pensioners
-
ఉద్యోగులు, పెన్షనర్లను దగా చేసిన కూటమి సర్కారు
-
ఈ నెలా తగ్గిపోయిన పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య ఈ నెల కూడా తగ్గిపోయింది. గత నెల (జనవరి)లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన పింఛన్లకంటే శనివారం (ఫిబ్రవరి 1న) విడుదల చేసిన పింఛన్లు 18,036 తగ్గిపోయాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.ఇలా గత ఎనిమిది నెలల్లో ఏకంగా 1,89,957 పింఛన్లు తగ్గిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు గత ఏడాది మే నెలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 65,49,864 మందికి పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేయగా, శనివారం చంద్రబాబు ప్రభుత్వం 63,59,907 మంది లబ్దిదారులకే నిధులు విడుదల చేసింది. జనవరి నెల పింఛన్ల పంపిణీకి డిసెంబరు 31న 63,77,943 మందికే నిధులివ్వడం గమనార్హం.భయం భయంగా లబ్ధిదారులుచంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే కొత్తగా ఎవరూ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకుండా ఆన్లైన్ సేవలు పూర్తిగా నిలిపివేసింది. మరోపక్క.. గత ఐదేళ్లుగా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రతి నెలా ఠంఛన్గా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లబ్ధిదారుల సంఖ్యనూ తగ్గించేస్తోంది. ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను ఇప్పుడు అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే, స్పెషల్ డ్రెవ్ల పేరుతో రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త పింఛన్దారుల అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన జరుపుతోంది. దీంతో తమ పింఛనుకు ఎప్పుడు ఎలా ఎసరు పెట్టేస్తారోనని లబ్ధిదారులు నిత్యం భయంభయంగా గడుపుతున్నారు. -
వచ్చే పెన్షన్ ఆపేశారు.. అడుక్కుతిని బతకాల్సివస్తుంది..
-
బకాయిలు కొండంత.. చెల్లించేది గోరంత
సాక్షి, అమరావతి: ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిలకుగానూ అరకొర నిధులను విడుదలచేస్తూ, సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25,000 కోట్లు ఉంటే, కూటమి ప్రభుత్వం రూ.1,300 కోట్లే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఇవ్వాల్సిన బకాయిలెంత? ఇప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం బయటపడుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునేది. కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కు పిలిచి మాట్లాడిన దాఖలాల్లేవు. ⇒ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన రూ.1,300 కోట్లలోనూ రూ.519 కోట్లు జీపీఎఫ్ కోసం, రూ.214 కోట్లు పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం రూ. 300 కోట్లు మాత్రమే కడతామని చెబుతున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక? ⇒ జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు. దీనికి మొత్తం ఇవ్వకుండా రూ. 519 కోట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం? ఏడాదికి 15 రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునేందుకు వీలుంది. దీనిని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు.. అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు. సీపీఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు. ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రూ.265 కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. 36 ఏళ్లు ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగిగా ప్రభుత్వ తీరు అర్థం కావడంలేదు. ⇒ రాష్ట్రంలోని 3.80 లక్షల మంది పెన్షనర్లకు ఏమాత్రం మేలు చేయడంలేదు. డీఎ ఎరియర్స్, పీఆర్సీ ఎరియర్స్, సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటేషన్ ఆఫ్ లీవ్, గ్రాట్యూటీ వంటి బెనిఫిట్స్ పెండింగ్ లో పెడుతున్నారు. అలాగే, మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్, ఏపీజేఎల్ వంటివి రూ. కోట్లలో ఉన్నాయి. వాటిల్లో ఇంతమేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టంచేయాల్సి ఉంది. ⇒ మంచి పీఆర్సీని, మధ్యంతర భృతిని ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీలిచ్చింది. 7 నెలలు గడుస్తున్నా పీఆర్సీని నియమించలేదు, ఐఆర్ను ప్రకటించలేదు. రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రతి ఆరునెలలకు కేంద్రం డీఏను ప్రకటిస్తుంది. ఏపీలో 2024లో రావాల్సిన రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ⇒ కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామన్నారు. తొలి రెండు నెలలే అలా ఇచ్చారు. హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత, ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది. ప్రతిసారీ ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడంవల్ల ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. సకాలంలో ప్రభుత్వ వాటా చెల్లించాలి. -
ఇంటి పన్ను కడితేనే పింఛన్!
గుడిపాల: ఇంటి పన్నుకు, పింఛన్లకు కూటమి సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో మంగళవారం 27 పంచాయతీల్లో ఇదే తంతు నడిచింది. పైనుంచి ఆదేశాలొచ్చాయంటూ..సచివాలయాల సిబ్బంది, వీఆర్ఓలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పన్ను వసూలు చేశారు. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లిస్తామని చెప్పిన తర్వాతే పింఛన్ సొమ్ము అందజేశారు. అయితే పన్ను చెల్లించిన వారికి ఎక్కడా కూడా రశీదులు ఇవ్వలేదు. ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదని, ఇలా బలవంతం చేయడం తగదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పింఛన్ డబ్బులిచ్చేటప్పుడే ఇంటి పన్ను వసూలు చేయండి. తర్వాత అయితే డబ్బులు లేవు అని చెబుతారు. ఇప్పుడైతే డబ్బులు లేవు అని చెప్పడానికి వారికి ఆస్కారం ఉండదు. ఇది ఇయర్ ఎండింగ్ అని చెప్పండి’ అని ఒక ప్రజాప్రతినిధి అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై స్పందించడానికి అధికారులెవరూ ఇష్టపడలేదు. -
కమీషన్ ఇవ్వకపోతే పెన్షన్ కట్..
-
పింఛన్ లబ్ధిదారులను దొంగలతో పోల్చిన స్పీకర్
-
పేదల పెన్షన్లతో రాజకీయం చేస్తున్న కూటమి ప్రభుత్వం
-
చంద్రబాబు కోతలు.. 1.5 లక్షల పెన్షన్లు గోవింద
-
ఏపీలో నెలనెల తగ్గిపోతున్న పింఛన్లు
-
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
‘పెన్షన్ ఆగిపోతుంది’.. బురిడీకొట్టిస్తున్న కొత్త స్కామ్!
పెన్షనర్లను మోసగాళ్లు కొత్త స్కామ్తో బురిడీకొట్టిస్తున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (CPAO) అధికారులమని చెప్పుకుంటూ పెన్షనర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మోసగాళ్లు ఫేక్ వాట్సాప్ సందేశాలు పంపి తప్పుడు ఫారమ్లను నింపమని కోరుతున్నారు. పాటించకపోతే వారి పెన్షన్ చెల్లింపులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు.వార్తా నివేదికల ప్రకారం.. బ్యాంకు ఖాతా వివరాలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా మోసగాళ్లు ఈ స్కామ్ చేస్తున్నారు. ఈ సమాచారంతో వారు పెన్షనర్ల వివరాలను దొంగిలించి ఆర్థిక మోసానికి పాల్పడవచ్చు. ఈ నేపథ్యంలో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.సీపీఏఓ పేరుతో ఏదైనా సందేశం వస్తే దాని ప్రామాణికతను పరిశీలించుకోవాలి. అధికారిక ఏజెన్సీలు వాట్సాప్ లేదా ఇతర అనధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా వ్యక్తిగత వివరాలను అడగవు. మీ పీపీఓ నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని మెసేజింగ్ యాప్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. అనుమానం వస్తే సీపీఏఓ లేదా బ్యాంక్ వారిని అధికారిక సంప్రదింపు వివరాలను ఉపయోగించి సంప్రదించండి. -
టీచర్లకు జీతాల్లేవు..పెన్షనర్లకు పెన్షన్ లేదు
సాక్షి, అమరావతి: ప్రతీ నెలా ఒకటో∙తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు మాట తప్పింది. సెప్టెంబర్ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మినహా మిగతా ఉద్యోగులు, టీచర్లకు మంగళవారం వేతనాలు చెల్లించలేదు.మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ కూడా చెల్లించలేదు. మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,000 కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తరువాతే వేతనాలు, పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం గాంధీ జయంతి సెలవు కారణంగా గురువారం రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. దీంతో గురు, శుక్రవారం వరకు వేతనాలు, పెన్షన్కు ఎదురు చూడక తప్పదు. -
క్యాష్ లెస్.. యూజ్ లెస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అటకెక్కింది. నగదు రహిత వైద్యసేవలు అందక ఉద్యోగులు, పింఛన్దారులు గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు వా పోతున్నారు. ఉద్యోగులు గత్యంతరం లేక లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా, పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు బకాయిలతో.. ఈహెచ్ఎస్ పరిధిలో సుమారు 5.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 20 లక్షల మంది ఈ పథకంలోకి వస్తారు. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చి వైద్యం చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. ఆస్పత్రులకు ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారం.. ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దాదాపు రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. రీయింబర్స్మెంట్తో మరింత సమస్య ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకంతోపాటు రీయింబర్స్మెంట్ను కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకోవాలి. తర్వాత ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వానికి సమరి్పస్తే.. ఆ సొమ్ము రీయింబర్స్మెంట్ అవుతుంది. కానీ దీనితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. రూ.10 లక్షల బిల్లు అయితే.. రూ.లక్ష, లక్షన్నర మాత్రమే వెనక్కి ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత వైద్య పథకం సరిగా అమలవకపోవడం, రీయింబర్స్మెంట్ పూర్తిగా రాకపోవడంతో.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని, ఏటా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్పై అస్పష్టత గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్కు కొన్ని రోజుల ముందు ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ)’ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత కలిపి జమ చేయాలని పేర్కొంది. అది అమల్లోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఈ స్కీంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నగదు రహిత వైద్యం అందేలా చూడాలి హెల్త్కార్డులు నిరుపయోగంగా మారాయి. రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తి మొత్తం అందడం లేదు. ఉపాధ్యాయుల మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లిస్తామని, ప్రత్యేక ట్రస్టుతో పథకం అమలు చేయాలని గత ప్రభుత్వాన్ని కోరాం. అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. విధివిధానాలు ఖరారుకాలేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఎం.పర్వత్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయడంలేదు హెల్త్కార్డులు నామ్ కే వాస్తేగా మారాయే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు అందించేలా చూడాలి. – కొమ్ము కృష్ణకుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ జిల్లా బిల్లు కట్టి.. ఎదురుచూపులు నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ పెన్షనర్ ప్రభుదాస్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. రూ.లక్ష బిల్లు అయింది. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలైంది. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తల్లికి చికిత్స చేయించి.. నిజామాబాద్ జిల్లాలోని డీఆర్డీవో ఆఫీసులో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రూ.లక్షకుపైగా బిల్లు అయితే సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, మూడు నెలలైనా ఇంకా రాలేదు. రూ.28 వేలు ఖర్చయితే.. రూ.12 వేలు వచ్చాయి మా అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించడం కోసం రూ.28 వేలు ఖర్చయ్యాయి. రీయింబర్స్మెంట్ కింద మెడికల్ బిల్లులు సమర్పించినప్పుడు రూ.12 వేలు మాత్రమే, అదీ ఏడాది తర్వాత అందాయి. ప్రభుత్వం నగదు రహిత చికిత్సఅందిస్తేనే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. – బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం -
ఏపీలో పెన్షన్.. టెన్షన్
అమరావతి, సాక్షి: ‘అమ్మో ఒకటో తారీఖు..’ అనుకుంటున్న ఏపీ పెన్షనర్లను ఆ ‘టెన్షన్’ ఇప్పుడు ఒకరోజు ముందుగానే పలకరించబోతోంది. కూటమి ప్రభుత్వం వరుసగా 3వ నెల పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి ఒక రోజు ముందే పెన్షన్ రానుంది. దీంతో.. అకారణంగా లిస్టు నుంచి తమ పేరును తొలగిస్తారేమో అనే ఆందోళన పింఛన్దారుల్లో నెలకొంది.ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరిట రెండో నెల(ఆగష్టు 1వ తేదీన) జరిగిన ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడింది.గడిచిన రెండు నెలల కాలంలో ఏపీలో పెన్షనర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు.ఆగష్టు నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది (ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052)జులై కంటే ఆగష్టులో ఏకంగా 79, 455 పెన్షన్లు తగ్గించింది ప్రభుత్వం. జగన్ హయాంలో ఏ నెల ఫించన్దారుల్లో కోతలు విధించిన దాఖలాలు లేవు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల కాలంలోనే పెన్షనర్లను భారీగా తగ్గించింది. దీనిపై సిబ్బందిని ఆరా తీస్తే.. నిబంధనల పేరుతోనే ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా ఉండొచ్చని చంద్రబాబు సర్కార్ సూత్రప్రాయంగా సంకేతాలిస్తోంది.వలంటీర్ల ఊసేది?ఏపీలో ఇంటింటికే పెన్షన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పడేసింది. వలంటీర్లు లేకుండానే రెండు నెలలు పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే సన్నద్ధం చేసింది. ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా.. ‘అసలు వలంటీర్లు అవసరం ఏముంది?’ అనే ధోరణితో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను కొనసాగించడం కన్నా.. ఏదో ఒక రకంగా రద్దు చేయాలని చూస్తోంది.మమ్మల్ని ముంచేశారుప్రతిపక్షంలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.ఇబ్బందులమయంగా పంపిణీ..చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని ఆదేశాలిప్పిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సర్వర్లో ఇబ్బందులతో సచివాలయ ఉద్యోగులు సతమతమవుతుండగా.. ఫించన్దారుల నిలదీతతో ఇబ్బందికర పరిస్థితి టీడీపీ ఈవెంట్గా.. పెన్షన్ల పంపిణీని గత ప్రభుత్వం ఏనాడూ రాజకీయ కార్యక్రమంగా చూడలేదు. కానీ, చంద్రబాబు మాత్రం దాన్ని టీడీపీ ఈవెంట్గా మార్చేశారు. టీడీపీలో చోటా లీడర్ల దగ్గరి నుంచి మంత్రుల స్థాయిదాకా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. లబ్ధిదారులతో ఉత్తుత్తి పంపిణీ ఫొజులు ఇచ్చి.. సోషల్ మీడియాలో పోస్టర్లు వేయించుకుంటున్నారు. పెన్షన్ వచ్చేనా?ఏపీలో దివ్యాంగుల్లో 8 లక్షల మంది పెన్షన్ పొందుతుండగా.. వారిలో 60 వేల మందికి మళ్లీ వైకల్య పరీక్షలు జరపాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందువల్ల వాళ్లకు పెన్షన్ వస్తుందా అనేది అనుమానమే. వృద్ధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇస్తున్న పెన్షనర్ల విషయంలోనూ రివిజన్ నిర్వహించాలని బాబు సర్కార్ యోచిస్తోంది. తద్వారా రకరకాల నిబంధనల పేరుతో మరికొందరిని జాబితా నుంచి తొగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లుంది. ఈసారి ఒకరోజు ముందుగానే ఆగస్టు 31న పెన్షన్ పంపిణీ చేస్తునప్పటికీ.. పెన్షన్ ఇవ్వడానికి ఎవరూ రాకపోతే ఎలా? అనే ఆందోళన లబ్దిదారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పెన్షన్ రాకపోతే.. సచివాలయాల చుట్టూ తిరగండి. అసలు మీ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోండి.. లేకపోతే ఇక అంతే.. అంటూ అధికారులు చెబుతున్నారని పెన్షనర్లు వాపోతున్నారు. -
ఏపీలో పెన్షనర్లకు షాక్..
-
పెన్షనర్లపై బాబు కొత్త కుట్ర..
-
డబుల్ పెన్షనర్ల నుంచి రూ.10 లక్షలు రికవరీ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ సర్వీసు పెన్షన్లు, సామాజిక ఆసరా పెన్షన్.. రెండూ పొందుతున్న పది మంది రూ.10 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. జిల్లాలో 71 మంది రెండు పెన్షన్లు పొందుతున్నట్లుగా పేర్కొంటూ జూలై 6న ‘సాక్షి’లో ‘ప్రభుత్వ పెన్షనర్లకు ఆసరా’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రెండు పెన్షన్లు పొందుతున్న వారికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీచేశారు. రెండు పెన్షన్లు పొందుతున్న వారు ఆసరా పెన్షన్ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశించారు.కాగా, ఏళ్ల తరబడి పొందిన ఆసరా పెన్షన్ డబ్బులను ఒకేసారి చెల్లించడం ఇబ్బందిగా ఉండడంతో రికవరీకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వారికి వెసులుబాటు కలి్పంచారు. ఇప్పటికే 10 మంది రూ.10 లక్షలు చెల్లించగా.. ఇంకా 61 మంది, రూ.47.75 లక్షల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని దశలవారీగా రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆసరా పెన్షన్లు నిలిపివేసి, సరీ్వసు పెన్షన్ నుంచి ఆ సొమ్మును దశలవారీగా రికవరీ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయకుండా వాయిదా పద్ధతిలో వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
పింఛన్లకు ‘అధికార’ గ్రహణం
బత్తలపల్లి/గాండ్లపెంట/పుట్టపర్తి అర్బన్/కోటనందూరు: రాష్ట్రంలో పెన్షన్లకు ‘అధికార’ గ్రహణం పట్టింది. టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్ నగదు అందకుండా చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్ను ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు బుధవారం వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎంపీడీవో శివనాగప్రసాద్ వారితో చర్చించారు. పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్ను ఆరాతీశారు. అందరికీ పింఛన్లు ఇవ్వాలని తాము భావించామని, అయితే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వారు వాపోయారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ అయిందని, వచ్చేనెల రెండునెలల పింఛన్ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కలెక్టర్ను కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. ⇒ గాండ్లపెంట మండలం ఎలుగూటివారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు పింఛన్ మంజూరైనా అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు కె.రమాదేవి, ఎం.నారాయణరెడ్డి, ఎం.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి బుధవారం ఎంపీడీవో రామానాయక్కు ఫిర్యాదు చేయాలని కార్యాలయానికి ఎంపీడీవో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్ను ఇప్పుడు నిలిపేశారని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. ⇒ స్థానిక టీడీపీ నాయకులను కలిసి వస్తేనే పింఛన్ ఇస్తామంటూ మూడురోజుల నుంచి తిప్పుకొన్న సచివాలయ సిబ్బంది చివరకు సైట్ క్లోజ్ అయిందంటూ పింఛన్ సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంసీపల్లి 1, 2 సచివాలయాలకు చెందిన పెన్షన్దారులు బుధవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ రోజూ ఇలా జరగలేదని, వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ మొత్తాన్ని ఇచ్చేవారని చెప్పారు. ప్రభుత్వం మారగానే పింఛన్ ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సిబ్బంది సూచన మేరకు వారు డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పీడీ నరసయ్య లేకపోవడంతో అధికారి శివమ్మ వద్ద గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై డీఆర్డీఏ పీడీ నరసయ్యను వివరణ కోరగా .. ఈ విషయాన్ని పరిశీలించాలని రామగిరి ఎంపీడీవోని ఆదేశించామని, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ⇒ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛనుదారులకు అధికారులు పింఛన్ నిలిపేశారు. సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి ఏడుగంటల వరకు సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సమస్యను బుధవారం ఎంపీపీ లగుడు శ్రీనివాసుకి వివరించారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీడీవో జయమాధవికి వినతిపత్రమిచ్చారు. దీనిపై ఎంపీడీవో జయమాధవిని వివరణ అడగగా.. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు తీసుకుంటున్నారని 18 మందిపై ఫిర్యాదు అందడంతో వారికి పింఛన్లు ఆపేశామన్నారు. విచారించి వారు అర్హులైతే వచ్చేనెల నుంచి ఇస్తామని చెప్పారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు ఇంత దారుణం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో ఒక్కనెల కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు. కలెక్టర్ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. - సిద్ధయ్య, ఎంసీపల్లి, రామగిరి మండలం అప్పుడు ఎవరికీ తొలగించలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ పెన్షన్ తొలగించలేదు. ఒకవేళ మా నాయకులు తప్పుచేస్తే నాకు చెప్పండి లేదా కోర్టుకు వెళ్లండని చెప్పిన గొప్ప నాయకుడు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా చేస్తున్నారు. - నరసింహారెడ్డి, ఎంసీపల్లి, రామగిరి మండలం సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? నా కుమార్తె నందివర్ధినీబాయికి తలసేమియా పెన్షన్ వస్తోంది. పాపను ఎత్తుకుని నా భార్య మూడురోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది. టీడీపీ వాళ్లను కలిసి ఫోన్చేయిస్తే ఇస్తామని చెప్పారు. లోకల్ లీడర్ల ప్రెజర్ ఉందని, వాళ్లను కలవాలని సెక్రటరీ, ఎంపీడీవో చెప్పడం అన్యాయం. సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలీల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు స్పందించి నందివర్ధినీబాయికి బాసటగా నిలవాలి. - ముత్యాలనాయక్, ఆర్.కొత్తపల్లి, రామగిరి మండలం -
పెన్షన్ దారులకు వెన్ను పొట్లు బాబు మార్క్ కుట్ర
-
మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు
-
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
-
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
-
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
-
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
-
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. -
పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..
