారు. కంప్యూటర్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేలా కృషి చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న క్లస్టర్ విధానంతో గ్రామ స్థాయిలో అందే సేవలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు సచివాలయాలు కలిపి.. గ్రామ సచివాలయాలను క్లస్టర్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు. ఒక గ్రామంలో ఒకే సచివాలయం ఉంటే సమీప గ్రామంలోని సచివాలయాన్ని కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు. పట్టణం, మండలం యూనిట్గా క్లస్టర్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే మండలాల వారీగా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. కష్టాలు తప్పవు గ్రామ స్థాయిలో ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న సచివాలయాల్ని క్లస్టర్లు మార్చితే ప్రజలకు ఇబ్బందులు తప్పవని వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో గిరిజనుల బాధలు వర్ణణాతీతం. రెండు సచివాలయాలను ఒకటిగా చేస్తే ప్రజలకు మెరుగైన సేవల అందవని ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నాయకులు కోరుతున్నారు. జనాభా ప్రాతిపదికన రెండు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు ఉమ్మడి పశ్చిమ పరిధిలో 1,165 సచివాలయాలు 582కే పరిమితం చేసేలా పావులు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర దేశానికే ఆదర్శంగా నిలిచిన సచివాలయాలను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీనిలో భాగంగానే క్లస్టర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. రెండు సచివాలయాలు ఒకటి చేయడం వల్ల ప్రజలకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలు అందేవి. క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే -
● అలరించిన జాతీయస్థాయి నాటిక పోటీలు
పట్టణంలోని కళారంజని నాటక అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీసోమేశ్వర జనార్ధనస్వామి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. పోటీల్లో గురువారం ప్రదర్శించిన గుంటూరు వారి అభినయ ఆర్ట్స్ ‘ఇది అతని సంతకం’, హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి శ్రీసారీ రాంగ్నెంబర్శ్రీ నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ఎన్ రవీంద్రరెడ్డిని ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావు స్మారక పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో కళారంజని వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరఽథీశ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వై వెంకటరమణ, మెంటే పూర్ణచంద్రరావు, మల్లుల సీతారామప్రసాద్, మాదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. –భీమవరం -
ఇంజినీరింగ్దే హవా
ఏలూరు (ఆర్ఆర్పేట): దాదాపు దశాబ్ద కాలానికి పైనుంచే విద్యార్థులు సాంకేతిక విద్యబాట పట్టారు. గతంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తరువాత డిగ్రీ కోర్సుల్లోకి ప్రవేశించడం సంప్రదాయంగా వచ్చింది. అనంతర కాలంలో ప్రపంచం మొత్తం మీద వచ్చిన సాంకేతిక విప్లవం ఆధారంగా కంప్యూటర్, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా జీతాలు వచ్చే అవకాశం ఈ రంగంలో ఉండడంతో విద్యార్థులు సైతం సాంకేతిక విద్యపై ఆకర్షితులయ్యారు. దీనితో ఇంజినీరింగ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల హవా నడుస్తోంది. ఇంటర్మీడియెట్ అనంతరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడం కోసం ప్రభుత్వం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలను ఏపీఈఏపీ సెట్ పేరిట నిర్వహిస్తోంది. ఇటీవల ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడి కావడంతో విద్యార్థులంతా ఈఏపీ సెట్కు సిద్ధమౌతున్నారు. మే 19 నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశించే వారి కోసం మే 19వ తేదీ నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. షెడ్యూల్లోని ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ వరకూ గడువు ఉంది. ఉమ్మడి పశ్చిమలో 13,330 సీట్లు ఇంజినీరింగ్ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి వివిధ కోర్సులకు సంబంధించి 13,330 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900 సీట్లు, ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో 600 సీట్లు, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ కళాశాలలో 1360 సీట్లు, నూజివీడులోని సారధి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో 1,860, శ్రీ విష్ణు మహిళా కళాశాలలో 960, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో 1,140, భీమవరం ఇంజినీరింగ్ కళాశాలలో 300, నరసాపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో 1,620, తాడేపల్లిగూడెంలోని శ్రీవాసవి కళాశాలలో 1,200, శశి ఇంజినీరింగ్లో 1,140, నల్లజర్లలోని వైస్ ఇంజినీరింగ్లో 270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక మరో 10 శాతం సీట్లు అంటే 1333 సీట్లు ఈడబ్ల్యూస్ కోటాలో కేటాయిస్తారు. అంటే మొత్తం కలిపి 14,663 సీట్లు ఈ రెండు జిల్లాల్లోని కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఈ పరీక్షలకు గత సంవత్సరం మాదిరిగానే ఇంటర్మీడియెట్లో అభ్యర్థి సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు. ఈఏపీ సెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి మొత్తం కలిపిన తరువాత ర్యాంకును ప్రకటిస్తారు. ప్రస్తుతం దరఖాస్తులు చేస్తున్న ఉరవడి పరిశీలిస్తే గత ఏడాది కంటే మరో 10 శాతం దరఖాస్తులు పెరగనున్నట్టు ఈ పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ కాకినాడ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈఏపీ సెట్లో ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత కోర్సులకే విద్యార్థుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గత ఏడాది వరకూ తెలంగాణ విద్యార్థులకు నాన్లోకల్ కేటగిరీ కింద 15 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున ఈ ఏడాది నుంచి వారికి రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి మొత్తం సీట్లలో స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. దీనివల్ల ఆంధ్ర విద్యార్థులకు కొద్దిగా పోటీ తగ్గనుంది. మే 19 నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు తొలి రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాలకు పరీక్షలు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 14 ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో 13,330 సీట్లుఉత్తీర్ణులైతేనే ఫీజు రీయింబర్స్మెంట్ ఈఏపీసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఫీజు రీయింర్స్మెంట్ పథకం వర్తిస్తుంది. 160 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షకు 40 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్టే. ఫీజు రీయింబర్స్మెంట్ ఆశించే విద్యార్థులు ముందుగానే ఇన్కం ట్యాక్స్ సర్టిఫికెట్, ఈ ఏడాది తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్ కోటా (ఈడబ్ల్యూఎస్)లో చేరే విద్యార్థులు ముందుగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను పొందిఉండాలి. పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో తమపేరు అక్షరం కూడా తప్పులేకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. – పీ బాలకృష్ణ ప్రసాద్, ఈఏపీసెట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ -
రెండోరోజూ మట్టి నమూనాల పరిశీలన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో మట్టి నాణ్యత పరీక్షలను గురువారం రెండవ రోజు కూడా కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేశారు. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి.సిద్దార్ధ హెడవో, విపుల్ కుమార్ గుప్త ప్రాజెక్టు ప్రాంతంలోని దండంగి, జలవిద్యుత్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో నిల్వ చేసిన మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానిక లేబోరేటరీలో పరీక్షించడంతో పాటు మరింత సూక్ష్మంగా పరిశీలించేందుకు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో పరీక్షించేందుకు సేకరించారు. క్షేత్రస్థాయిలో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ సెంటర్లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్ఎఫ్, డయాఫ్రమ్వాల్ ప్రాంతాల్లో అవసరమైన మేర ఈ మట్టిని వినియోగిస్తారని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వీరి వెంట ప్రాజెక్టు ఈఈ శ్రీనివాసులు, డీఈ వి.నిర్మల, మేఘ ఇంజనీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ సీహెచ్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలి పాలకొల్లు సెంట్రల్: ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి 23 శాతం జీతం పెంచాలని లంకలకోడేరు పీహెచ్సీ కన్వీనర్ గౌతమి తెలిపారు. గురువారం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, సీహెచ్ఓలుగా పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాల సమస్యలు పరిష్కరించాలంటూ స్థానిక ఎన్జీఓ యూనిట్ అధ్యక్షుడు గుడాల హరిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ పని ఆదారిత ప్రోత్సాహకాలను సవరించాలని, ఈపీఎఫ్ను పునరుద్దరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సుజిత, రాజశ్రీ, యువతేజ, స్రవంతి, కృష్ణవేణి, లిఖిత, శైలజ, శిరీష, అన్నప్రైస్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలి ఏలూరు(మెట్రో): ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
రక్తదానంతో ప్రాణదానం
భీమవరం (ప్రకాశంచౌక్): రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా పంచాయతీ అధికారి అరుణశ్రీ అన్నారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నరసాపురం, భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్బ్యాంక్లలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించారు. ఆయా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పంచాయతీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. జిల్లా గ్రామ పంచాయతీ ఆఫీసర్ అరుణశ్రీ భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎంఎస్వీ భద్రిరాజు చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ చేసిన దాతలకు, ధ్రువీకరణ పత్రాలు అందించారు. సుమారుగా 90 మంది జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగులు, అధికారులు రక్తదానం చేశారు. రక్త దానం చేసిన దాతలకు రెడ్క్రాస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