-
ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర
కడప కార్పొరేషన్: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. 10,177 మంది రెగ్యులరైజ్ రాష్ట్ర బడ్జెట్ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియెర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్ష¯Œన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్ చేశారని, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్.. 12వ పే రివిజన్ కమిషన్ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు. వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్రెడ్డి వివరించారు. -
అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు, దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్చైర్కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. -
అవ్వాతాతలూ ఆలోచించండి.. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే: సీఎం జగన్
వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికేముంది? నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు.. ఎలాగూ చేసేది లేదు కదా! అనే మనస్తత్వం వాళ్లది. మీ బిడ్డ అలా కాదు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడమే. – పింఛన్దారులతో సీఎం జగన్ సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ‘‘పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఏ వర్గానికైనా సరే.. మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే ఎక్కడా మీ బిడ్డ తగ్గడు. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు అని స్పష్టంగా చెబుతున్నా. మన ప్రమాణ స్వీకారం రోజు వలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమంపైనే మొట్ట మొదటి సంతకం చేస్తా’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం, మోసం చేయడం తెలియదు కాబట్టి బాబు, ఆయన కూటమితో ఈ రెండు విషయాల్లో మాత్రం పోటీ పడలేడని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే.. అవ్వాతాతలపై ప్రేమతో... ఈరోజు అవ్వాతాతలతోపాటు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ ఇచ్చిన పెన్షన్ రూ.1,000 మాత్రమే. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకుంటేనే అందిన దుస్థితి. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అప్పట్లో నెలకు వెచ్చించిన వ్యయం కేవలం రూ.400 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ అవ్వాతాతల గురించి, వారి కష్టాలు, ఆత్మగౌరవం గురించి ఆలోచన చేశాడు. అధికారంలోకి రాగానే దేశంలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను నెలకొల్పి వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా 1వ తారీఖునే అది సెలవు రోజైనా, ఆదివారమైనా సరే ఇంటివద్దే నేరుగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్లు పెట్టిన పరిస్థితి 56 నెలలు మన ప్రభుత్వం హయాంలోనే జరిగింది. గతంలో 39 లక్షలు మంది మాత్రమే íపింఛనుదారులుండగా ఈరోజు వివక్ష లేకుండా 66.34 లక్షల మందికి ఠంఛన్గా పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా గత సర్కారు హయాంలో మాదిరిగా రూ.వెయ్యి కాకుండా ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళ్లి అవ్వాతాతలకు మంచి చేశాం. ఈ తేడాను ఒక్కసారి గమనించండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఆ అవ్వలు, తాతలు, అభాగ్యుల పట్ల మనసులో నిజమైన ప్రేమ ఉంటేనే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సభకు హాజరైన అవ్వాతాతలు బాబు ఆ ఆలోచనే చేయలేదు.. మీరంతా గత పాలకులను చూశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు పరిపాలన చేశానని చెబుతుంటారు. కానీ ఏ ఒక్క రోజైనా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఆయన ఆలోచన చేశాడా? అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలనే తాపత్రయం, మనసులో ప్రేమ ఉంటేనే చేతల్లో బయటకు వస్తుంది. ఇవాళ రాజకీయాలు పాతాళానికి దిగజారాయి. విలువలు, విశ్వసనీయత లేవు. ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ తొలిసారిగా అడుగులు వేగంగా వేశాడు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఏకంగా 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చాడు. మీ బిడ్డకు అబద్ధాలు, మోసాలు తెలియవు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ ముందు ఉంచుతున్న వాస్తవాలపై ఆలోచన చేయమని అందరినీ కోరుతున్నా. దేశంలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదే జనాభా ప్రకారం చూస్తే ఐదు కోట్ల మందిలో 66.34 లక్షల మందికి పెన్షన్లు, అత్యధికంగా పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రం మనదే. నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే అందచేస్తున్నాం. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నాం. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలిపితే ఏకంగా రూ.90 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. ఏటా రూ.24 వేల కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా బిహార్లో రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో రూ.5,160 కోట్లు, కర్ణాటకలో రూ.4,700 కోట్లు, పక్కన తెలంగాణలో రూ.8,180 కోట్లు చొప్పున ఏటా పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే అవ్వాతాతలను మోసం చేసేందుకు రూ.4 వేలు.. రూ.5 వేలు.. రూ.6 వేలు అని చెబుతారు. ఇంకా అవసరం అయితే ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు అని కూడా అంటారు. మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా చేయగలిగిందే చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాదు. ఈ 58 నెలల పాలన చూస్తే చెప్పనివి కూడా చాలా చేసిన పరిస్థితి మీ అందరికీ కనిపిస్తుంది. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. మీ అందరికీ అందుకే చెబుతున్నా. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండీ. మీ బిడ్డ పేదల సంక్షేమానికి సంవత్సరానికి దాదాపుగా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తేవడంతో ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని నమ్మబలుకుతున్న చంద్రబాబు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. సునాయాసంగా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మీలో ఎవరైనా నాకు సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్లిప్పులో రాసి బాక్సులో వేస్తే నావద్దకు వస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు చంద్రబాబు చేసిన పనికి... నాకు కాలు విరగడంతో ఆపరేషన్లు జరిగాయి. అన్ని పథకాలు కలిపి రూ.3.40 లక్షలు అందాయి. నీ మేలు ఎప్పుడూ మరవలేం. చంద్రబాబు చేసిన పనికి చాలా కష్టం అయింది. నాకు ఆయాసం ఉంది. మూడుసార్లు కూర్చుని లేచి సచివాలయానికి వెళ్లా. తోడు కోసం ఓ పాపను తీసుకెళితే రాయి తగిలి కింద పడటంతో ఆమె ముక్కుకు గాయం అయింది. మమ్మల్ని ఇంత కష్టపడేలా చేసింది చంద్రబాబే. రైతుభరోసా సహా నాకు ఎన్నో పథకాలు అందాయి. మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకున్నా. నీవల్లే ధైర్యంగా బతుకుతున్నా. – కర్నాటి సుబ్బులు, కుర్చేటి మండలం, అగ్రహారం ఎంత ఇబ్బంది బాబూ.. ఇన్నాళ్లూ వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెడితే ఈనెలలో మాత్రం మూడు చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళితే అక్కడ కాదన్నారు. ఇంకో చోటకు వెళితే అక్కడా కాదన్నారు. మోకాళ్ల నొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ బాబు! ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. మాకు వలంటీర్లు, వలంటీర్ల వ్యవస్థ కావాలి. కరోనాలో మాసు్కలతో సహా ఇంటివద్దకే పంపించారు. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకు పథకాలు అందుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తే ఒప్పుకోం. – పట్రా ప్రభావతి, దర్శి దివ్యాంగులు, వృద్ధులపై అక్కసు.. టీడీపీ హయాంలో దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. మీరు (సీఎం జగన్) పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలిచ్చారు. అందులో ఇవ్వని హామీ ఒకటి ఏమిటంటే దేవుడి దూతలా వలంటీర్లను పంపించడం. వారు ఇంటింటికీ వచ్చి దివ్యాంగులకు పెన్షన్లే కాకుండా సదరం సర్టిఫికెట్ నుంచి ఆధార్ కార్డు దాకా ప్రతి ఒక్కటీ అందేలా చేశారు. బాబు మిమ్మల్ని ఏమీ చేయలేక అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టి కొట్టుకుపోతారు. 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోవటాన్ని నేను కళ్లారా చూశా. దీనికి ఎవరు కారణమనేది అందరూ ఆలోచన చేయాలి. – నర్సింహారావు, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు నిన్నే నమ్ముకున్నానయ్యా.. నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాకు వైఎస్సార్ ఇల్లు కట్టించాడు. నాకు నలుగురు కొడుకులున్నా నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది బ్యాంకుల నుంచి రూ.23 వేలు వచ్చాయి. నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా. – గంగిరెడ్డి మంగమ్మ, బొట్టపాలెం దోమలు కుడుతున్నా.. పింఛన్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి మాకు పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలే ఉండేవి. దోమలు కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుందనే భయంతో వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వుండేవాడ్ని. సిబ్బంది 8 గంటలకు వచ్చేవారు. అన్ని పూర్తి చేసేసరికి 9 గంటలు అయ్యేది. అప్పటికే దాదాపు రెండు మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లను తరువాత రావాలని పంపేవారు. అలా వారం రోజులు పెన్షన్లు ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన బంగారు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వారికి మే 13న ప్రజాకోర్టు శిక్ష వేస్తుంది. జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది. – వెంకటపతి, దర్శి పల్లెటూళ్లకు పాలన తెచ్చారు.. నవరత్నాల పథకాల వల్ల మాలాంటి పేదలకు నాలుగు వేళ్లు నోట్లోకి పోతున్నాయి. నాడు పరిపాలన కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. నేడు పల్లెటూళ్లకు పరిపాలన తెచ్చిన ఘనత మన జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీస్కు వెళ్లాల్సిందే. ఇప్పుడు అన్నీ గ్రామాల్లోనే లభిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నీలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడ్ని చూసి భయపడుతున్నారు. – శ్రీనివాస్రెడ్డి, బసిరెడ్డిపాలెం గ్రామం నీ నీడన మేం ఉండాలి.. నా పెనిమిటి మరణించి 15 ఏళ్లు అయింది. నాకు ఇల్లూ వాకిలీ లేదు. ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. ఇప్పటి వరకూ రూ.1.30 లక్షల మేర లబ్ధి పొందా. ఈనెల పెన్షన్ వలంటీర్ ఇవ్వలేదు. నా కుమారుడిని అడిగితే దర్శి వెళ్లి తెచ్చుకోవాలన్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేను. ఎవరినో బతిమాలి వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నా. జగనన్నా మళ్లీ నువ్వే రావాలి. 175కి 175 రావాలి. నీ నీడన మేం ఉండాలి. మంచి మనసున్న మారాజు నువ్వు. సొంత కొడుకులు, కోడళ్లు పదెకరాల ఆస్తి ఇచ్చినా మనల్ని చూడరు. కానీ అందరినీ చూసే మంచి మనసున్న మనిషి దైవబలంతో ఆ తల్లికి జన్మించాడు. అలాంటి జగనన్నను మనం గెలిపించుకోవాలి. – వెంకాయమ్మ, శివాజీ నగరం వార్డు, దర్శి, వితంతు పెన్షన్ లబ్ధిదారు ఐదు గద్దలు మాపై పడ్డాయి.. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలు అరకొర పెన్షన్లు ఇవ్వడంతోపాటు ఒక íపింఛనుదారుడు చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలు మంజూరు చేసేవి. వలంటీర్లను అడ్డుకునేందుకు రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి లాంటి ఐదు గద్దలు తోడయ్యాయి. ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి నాలాంటి గుడ్డోళ్లు, ముసలోళ్లను దెబ్బ తీశారు. పది మంది చూపు పడితే బండ రాళ్లైనా పగిలిపోతాయి. 69 లక్షల మంది చూపు పడి ఆ ఐదుగురూ నామరూపాలు లేకుండా పోతారు. – శ్రీను, పెద ఉయ్యాలవాడ, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు -
పింఛన్ల లబ్ధిదారులపై అక్కసు వెళ్లగక్కుతున్న టీడీపీ నేతలు
-
అవ్వాతాతలకు ఇంటి దగ్గర పెన్షన్ రాకుండా చేసిన పచ్చ గ్యాంగ్
-
బాబు నిర్వాకం వల్లే సచివాలయాలకు వెళ్లే దుస్థితి: పెన్షన్ దారులు
-
జగన్ సీఎం అయ్యాకే సక్రమంగా పింఛన్: వృద్ధులు
-
‘పచ్చ’పగ.. పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు (ఫొటోలు)
-
ఊహల్లో బ్రతుకుతున్న బాబు.. ముమ్మాటికీ ఇది చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్ర
-
చంద్రబాబు వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందని అవ్వాతాతల ఆవేదన
-
చంద్రబాబు వేస్ట్...వాలంటీర్లే బెస్ట్
-
కుట్ర ఫలించి.. గడప దాటించి!
చంద్రబాబు అండ్ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్దారులకు పింఛన్ కష్టాలు పునరావృతం కానున్నాయి. తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అనుంగు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్ ఒకవైపు కోర్టుల్లో వలంటీర్లపై కేసులు వేయడం.. మరోవైపు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ దూరం పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఐదేళ్లుగా ఇంటి వద్దే పింఛను అందుకుంటున్న లబి్ధదారులు టీడీపీ కుట్రతో మొదటిసారి గడప దాటాల్సి రావడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 4,69,789 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.140,15,56,500 బ్యాంకులకు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి బుధవారం నగదు డ్రా చేయనున్నారు. వీలైనంతవరకు బుధవారమే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ అయినా గురువారం నుంచి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 సచివాలయాల్లో పించన్ల పంపిణీ జరుగుతుంది. 6వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 2,46,863 పింఛన్లకు రూ.73.90 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,22,935 పింఛన్లకు రూ.66.24 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. దీంతో పింఛన్దారులు వలంటీర్లను గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా పింఛన్ పొందుతున్న వారికి పచ్చ కూటమి కారణంగా మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాల్సి ఉన్నందున మొదటి రోజు పంపిణీలో జాప్యం జరుగుతుంది. 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్దారులు కిలో మీటర్ల దూరంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4.70 లక్షల మందికి కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీపై పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికే పింఛన్ పంపితే... చంద్రబాబు మళ్లీ పాత పద్ధతిలో సచివాలయాల చుట్టూ తిప్పేలా చేశాడని పింఛన్దారుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అందరికీ పింఛన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ ముగిసే వరకు సచివాలయాల వద్ద షామియానాలు వేయడంతో పాటు నీటి సదు పాయం కలి్పంచేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీరికి ఇంటి వద్దే పంపిణీ ► ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల పింఛన్లు ఉండగా... ఇందులో వికలాంగులు, వయోవృద్ధులు (నడవలేని వారు), మంచానికే పరిమితమైనవారు, కిడ్నీ, డయాలసిస్ పేషెంట్లకు ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగులు పింపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ► ఇటువంటి వారు దాదాపు 30–40 శాతం మంది ఉంటారు. ► సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ► సచివాలయాల్లేని మజరా గ్రామాల్లో పింఛన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఒకవైపు 30–40 శాతం మందికి ఇంటి వద్ద.. మిగిలిన వారికి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయనుండటం గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. బాబు ఎంత పని చేశావయ్యా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లూ ఎప్పుడూ పింఛన్ కోసం ఆలోచించలేదు. ఠంచన్గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇప్పడు భయపడుతున్నారు. మా లాంటి వారికి ఇంటికొచ్చి ఎవరు వస్తారో తెలియదు. ఎవరినీ అడగాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ముసలోళ్ల మీద దయలేదు. –కరీంబీ, డబ్ల్యూ.గోవిందిన్నె, దొర్నిపాడు మండలం లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో.. నాకు వితంతు పింఛన్ వస్తుంది. ప్రతి నెలా వలంటీర్లు తెల్లవారుజూమున ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. కానీ ఈ నెల ఒకటవ తేదీ వచ్చింది కానీ పింఛను అందలేదు. వలంటీర్ను అడిగితే సచివాలయానికి రావాలని చెబుతున్నారు. అందరూ అక్కడికి పోతే పెద్ద లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో తెలియడం లేదు. కూలీకి వెళ్లకుండా పింఛన్ కోసం వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు మాలాంటి పేదల మీద ఎప్పుడూ ఏడుస్తుంటాడు. – తెలుగు వెంకట లక్ష్మమ్మ, గిద్దలూరు గ్రామం, సంజామల మండలం మా ఉసురు తగులుతుంది టీడీపీ పాలనలో పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయలేదు. అప్పట్లో పంచాయతీ కార్యాలయం వద్ద వారాల కొద్ది ఎదురు చూసేటోళ్లం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ ద్వారా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దకు పింఛన్ ఇచ్చి పంపుతున్నాడు. పింఛన్లు వలంటీర్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణం. చంద్రబాబుకు ఓటు వేసే ప్రసక్తే లేదు. మా ముసలోళ్ల ఉసురు ఆయనకు తగులుతుంది. – బోయ నరసమ్మ, నాగలదిన్నె, నందవరం మండలం -
పండుటాకులపై పగా?
‘మేం ఏం పాపం చేశాము. మాపైన వాళ్లకు ఎందుకంత పగ. వలంటీర్లపై కక్షగట్టి మా నుంచి దూరం చేశారు. ఒకటో తేదీ తెల్లవారేసరికి ఇంటికొచ్చే పెన్షన్ని రానీయకుండా చేశారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ మేము క్యూల్లో నిలబడాలా..?. మండుటెండల్లో సొమ్మసిల్లి పడిపోవాలా..?. పనులు మానుకుని.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరీక్షించాలా..?’ అంటూ పెన్షన్ దారులు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు అండ్ కో.. వలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని సంక్షేమ పథకాల నుంచి మినహాయించింది. లబి్ధదారులకు ఒకటో తేదీ అందాల్సిన పెన్షన్ అందకుండా పోయింది. దీంతో లబి్ధదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. గుడ్డివారి గోష్ట టీడీపీకి తగులుతుంది నాకు కంటి చూపులేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మనిషి తోడుకావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే ప్రతినెలా ఒకటవ తేదీ గ్రామ వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేదాన్ని. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఈ నెల నుంచి ఎన్నికల సాకు చూపి వలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి పక్కన పెట్టడం దురదృష్టకరం. నా లాంటి కంటిచూపు లేని వాళ్లు ఎక్కడో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి క్యూలో నిలబడి పింఛన్ ఎలా తీసుకోవాలి..?. మాలాంటి వారి గోడు తప్పక తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము.గత 58 నెలలు ఆ బాధల నుంచి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని విముక్తి లభించింది. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. –నాగమ్మ, వెంగారెడ్డికండ్రిగ, వరదయ్యపాళెం మండలం లేవలేని స్థితిలో ఉన్నా నాకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదల్లేక మంచానికే పరిమితమైనాను. నెలనెలా వచ్చే పింఛనుపైనే మందులుమాకులు ఇతరులతో చెప్పి తెప్పించుకునేవాడిని. ప్రతినెలా ఒకటో తారీఖున వలంటీర్ నిద్రలేపి నా వేలిముద్ర తీసుకుని ఇంటివద్దనే పింఛన్ ఇచ్చేవాడు. ఈ రోజు(సోమవారం) పింఛన్ ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారు. నేను అంత దూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకునేది..?. ఏ పుణ్యాత్ముడో ఫిర్యాదు చేసి నాలాంటి వారి ఉసురు పోసుకున్నాడు. పింఛన్ ఇంటికి రాకుండా చేశారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నలుగురిని మంచంపై సచివాలయం వద్దకు మోసుకెళ్లాలి. అదే వలంటీర్ అయితే ఇంటివద్దకే వచ్చి ఇచ్చిపోయుండేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏ దిగులూ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇవ్వకపోయినా ఆయన చేసిన మేలు మరిచిపోతామా?. – గోవిందనాయుడు, కుప్పంబాదూరు గ్రామం, రామచంద్రాపురం టీడీపీ పాలనలో అష్టకష్టాలు..మళ్లీనా? వాకాడు మండలం, ఇన్నమాల గ్రామానికి చెందిన పోలయ్య వయసు 91, చేను చెంగమ్మ వయసు 85, ఇన్నమాల సుబ్బమ్మ వయసు 86, బండి వెంకటసుబ్బయ్య వయసు 78. వీరి వలంటీర్లు ఉమ్మడి మోహన్, పీ.సులోచన, అఖిల కవిత. సోమవారం ఒకటో తేదీ కావడంతో వారి రాకకోసం ఎదురు చూశారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా నాయనా.. మీరు మాకు పింఛన్ ఇచ్చే వారా?.. అయితే నా పేరు ఫలానా.. నాకు పింఛన్ ఇవ్వండి’ అని అడిగి మరీ నిరాశ చెందారు. తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు వీ«ధి కాలవలపై కూర్చుని పింఛన్ కోసం ఎదురు చూసి నిట్టూర్పుతో వెనుదిరిగారు. చంద్రబాబు పుణ్యమా అంటూ మరో మూడు నెలలు పింఛన్ ఇంటికి రాదని సమాచారం తెలుసుకున్న అవ్వాతాతలు మాకు పింఛన్ రాకుండా చేసిన చంద్రబాబు, వారి మనుషులు మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు బాబు కుట్రలకు బలైపోయాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతిరోజూ అవస్థలే. ఎప్పుడు..? ఎక్కడిస్తారో తెలియని పరిస్థితి. పంచాయతీ, పోస్టల్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కష్టాల నుంచి వృద్ధులను, వితంతువులను గట్టెక్కించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ వలంటీర్ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. అనారోగ్య కారణంతో మంచానికే పరిమితమైన నాలాంటి వారికి ఈ పద్ధతి ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. నేను సచివాలయానికి వెళ్లాలంటే అద్దె ఆటో కావాలి. దానికి తోడు నా వెంట మరో వ్యక్తి సహాయం అవసరం. ఇంట్లో వారు సైతం పనులు మానుకుని నా వెంట రావాల్సిన పరిస్థితి. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు. నాలాంటి వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. –మాచాలమ్మ, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం మేమంటే బాబుకు ఎందుకంత కక్ష గతంలో వెయ్యి రూపాయల పింఛన్ కోసం మండుటెండల్లో కిలోమీటరు పొడవున ఉండే క్యూలో నిలబడేదాన్ని. నా మనవడు జగన్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. నాకు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు జామున్నే మా వలంటీర్ సులోచన ఇంటికొచ్చి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేది. ఈనెల ఒకటోతేదీ వచ్చినా మా వలంటీర్ ఇంటికి రాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడపలో కూర్చుని ఎదురు చూశాను. ఎందుకు రాలేదని వేరే వాళ్లను అడిగితే చంద్రబాబు, వాళ్ల మనుషులు వలంటీర్లుపై కోర్టుకు వెళ్లి కేసు వేశారని చెప్పారు. మరో మూడు నెలలు ఆఫీసుకాడికి వెళ్లి పింఛన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గరపడి పేదలను ఇలా కష్టాలు పెడుతున్నాడు. చంద్రబాబు అప్పుడు అలా చేశాడు.. ఇప్పుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన పాలనలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని నాలుగో రోజున పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు నా మనవడు జగన్ దయతో ఐదేళ్లు ఆ కష్టాలు తప్పినాయి. మళ్లీ చంద్రబాబు పాత రోజులను తీసుకురావడం దుర్మార్గం. చేను చెంగమ్మ వృద్ధురాలు, గొల్లపాళెం, వాకాడు మండలం మా ఉసురు తగలకుండా పోదు జగనన్న ప్రభుత్వ హయంలో మాకు తెల్లారేసరికి నిద్రలేపి పింఛన్ ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛను ఇచ్చి, సమస్యలు అడిగి తెలుసుకునేవారు. జీతం తరహాలో పింఛను తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు మాకు అండగా నిలిచారు. వలంటీర్ల సేవలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడేమో ఎన్నికలు అని చెప్పి మాకు పింఛన్ అందకుండా చేశారు. పింఛన్ అడ్డుకున్న వాళ్లకు మాలాంటి ముసలోళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం వలంటీర్ల ద్వారా మాకు మంచి చేస్తుంటే ఓర్వలేక అడ్డుపడడం బాధగా ఉంది. ఎవరో వద్దన్నారని వలంటీర్లు ఏమో ఈరోజు పింఛను ఇవ్వలేదు. ఎందుకని అడిగితే టీడీపీ వాళ్లు వలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతేనా..?. మాలాంటి ముసలోళ్లకి మంచి జరిగితే ఓర్వలేరా..?. మాలాంటి వాళ్లపైన కక్షగడ్డి పింఛన్ రాకుండా చేశారు. మా ఉసురు తలగకుండా పోదు. – సరసమ్మ, ఎర్రమిట్ట, తిరుపతి -
మేమంటే బాబుకు ఎందుకంత కక్ష
‘మేం ఏం పాపం చేశాము. మాపైన వాళ్లకు ఎందుకంత పగ. వలంటీర్లపై కక్షగట్టి మా నుంచి దూరం చేశారు. ఒకటో తేదీ తెల్లవారేసరికి ఇంటికొచ్చే పెన్షన్ని రానీయకుండా చేశారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ మేము క్యూల్లో నిలబడాలా..?. మండుటెండల్లో సొమ్మసిల్లి పడిపోవాలా..?. పనులు మానుకుని.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరీక్షించాలా..?’ అంటూ పెన్షన్ దారులు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు అండ్ కో.. వలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని సంక్షేమ పథకాల నుంచి మినహాయించింది. లబి్ధదారులకు ఒకటో తేదీ అందాల్సిన పెన్షన్ అందకుండా పోయింది. దీంతో లబి్ధదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. గుడ్డివారి గోష్ట టీడీపీకి తగులుతుంది నాకు కంటి చూపులేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మనిషి తోడుకావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే ప్రతినెలా ఒకటవ తేదీ గ్రామ వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేదాన్ని. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఈ నెల నుంచి ఎన్నికల సాకు చూపి వలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి పక్కన పెట్టడం దురదృష్టకరం. నా లాంటి కంటిచూపు లేని వాళ్లు ఎక్కడో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి క్యూలో నిలబడి పింఛన్ ఎలా తీసుకోవాలి..?. మాలాంటి వారి గోడు తప్పక తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము.గత 58 నెలలు ఆ బాధల నుంచి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని విముక్తి లభించింది. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. –నాగమ్మ, వెంగారెడ్డికండ్రిగ, వరదయ్యపాళెం మండలం లేవలేని స్థితిలో ఉన్నా నాకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదల్లేక మంచానికే పరిమితమైనాను. నెలనెలా వచ్చే పింఛనుపైనే మందులుమాకులు ఇతరులతో చెప్పి తెప్పించుకునేవాడిని. ప్రతినెలా ఒకటో తారీఖున వలంటీర్ నిద్రలేపి నా వేలిముద్ర తీసుకుని ఇంటివద్దనే పింఛన్ ఇచ్చేవాడు. ఈ రోజు(సోమవారం) పింఛన్ ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారు. నేను అంత దూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకునేది..?. ఏ పుణ్యాత్ముడో ఫిర్యాదు చేసి నాలాంటి వారి ఉసురు పోసుకున్నాడు. పింఛన్ ఇంటికి రాకుండా చేశారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నలుగురిని మంచంపై సచివాలయం వద్దకు మోసుకెళ్లాలి. అదే వలంటీర్ అయితే ఇంటివద్దకే వచ్చి ఇచ్చిపోయుండేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏ దిగులూ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇవ్వకపోయినా ఆయన చేసిన మేలు మరిచిపోతామా?. – గోవిందనాయుడు, కుప్పంబాదూరు గ్రామం, రామచంద్రాపురం టీడీపీ పాలనలో అష్టకష్టాలు..మళ్లీనా? వాకాడు మండలం, ఇన్నమాల గ్రామానికి చెందిన పోలయ్య వయసు 91, చేను చెంగమ్మ వయసు 85, ఇన్నమాల సుబ్బమ్మ వయసు 86, బండి వెంకటసుబ్బయ్య వయసు 78. వీరి వలంటీర్లు ఉమ్మడి మోహన్, పీ.సులోచన, అఖిల కవిత. సోమవారం ఒకటో తేదీ కావడంతో వారి రాకకోసం ఎదురు చూశారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా నాయనా.. మీరు మాకు పింఛన్ ఇచ్చే వారా?.. అయితే నా పేరు ఫలానా.. నాకు పింఛన్ ఇవ్వండి’ అని అడిగి మరీ నిరాశ చెందారు. తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు వీ«ధి కాలవలపై కూర్చుని పింఛన్ కోసం ఎదురు చూసి నిట్టూర్పుతో వెనుదిరిగారు. చంద్రబాబు పుణ్యమా అంటూ మరో మూడు నెలలు పింఛన్ ఇంటికి రాదని సమాచారం తెలుసుకున్న అవ్వాతాతలు మాకు పింఛన్ రాకుండా చేసిన చంద్రబాబు, వారి మనుషులు మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు బాబు కుట్రలకు బలైపోయాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతిరోజూ అవస్థలే. ఎప్పుడు..? ఎక్కడిస్తారో తెలియని పరిస్థితి. పంచాయతీ, పోస్టల్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కష్టాల నుంచి వృద్ధులను, వితంతువులను గట్టెక్కించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ వలంటీర్ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. అనారోగ్య కారణంతో మంచానికే పరిమితమైన నాలాంటి వారికి ఈ పద్ధతి ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. నేను సచివాలయానికి వెళ్లాలంటే అద్దె ఆటో కావాలి. దానికి తోడు నా వెంట మరో వ్యక్తి సహాయం అవసరం. ఇంట్లో వారు సైతం పనులు మానుకుని నా వెంట రావాల్సిన పరిస్థితి. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు. నాలాంటి వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. –మాచాలమ్మ, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం మేమంటే బాబుకు ఎందుకంత కక్ష గతంలో వెయ్యి రూపాయల పింఛన్ కోసం మండుటెండల్లో కిలోమీటరు పొడవున ఉండే క్యూలో నిలబడేదాన్ని. నా మనవడు జగన్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. నాకు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు జామున్నే మా వలంటీర్ సులోచన ఇంటికొచ్చి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేది. ఈనెల ఒకటోతేదీ వచ్చినా మా వలంటీర్ ఇంటికి రాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడపలో కూర్చుని ఎదురు చూశాను. ఎందుకు రాలేదని వేరే వాళ్లను అడిగితే చంద్రబాబు, వాళ్ల మనుషులు వలంటీర్లుపై కోర్టుకు వెళ్లి కేసు వేశారని చెప్పారు. మరో మూడు నెలలు ఆఫీసుకాడికి వెళ్లి పింఛన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గరపడి పేదలను ఇలా కష్టాలు పెడుతున్నాడు. చంద్రబాబు అప్పుడు అలా చేశాడు.. ఇప్పుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన పాలనలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని నాలుగో రోజున పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు నా మనవడు జగన్ దయతో ఐదేళ్లు ఆ కష్టాలు తప్పినాయి. మళ్లీ చంద్రబాబు పాత రోజులను తీసుకురావడం దుర్మార్గం. చేను చెంగమ్మ వృద్ధురాలు, గొల్లపాళెం, వాకాడు మండలం మా ఉసురు తగలకుండా పోదు జగనన్న ప్రభుత్వ హయంలో మాకు తెల్లారేసరికి నిద్రలేపి పింఛన్ ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛను ఇచ్చి, సమస్యలు అడిగి తెలుసుకునేవారు. జీతం తరహాలో పింఛను తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు మాకు అండగా నిలిచారు. వలంటీర్ల సేవలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడేమో ఎన్నికలు అని చెప్పి మాకు పింఛన్ అందకుండా చేశారు. పింఛన్ అడ్డుకున్న వాళ్లకు మాలాంటి ముసలోళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం వలంటీర్ల ద్వారా మాకు మంచి చేస్తుంటే ఓర్వలేక అడ్డుపడడం బాధగా ఉంది. ఎవరో వద్దన్నారని వలంటీర్లు ఏమో ఈరోజు పింఛను ఇవ్వలేదు. ఎందుకని అడిగితే టీడీపీ వాళ్లు వలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతేనా..?. మాలాంటి ముసలోళ్లకి మంచి జరిగితే ఓర్వలేరా..?. మాలాంటి వాళ్లపైన కక్షగడ్డి పింఛన్ రాకుండా చేశారు. మా ఉసురు తలగకుండా పోదు. – సరసమ్మ, ఎర్రమిట్ట, తిరుపతి -
మాపై నీకెందుకింత కక్ష?.. చంద్రబాబుపై పింఛన్దారుల ఆగ్రహం
రాజమహేంద్రవరం సిటీ/పెదబయలు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ‘మాపై నీకెందుకింత కక్ష? వృద్ధుల విషయంలో కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావ్. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకుంటావా?’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ పింఛన్ కానుక లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జాంపేట గణేష్ చౌక్ వద్ద వందలాది మంది పింఛన్దారులు సోమవారం ఆందోళన చేశారు. ఎంపీ, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్లు తమ ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్ డబ్బులు చేతిలో పెట్టేవారని చెప్పారు. కానీ ఈ దుర్మార్గపు చంద్రబాబు చేసిన పని వల్ల ఈరోజు ఇంటి వద్ద పింఛన్ అందుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అసలు పింఛన్ మంజూరవ్వడానికే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని.. పింఛన్ కోసం ఎండలో క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు పడేవాళ్లమంటూ గుర్తు చేసుకున్నారు. ఆకలి వేసినా, వడదెబ్బ కొట్టి పడిపోయినా, అనారోగ్యం వచ్చినా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదన్నారు. అధికారం నుంచి దించేసినా చంద్రబాబుకు సిగ్గురాలేదని మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని.. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు పాలన, ఆ జన్మభూమి కమిటీలను తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. టీడీపీ పాలనలో పింఛన్ కోసం కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలన వచ్చాక ప్రతి నెలా క్రమం తప్పకుండా వలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారని.. ఇంత చక్కని పాలన ఇంకెవ్వరూ అందించలేరన్నారు. తమకు మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలంటూ నినాదాలు చేశారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని ఎంపీ భరత్ చెప్పారు. బాబు నిర్వాకంతో 10 కిలోమీటర్లు నడవాలి అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గోమంగి, గుల్లేలు పంచాయతీల పరిధిలోని పింఛన్దారులు సోమవారం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థ వల్ల ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే వలంటీర్లు తమ ఇళ్లకు వచ్చి పింఛన్ ఇచ్చేవారని చెప్పారు. కానీ చంద్రబాబు చేసిన పని వల్ల ఏజెన్సీలో ఉండే తాము ఎంతో బాధపడాల్సి వస్తోందన్నారు. గుల్లేలు పంచాయతీ కించూరు, బూరుగువీధి, పెదవంచరంగి, జంగంపట్టు గ్రామాలకు సుమారు 10 కిలోమీటర్ల దూరమని, గోమంగి పంచాయతీ కరుగొండ, బొండ్డాపుట్టు, కుంతురుపుట్టు, వన్నాడ, వంకరాయి గ్రామాలకు కూడా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నిర్వాకం వల్ల తాము 10కిలోవీుటర్లు నడిచి వచ్చి సచివాలయంలో పింఛన్ తీసుకోవడం కష్టంతో కూడుకున్నదని వాపోయారు. చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులను నమ్మవద్దని ఎన్నికల కమిషన్ను కోరారు. -
పాపాల చంద్రబాబుకు అవ్వాతాతల హెచ్చరిక
-
పెనుకొండ సభలో పింఛనుపై తన వైఖరి ప్రకటించిన చంద్రబాబు
-
సీఎం జగన్ చిత్రపటానికి రాజధాని ప్రాంత రైతు కూలీల క్షీరాభిషేకం
మంగళగిరి : రాజధాని ప్రాంత రైతు కూలీలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు కూలీల పింఛన్ను సీఎం జగన్ రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా యర్రబాలెం, నిడమర్రులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవితో కలిసి పర్యటించి వలంటీర్ల ద్వారా రైతు కూలీలకు రూ.5 వేల చొప్పున పింఛన్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో యర్రబాలెంలో పలువురు లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి, నిడమర్రులో వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకతీతంగా రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ రూ.5 వేల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతులను, రైతు కూలీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులు లబ్ధిపొందలేకపోయారని, ఇక రైతు కూలీల జీవితాలైతే అగమ్యగోచరంగా తయారైన పరిస్థితులను చూశామన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. రాజధానిని నిర్మించలేకపోవడంతో పాటు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయలేకపోయాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా తాను రైతు కూలీలను ఆదుకుంటానని వాగ్దానం చేశారని, ఆ మేరకు రూ.2,500గా ఉన్న రైతు కూలీల పింఛన్ను రూ.5 వేలకు పెంచారని ప్రశంసించారు. -
AP: పింఛనే కాదు.. పెన్షనర్లూ పెరిగారు
సాక్షి, అమరావతి/కాకినాడ: అవ్వాతాతలతో పాటు వితంతువులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్ మొత్తం ఈనెల నుంచి రూ.మూడు వేలకు సీఎం వైఎస్ జగన్ సర్కారు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పింఛను పెంపు ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. వలంటీర్లు ఓ వైపు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తుండగా.. మరోవైపు రెండ్రోజులుగా వివిధ మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చురుగ్గా పాల్గొంటున్నారు. నాలుగున్నర ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో కొత్తగా పింఛన్లు మంజూరు కావాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక పింఛన్ల పంపిణీలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు గుర్తుచేస్తున్నారు. దీంతో.. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచి్చన మాట ప్రకారం రూ.3,000ల పెన్షన్ అమలుపై వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు కాకినాడ ఉత్సవాలకు సీఎం జగన్.. ఈ నేపథ్యంలో.. బుధవారం సీఎం జగన్మోహన్రెడ్డి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో జరిగే పింఛన్ల పెంపు ఉత్సవంలో స్వయంగా పాల్గొననున్నారు. ఈ జనవరి ఒకటో తేదీ నుంచి 66,34,742 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల మొత్తం రూ.1,967.34 కోట్లు విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన మెగాచెక్ను ముఖ్యమంత్రి కాకినాడలో ఆవిష్కరిస్తారు. అలాగే, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరుకు ఇటీవల జాతీయ స్థాయిలో స్కోచ్ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన ప్లాటినం అవార్డును సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. అంతేకాక.. లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడుతారు. అనంతరం.. రూ.65 కోట్లతో నిర్మించిన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ను (ముత్తా గోపాలకృష్ణ వారధి), రూ.20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి వెంకట జయరామ్కుమార్ కళాక్షేత్రాన్ని, రూ.9.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్ను సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిచేశారు. సీఎం పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆయన ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎంపీ వంగా గీత, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీ‹Ùకుమార్, ఇతర ప్రముఖులు సమీక్షించారు. సీఎం షెడ్యూల్ ఇలా.. – ఉ.9.30కు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి 10.20 గంటలకు కాకినాడకు చేరుకుంటారు. – ఉ.10.40కు బహిరంగ సభ జరిగే రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) గ్రౌండ్స్కు చేరుకుంటారు. – 11.55 వరకూ వైఎస్సార్ పింఛన్ పెంపు ఉత్సవంలో పాల్గొంటారు. – మ.12 గంటల ప్రాంతంలో కాకినాడ నుంచి బయల్దేరుతారు. – మ.2 గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు పంపిణీ రెండో రోజు శనివారం కూడా ముమ్మరంగా కొనసాగింది. వలంటీర్లు శనివారం సాయంత్రం వరకు 60,03,709 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,654.61 కోట్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. డిసెంబరు నెలలో మొత్తం 65,33,781 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 91.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ఈ నెల 5వ తేదీ వరకు మిగిలిన లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. -
పెన్షన్ పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం
-
Telangana: కొత్త పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీపి కబురు అందించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.రామయ్య కమిటీ సభ్యుడిగా వ్యవహరించనున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం/మూల పెన్షన్పై 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుత అక్టోబర్ నెల నుంచే ఐఆర్ను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు కొత్త పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించారు. వేతన సవరణ సిఫారసుల కోసం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల వేతన సవరణపై సిఫారసులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత, భవిష్యత్తు మూలధన పెట్టుబడి అవసరాలు/ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి..’ అని సూచించారు. 5% ఐఆర్తో రూ.2 వేల కోట్లకు పైగా భారం! ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ గడువు గత జూన్ 30తో ముగిసింది. జూలై 1 నుంచి ఉద్యోగులకు కొత్త వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. తాజాగా ఏర్పాటైన రాష్ట్ర రెండో పీఆర్సీ.. వేతన సవరణ ఫిట్మెంట్ శాతాన్ని సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు 5 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించనుంది. వేతన సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటివరకు చెల్లించిన ఐఆర్ను సర్దుబాటు చేసి ఉద్యోగులకు రావాల్సిన మిగిలిన వేతన సవరణ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా 5 శాతం ఐఆర్ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి ముందు 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింప చేయాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రయోజనాలను అమలు చేసింది. ఐఆర్ వీరికి వర్తిస్తుంది.. ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందుకుంటున్న సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఐఆర్ను వర్తింపజేయనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించదు.. ► తెలంగాణ ఉన్నత న్యాయ సేవలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు, అఖిల భారత సర్వీసు అధికారులు, యూజీసీ/ఏఐసీటీఈ/ఐసీఏఆర్/ కేంద్ర ప్రభుత్వ వేతనాలు/పెన్షన్లు అందుకుంటున్న ఉద్యోగులు/పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, సొసైటీల ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. -
కస్టమర్కు అనుకూలంగా సేవలు ఉండాలి
ముంబై: బ్యాంకులు కస్టమర్కు ప్రాధాన్యం ఇస్తూ, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్బీఐకి ప్యానెల్ సిఫారసు చేసింది. మరణించిన ఖాతాదారు వారసులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతించాలని, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్ తదితర సూచలను ప్యానెల్ చేసిన వాటిల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ను బ్యాంకుకు సంబంధించి ఏ శాఖలో అయినా, ఏ నెలలో అయినా సమర్పించేందుకు అనుమతించాలని, దీనివల్ల రద్దీని నివారించొచ్చని పేర్కొంది. ఆర్బీఐ నియంత్రణలోని సంస్థల పరిధిలో వినియోగదారు సేవా ప్రమాణాల సమీక్షపై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. గతేడాది మే నెలలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో అద్యక్షతన ఈ కమిటీని నియమించడం గమనార్హం. సూచనలు.. ఇంటి రుణాన్ని తీర్చివేసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తిరిగి రుణ గ్రహీతకు స్వాధీనం చేసే విషయంలో నిర్ధేశిత గడువు ఉండాలి. గడువులోగా ఇవ్వకపోతే బ్యాంక్/ఎన్బీఎఫ్సీపై జరిమానా విధించాలి. డాక్యుమెంట్లు నష్టపోతే, వాటిని తిరిగి పొందే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు అయ్యే వ్యయాలను బ్యాంకులే పెట్టుకోవాలి. కస్టమర్లకు సంబంధించి రిస్క్ కేటగిరీలను సూచించింది. వేతన జీవులు అయితే వారికి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, వారిని హై రిస్క్గా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులను తక్కువ రిస్క్ వారిగా కేటాయించొచ్చని సూచించింది. కస్టమర్లతో వ్యవహారాలు నిర్వహించే సిబ్బంది, వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా నిర్ణీత కాలానికోసారి తప్పనిసరి శిక్షణ పొందాలని కూడా పేర్కొంది. -
తెల్లవారుజాము నుంచే పెన్షన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు
-
ఈపీఎఫ్ఓ పెన్షన్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్: అధిక పెన్షన్(హయ్యర్ పెన్షన్) పథకం దరఖాస్తులకు సాంకేతిక చిక్కులు వీడడం లేదు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) షరతులకు అనుగుణంగా అన్నిరకాల వివరాలను తీసుకుని ఆన్లైన్లో అధిక పెన్షన్ దరఖాస్తు సమర్పించినప్పటికీ మెజార్టీ అర్జీదారులకు సంబంధిత దరఖాస్తు స్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆన్లైన్లో అన్ని వివరాలతో సమర్పించిన దరఖాస్తు ఎవరికి చేరిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో అర్జీదారులు అటు కంపెనీ యాజమాన్యం వద్దకు, ఇటు రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్(ఆర్పీఎఫ్సీ) కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయినాసరే ఈ సమస్యకు యాజమాన్యం వద్ద, ఆర్పీఎఫ్సీ వద్ద సమాధానం దొరకడం లేదని అంటున్నారు. నాలుగు స్థాయిల్లో ఫైలు... భవిష్యనిధి చందాదారుల్లో అధిక పెన్షన్కు అర్హత ఉన్న వారంతా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తును పూరించి సరైన ఆధారాలను జతచేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దరఖాస్తు వెంటనే కంపెనీ యూజర్ ఐడీ ఖాతాకు చేరుతుంది. అలా చేరిన దరఖాస్తును యాజమాన్యం పరిశీలించి అర్హతలను నిర్ధారించుకున్న తర్వాత ఆమోదిస్తుంది. ఇలా ఉద్యోగి, కంపెనీ ఉమ్మడి ఆప్షన్ తర్వాత ఆ దరఖాస్తు సంబంధిత రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ లాగిన్కు చేరుతుంది. అక్కడ మరోమారు పరిశీలించిన అధికారులు ఈ దరఖాస్తును ఆమోదించిన తర్వాత సెంట్రల్ సర్వర్కు ఫార్వర్డ్ చేస్తారు. ఇలా నాలుగు దశల్లో దరఖాస్తు ముందుకు కదులుతుంది. అయితే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో దరఖాస్తు దశ పూర్తిగా మారింది. ఆ దరఖాస్తు నేరుగా సెంట్రల్ సర్వర్కు చేరుతోంది. దీంతో కంపెనీ యాజమాన్యం, ఆర్పీఎఫ్సీ పరిధిలోకి రాకపోవడంతో వాటి పరిశీలన సందిగ్ధంలో పడుతోంది. గడువు దాటితే అనర్హతే... పీఎఫ్ చందాదారులు, పెన్షనర్లకు అధికపెన్షన్ అవకాశం ఇదే చివరిసారి. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆన్లైన్లో ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడం తప్పనిసరి. ఆ తర్వాత ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఇక ఇలాంటి వెసులుబాటు ఉండదని ఇప్పటికే ఈపీఎఫ్ఓ తేల్చిచెప్పింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.62లక్షల మంది అధిక పెన్షన్కు దరఖాస్తులు సమర్పించారు. మరో నెలరోజుల పాటు గడువు ఉండడంతో ఈ దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ దరఖాస్తులు సమర్పించిన వారిని ఇప్పుడు సాంకేతిక సమస్య తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులు నేరుగా సెంట్రల్ సర్వర్కు చేరడంతో అవి తిరిగి యాజమాన్యం, ఆర్పీఎఫ్సీకి చేరేదెలా అనే సందేహం నెలకొంది. మరోవైపు వచ్చే నెల 3వ తేదీలోగా ఉమ్మడి ఆప్షన్ పూర్తవుతుందా? లేదా? అనే ఆందోళన నెలకొంది. -
నకిలీ నోట్ల వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు
-
Aasara Pension: అందని ఆసరా గుర్తింపు కార్డులు..!