పొగాకు బ్యారన్ల దగ్ధం
జంగారెడ్డిగూడెం: మండలంలోని చిన్నవారిగూడెంలో గ్రామానికి చెందిన దాకవరపు అర్జునరావు, దాకవరపు రవికృష్ణలకు చెందిన పొగాకు బ్యారన్లు బుధవారం రాత్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.28 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు పేర్కొన్నారు. వారిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు గురువారం పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో రూ.20 లక్షల పొగాకు, రూ.8 లక్షలు విలువైన రెండు బ్యారన్లు నష్టపోయామని రైతులు వివరించారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ బ్యారన్లు దగ్ధంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. క్యూరింగ్ సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని జెట్టి సూచించారు. రైతులను పరామర్శించిన వారిలో ఎ.పోలవరం సర్పంచ్ బుద్దాల సీతారాముడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, సత్రం లక్ష్మణరావు, తాడువాయి సొసైటీ మాజీ అధ్యక్షుడు కనికళ్ల ప్రసాద్, బుద్దాల నాగేంద్రం, బుద్దాల సత్యనారాయణ, బండారు సూరిబాబు, బండారు ప్రసాద్, దాకవరపు వెంకటేశ్వరరావు, నెల్లూరు గంగరాజు, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ పాటించడం లేదు
ఏలూరు (టూటౌన్): అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని పలువురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు మండిపడ్డారు. తామేమీ ప్రభుత్వ పెద్దలచే నామినేట్ అయిన సభ్యులం కాదని ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులమని గుర్తు చేశారు. గురువారం జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సర్వ సభ్యసమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పి.థాత్రీ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, చిర్రి బాలరాజు,, జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్లు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్.చిన్న రాముడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గడువులోగా మంచినీటి చెరువులను నింపాలి ఉమ్మడి జిల్లాలో పంట కాలువలను ఈ నెల 22తో కట్టివేస్తున్నందున అన్ని మంచినీటి చెరువులను గడువులోగా నీటితో నింపుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా సమావేశంలో ఎకరాకి 50 బస్తాల వరకే ధాన్యం కొనుగోలు చేయడంపై పలువురు డెల్టా జెడ్పీటీసీలు వ్యవసాయాధికారులను నిలదీశారు. ఎటువంటి కోతలు లేకుండా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. అలాగే తమ మండలంలో చేపట్టే పనుల ప్రతిపాదనలు సమర్పించినా జెడ్పీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు నిలదీశారు. తాము ప్రతిపాదించిన పనులను టేక్అప్ చేయకండా ఎవరో చెప్పిన పనులను మాకు తెలియకుండా ఎలా చేపడతారు అంటూ ప్రశ్నించారు. అందరినీ సమానంగా చూడాలి ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వస్తే పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ వేదిక మీదకు ఆహ్వానించారని అదే తాను వస్తే సాధారణంగా పైకి ఆహ్వానించారని ఇదెక్కడి పక్షపాతమంటూ ప్రశ్నించారు. జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గత 18 నెలలుగా వేతనాలు రావడం లేదని, వీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పీఎంజీపీవైలో 2023–24లో 94 దరఖాస్తులు అందగా వాటిలో 34 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, 2024–25లో 84 దరఖాస్తులు అందగా 48 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయన్నారు. ఇలా అయితే ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సీడీని విడుదల చేసేలా చూడండి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రైతులకు త్వరగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు జిల్లాలకు సంఖ్యా బలం ఆధారంగా సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయించగా తాడేపల్లిగూడెంకు మాత్రం రూ.7 కోట్లు కేటాయించారని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులు మంజూరైనా పనులు మొదలు కాక తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోయారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సి ఉంది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలో కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నా హాజరైంది మాత్రం ముగ్గురే. అందులో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే చిర్రిబాలరాజు వచ్చామా.. నాలుగు పలుకులు పలికామా.. అన్నట్లు పలికి వెళ్లిపోయారు. మధ్యలో వచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాథాకృష్ణ సభ పూర్తయ్యేవరకు ఉన్నారు. తామేమి నామినేట్ సభ్యులం కాదని జెడ్పీటీసీల మండిపాటు వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం సమావేశానికి ప్రజాప్రతినిధుల గైర్హాజరు