ముషీరాబాద్ భోలక్పుర్కు చెందిన మహిళకు వితంతు పింఛన్ మంజూరైంది. కొత్తగా పింఛను మంజూరు కావడంతో గుర్తింపు కార్డు కోసం తహాసిల్ ఆఫీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆశ్రయించింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదంటూ నాలుగైదు రోజులుగా సమాధానం చెబుతూ వచ్చి... చివరకు కార్డు వచ్చింది... ఒంటరిగా రా ఇస్తానని చెబుతున్నాడని ఆరోపిసూ సదరు మహిళ కుటుంబ సభ్యులు, బస్తీ వాసులతో కలిసి తహసీల్దార్ సమక్షంలోనే సదరు సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఆసరా ఫించన్దారులకు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షగా తయారయ్యాయి. ఆసరా పింఛన్లు మంజూరైనా..గుర్తింపు కార్డులు పంపిణీ నత్తలకు నడకనేర్పిస్తోంది. గత నెలలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల చేతులు మీదుగా ఫించను గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టినా... కనీసం 30 శాతం పూర్తి కాలేదు. కొందరికి కార్డు దక్కి మిగతా వారికి పంపిణీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో లబ్ధిదారులు తహాసిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ సంబంధిత సిబ్బందిచే ఛీత్కారాలు, వేధింపులకు గురవుతున్నారు. మహిళలకు వేధింపులే... ఆసరా పించన్ల విషయంలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఒక వైపు సిబ్బంది, మరోవైపు దళారులు మహిళల పేదరికం, అవసరాన్ని ఆసరా చేసుకొని వివిధ రకాలుగా వేధించడం పరిపాటిగా తయారైంది. గుర్తింపు కార్డులు అందని వారు తమకు ఫించన్ మంజూరు కాలేదన్న భయం... కొందరు సిబ్బంది.. దళారులకు కలిసి వచ్చే అవకాశంగా తయారైంది. తాము సహకరస్తామంటూ తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. కార్డుల పంపిణీ అంతంతే.. సరిగ్గా మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఆఫ్లైన్ ఆసరా దరఖాస్తులకు, ఏడాది అనంతరం ఆన్లైన్ ఆసరా దరఖాస్తులకు మోక్షం లబించి కొత్త పింఛన్లు మంజూరైనా గుర్తింపు కార్డుల పంపిణీ అంతంత మాత్రంగా తయారైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం మీద సుమారు 80,824 మంది ఆసరా పింఛన్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 58,066 మంది వద్దులకు, 15,210 మంది వితంతులకు, 3,265 మంది వికలాంగులకు, 2,197 ఒంటరి మహిళలకు, ఇద్దరు బీడీ కార్మికులకు, 1,194 మంది కళాకారులకు, 892 యాలసిస్ బాధితులకు, ఆరుగురు ఫైలేరియా, ఇద్దరు చేనేత కార్మికులను అసరా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీ కింద 1.96 లక్షల మంది సరా పింఛన్లు పొందుతున్నారు. (క్లిక్ చేయండి: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్కు..!) -
ఈపీఎఫ్వో సభ్యులకు శుభవార్త...!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) సభ్యులకు శుభవార్తను అందించింది. పెన్షనర్లకు భారీ ఊరట కలిపిస్తూ ఈపీఎఫ్వో నిర్ణయం తీసుకుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు సంబంధించి రూల్స్ను సడలించింది. ఈపీఎఫ్వో సభ్యులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. పెన్షన్ స్కీమ్ ను పొందాలంటే కచ్చితంగా ఆయా సభ్యులు లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంది. కాగా తాజాగా లైఫ్ సర్టిఫికేట్ విషయములో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షనర్లు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికెట్ను సబ్మిట్ చేసేలా వీలును కల్పించింది. ఇంతకుముందు పెన్షనర్లు ఈ డాక్యుమెంట్ను నవంబర్ నెలలో కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వుండేది. ఒకవేళ ఈ డాక్యుమెంట్ను ఇవ్వకపోతే పెన్షన్ నిలిచిపోతుంది. ఈపీఎఫ్వో పెన్షనర్లు బ్యాంక్ లేదా పోస్టాఫీస్కు వెళ్లి ఈ సర్టిఫికెట్ను సమర్పించాల్సి వుంటుంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్నెస్ అలవెన్స్ (డీఏ) , పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో డియర్నెస్ అలవెన్స్ 34 శాతంకు చేరనుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 31 శాతం మేర డీఏను పెంచాలని కేంద్రం నిర్ణయించగా..ఇప్పుడు అనూహ్యంగా డీఏను 34 శాతంగా పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులు ఆధారంగా డీఏ అమలు జనవరి 1, 2022 అమల్లోకి రానుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో బేసిక్ పే/పెన్షన్కు అదనంగా 3 శాతం డీఏ పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది. డీఏ పెంపు నిర్ణయం 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఇది సివిల్ ఉద్యోగులు, రక్షణ సేవల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుంది. ఇక 3 శాతం డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల మేర అదనపు భారం పడనున్నుట్లు సమాచారం. కోవిడ్-19 కారణంగా 2020లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ను కేంద్రం నిలిపివేసింది. కాగా 2021 జూలైలో డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది. తరువాత మరో 3 శాతం పెంచి 31 శాతం డీఏను ఫిక్స్ చేసింది. చదవండి: టాక్స్ పేయర్లకు అలర్ట్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..! -
మీ ఆనందమే నా తపన: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆర్థిక భారమైనా, కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా.. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలనేదే తన తపన అని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ నూతన సంవత్సర శుభ దినాన పింఛన్లను నెలకు మరో రూ.250 పెంచుతూ రూ.2,500 చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. పెన్షన్ పెంపు నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి నెలా రూ.2,250 చొప్పున డబ్బులు అందుకుంటున్న లబ్ధిదారులు ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ వ్యక్తిగతంగా లేఖ రాశారు. వలంటీర్లు 1వ తేదీన పింఛన్ డబ్బులతో పాటు ఆయా లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖను అందజేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ ‘సాక్షి’కి వివరించారు. సీఎం రాసిన లేఖ ఇలా ఉంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షులు చెబుతూ ఒక శుభవార్త అందించాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. నా సుదీర్ఘ పాదయాత్రలో అవ్వాతాతల కష్టాలను స్వయంగా గమనించా. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గత ప్రభుత్వం పెన్షన్గా మీకిచ్చిన చాలీ చాలని వెయ్యి రూపాయలతో మీరెన్ని అవస్థలు పడ్డారో కళ్లారా చూశాను. ఆత్మాభిమానం చంపుకొని జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరుగుతూ లంచాలు, వివక్షతో కూడిన వ్యవస్థలో వృద్ధులు, దివ్యాంగులు రోజుల తరబడి చేంతాడంత కూలైన్లలో పడ్డ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. గత ప్రభుత్వం కోటా పెట్టింది.. అర్హులు ఎంత మంది ఉన్నా, ఎలాగైనా పెన్షన్ల సంఖ్య తగ్గించాలని ఒక్కో గ్రామానికి ఇన్నే పెన్షన్లని గత ప్రభుత్వం కోటా పెట్టింది. ఆ కోటాకు మించి ఎంత మంది అర్హులున్నా వారెవ్వరికీ పెన్షన్లు ఇవ్వలేదు. అయ్యా.. మేము అర్హులమని అడిగిన వారికి నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, అమానవీయంగా ‘మీ ఊరిలో ఎవరైనా పెన్షనర్ చనిపోతే నీ సంగతి అప్పుడు చూద్దాంలే’ అన్నారు. మనిషన్న వారికెవరికైనా ఇలాంటి సమాధానాలు వింటే కన్నీళ్లు రాకుండా ఉంటాయా? గత ప్రభుత్వంలో దిక్కుమాలిన జన్మభూమి కమిటీలను వారి వర్గం, పార్టీ వారితో నింపి.. ఆ కమిటీలు అర్హులను గుర్తిస్తాయని ఉత్తర్వులు ఇవ్వడంతో సీనియర్ సిటిజన్లు అయిన మీరు ఆ పనికి మాలిన జన్మభూమి కమిటీల ముందు కాళ్లా వేళ్లా పడే పరిస్థితిని కల్పించారు. లంచాలు ఇస్తేనే, తమ వర్గం వారు అయితేనో, తమ పార్టీ వారు అయితేనో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ఇంతా చేసి వారు ఇచ్చింది కేవలం 39 లక్షల మందికి మాత్రమే. వాళ్లు పెన్షన్లపై నెలకు ఖర్చు చేసింది కేవలం రూ.400 కోట్లే. ఈ దుస్థితిని చూసి.. ఈ పరిస్థితి మారాలి.. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడవాలి.. వారి ముఖంలో కనిపించే చిరునవ్వులే నాకు ఆశీర్వాదాలు అవ్వాలని ఆనాడే నా మనస్సులో దృఢంగా సంకల్పించుకున్నాను. ఇదే విషయాన్ని నా పాదయాత్రలో ప్రకటించాను. మేనిఫెస్టోలో కూడా రాశాను. అప్పుడు 39 లక్షలు.. ఇప్పుడు 61 లక్షలు గత పాలకులు దిగిపోయే ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే నేడు మన ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల సంఖ్య దాదాపు 61 లక్షలు. గత ప్రభుత్వం పెన్షన్ల మీద ఖర్చు పెట్టింది నెలకు రూ.400 కోట్లు అయితే నేడు మన ప్రభుత్వం నెలకు ఖర్చు పెడుతున్నది దాదాపు రూ.1,450 కోట్లు. ఆర్థిక భారమైనా, కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలన్న తపనతో ఏటా దాదాపు రూ.18,000 కోట్ల పెన్షన్ల ఖర్చును చిరునవ్వుతో మనందరి ప్రభుత్వం భరిస్తోంది. ఈ జనవరి 1 నుంచి పెంచబోతున్న పెన్షన్తో ఈ ఖర్చు ఈ యేడు దాదాపు రూ.20,000 కోట్లకు చేరుతుంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్లపై ఖర్చు చేసింది దాదాపు రూ.45 వేల కోట్లు. ‘పెన్షన్లను క్రమంగా రూ.3 వేల వరకు పెంచుతాం’ అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈ నెల నుంచి క్రమం తప్పకుండా మీకు పెంచిన పెన్షన్ రూ.2,500 అందుతుంది. ఒకవేళ పెన్షన్ అందుకోవడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మీ గ్రామ, వార్డు వలంటీర్ లేదా గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. వాళ్లే దగ్గర ఉండి మీ చేయి పట్టుకుని నడిపిస్తారు. మీకు పెన్షన్ అందేలా అన్ని విధాలా సహాయం చేస్తారు. మీరు బాగుండాలని, దేవుడు మీకు మంచి చేసే అవకాశం ఇంకా ఎక్కువ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. – ప్రేమతో మీ కుటుంబ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మీ ఇంటికే పెన్షన్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజే తొలి సంతకంగా, నా ప్రమాణ స్వీకారోత్సవంలోనే పెన్షన్ల పెంపునకు ఆదేశాలు ఇచ్చాను. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెలా మొదటి రోజు మీ గడప ముందుకు వచ్చి, మీ తలుపులు తట్టి, మీకు గుడ్మార్నింగ్ చెప్పి, పెంచిన పెన్షన్ మీకు అందేలా వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాను. కరోనా కారణంగా ఎన్ని ఇక్కట్లు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మీ కష్టాలు తెలుసు కాబట్టి ఠంచన్గా పింఛన్ అందే విధంగా చూసుకుంటున్నాను. పెన్షన్లు ఎలా తగ్గించాలనేది గత పాలకుల విధానం అయితే అర్హులు ఏ ఒక్కరూ పెన్షన్కు దూరంగా ఉండకూడదన్నది నా పోరాటం. అందుకే అత్యంత పారదర్శక విధానంలో కులం, మతం, ప్రాంతం ఆఖరుకు ఏ రాజకీయ పార్టీ అనేది కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లంచాలు, వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నామని సగర్వంగా చెబుతున్నాను. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించి మరీ సామాజిక తనిఖీ ద్వారా అర్హులను గుర్తించి వారికి పెన్షన్ అందిస్తున్నాం. అర్హులెవరైనా ఏ కారణం చేతనైనా మిగిలిపోతే కూడా, వాళ్లకు మరో అవకాశం ఇస్తూ వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ధ్రువీకరించుకుని వారికి కూడా పెన్షన్ అందిస్తున్నాం. -
ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్న్యూస్..!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. వ్యక్తిగత పెన్షన్ ప్లాన్(ఐపీపీ) యాన్యుటర్లు, ఎల్ఐసీ సిబ్బంది పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఇక నుంచి ఆన్లైన్లోనే పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయడం కోసం ఎల్ఐసీ బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎల్ఐసీ జీవన్ సాక్ష్య అనే మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేయడం ద్వారా తేలికగా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయవచ్చు అని తెలిపింది. సకాలంలో పెన్షన్ పొందడానికి పెన్షనర్లు ప్రతి ఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక నుంచి సులభంగా ఈ యాప్ ద్వారా సులభంగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని వినివగించడం కోసం పెన్షన్ పాలసీదారులు మీ ఆధార్ ఆధార్ నెంబరుని మొబైల్ నెంబరుకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్ని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. జీవన్ సాక్ష్య యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇలా పొందండి: మొదట ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు మీరు మీ మొబైల్ ద్వారా ఒక సెల్ఫీ దిగి సబ్మిట్ చేయండి. వెంటనే మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి. ఆ తర్వాత మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోండి. "ఫెసిలిటేటర్" ఆప్షన్ ద్వారా కూడా మీ లైఫ్ సర్టిఫికెట్ను పొందవచ్చు. యాన్యుయిటెంట్లు/స్టాఫ్ పెన్షనర్లు కాకుండా వారి కుటుంబ సభ్యులు ఈ ఆప్షన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఫెసిలిటేటర్ ద్వారా మీ లైఫ్ సర్టిఫికెట్ ఇలా పొందండి: ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్లో ఫెసిలిటేటర్ సమాచారాన్ని నమోదు చేయండి. ఆ తర్వాత యాన్యుటెంట్/పెన్షనర్ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు యాన్యుటెంట్/పెన్షనర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటిపిని వెరిఫై చేయండి. యాన్యుటెంట్/పెన్షనర్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ తీసి సబ్మిట్ చేయండి. ఇటీవల ఒక ప్రకటనలో, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి గడువును పొడిగించింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి గడువును ఇప్పుడు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించారు. (చదవండి: 5జీ మొబైల్స్.. ఈ ఫీచర్స్తో ఈ మోడలే చాలా చీప్ అంట!) -
పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
పెన్షన్లరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్(జీవన్ ప్రమాన్) సమర్పించాల్సిన గడువును 2021 డిసెంబర్ 31 వరకు పొడగించింది. ఇంతక ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లను పొందడానికి వారు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను నవంబర్ 30లోపు సబ్మిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ గడువును మరో నెల పొడగించింది. దీంతో పెన్షనర్లకు ఊరట కలగనుంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పుడు, డిసెంబర్ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు సబ్మిట్ చేయవచ్చు. అలాగే, లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను డిజిటల్ రూపంలో పొందడం కోసం రికగ్నైషన్ టెక్నాలజీని కేంద్రం ప్రారంభించింది. పెన్షనర్ల ఫిర్యాదుల మేరకు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్గా లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 31 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా పెన్షనర్లు పెన్షన్ పొందవచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా?) -
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్కు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: వృద్ధాప్యం మీదపడుతున్న పెన్షనర్లు సుదూరంలోని సంబంధిత కార్యాలయాలకు తాము నేరుగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి వచ్చేది. అలాంటి వారికి లైఫ్ సర్టిఫికెట్ విషయంలో ఎంతగానో సాయపడే కొత్త రకం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. ప్రతీ సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ శాఖకు సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్కు ఇకపై ఒక సాక్ష్యంగా పనికొచ్చే ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని పెన్షన్ల శాఖ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ను డిజిటల్ రూపంలో ఇచ్చేందుకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వారికి మరింతగా ఉపయోగపడనుందని మంత్రి చెప్పారు. 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఈపీఎఫ్వో, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వారికీ ఈ టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందన్నారు. -
పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. ఇక వారి కష్టాలు తీరినట్టే!
పెన్షన్లరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆయా పెన్షన్లను పొందుతున్న వారు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉండేది. వీటిస్థానంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పెన్షన్ దారుల కోసం యూనిక్ ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీని ప్రారంభించారు. దీంతో పెన్షనర్లకు ఊరట కల్గనుంది. లైఫ్ సర్టిఫికేట్ల విషయంలో పెన్షన్దారులు ఇబ్బందులను ఎదుర్కొవడంతో పలు ఫిర్యాదులను చేశారు. ఫిర్యాదుల మేరకు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్గా లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. పెన్షన్ దారుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రత్యేకమైన ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీ పెన్షనర్లకు మరింత సులభతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీతో 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈపీఎఫ్వో, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోందని అన్నారు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు యూఐడీఎఐకి సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ పెనాల్టీ..! ఎందుకంటే.. -
పెన్షనర్లకు హై అలర్ట్.. ! రెండు రోజులే గడువు..లేదంటే..
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అలెర్ట్. లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేసేందుకు ఇంకా రెండు రోజులే గడువు (నవంబర్ 30 వరకు) ఉంది. ఈ పత్రాన్ని సమర్పించకపోతే పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉంది. లైఫ్ సర్టిఫికెట్ను ఎలా అప్లయ్ చేయాలంటే? ►పెన్షన్ లబ్ధి దారులకు పాన్ కార్డ్ అవసరం. ► పాన్ కార్డ్ ఉంటే లబ్ధి దారులు లైఫ్ సర్టిఫికెట్ కోసం ఎస్బీఐ పెన్షన్ సేవ పోర్టల్లోకి వెళ్లాలి. ► ఆ పోర్టల్లో 'వీడియో ఎల్సీ' అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఎస్బీఐ పెన్షన్ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ►ఎంటర్ చేసిన తరువాత మనకు ఓటీపీ వస్తుంది. ►ఆ ఓటీపీని ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ను యాక్సెప్ట్ చేసి స్టార్ట్ జర్నీ అనే బటన్పై క్లిక్ చేయాలి. ►ఆ తర్వాత 'ఐయామ్ రెడీ' అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ►ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఎస్బీఐ అధికారుల నుంచి వీడియో కాల్ ప్రారంభం అవుతుంది. ►ఆ వీడియో కాల్లో వెరిఫికేషన్ కోసం మీ ఎదురుగా స్క్రీన్ మీద నాలుగు అంకెల్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను ఎంటర్ చేయాలి. ►అనంతరం ఒరిజనల్ పాన్ కార్డ్ను చూపించాలి ►తర్వాత పాన్ కార్డును లబ్ధిదారులు ఫోటోల్ని తీసుకుంటారు. ► వీడియో లైఫ్ సర్టిఫికెట్ పూర్తవుతుంది. ఈ ప్రాసెస్లో ఏదైనా పొరపాటు జరిగితే మీ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. లైఫ్ సర్టిఫికెట్ను ఎక్కడ సమర్పించాలి లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. పెన్షన్ తీసుకునే బ్యాంక్ బ్రాంచ్లో, జీవన్ ప్రమాణ్ పోర్టల్లో సబ్మిట్ చేయాలి. లేదంటే బ్యాంక్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ యాప్లో లాగిన్ అయితే బ్యాంక్ అధికారులు మీ ఇంటి వద్దకే వస్తారు. పోస్ట్మ్యాన్ ద్వారా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. -
పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ను పోస్టాఫీసులో ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ను ఇకనుంచి పోస్టాఫీసు ద్వారా ఆన్లైన్లో పింఛనుశాఖకు సమర్పించుకోవచ్చునని సిక్రింద్రాబాద్ తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ సంతోష్ నేత తెలిపారు. ఈ సేవలను పోస్టుమెన్ ద్వారా పొందవచ్చునని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: పాము రాసిన విషాద గీతం) -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’
సాక్షి, నెట్వర్క్: ఈ నెల ‘ఆసరా’ లేక పింఛన్దారులు ఆగమాగమవుతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. మందులు కొనలేకపోతున్నారు. నిత్యవసరాలు సమకూర్చుకోలేకపోతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే చేతికందే ‘ఆసరా’పెన్షన్ ఈ సారి మూడు వారాలు గడిచినా ఇంకా జాడలేదు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈసారి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ డబ్బులు వస్తాయన్న ధీమాతో కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే తాము ఫైనాన్స్ విభాగానికి నివేదించామని, వారు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. ఎదురుచూపుల్లో 38 లక్షల మంది... ఆసరా పింఛన్ కింద ప్రతి నెలా ఆయా వర్గాలకు ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆగస్టు నెల కింద అందాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 38 లక్షల 71 వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వీవర్స్, హెచ్ఐవీ బాధితులు, బోదకాలు బాధితులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అయినవారికి దూరంగా ఉంటున్నవారే. ఇంకా పలువురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్న వారూ ఉన్నారు. మస్తు ఇబ్బంది అవుతోంది చిల్లర ఖర్సులకు మస్తు ఇబ్బంది పడుతున్న. రోజూ పోస్ట్ ఆఫీస్కు వచ్చి పోతున్న. ఇప్పుడు, అప్పుడు అంటున్నరు. ఎప్పుడు ఇస్తారో ఏమో. మస్తు ఇబ్బంది అవుతుంది. – అమ్రు, హజీపూర్, కామారెడ్డి జిల్లా పింఛన్ రాక మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఆఫీసర్లను అడిగితే రేపు మాపంటున్నరు. ఇంతకు ముందు ఆరో తారీఖు ఇస్తుండిరి. ఇప్పుడు పదిహేను రోజులైనా అస్తలేవు. – రుక్కవ్వ, సోమార్పేట్, కామారెడ్డి జిల్లా -
పెన్షనర్లకు ఎస్బీఐ శుభవార్త!
సీనియర్ సీటిజన్ ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సీనియర్ సీటిజన్ ఖాతాదారుల కోసం ప్రత్యేక కొత్త పెన్షన్ సేవలను ప్రవేశపెట్టింది. పెన్షన్ తీసుకునే వారి కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్(https://www.pensionseva.sbi) తీసుకొనివచ్చింది. ఈ పోర్టల్ ద్వారా సీనియర్ సీటిజన్ ఖాతాదారులు అన్ని రకాల పెన్షన్ సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు. ముందుగా అవసరమైన సమాచారం అందించి, పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత సేవలు సులభంగా పొందొచ్చని ఎస్బీఐ వివరించింది.(చదవండి: ఈ 4 యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!) Good news for all Pensioners! We have revamped our PensionSeva website for you to manage all your pension related services with ease. Click here: https://t.co/pM0XAgtzuc#PensionSeva #Pension #SBI pic.twitter.com/xioULTSMKC — State Bank of India (@TheOfficialSBI) September 11, 2021 పోర్టల్ ద్వారా ఏ ఏ సేవలు పొందొచ్చంటే.. బకాయిల లెక్కింపు షీట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ స్లిప్ లేదా ఫారం-16ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ లాభం వివరాల సమాచారాన్ని చూడవచ్చు. మీ పెట్టుబడులను తనిఖీ చేయవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇక మీ ఫోన్లో పెన్షన్ చెల్లింపు వివరాలకు సంబంధించి అలర్ట్లు వస్తాయి. అలాగే లైఫ్ సర్టిఫికేషన్ సదుపాయం మీ దగ్గరల్లో ఉన్న బ్రాంచీవద్ద లభిస్తుంది. మీ ఈ-మెయిల్ కు పెన్షన్ స్లిప్ వస్తుంది. ఇకపోతే మీ పేరు పోర్టల్లో రిజిస్టర్ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు support.pensionseva@sbi.co.inకు ఈ-మెయిల్ చేయవచ్చు. అలాగే 'ఎస్ఎమ్ఎస్ అన్ హ్యాపీ' టైప్ చేసి 8008202020కు ఎస్ఎమ్ఎస్ చేయవచ్చు లేదా 18004253800/1800112211 లేదా 08026599990 కాల్ చేయవచ్చు. -
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ఏపీ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు ఆర్ధిక శాఖ తెలిపింది. 2018 జూలై 1వ తేదీన 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంపుదల చేశారు. ఈ పెంపుతో 38.776 శాతానికి పింఛన్దారుల డీఏ పెరగనుంది. -
ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఆర్బీఐ శుభవార్త!
ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. ఇక మీ జీతం, పెన్షన్ డబ్బులు సెలవు రోజుల్లో పడనున్నాయి. ఇప్పటి వరకు వేతనం, పెన్షన్ డబ్బులు, ఈఎమ్ఐ చెల్లింపులు చేయడం అనేది బ్యాంక్ సెలవు రోజుల్లో వీలు కాకపోయేది. కానీ, కొత్తగా ఆర్బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా మీ జీతం, పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కానున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ పనిదినాల కోసం మీ జీతం లేదా పెన్షన్ డబ్బుల క్రెడిట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎన్ఏసీహెచ్ సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, బ్యాంకులు తెరిచి ఉన్నప్పుడు ఎన్ఏసీహెచ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు నెల మొదటి రోజు వారాంతంలో వస్తుంది. దీని కారణంగా ప్రజలు బ్యాంక్ పని దినం వరకు వేచి ఉండాలి. జూన్ క్రెడిట్ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వినియోగదారుల అందించే సేవలను మరింత పెంచడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. -
వృద్ధులకు, పింఛనుదారులకు గుడ్ న్యూస్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా వృద్దులు, పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు అని ప్రకటించింది. తాజా నిర్ణయంతో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ భారీ ఉపశమనం లభించింది. సాంకేతికపరిజ్ఞానం లేని వృద్దులు తమ లైఫ్ సర్టిఫికేట్ పొందడం కోసం వారు బ్యాంకులను సందర్శించాల్సి వచ్చేది. అక్కడ వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లయింది. "ఇకపై వృద్ధులు సులభంగా జీవన ప్రమాణ సేవలను పొందవచ్చు. సమీప పోస్టాఫీసులో ఉండే సీఎస్సీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి" అని పోస్టల్ విభాగం ట్వీట్ చేసింది. తాజా నిర్ణయం వల్ల కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యుటీలు) 60 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ది జీవన్ ప్రమాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందడానికి పెన్షన్ తీసుకునే వ్యక్తి ప్రభుత్వం చేత గుర్తించబడిన ఏజెన్సీ ముందు హాజరు కావాలి లేదా పింఛనుదారుడు ఇంతకు ముందు పనిచేసిన అథారిటీ ద్వారా జారీ చేయబడ్డ లైఫ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. తర్వాత దానిని ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడుఆ వారు లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి సమీప పోస్టాఫీసు కేంద్రాన్ని సందర్శించవచ్చు. అలాగే, మీ దగ్గరలో గనుక జీవన్ ప్రమాన్ కేంద్రాలు ఉంటే దాని ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ కేంద్రాలలో వారు మీ ఆధార్ బయో మెట్రిక్ తీసుకుంటారు. वरिष्ठ नागरिक अब सरलता से नज़दीकी डाकघर के सीएससी काउंटर पर जीवन प्रमाण सेवाओं का लाभ उठा सकते हैं। #AapkaDostIndiaPost Senior citizens can now easily avail the benefit of Jeevan Praman services at the nearest post office CSC counter.#AapkaDostIndiaPost pic.twitter.com/tKrzifc6yc — India Post (@IndiaPostOffice) July 15, 2021 -
ఇకపై వాట్సాప్ ద్వారా పెన్షన్ స్లిప్పులు: కేంద్రం
న్యూఢిల్లీ: పింఛన్దారులకు పెన్షన్ స్లిప్పులను వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పంపించాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ఇందుకోసం ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ లాంటి సదుపాయాలతోపాటు సోషల్ మీడియా యాప్లను ఉపయోగించుకోవాలంటూ తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ పెన్షన్, భత్యాలు, పన్ను కోతలు వంటి పూర్తి వివరాలు పెన్షన్ స్లిప్పులో ఉండాలని పేర్కొంది. ఇలాంటి వివరాలు పెన్షన్ స్లిప్పుల్లో చేర్చేందుకు బ్యాంకులు ఇటీవలే అంగీకారం తెలిపినట్లు పేర్కొంది. -
ఎల్ఐసీ గ్రిహా వరిష్ట లోన్ తీసుకున్నవారికి శుభవార్త!
మీరు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ గ్రిహా వరిష్ట కింద హోమ్ లోన్ లేదా ప్లేట్ కోసం లోన్ తీసుకున్నారా అయితే మీకు శుభవార్త. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్ధ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గ్రిహా వరిష్ట కింద లోన్ తీసుకున్న వారికీ ఆరు ఈఎంఐలు మాఫీని(వేవర్) ప్రకటించింది. రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ అఫర్ ప్రకటించింది. ఒక వేళ మీరు నిర్మించి సిద్ధంగా ఉన్న ఇంటిని లేదా ఫ్లాట్ను కొంటే ఈ అఫర్ వర్తిస్తుంది. బిల్డర్ నుంచి మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడే మీరు ఎంచుకున్న ఈఎంఐలలో 37వ, 38వ, 73వ, 74వ, 121వ, 122వ ఈఎంఐలను మాఫీ చేస్తుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. పేన్షనర్ల కోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గృహ వరిష్ట పథకాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. ఉద్యోగ పదవి విరమణ పొందిన వారు/ భవిష్యత్ లో ఖచ్చితమైన పెన్షన్ సదుపాయాన్ని కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం. కంపెనీ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి రుణ వడ్డీ రేటును తగ్గించింది. 700 కంటే ఎక్కువగా సిబిల్ స్కోరు ఉన్న వారికి 6.90 శాతం రుణ రేటు వర్తిస్తుంది. రుణాన్ని పొందాలని అనుకునే వారికి రూ.50 లక్షల వరకు కంపెనీ గృహ రుణం ప్రస్తుతం అందిస్తోంది. చదవండి: పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ! -
20 ఏళ్ల సర్వీసుంటే.. పూర్తి పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని పదవీ విరమణ చేస్తే వారికి పూర్తిస్థాయిలో పెన్షన్ సదుపాయం కల్పించాలని వేతన సవరణ సంఘం(పీఆర్సీ) సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే రాష్ట్ర మూ అనుసరించాలని సూచించింది. ప్రస్తు తం 33 ఏళ్ల సర్వీసు ఉంటేనే పూర్తి పరిమాణంలో పెన్షన్ను చెల్లిస్తున్నారు. 20 ఏళ్లలోపు సర్వీసుతో పదవీవిరమణ చేసే ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న ఐదేళ్ల సర్వీసు వెయిటేజీ విధానాన్ని కొనసాగించాలని సూచించింది. పెన్షనర్ల విషయంలో పీఆర్సీ కమిటీ సిఫార్సులివీ.. ►75 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు రిలీఫ్గా మూల పెన్షన్పై 15 శాతాన్ని అదనంగా చెల్లించాలి. 100 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు 100 శాతం వరకు మూల పెన్షన్ను అదనంగా చెల్లించాలి. ►కనీస పెన్షన్/ ఫ్యామిలీ పెన్షన్ను నెలకు రూ.9,700కు పెంచాలి. ►సవరించిన కనీస వేతనం (రూ.19 వేలు)లో 50% కనీస పెన్షన్గా ఉండాలి. కరువు భత్యం లేకుండా 2018 జూలై 1 నుంచి ఈ పెంపును వర్తింపజేయాలి. ►సర్వీసులో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే, మరణించిన మరుసటి రోజు నుంచి గరిష్టంగా 10 ఏళ్ల పాటు లేదా మరణించిన ఉద్యోగి/ పెన్షనర్ 65 ఏళ్ల వయస్సుకు చేరే వరకు.. ఈ రెండింటిలో ఏది ముం దు సంభవిస్తే అప్పటి వరకు కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ను చెల్లించాలి. ►మానసికంగా/ శారీరకంగా వికలాంగులైన కుమారుడు/కుమార్తె వివాహమైనప్పటికీ జీవితకాలం పాటు ఫ్యామిలీ పెన్షన్ చెల్లించాలి. ►పదవీ విరమణ సమయంలో చెల్లించే గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలి. ►సర్వీసు పెన్షనర్/ ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు చెల్లించాల్సిన రిలీఫ్ అమౌంట్ను రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలి. ►కేంద్ర ప్రభుత్వం కమ్యుటేషన్ టేబుల్ను సవరించే వరకు పెన్షన్లో కమ్యుటెడ్ పోర్షన్ను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించే విధానాన్ని కొనసాగించాలి. చదవండి: (ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు) (కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జాబితా) -
పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి కొత్త ఏడాదిలో కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసే వారు లేదా ఇప్పటికే పెన్షన్ తీసుకునే వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఒక్క చిన్న క్లిక్తోనే పెన్షనర్లు పీపీఓను ప్రింట్ తీసుకోవచ్చు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇ-పిపిఓను అభివృద్ధి చేసిన అధికారులను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందించారు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది పెన్షన్ దారులు పీపీవో గురించి ఆందోళన చెందారని.. ఇకపై ఈ కొత్త ఇ-పిపిఓ ద్వారా వారికీ అన్ని రకాల సమస్యలు తొలగనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.(చదవండి: సెకండ్ రౌండ్లో టీకా తీసుకోనున్న మోదీ?!) ఇకపై పెన్షన్ దారులు ఆన్లైన్లోనే పీపీవోను పొందొచ్చు. లాక్ డౌన్లో ఉద్యోగ పదవీ విరమణ చెందిన వారికి ఈ సర్వీసులు వల్ల చాలా లాభం కలుగనుంది అని మంత్రి పేర్కొన్నారు. పీపీవో ఆర్డర్ చేతికి రాని వారు ఆన్లైన్లోనే పీపీవో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొరని తెలిపారు. ఉద్యోగ పదవీ విరమణ చెందిన లేదా ప్రభుత్వం పెన్షన్ పెంచిన వారికీ పీపీవో అవసరం అవుతుంది. కరోనా కారణంగా పెన్షన్ దారులు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఇప్పుడు డిజి-లాకర్తో అనుసందించబడిన పిఎఫ్ఎంఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ పిపిఓ కాపీని సులభంగానే పొందవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు భవిష్య అకౌంట్ను డిజి లాకర్ అకౌంట్తో లింక్ చేసుకోవాలి. -
లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు గడువు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్ పత్ర–జేపీపీ) సమర్పించే తుది గడువును వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్వో తెలిపింది. ఆలోగా ఎప్పుడైనా ఇవ్వవచ్చని పేర్కొంది. కోవిడ్–19 కారణంగా జేపీపీ అందజేయలేకపోయిన సుమారు 35 లక్షల పింఛనుదారులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీలోగా జేపీపీ సమర్పించని వారికి ఫిబ్రవరి వరకు పింఛను యథా ప్రకారం అందుతుందని స్పష్టం చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం–1995 ప్రకారం పింఛను పొందుతున్న వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివరించింది. జేపీపీ ఏడాదిపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. -
బాబు డీఏ బకాయిలకు ఏటా రూ.2,400 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కారు ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించకుండా బకాయిపెట్టిన రెండు డీఏలను చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు డీఏ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఏకంగా రూ.2,400 కోట్లకుపైనే భరించనుంది. ఈ రెండు డీఏల 30 నెలల తాలూకు బకాయిలు చెల్లించేందుకు రూ.6,034.80 కోట్ల మేర వ్యయం కానుంది. 2018 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించకుండా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. 2019 జనవరి నుంచి మరో డీఏను కూడా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. ఈ రెండు బకాయిలను చెల్లించడంతో పాటు 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏను కూడా చెల్లించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,011 కోట్లను భరించనుంది. 30 నెలల బకాయిలకు రూ.5,028.90 కోట్లు వ్యయం కానుంది. పెన్షనర్లకు.... ► పెన్షనర్లకు 3.144 శాతం పెంపు జూలై 2018 నుంచి వర్తింపు, జనవరి 2021 నుంచి చెల్లింపు ► 2019 జనవరి నుంచి మరో 3.144 శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జూలై నుంచి చెల్లింపు ► 2019 జూలై నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జనవరి 2022 నుంచి చెల్లింపు ఉద్యోగులకు... ► ఉద్యోగులకు జూలై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి నుంచి చెల్లింపు ► 2019 జనవరి నుంచి 3.144 శాతం పెంచిన డీఏ జూలై 2021 నుంచి చెల్లింపు ► 2019 జూలై నుంచి పెంచిన 5.24 శాతం డీఏ జనవరి 2022 నుంచి చెల్లింపు -
పెన్షనర్లకు ఊరట : కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులకు ఊరట. కేంద్ర పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును మరో రెండు నెలలు పెంచుతూ కేంద్రప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ గడువును పెంచాలన్న పెన్షన్దారుల సంఘాల విజ్ఞప్తి మేరకు 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని లైఫ్ సర్టిఫికేట్ గడువును మరికొంత కాలం పెంచాలంటూ వివిధ పెన్షన్దారుల సంఘాల నుంచి పిటిషన్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్-19 కేసులు వరకు పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంతో సంప్రదించిన పిదప ఈ గడువును 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచినట్టు తెలిపారు. అలాగే పొడిగించిన కాలంలో, (ఫిబ్రవరి వరకు) ప్రతీ నెలా పెన్షన్ యథావిధిగా చెల్లిస్తామని పేర్కొన్నారు. వాయిదా ప్రధాన లక్ష్యం వివిధ శాఖల వద్ద విపరీతమైన రద్దీని నివారించడమనీ, సంబంధిత శాఖలలో సరైన పారిశుద్ధ్యం, సామాజిక దూరాన్ని పాటించాలని నోటీసులో పేర్కొంది. కాగా ప్రతీ ఏడాది పింఛనుదారులు నవంబర్లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. కరోనా ప్రభావం వృద్ధులపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన మేరకు కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసే చివరి తేదీని 2020 డిసెంబర్ 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: తమ లైఫ్ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈపీఎఫ్వో పెన్షనర్లు పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దని, బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు/మీ సేవా కేంద్రాల వద్ద అందజేయొచ్చని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) పేర్కొంది. లేదా ఆధార్తో కూడుకున్న బయోమెట్రిక్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పింవచ్చని ఈపీఎఫ్వో తెలిపింది. సాధారణంగా ఏటా నవంబర్/డిసెంబర్లో పెన్షనర్లు పీఎఫ్ ఆఫీసుల్లో లైఫ్ సర్టిఫికెట్లు అందజేస్తుండగా, ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లంతా ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డిజిటల్ జీవన్ ప్రమాణ్ సమర్పణకు అవసరమైన చర్యల కోసం కామన్ సర్వీసెస్ సెంటర్తో కలసి పనిచేస్తున్నట్లు ఈపీఎఫ్వో వివరించింది. చదవండి: క్వారంటైన్లో డబ్ల్యూహెచ్వో చీఫ్ సౌకర్యవంతంగా ఉండేలా సర్వీస్ డెలివరీ ఏజెన్సీని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఈపీఎస్ పెన్షనర్లు పొందేలా బహుళ సంస్థల ఏజెన్సీ (మల్టీ–ఏజెన్సీ) మోడల్ను ఈపీఎఫ్వో ఎంచుకున్నట్లు పేర్కొంది. దీనికోసం పెన్షనర్లు తమ మొబైల్ ఫోన్లు, బ్యాంకు పాస్బుక్కు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటివి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించింది. స్థానిక పోస్ట్మాన్/సమీపంలోని పోస్టాఫీస్ను సంప్రదించడం లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో తమ చేతివేలిముద్ర స్కానింగ్ను పంపించడంతో సమర్పించవచ్చని పేర్కొంది. ఏడాదిలో ఏ సమయంలోనైనా (కేవలం నవంబర్, డిసెంబర్లోనే కాకుండా) ఈపీఎస్ పెన్షనర్లు ‘డిజిటల్ జీవన్ ప్రమాణ్’ల సమర్పణకు కీలకమైన విధానమార్పును చేపట్టినట్లు తెలిపింది. ఈ విధంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే తేదీ నుంచి ఏడాది పాటు అది చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. చదవండి: ఈపీఎఫ్వో కీలక నిర్ణయం -
దసరా కానుక.. ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదశమి సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ను కలిసి పెండింగ్ డీఏలను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి మొత్తం మూడు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. మూడు డీఏల మంజూరు వల్ల ఖజానాపై ఏడాదికి రూ.3,802 కోట్లు భారం పడుతుంది. అలాగే బకాయిలను ఉద్యోగుల భవిష్య నిధి (జీపీఎఫ్)కు జమ చేయడానికి మరో రూ.9,504 కోట్లు వ్యయం కానుంది. దీనివల్ల 4,49,000 ఉద్యోగులకు, 3,57,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. – జూలై 2018 నుంచి ఇవ్వాల్సిన డీఏను వచ్చే ఏడాది జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను మాత్రం ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్కు జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ బకాయిలను ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. – జనవరి 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ వచ్చే ఏడాది జూలై వేతనాలతో నగదు రూపంలో ఆగస్టు 1న ఇస్తారు. డీఏ బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్కు జమ చేస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. – జూలై 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ 2022 జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను అదే ఏడాది ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో జీపీఎఫ్కు జమ చేస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించిన సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి, ఏపీ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో సైతం గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రెండు డీఏలతోపాటు మరో డీఏను ఒకేసారి మంజూరు చేస్తూ సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇది ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. -
నా వయసు 58!
సాక్షి, హైదరాబాద్: అసహాయులైన పేదలపై కరోనా పంజా విసిరింది. ప్రభుత్వ చేయూత కోసం మరి కొన్నాళ్లు ఎదురుచూసేలా చేసింది. పేదరికంలో మగ్గుతున్న పండుటాకులను ఆదుకునేందుకు గత ఏప్రిల్ నుంచి మరింత మంది వృద్ధులకు ‘ఆసరా’పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బడ్జెట్లోనూ అదనపు నిధులు కేటాయించింది. అయితే, ఊహించనివిధంగా కరోనా మహమ్మారి పడగలు విప్పడం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్ వల్ల రాబడులు తగ్గిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. దీంతో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకు పడింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు లాక్డౌన్ కొనసాగడంతో కొత్త పింఛన్ల పంపిణీ అటకెక్కింది. ప్రజాజీవనం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నా.. ఆర్థికంగా కోలుకోవడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 6.62 లక్షల మంది ఎదురు చూపులు నిరుపేదలకు అండగా నిలుస్తున్న ప్రభు త్వం.. ప్రస్తుతం 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఆసరా పింఛన్లను అందజేస్తోంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వయోపరిమితిని 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న 12.21 లక్షల వృద్ధాప్య పింఛన్లకు అదనంగా మరో 6.62 లక్షల వృద్ధాప్య పింఛన్లు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. తొలుత గతేడాది నుంచే దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇదివరకే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హుల జాబితాను తయారు చేసింది. అయితే, ప్రస్తుతం ఇందులో కొందరు మరణించి ఉంటారని భావిస్తున్న పంచాయతీరాజ్ శాఖ.. తాజాగా మరోసారి వివరాలను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం గ్రామాలవారీగా ఓటర్ల జాబితాను సేకరించి.. అందులో 57 ఏళ్లు పైబడిన ఓటర్ల వివరాల లెక్క తీసింది. అయితే, కేవలం ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకోకుండా.. క్షేత్రస్థాయిలో శిబిరాలు నిర్వహించి వయసును నిర్ధారించాలని నిర్ణయించింది. ఆధార్, ఓటర్ ఐడీల ఆధారంగా అర్హుల జాబితాను స్క్రీనింగ్ చేయాలని భావించింది. ఇంతలోనే కరోనా వైరస్ విశ్వరూపం చూపడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో కొత్త పింఛన్ల మాట అటు ఉంచి..ఉన్నవారికి నెలవారీగా సక్రమంగా చెల్లిస్తే చాలనే పరిస్థితి తలెత్తింది. అదనంగా నెలకు రూ.133.45 కోట్ల భారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లకు ప్రభు త్వం 2019–20లో రూ.9,402 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక సంవత్సరానికి రూ.11,758 కోట్లకు పెంచింది. అయితే, పెంచిన రూ.2,356 కోట్లు ఈసారి అదనంగా పెరిగే వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, కొత్తగా పెరిగే 6.62 లక్షల వృద్ధాప్య పింఛన్లతో నెలకు రూ.133.45 కోట్ల మేర అదనపు భారం పడనుందని అంచనా వేసింది. రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లు వృద్ధాప్య: 12,21,887 వికలాంగులు: 4,91,892 హెచ్ఐవీ బాధితులు: 32,627 వితంతువులు: 14,31,585 బోదకాలు బాధితులు: 14,901 చేనేత కార్మికులు: 36,813 బీడీ కార్మికులు: 4,07,268 గీత కార్మికులు: 62,069 ఒంటరి మహిళలు: 1,33,789 -
ఈపీఎఫ్వో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్)ను అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరో వెసులుబాటు కల్పించింది. కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ఈ)ల ద్వారా వీటిని అందజేయవచ్చునని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్) పింఛనుదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పింఛనుదారులు ఏటా డిసెంబర్లో లైఫ్ సర్టిఫికెట్ను అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల పింఛను అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల సీఎస్సీల్లోనూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించే వీలుంటుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు ఇవి అదనమని తెలిపింది. పింఛనుదారులు ఇకపై తమకు వీలున్న సమయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సీఎస్సీల్లో ఇవ్వవచ్చని, ఇచ్చిన రోజు నుంచి ఇది ఏడాది పాటు చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. (చదవండి: భారత్లో సామాజిక వ్యాప్తి లేదు) -
ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త తెలిపింది. రూ. 868 కోట్ల పెన్షన్ నిధులతో పాటు రూ.105 కోట్ల పెన్షన్ బకాయిలను విడుదల చేస్తున్నట్టు ఈపీఎఫ్ఓ సోమవారం తెలిపింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఈపీఎస్ 95 (ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్) లబ్డిదారులకు ఎంతో మేలు కలుగుతుందని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈపీఎఫ్వోలో 65 లక్షల మంది పెన్షనర్లు లబ్దిదారుల జాబితాలో ఉన్నారని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సభ్యుల నివేదిక ఆధారంగానే పెన్షన్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు కేంద్రం పేర్కొంది. చదవండి: ఈపీఎఫ్ను భారీగా లాగేశారు.. -
పెన్షన్ల కోతపై హైకోర్ట్లో విచారణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లను 25 శాతం ప్రభుత్వం కోత విధించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకు సంబంధించిన పిటిషన్ను పెన్షనర్స్ జేఏసీ నాయకులు లక్ష్మయ్య దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది పెన్షదారుల పెన్షన్ కట్ చేయొద్దని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. చదవండి: మటన్ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు మే నెల పెన్షన్ కట్ చెయ్యకుండా పూర్తి పెన్షన్ వేసేలా చూడాలని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టును కోరారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పెన్షనర్లపై ప్రభుత్వం పునరాలోచనలో ఉందని తెలిపారు. జూన్ 1 వరకు పూర్తి పెన్షన్ చెల్లించకపోతే అదే రోజు ఆదేశాలు జారీచేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్ట్ జూన్ 1కి వాయిదా వేసింది. చదవండి: అమాంతం ఎత్తేస్తున్నారు.. -
పెన్షనర్లకు 764 కోట్లు: ఈపీఎఫ్వో
న్యూఢిల్లీ: పెన్షన్ పథకంలో భాగంగా ఏప్రిల్ మాసానికి 65 లక్షల మంది పెన్షనర్లకు రూ.764 కోట్లను అందించినట్లు భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్వో వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపింది. మొత్తంగా 135 ఈపీఎఫ్వో ఫీల్డ్ ఆఫీస్లు ఈ నగదును ముందస్తుగా ఇచ్చే పనిలో నిమగ్నమయ్యాయని కేంద్ర కార్మిక శాఖ ప్రకటన తెలిపింది. నగదు పంపిణీ ప్రక్రియలో ఈపీఎఫ్వో అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషిచేశారని, దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్లు తమ నోడల్ బ్రాంచీల ద్వారా పెన్షనర్లకు నగదును తగు సమయానికి అందించాయని కార్మిక శాఖ ప్రకటనలో పేర్కొంది. పీఎం కేర్స్కు సాయుధ దళాల భారీ సాయం పదిహేను లక్షల మంది సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగస్తులు, అధికారులు రానున్న 11 నెలల పాటు ప్రతినెలా ఒకరోజు వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి(పీఎం కేర్స్)కి స్వచ్ఛందంగా ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రూ. 5,500 కోట్లు ప్రధాని సహాయనిధికి జమ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. పీఎం కేర్స్కి సిబ్బంది వేతనాలనుంచి ఇచ్చే విరాళం మే 2020నుంచి ప్రారంభమై మార్చి 2021 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. చదవండి: లాక్డౌన్ని ఎంతకాలం పొడిగిస్తారు? -
పెన్షనర్లు, ఏటీఎంలకు కొత్త నియమాలు
సాక్షి, ముంబై: కరోనావైరస్ సంక్షోభం, దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో నేటి (మే 1 ) నుంచి పెన్షనర్లు, ఏటీఎం నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా పెన్షనర్లకు పూర్తి పేమెంట్ లభించనుంది. అలాగే ఏటీఎం వినియోగం ద్వారా యూజర్లకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని కఠిన నియమాలు పాటించాల్సి వుంటుంది. (ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి) చదవండి : కరోనా : అయ్యయ్యో మారుతి! పెన్షనర్లకు పూర్తి పెన్షన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి ఈ రోజు నుంచి పూర్తి స్థాయి పెన్షన్ లభించనుంది. దీంతో 6 లక్షల 30వేల మందికి పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఫలితంగా ప్రభుత్వానికి 1,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అలాగే కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి లాక్డౌన్ మధ్య సుమారు 6 లక్షల సంస్థలకు ఉపశమనం ఇస్తూ, ఒకేసారి బకాయిలు చెల్లించకుండా నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) రిటర్న్స్ దాఖలు చేయడానికి యజమానులకు అనుమతినిచ్చింది. ఏటీఎం కేంద్రాల శానిటైజేషన్ కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడానికి వీలుగా కొన్ని నిబంధనలను ఆయా బ్యాంకులు కచ్చితంగా పాటించాలి. ఏటీఎంలను రోజూ శుభ్రం చేయడంతోపాటు వినియోగించిన ప్రతీసారీ శానిటైజ్ చేయాలి. రోజుకు రెండు సార్లు ఏటీఎంలను శానిటైజర్తో క్లీన్ చేయాలి. మరీ ముఖ్యంగా హాట్స్పాట్స్లోని మున్సిపల్ కార్పొరేషన్లు ఈ నియమాలను విధిగా పాటించాలి. లేదంటే సదరు ఏటీఎంలను సీజ్ చేస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ , తమిళనాడు లోని చెన్నైలలో ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. -
లైఫ్ సర్టిఫికెట్.. పెన్షనర్లకు వెసులుబాటు
ప్రభుత్వ పెన్షన్ దారులు, ఫ్యామిలీ పెన్షనర్లు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏటా మాదిరిగానే పెన్షన్ కోసం వార్షిక ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని ప్రతీ పెన్షనర్ తప్పనిసరిగా డిసెంబర్ 31లోగా అందజేయాలి. ఆ విధంగా అందజేసిన వారికి మాత్రమే తదుపరి ఆర్థిక సంవత్సరం పెన్షన్ అందజేస్తారు. అందజేయని వారికి 2020 మార్చి నెలకు సంబంధించి పెన్షన్ ఏప్రిల్లో ఇవ్వకుండా నిలిపివేస్తారు. అయితే, గతంలో మాదిరిగా తప్పనిసరి వ్యక్తిగతంగా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలనే నిబంధనలో కొంత సడలింపు ఇచ్చారు. ఆండ్రాయిడ్ మొబైల్లో టీ ఫోలియో యాప్ ద్వారా కానీ, మీ సేవ కేంద్రాల నుంచి జీవన్ప్రమాణ్ సైట్ ద్వారా కానీ పంపించే వెసులుబాటు కల్పించారు. కాగా, మొబైల్ యాప్ ద్వారా ధ్రువీకరణ పత్రం అందజేసే అవకాశం కల్పించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఈ నిర్ణయంతో పెన్షనర్లు వ్యక్తిగతంగా కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండదు. ఉమ్మడి వరంగల్లో పరిశీలిస్తే ఒక్క వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోనే మొత్తం 19వేల మంది వరకు పెన్షనర్లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నూతన నిర్ణయంతో వీరందరూ కార్యాలయాలకు రావడంలో ఎదుర్కొనే ఆర్థిక, శారీరక భారం నుంచి బయటపడినట్లవుతుంది. ఈ మేరకు నూతన విధానంపై వివరణాత్మక కథనం. మొబైల్ యాప్ ద్వారా.. ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో టీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెల్ నంబర్, ఈ మెయిల్ ద్వారా రిజిష్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్ ఐడీగా సెల్ నంబర్ మారుతుంది. పిన్ను పాస్వర్డ్గా సెట్ చేసుకోవాలి. సెల్ నంబర్, పాస్ వర్డ్ను ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి. అనంతరం పెన్షనర్ మాన్యువల్ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంపిక చేసుకుని బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా పెన్షనర్ ఐడీ నంబర్ నమోదు చేయాలి. ఓటరు ఐడీ కార్డు కార్డుపై ఉండే ఎపిక్ నంబర్, అసెంబ్లీ నియోజకవర్గం పేరు నమోదుచేయాలి. అనంతరం ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఆ సెల్ఫీఫొటో ఎపిక్ కార్డులోని ఫొటోతో వెరిఫై చేయబడి ఆమోదించినట్లు వెరిఫికేషన్ నంబర్ వస్తుంది. ఆ మెసేజ్ సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి చేరుతుంది. ట్రెజరీ కార్యాలయంలో అధికారి తనకు వచ్చిన వివరాలు, తన వద్ద అందుబాటులో ఉన్న వివరాలతో పోల్చి చూసుకుని ఆమోదిస్తారు. దీని ద్వారా పెన్షనర్లు సుదూర ప్రాంతాల నుంచి ట్రెజరీ కార్యాలయానికి వచ్చే ఇబ్బంది ఉండదు. బ్యాంకులు, మీసేవ కేంద్రాలకు వెళ్లే అవసరం ఉండదు. ఇంటివద్దనే ఉండి ధ్రువీకరణ పత్రం అందజేయవచ్చు. ప్రస్తుతం మొబైల్ యాప్తో ధ్రువీకరణ పత్రం ఇచ్చే సదుపాయం కల్పించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ట్రెజరీకి రాలేని వారి కోసం... పెన్షనర్ల వయస్సు 75 సంవత్సరాలు పైబడి, కార్యాలయానికి రాలేని వారు ఇలా చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే తమ వార్షిక ధ్రువీకరణ పత్రాన్ని నివాస పరిధిలోని గ్రామపంచాయతీ ఈఓ ద్వారా ధృవీకరించి తమ ప్రతినిధుల ద్వారా ట్రెజరీలో అందజేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి స్వయంగా పెన్షనర్ గృహాన్ని సందర్శించి పెన్షనర్ కదలలేని పరిస్థితిలో ఉన్నట్లు ధృవీకరించి పత్రాన్ని జారీ చేస్తారు. వీరు మాత్రమే... ఆధార్ నంబర్ ఆధారంగా మీ సేవ కేంద్రంలో, ఓటర్ ఐడీ ద్వారా కూడా టీ యాప్ ఫోలియో యాప్ తో జీవన ధృవీకరణ పత్రాలు అందజేయలేని వారు మాత్రమే ట్రెజరీ కార్యాలయానికి రావల్సి ఉంటుంది. వారి పత్రాలు మాత్రమే ట్రెజరీ అధికారులు స్వీకరిస్తారు. దివ్యాంగులకు.. ప్రభుత్వ ఉత్తర్వులు 315 ద్వారా పెన్షన్ పొందుతున్న దివ్యాంగులు తాము గత మూడేళ్లలోపు తీసుకున్న వైకల్య ధృవీకరణ పత్రాన్ని అందజేయాలి. మూడేళ్ల క్రితం తీసుకున్నట్లయితే అంగీకరించరు. మరికొన్ని సూచనలు లైఫ్ సర్టిఫికెట్లో అడిగిన అన్ని వివరాలు పెన్షనర్లు నింపాలి. పీపీఓ నంబర్, ఐడీ నంబర్, బ్యాంకుఖాతా నంబర్, ఆధార్, పాన్కార్డు వివరాలు అవసరం మేరకు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. నెలసరి రూ.15వేలకు పైగా పింఛన్ పొందుతున్న వారు తప్పనిసరిగా పాన్కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్లో మాత్రమే అందజేయాలి. పెన్షనర్ కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందినట్లయితే ఆ వివరాలు అందజేస్తే పెన్షన్లో డీఏ కట్ చేస్తారు. డీఏను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో పొందొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉద్యోగి డ్రాయింగ్ అధికారి ద్వారా ధ్రువీకరించి అందజేయాల్సి ఉంటుంది. రెండు చోట్ల డీఏ పొందినట్లయితే సదరు పెన్షనర్ / ఉద్యోగిపై చట్టరీత్యా చర్యలకు అవకాశం ఉంటుంది. పెన్షనర్లు తమ 10వ పీఆర్సీ ఏరియర్స్ కోసం ఆధార్ నంబర్ తప్పనిసరిగా అంజేయాలి. కొన్ని నిబంధనలు పెన్షనర్ రెండో వివాహం చేసుకున్నట్లయితే ఆ వివరాలు ఏజీ ఆమోదం తర్వాత రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి. కారుణ్య నియామక ఉద్యోగం చేస్తున్న వారు స్వీయ ధ్రువీకరణ పత్రం, డ్రాయింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేయాలి. పెన్షన్ పొందుతున్న బ్యాంకులో కూడా వార్షిక ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ట్రెజరీలో అందజేసిన పత్రాలకు రశీదు తప్పని సరిగా పొందాలి. పోస్టు ద్వారా పంపినవి, అసంపూర్తిగా నింపినవి అంగీకరించబడవు. లైఫ్ సర్టిఫికెట్ అందజేయని వారి పెన్షన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నిలిపివేసే అధికారం ట్రెజరీ అధికారులకు ఉంది. సద్వినియోగం చేసుకోవాలి.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అవకాశాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా కార్యాలయానికి వచ్చే భారం తప్పుతుంది. నూతన విధానం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ జీవిత ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే ఇబ్బందులు తొలగిపోతాయి. పెన్షనర్లు ఆన్లైన్ ద్వారా పంపిన వివరాలను అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా పెన్షనర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. – గుజ్జు రాజు, ఉప సంచాలకులు, ట్రెజరీ శాఖ, వరంగల్ అర్బన్ -
చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం
పుట్లూరు: ప్రభుత్వ పింఛనుదారులకు అందించే డబ్బు రూ.16లక్షల దోపిడీ కేసును చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వెయ్యి మంది ప్రజల సహకారంతో పోలీసులు 90 నిమిషాల్లోనే ఛేదించారు. యల్లనూరు మండలం చింతకాయమంద గ్రామ కార్యదర్శి నాగలక్ష్మి చింత కాయమంద గ్రామంలో నవంబర్ నెల వైఎస్సార్ పింఛను కానుక డబ్బును పంపిణీ చేయాల్సి ఉంది. ఆమె పింఛను డబ్బు రూ.16లక్షలు తీసుకుని శుక్రవారం ఉదయం నార్పల మండల కేంద్రం నుంచి ఆర్టీసీ బస్సులో ఎ.కొండాపురానికి చేరుకుంది. ఈ విషయాన్ని గమనించిన వాసాపురం గ్రామానికి చెందిన కుళ్లాయప్ప, సుధాకర్, ఆటో డ్రైవర్లు శ్రీనివాసులు, ఆంజనేయులు ఆ డబ్బును చోరీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నాగలక్ష్మి ఎ.కొండాపురం చేరుకోగానే ఆటోడ్రైవర్ శ్రీనివాసులు ఇతర ప్రయాణికులతో పాటు ఆమెను కూడా ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆదే ఆటోలో కుళ్లాయప్ప కూడా ఉన్నాడు. ఆటోను సుధాకర్ ద్విచక్రవాహనంపై అనుసరించాడు. తిమ్మంపల్లిలో ప్రయాణికులు దిగి వెళ్లగా ఆరవీడు గ్రామ సమీపంలో కుళ్లాయప్ప పిడిబాకుతో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ. 16లక్షల నగదు ఉన్న బ్యాగును తీసుకుని సమీపంలోని అరటి తోటల్లోకి పరారయ్యాడు. దీంతో నాగలక్ష్మి ఫోన్లో పోలీసులకు విషయం తెలపడంతో అప్రమత్తమై.. యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో దాదాపు 1000 మందికి పైగా ప్రజలు దుండగుల కోసం గాలించారు. చిలమకూరు గ్రామ సమీపంలో నగదును దోచుకెళ్లిన కుళ్లాయప్పను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఆంజనేయులతో పాటు ఆటో డ్రైవర్ శ్రీనివాసులు, సుధాకర్, కుళ్లాయప్పను అరెస్టు చేసి 16లక్షల నగదు, ఆటో, ద్విచక్రవాహనం, పిడిబాకును సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
పింఛన్ల పండుగ
సాక్షి, అమరావతి: సంతృప్త (శాచ్యురేషన్) స్థాయిలో రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ.. తదితర పింఛన్లు మంజూరుకోసం నవంబర్ 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. నవంబర్ 25వ తేదీ వరకు వలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల పరిధిలో అర్హులనుంచి వారి ఇంటివద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. అదే సమయంలో ఇప్పటికే అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్ని సైతం వలంటీర్లు పరిశీలించి.. వాటిలోనూ అర్హత ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుంటారు. పింఛన్లకోసం కొత్తగా అందిన దరఖాస్తులతోపాటు ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్నవారి వివరాలతో గ్రామ, పట్టణ వార్డులవారీగా జాబితాలు తయారుచేసి, వాటిపై ఆ ప్రాంత ప్రజలందరి సమక్షంలో డిసెంబర్ 1–14వ తేదీల మధ్య సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 15న మంజూరు చేసిన తుది పింఛనుదారుల జాబితాను ప్రకటించి.. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి 2020, జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నట్టు వారు వివరించారు. నవంబర్ 5 నుంచి అధికారులకు శిక్షణ.. కొత్త పింఛనుదారుల దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటికే పింఛను తీసుకుంటున్నవారి వెరిఫికేషన్ ప్రక్రియపై నవంబర్ 5 నుంచి అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. 5న జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున శిక్షణ ఇస్తారు. నవంబర్ 7, 8 తేదీల్లో ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఇద్దరేసి చొప్పున అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణ అందజేస్తారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో నవంబర్ 12, 13, 14 తేదీల్లో స్థానిక సిబ్బందికి శిక్షణ ఇస్తారు. నవంబర్ 15–20 తేదీల మధ్య గ్రామ, వార్డు వలంటీర్లకు ఈ ప్రక్రియపై శిక్షణ ఇస్తారు. -
పెన్షనర్లకు 27 శాతం ఐఆర్
సాక్షి, అమరావతి: ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 1–07–2013 ముందుకు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఈ భృతి వర్తించనుంది. జూలై 1వ తేదీ నుంచి ఈ భృతి మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటి అలవెన్స్.. మరో ఏడాది పొడిగింపు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ను మరో ఏడాది పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు.. పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయడమే కాకుండా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు అంటి అద్దె అలవెన్స్ 30 శాతం మరో ఏడాది పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
టీడీపీకే ఓటేయాలంటూ పింఛన్ల పేరుతో బెదిరింపు
-
ఇచ్చారు.. తీసుకున్నారు..!
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో గురువారం స్థానిక పోస్టాఫీసు వద్ద ఆసరా పింఛన్ లబ్ధిదారులకు డబ్బులు చెల్లించారు. ఆ వెంటనే పోస్టాఫీసు పక్కనే గ్రామ పంచాయతీ ఉద్యోగి ఒకరు కూర్చొని గ్రామ పంచాయతీ పన్నులను వసూలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి పన్నులు వసూలు చేయొద్దని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు అందుకు విరుద్ధంగా ఇలా పన్నులు వసూలు చేయడం గమనార్హం. -
యుక్తవయస్సులోనూ వృద్ధులుగా..
సాక్షి, కోదాడ : తెలంగాణ ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి వచ్చే ఏప్రిల్ నుంచి 2,016 రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించడంతో పట్టుమని 40 సంవత్సరాలు నిండని వారు వృద్ధుల అవతారం ఎత్తుతున్నారు. మీ సేవ కేంద్రాలే అడ్డాగా ఆధార్, ఓటరు కార్డుల్లో వయస్సును అమాంతం పెంచుకుంటున్నారు. కోదాడ పట్టణంలో దీని కోసం ప్రత్యేక అడ్డాలు ఏర్పడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు, బీఎల్ఓలు, వారి భర్తలు దీన్ని లాభసాటి వ్యాపారంగా చేసుకున్నారు. వేల సంఖ్యలో కాగితాల్లో వృద్ధులు తయారు అవుతున్నారు. పట్టణ శివారు గ్రామాలైన లక్ష్మీపురం, శ్రీరంగాపురం, సాలార్జంగ్పేట, బాలాజీనగర్లో ఇప్పటికే మార్పిడి యథేచ్ఛగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తంతు వల్ల భవిష్యత్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడనుంది. దళారుల దందా.. వాస్తవానికి ఆసరా పింఛన్ కోసం ఆధార్కార్డు వయస్సుతో సంబంధం లేదు. కేవలం ఓటరు కార్డులోని వయస్సును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. కానీ కొందరు దళారులు ఆధార్ కార్డులో కూడా వయస్సు పెంచాలని మభ్యపెడుతూ సామాన్యుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ఇక ఓటరు గుర్తింపు కార్డుల్లో వయస్సు పెంపు కోసం పలువురు బీఎల్ఓలు కూడ భారీగా పుచ్చుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. గతంలో కోదాడ తహసీల్దార్ వద్ద పని చేసిన ఓ వ్యక్తి కొంత మంది కార్యాలయ ఉద్యోగులతో ఉన్న సంబంధాలతో ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. పట్టణ శివారు గ్రామాలైన లక్ష్మీపురం, బాలాజీనగర్, సాలార్జంగ్ పేటలలో కూడా ఈ దందా పెద్దెత్తున నడుస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరంగాపురం గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తి వయస్సు వాస్తవంగా 45 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ కార్డుల్లో వయస్సును పెంచుకుని కొంత కాలంగా పింఛన్ పొందడం గమనించదగ్గ విషయం. పింఛన్ల పంపిణీలో చేతివాటం.. కోదాడ పట్టణంలో దాదాపు 5 వేల వరకు వివిధ రకాల పింఛన్లను ప్రతి నెలా అందించాల్సి ఉంది. కానీ పట్టణంలో 3 బయోమెట్రిక్ యంత్రా లే ఉండడంతో పరిసర గ్రామాలలో ఉన్నవారిని కోదాడకు పిలిపించి పింఛన్లు ఇప్పిస్తున్నారు. అయితే వీరు తపాలా కార్యాలయంలో ఇవ్వాల్సిన పింఛన్లను ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తూ ప్రతి లబ్ధిదారు నుంచి 50 రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా వేలిముద్రలు పడడం లేదని కొంద మంది కోదాడలో లేకున్నా వారి పింఛన్లను పెద్ద ఎత్తున డ్రా చేస్తున్నట్లు విమర్శలున్నాయి. పింఛన్ల పంపిణీ సమయంలో వేలి ముద్రలు పడని వారి కోసం మున్సిపాలిటీ 1–15 వార్డులకు ఒకరిని, 16–30 వార్డులకు మరొకరిని నియమించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు కీలకంగా వ్యవరిస్తున్నారని సమాచారం. పింఛన్లు పొందుతున్న వారు కోదాడలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉంటున్నారు. వారి వేలు ముద్రలు పడడం లేదని మున్సిపాలిటీ ఉద్యోగులు డబ్బులు డ్రా చేస్తున్నారని, దీని కోసం రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో చనిపోయిన వారివి కూడా వేలి ముద్రలు పడడం లేదని నొక్కేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు పింఛన్ల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. వేలి ముద్రలు పడనివారి పింఛన్లను మాత్రమే మున్సిపల్ ఉద్యోగులు డ్రా చేయాలి. చనిపోయిన వారి పింఛన్లు డ్రా చేసినట్లు తెలిస్తే తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. విచారించి తగు చర్యలు తీసుకుంటాం. – కందుల అమరేందర్రెడ్డి, కోదాడ మున్సిపల్ కమిషనర్ -
పెండింగ్ డీఏలు ఎప్పుడు చెల్లిస్తారు?
సాక్షి, అమరావతి: గత ఏడాది జనవరి.. జులై నుంచి ఇవ్వాల్సిన రెండు విడతల డీఏలను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంపై ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏడాది దాటినా వీటిని చెల్లించకుండా.. మరోవైపు, అడ్డగోలుగా వందల కోట్ల రూపాయలను అస్మదీయులకు దోచిపెట్టడంపై వారు ప్రభుత్వ పెద్దల వైఖరిని బాహాటంగానే తూర్పారబడుతున్నారు. నిబంధనల మేరకు ఇవ్వాల్సిన డీఏలను ఇవ్వకుండా అడ్వాన్స్ల పేరుతో నిబంధనలను సడలించి మరీ కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తూ ఆ తరువాత కేబినెట్లో ఆమోదింపజేస్తున్నారని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. అదే తరహాలో తమకు కూడా డీఏను ఇచ్చేసి ఆ తరువాత కేబినెట్లో ఆమోదించుకోవచ్చు కదా అని వారు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగకు ఒక డీఏనైనా మంజూరు చేస్తారని ఎదురుచూశామని, కానీ, ప్రభుత్వం స్పందించలేదని సచివాలయంలో ఓ సీనియర్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. అప్పుడూ ఇంతే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగులకు డీఏలను ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందని.. అలాగే, పెన్షనర్లకు డీఏను ఏకంగా ఎగ్గొట్టారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వాటిని చెల్లించారని.. అంతేకాకుండా, పెన్షనర్లకు డీఏను పునరుద్ధరించారన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని, చంద్రబాబు ఇస్తే ఒక డీఏ మంజూరుచేస్తారని లేదంటే అదీ కూడా చేయరని, ఎన్నికల అనంతరం వచ్చే ప్రభుత్వమే ఇక మాకు దిక్కనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెలల తరబడి డీఏలను ఎప్పుడూ పెండింగ్ పెట్టలేదని, అంతేకాకుండా.. 2009 ఎన్నికల ముందు ఐఆర్ కూడా మంజూరు చేశారని వారు గుర్తుచేస్తున్నారు. ఈవెంట్ల పేరుతో దుబారా గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఉద్యోగులకు 1.58 శాతం డీఏ ఇవ్వాల్సి ఉందని, నెలకు కేవలం రూ.35 కోట్లే భారం పడుతుందని, కానీ.. ఈ కొద్దిపాటి మొత్తాన్ని కూడా మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టడంపై వారు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అలాగే, గత ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు ఉద్యోగులకు 2.36 శాతం డీఏ ఇవ్వాల్సి ఉందని, దీనికి కూడా నెలకు రూ.70 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని.. ఇంత చిన్నచిన్న మొత్తాలను ఉద్యోగులకు మంజూరు చేయకుండా ఓపక్క పెండింగ్ పెడుతూ మరోపక్క పెద్దఎత్తున ఈవెంట్ల పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుబారా చేస్తోందని ఉద్యోగులు, పెన్షన్లు ఆరోపిస్తున్నారు. 11వ వేతన సవరణ కమిషన్ను సైతం ప్రభుత్వం ఆలస్యంగా నియమించిందని.. ఆ నివేదిక వచ్చేసరికి సమయం పడుతుందని, ఈలోగా మధ్యంతర భృతి ఇవ్వాలన్న తమ డిమాండ్పై కూడా ప్రభుత్వం నోరు మెదపడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డీఏలే ఇవ్వని సర్కారు మధ్యంతర భృతి ఇస్తుందనే నమ్మకంలేదని, ఒకవేళ ఇచ్చినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇస్తుంది తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి ఉండదని వారంటున్నారు. కేబినెట్లో ఇవ్వకపోతే నిరసన పెండింగ్లోని రెండు డీఏల విషయమై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేయకుండా వారితో కుమ్మక్కవుతున్నారని సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. మధ్యంతర భృతి కోసం కూడా ఆ నేతలు ఒత్తిడి తేవడంలేదన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరు చేయకపోతే నిరసన కార్యక్రమాలను చేపడతామని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్: ఎంపీ వినోద్
హైదరాబాద్: తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఎవరినైనా, దేనినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎంపీ వినోద్ అన్నారు. ది తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హోటల్ ది ప్లాజాలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తాగునీరు, విద్యుత్కు పెద్దపీట వేసిందన్నారు. తమ ప్రభుత్వం పెన్షనర్లను అన్నివిధాలా ఆదుకుంటుందని, పదో పీఆర్సీ ప్రకారం 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనంగా 15 శాతం క్యాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరుకు సిఫారసు చేయాలని పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.నర్సయ్య కోరారు. దేవాలయాలు, గ్రంథాలయాల సంస్థ, మార్కెట్ కమిటీ, డీసీసీబీ, వాటర్ వర్క్స్, సింగరేణి కాలరీస్లో రిటైర్డ్ అయిన వారికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. సమావేశంలో సంఘం గౌరవ సలహాదారు దేవీ ప్ర సాద్, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, వర్కింగ్ ప్రెసిడె ంట్ టి.ప్రేమ్కుమార్, కోశాధికారి శ్రావ ణ్కుమార్, నవనీతరావు పాల్గొన్నారు. -
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
-
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. అకారణంగా పెన్షన్ జాబితా నుంచి తీసివేసిన 490 మందికి పెన్షన్ ఇవ్వాలని కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన పలువురి పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎంపీపీ సువ్వారి గాంధీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. పెన్షన్ జాబితా నుంచి తీసివేసిన 490 మందికి.. 2014 సెప్టెంబర్ నుంచి బకాయిలను కూడా చెల్లించాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అందుకోసం ఒక్కో వ్యక్తికి 49 వేల రూపాయలు చెల్లించాలని తెలిపింది. మూడు వారాల్లో ఈ మొత్తాన్ని వారికి చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
రైల్వే ఉద్యోగులకు హెల్త్ కార్డులు
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఇస్తున్న మెడికల్ కార్డులకు బదులుగా హెల్త్కార్డులను జారీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశిష్ట గుర్తింపు సంఖ్యతో దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా క్రెడిట్ కార్డు తరహాలో అందజేయనుంది. రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం.. యూనిక్ ఐడీ నంబర్ ఉన్న హెల్త్ కార్డులను ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ‘ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులకు హెల్త్ కార్డులను అందజేయాలని నిర్ణయించాం. ఇవి డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో ఉంటాయి. కేటగిరీని బట్టి కలర్ ఉంటుంది. వీటి కాల పరిమితి ఐదేళ్లు’అని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
‘పింఛనుదారులు గుర్తులేరా?’
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 65 ఏళ్లు నిండిన పింఛనుదారుల పట్ల కూడా ఇంత కఠినంగా ఉండటం సబబేనా? ఇలాంటి వారికి 15 శాతం క్వాంటం పింఛను అమలు చేస్తానని ఆయన 2014 ఎన్నికల సమ యంలో హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరి చారు. కానీ జరగలేదు. 2013 నుంచి అమలులో నికి వచ్చిన పదో వేతన సవరణ సంఘం 70 ఏళ్లు నిండిన పింఛనుదారులకు 15 శాతం క్వాంటం పింఛను సిఫారసు చేసింది. 27.2.2017 తేదీన విజయవాడలో పింఛనదారుల 40వ వార్షికో త్సవం జరిగినప్పుడు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సభలోనే క్వాంటం పింఛను ఉత్తర్వులు జారీ చేయడానికి హామీ ఇచ్చారు. మేమంతా కరతాళ ధ్వనులతో స్వాగతించాం. కానీ నేటికీ ఆయన మాట కార్యరూపం దాల్చ లేదు. అలాగే ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలలో పనిచేస్తున్న సిబ్బందికి ఆర్జిత సెలవులను నగ దుగా మార్చుకునే వీలు కల్పిస్తూ జీవో ఎంఎస్ నం 154 ఇచ్చారు. దీని అమలుకు సంబంధిం చిన ఉత్తర్వు 4.5.2010న వెలువడాలి. కానీ 27.5.2017 నుంచి ఆ జీవో అమలుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం విచారకరం. ఇందుకు నిరసనగా పలువురు న్యాయస్థా నాన్ని ఆశ్రయించారు. శాసన మండలి సభ్యుల విజ్ఞప్తి మేరకు 4.5.2010–26.11.2017 మధ్యకా లంలో ఉద్యోగ విరమణ చేసినవారి వివరాలు సేకరణ పేరుతో ఆర్థిక శాఖ కాలయాపన చేసింది. ఈ రెండు పరిణామాలు పింఛనుదారులకు వేదన కలిగించేవే. కానీ వివరాల సేకరణ పేరుతో కాల యాపన చేసి, పింఛనుదారులను వేధిస్తున్నారు. ఇకనైనా ఈ కాలయాపన వ్యూహాలకు స్వస్తి పలికి సమస్య పరిష్కారానికి సీఎం చొరవ తీసుకోవాలి. పింఛనుదారుల సమస్యను పరిష్కరించాలి. ఆశం సుధాకరరావు, గూడలి, నెల్లూరు జిల్లా -
ఉద్యోగీ.. నువ్వే భరించు..!
షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు వైద్యులు జైడోజింగ్ ఇంజక్షన్ రాశారు. నెలకు నాలుగు అవసరం. వెల్నెస్ సెంటర్లలో ఇవ్వడంలేదు. ఒక్కో ఇంజక్షన్కు రూ.1,300 పెట్టి బయటి షాప్లో కొంటున్నాను. ఇక ఈహెచ్ఎస్తో ఉపయోగం ఏముంది. – వై.మురళీధర్, రిటైర్డ్ ఉద్యోగి డాక్టర్లు రాసే మందులివ్వడంలేదు. నాకు 500 ఎంజీ డోసు ట్యాబ్లెట్లు రాశారు. మందులు 1,000 ఎంజీ డోసువి ఇచ్చారు. ఎక్కువ డోసు ఎలా వాడతామని అడిగితే.. ఏమీ చేయలేమని అంటున్నారు. – ఆర్.వెంకటనారాయణ, ప్రభుత్వ ఉద్యోగి – సాక్షి, హైదరాబాద్ ..వీరిద్దరే కాదు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్ల దుస్థితి ఇదీ. ఉద్యోగుల ఆరోగ్య సేవల పథకాని(ఈహెచ్ఎస్)కి నిర్లక్ష్య పు జబ్బు పట్టడంతో కనీస వైద్య సేవలూ ఉద్యోగులకు అందే పరిస్థితి ఉండటం లేదు. వైద్య సేవల కోసం వెల్నెస్ సెంటర్లకు వెళ్లిన వారికి మందులు ఇవ్వడం ఆపేస్తున్నారు. ‘కొన్ని మందులు అందుబాటులో లేవు. అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని ఖైరతాబాద్లోని వెల్నెస్ మందుల కౌంటర్లలో నోటీసు పెట్టా రు. ఇదేమిటని రోగులు అడిగితే.. తామేమీ చేయలేమని సిబ్బంది సమాధానమిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవట్లేదు. దీంతో ఉద్యోగులు బయట మార్కెట్లో ఖరీదైన మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆరోగ్య సేవల పథకాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. పర్యవేక్షణ లేక.. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ప్రత్యేకంగా సీఈవో ఉన్నారు. ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్కు మరో సీఈవో ఉన్నారు. వీరిద్దరి విధుల విష యంలో ప్రభుత్వపరంగా స్పష్టత లేకపోవడం తో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో కె.మనోహర్కు ఈహెచ్ఎస్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ఈహెచ్ఎస్ నిర్వహణ మరింత అధ్వానంగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో వైద్య సేవలు అందడంలేదు. మందుల సరఫరా అరకొరగా జరుగుతోంది. దీంతో వెల్నెస్ సెంటర్లకు వచ్చే ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గింది. జనవరి వరకు నగరంలోని వెల్నెస్ సెంటర్లకు సగటు న ప్రతి రోజు వెయ్యి మంది ఉద్యోగులు వచ్చేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 300కు తగ్గింది. వైద్య సేవలు, మందులు అందుబాటులో లేక పోవడం వల్లే ఈ స్థితి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈహెచ్ఎస్ను క్రమంగా నిర్వీ ర్యం చేసి పూర్తిగా తొలగించే యత్నాల్లో భాగం గా వైద్యారోగ్య శాఖ వెల్నెస్ సెంటర్లను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. అంతా అయోమయం.. ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్ను ప్రారంభించింది. ఈహెచ్సీలో 8,32,085 మంది ఉద్యోగులు, 3,06,125 మంది పెన్షన్దారులు, 32,210 మంది జర్నలిస్టులు నమోదయ్యారు. 2016 డిసెంబర్ 17న ఈహెచ్ఎస్ సేవలు మొదలయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లో వెల్నెస్ సెంటర్ను ప్రారంభించింది. అదే నెల 19 నుంచి ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లోని వనస్థలిపురం, వరంగల్, సంగారెడ్డిలో వెల్నెస్ సెంటర్లను ప్రారంభించింది. ఓపీ సేవలను, పరీక్షలను, మందులను ఉచితంగా అందిస్తోంది. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా అవసరమైన వారికి చికిత్స కోసం ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఈహెచ్ఎస్ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఆస్పత్రులు ఉన్నాయి. అయితే కీలకమైన ఈహెచ్ఎస్ నిర్వహణ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
పెన్షనర్లకు బంపర్ బొనాంజ
న్యూఢిల్లీ : పెన్షనర్లకు బంపర్ బొనాంజ దక్కబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద నెలవారీ అందించే చెల్లింపులను ప్రభుత్వం రెట్టింపు చేయబోతోందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో సుమారు 40 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ఒకవేళ ఇది కనుక అమల్లోకి వస్తే, ప్రభుత్వంపై వార్షికంగా రూ.3000 కోట్ల భారం పడనుంది. ఈపీఎస్ కింద కనీస నెలవారీ పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వాలని 2014లో కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం దీని రెండింతలు చేస్తుండటంతో, ఇక నుంచి కనీసం రెండు వేల రూపాయలను పెన్షనర్లు అందుకోబోతున్నారు. ఈపీఎస్ పెన్షన్ రెండింతలు చేస్తున్న నేపథ్యంలో దీని ఖర్చును, లబ్దిదారుల సంఖ్యను లెక్కించాలని ఈపీఎఫ్ఓను కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశించినట్టు సీనియర్ అధికారి చెప్పారు. ఈపీఎఫ్ఓ త్వరలోనే ఈ పెన్షన్ను రెండింతలు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించనుందని తెలిపారు. ఈపీఎస్-95 కింద 60 లక్షల మంది పెన్షనర్లున్నారు. వారిలో నెలవారీ రూ.1500 కంటే తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారు 40 లక్షల కంటే తక్కువే. వీరిలో కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకునేది 18 లక్షలు మంది. కనీస నెలవారీ చెల్లింపులను రూ.3000-రూ.7500కు పెంచాలని ఎంతో కాలంగా ట్రేడ్ యూనియన్లు, ఆల్ ఇండియా ఈపీఎస్-95 పెన్షనర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్లమెంటరీ ప్యానల్ కూడా ఈపీఎస్-95 అసెసీలకు అందించే నెలవారీ కనీస పెన్షన్ రూ.1000ను పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిత్యావసరాలు తీర్చేలా సామాజిక భద్రత ప్రయోజనాలుండాలని తెలిపింది. ఈపీఎఫ్ స్కీమ్ కింద సభ్యులైన ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా ఈపీఎస్ స్కీమ్ కింద ఎన్రోల్ అవుతారు. -
మార్చి వరకు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు వైద్య చికిత్స ఖర్చుల రీయింబర్స్మెంట్ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది మార్చి వరకు ఉద్యోగులు, పింఛన్దారుల రీయింబర్స్మెంట్ విధానం కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల వైద్య చికిత్స ఖర్చుల రీయింబర్స్మెంట్ విధానం 2017 డిసెంబర్ 31తో గడువు ముగిసింది. 2018 జనవరి 1 నుంచి ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్ఎస్) ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు, పింఛన్దారులకు వైద్య సేవలను కొనసాగించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో రీయింబర్స్మెంట్ విధానాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రీయింబర్స్మెంట్ విధానంతోపాటు ఈహెచ్ఎస్ కూడా సమాంతరంగా కొనసాగుతాయని ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 14 వెల్నెస్ సెంటర్లలో వైద్య సేవలు, వ్యాధి నివారణ పరీక్షలు, ఔషధాల పంపిణీ జరుగుతుందని తెలిపింది. -
ఎన్నాళ్లీ నిరీక్షణ?
రాయవరం (మండపేట): ఒక రోజు ఉదయం ఎనిమిది గంటలకే సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ ఉద్యోగుల ఉరుకులు, పరుగులు. మరో రోజు సాయంత్రం ఐదు గంటలకు మొదలయ్యే వీడియో కాన్ఫరెన్స్ రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది. ఇంత కష్టపడి పనిచేసినా..ఉద్యోగులకు సమయానికి డీఏ ఇవ్వరు. ఆర్థిక ప్రయోజనాలు కల్పించరు. ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పనిచేస్తామని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగుల ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్తో పీఆర్సీ గడువు ముగుసున్నా.. గత పీఆర్సీ బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదు. పీఆర్సీ బకాయిల మాట అటుంచితే కరువుభత్యం చెల్లింపులోనూ మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారు తీరుపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు... పరిస్థితి బాగుపడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలకోసారి ధరల సూచిక ఆధారంగా కరువు భత్యం ప్రకటిస్తోంది. సాధారణంగా జనవరి, జూలై నెలల్లో కేంద్రం డీఏ ప్రకటిస్తుంది. ఆ ప్రకారం రెండు మూడు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర డీఏ ప్రకారం రాష్ట్ర పీఆర్సీ నిష్పత్తిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2016 జూలై నుంచి మూడు డీఏలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికి 2016 జూలై డీఏ మాత్రమే ప్రకటించింది. ఇంకా రెండు డీఏలు ఇవ్వాల్సి ఉంది. బకాయిల మాటెత్తని సర్కార్ ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు నిర్ణయిస్తుంది. గతంలో పీఆర్సీ ఏర్పాటులో జాప్యం వల్ల 18 నెలలు నష్టపోయారు. ప్రస్తుతం అమలవుతున్న పీఆర్సీ గడువు 2018 జూన్తో ముగియనుంది. 2018 జూలై నుంచి నూతన పీఆర్సీ అమల్లోకి రావాలి. నూతన పీఆర్సీ కోసం ముందుగా అధ్యయన కమిటీని నియమించాల్సి ఉంది. ఇంత వరకూ అటువంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోలేదు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. విడతల వారీగా బకాయిలు చెల్లించాలంటూ విజ్ఞప్తి చేసినా ఇంత వరకూ ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ ప్రకటన కూడా వెలువడలేదు. 46 వేల మంది ఉద్యోగులకు... జిల్లాలో సుమారు 46 వేల మంది వరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సుమారు 39 వేల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులకే కాదు పింఛన్దారులకు పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి వారి సర్వీసును బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉండగా, పెన్షనర్లకు ఒక్కొక్కరికి రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకూ చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.25 వేలు చెల్లించాల్సి వస్తే 46 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు రూ.115 కోట్లు, ఒక్కో ఫెన్షనర్కు సగటున రూ.15 వేలు చెల్లించాల్సి వస్తే 39 వేల మందికి రూ.58 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. వేచి చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు వింటూ ఇప్పటి వరకూ ఉద్యోగులు వేచి చూసే ధోరణి అవలంబించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా సమస్యలను పరిష్కరించకపోవడం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. ప్రభుత్వ వైఖరి మారకుంటే పోరాటం చేయక తప్పదు. – డి.వి.రాఘవులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోరాటం తప్పదు నాలుగేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడేందుకు ఉద్యోగులు శక్తికిమించి కష్టించి పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా ఇవ్వకుంటే పోరాటం తప్పదు. పీఆర్సీ గడువు ముంచుకొస్తున్నా..గత పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం అన్యాయం. – పితాని త్రినాథరావు, అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ -
పెన్షన్లలో పోస్టల్ సిబ్బంది చేతివాటం..!
♦ దసరా మామూళ్ల పేరిట రూ.50 కట్ ♦ శాపనార్ధాలు పెడుతున్న వృద్ధులు దామరచర్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న పెన్షన్లల్లో అవకతవకలు జరుగుతున్నాయి. దామరచర్ల మండల కేంద్రంలో పోస్టల్ చేతివాటం చూపిస్తూ పెన్షన్దార్ల నుంచి దసరా మామూలు పేరిట రూ.50 వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని బాధితులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. దసరా మామూళ్ల పేరిట దోపిడీ : మండల కేంద్రంలో 924 మంది వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్దారులు ఉన్నారు. వీరికి దసరా కానుకగా ముందుగానే ప్రభుత్వం పెన్షన్ విడుదల చేసింది. బుధవారం పోస్టల్ సిబ్బంది పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. పెన్షన్ తీసుకునేందుకు Ððవెళ్లిన వారికి పోస్టల్ సిబ్బంది దసరా మామూళ్ల పేరిట రూ.50 కట్చేసి రూ.950 ఇచ్చారు. ఇదేమని అడిగితే పండుగ మామూళ్లు ఇవ్వరా? దిక్కున చోట చెప్పుకోమంటున్నారని పలువురు వాపోయారు. దసరా మామూళ్లు వసూలు చేయడంపై పలువురు బహిరంగంగానే శాపనార్ధాలు పెడుతున్నారు. రూ.50కట్ చేశారు పెన్షన్ నుంచి రూ50 కట్ చేసి రూ.950 చేతిలో పెట్టారు. వృద్ధులకు వస్తున్న పెన్షన్లో చేతివాటం చూపడం సరికాదు. వారికి జీతం వస్తుంది కదా? పెన్షనర్ల నుంచి దసరా మామూలు వసూలు చేయడమేమిటి.? --కొండారపు పెద కృష్ణయ్య -
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : 50 లక్షల మంది ఉద్యోగులకు, 61 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ను, డియర్నెస్ రిలీఫ్ను 1 శాతం పెంచి 5 శాతం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బేసిక్ వేతనం, పెన్షన్ కింద ప్రస్తుతం ఇస్తున్న 4 శాతం డీఏ రేటును, 1 శాతం పెంచుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ కొత్త రేటు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని కేబినెట్ పేర్కొంది. డీఏ, డీఆర్ రెండింటి ఖాతాల ద్వారా ఖజానాపై పడే ప్రభావం వార్షికంగా రూ.3,068.26 కోట్లు ఉంటుందని, అదే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలల కాలానికి( 2017 జూలై నుంచి 2018 ఫిబ్రవరి) రూ.2,045.50 కోట్లుగా ఉంటుందని తెలిసింది. కేంద్ర కేబినెట్ మంగళవారం తీసుకున్న నిర్ణయంతో 49.26 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. -
మాట వినకుంటే పింఛన్లు పీకేస్తా
ఆర్బీపట్నం మహిళలపై మంత్రి రాజప్ప చిందులు ఆర్బీ పట్నం (పెద్దాపురం) : మేం చెప్పిందే వేదం.. మేం చేసిందే అభివృద్ధి.. ఏమనుకుంటున్నారో... వేషాలు వేస్తే మహిళలని చూడం. అవసరమైతే పింఛన్లు పీకేస్తాం. ఇవి ఎవరో తెలుగు తమ్ముడు అన్నమాటలు కావు .. సాక్షాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఊగిపోతూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనమిది. పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో మంగళవారం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రాత్రి వేళ గ్రామంలోకి వచ్చిన రాజప్పకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేవారు. తమ ఊరు అభివృద్ధిపై దృష్టి సారించాలని మహిళలు చెప్పే లోపే ఆయన ఆగ్రహంతో ఊగిసలాడిపోయారు. మహిళలని చూడకుండానే ఏదో పార్టీల అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. మేం చేసే అభివృద్ధి పనులకే వత్తాసు పలకాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరమైతే మీ పింఛన్లు పీకేస్తా.. అభివృద్ధికి సహకరించాలే తప్ప వేషాలు వేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహానికి లోనయ్యారు. దీనిని బట్టి అర్థమౌతోంది మంత్రి రాజప్పకు అభివృద్ధిపై ఎంత ఆసక్తి ఉందో. అంతేగాకుండా ఆ గ్రామానికి అనుకున్న సమయానికి వస్తే మహిళలు ప్రశ్నలు అడుగుతారనే ఆలస్యంగా వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యం( డీఏ) పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించే డియర్ నెస్ అలవెన్స్ను అదనంగా 2 శాతం పెంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జరిగిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 2017 నుంచి ఈ డీఏ/డీఆర్ 2 శాతం పెంపును అమలు చేయనున్నారు. డీఏ పెంపు వల్ల 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 58 లక్షల మంది పింఛన్ దారులు లబ్ది పొందనున్నారు. కాగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డీఏ పెంపు లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిత్యా వసరాలు ఆకాశాన్నం టుతుంటే కేంద్రం తక్కు వగా పెంచుతోందని కేంద్ర ఉద్యోగుల సమాఖ్య ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. -
పోటెత్తిన పెన్షనర్లు
– బ్యాంకుల్లో పెరిగిన రద్దీ – ‘సర్దుబాటు’ చేస్తున్న బ్యాంకర్లు – జిల్లాకు మందకొడిగా నగదు సరఫరా అనంతపురం అగ్రికల్చర్ : పెన్షన్ డబ్బు కోసం పెన్షనర్లు, వేతనాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, అత్యావసరాల కోసం ఖాతాదారులు తరలిరావడంతో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు కిటకిటలాడాయి. పెద్దనోట్లు రద్దు చేసి మంగళవారం నాటికి 56 రోజులు పూర్తయ్యింది. అయినప్పటికీ జిల్లా అంతటా నగదు కోసం జనం పోరాటం కొనసాగుతోంది. నగదు సరఫరా మందకొడిగా ఉండటంతో ఈ దుస్థితి ఏర్పడినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. నెల మొదటి వారం కావడంతో పెన్షనర్లకు కష్టాలు తప్పలేదు. అనంతపురం సాయినగర్లోని ఎస్బీఐ ప్రధానశాఖ వందలాది మందితో కిక్కిరిసిపోయింది. సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో రెండు, మూడు సార్లు లావాదేవీలకు ఆటంకం కలిగింది. అయినా గంటల కొద్దీ జనం ఓపికతో క్యూలో నిల్చుకున్నారు. ఆంధ్రా, సిండికేట్, కెనరా, ఏపీజీబీ, కార్పొరేషన్, ఎస్బీహెచ్ తదితర బ్యాంకుల్లో కూడా రద్దీ ఎక్కువగా కనిపించింది. ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకుకు చెందిన కొన్ని శాఖల్లో విత్ డ్రా రూ.24 వేలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని బ్యాంకుల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తున్నారు. మిగతా అన్ని బ్యాంకుల్లోనూ రూ.10 వేల వరకు ఇస్తున్నారు. నగదు సరఫరా తక్కువగా ఉన్న ఏపీజీబీ, సిండికేట్, మరికొన్ని చిన్నబ్యాంకుల్లో సర్దుబాట్లు చేస్తున్నారు. ఏటీఎంలు అక్కడక్కడ తెరచి ఉంచినా.. నోక్యాష్ బోర్డు తగిలించారు. గత నెలతో పోల్చితే ఏటీఎంల పరిస్థితి కొంత మెరుగైంది. ఒకేసారి రూ.4,500 విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించినా.. రూ.100, రూ.500 నోట్ల కొరత కారణంగా కొన్ని ఏటీఎంలు రూ.2 వేల నోట్లకే పరిమితమయ్యాయి. చిల్లర సమస్య కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 170 నుంచి 190 ఏటీఎంలు పనిచేసినట్లు లీడ్బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో నగదు సరఫరా అయ్యే అవకాశం ఉండటంతో 70 నుంచి 80 శాతం ఏటీఎంలు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కాగా.. ఇప్పటివరకు పాతనోట్ల డిపాజిట్లు రూ.2,500 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం. ఒక్క సాయినగర్ ఎస్బీఐ ప్రధానశాఖలోనే రూ.550 కోట్ల వరకు పాతనోట్లు డిపాజిట్లు అయినట్లు తెలుస్తోంది. కొత్త కరెన్సీ రూ.1,400 కోట్ల వరకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు. మందకొడిగా నగదు సరఫరా నోట్ల రద్దు తర్వాత కొత్త నగదు జిల్లాకు మందకొడిగా సరఫరా అవుతోందని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ నుంచి నేరుగా అనంతపురం కేంద్రానికి డబ్బు సరఫరా కావాల్సివున్నా... గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి మీదుగా వస్తుండడంతో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. అక్కడి నుంచి తెచ్చుకునేందుకు వాహనాలు, సెక్యూరిటీ సమకూర్చుకోవడం భారంగా పరిణమించిందని వాపోతున్నారు. ఖాతాదారుల సంఖ్య, బ్యాంకు శాఖలను పరిగణనలోకి తీసుకోకుండా నగదు కేటాయిస్తుండటంతో కొన్ని బ్యాంకుల్లో పరిస్థితి ఏమాత్రమూ మెరుగుపడలేదు. లాబీయింగ్ చేస్తున్న వాళ్లకే నగదు సరఫరా అవుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ ఆర్బీఐ, మైసూరు ప్రెస్ లేదా బెంగళూరు నుంచి నగదు వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు. జిల్లా మంత్రులు, కలెక్టర్ లాంటి వారు దృష్టి సారిస్తే కానీ ప్రజలకు కరెన్సీ కష్టాలు తీర్చలేమని స్పష్టం చేస్తున్నారు. స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ)..ఈ రెండు బ్యాంకుల్లోనే 30 నుంచి 40 శాతం మంది ఖాతాదారులు ఉన్నారు. వీటికి కూడా అవసరం మేరకు నగదు సరఫరా కావడం లేదని ఆయా బ్యాంకుల అధికారులే చెబుతున్నారు. -
నోటు కోసం కోటి కష్టాలు
సాక్షి, అమరావతి: వరుసగా మూడు రోజుల సెలవు తర్వాత మంగళవారం బ్యాంకులు తెరుచుకోవడంతో నగదు తీసుకోవడానికి జనం పోటెత్తారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీగా క్యూకట్టారు. ఇక్కడా అక్కడా అన్న తేడా లేదు.. పల్లెటూరు నుంచి పట్టణాల దాకా రాష్ట్రమంతా ఇదే విధమైన పరిస్థితి కనిపించిం ది. తెల్లవారకుండానే పలుచోట్ల క్యూలు కట్టారు. నగదు కోసం పనులన్నీ మానుకుని క్యూల్లో వేచి చూశారు. ‘ఈ రోజైనా డబ్బులు దొరికితే ఇబ్బందులు తొలుగుతాయి’ అని ఆశించా రు. అయితే చాలా మందికి ఆశ నిరాశగానే మారింది. కొంతమందికే నగదు చేతికి వచ్చింది. అదీ అరకొరగానే. ఒక్కో ఖాతాదారుడికి కొన్ని చోట్ల రెండు వేలు చొప్పున ఇస్తే.. మరి కొన్ని చోట్ల ఆరువేలు చొప్పున బ్యాంకర్లు పంపిణీ చేశారు. రాత్రి పొద్దు పోయేవరకూ క్యూల్లో నుంచున్నా చాలా మందికి ఆ కాస్త నగదు కూడా దొరకలేదు. పలు జిల్లాల్లో ఏటీఎంలు పనిచేయలేదు. ఏటీఎంలలో నగదు పెడతారేమోనన్న ఆశతో జనాలు అక్కడే కూర్చుండిపోవడం కూడా కనిపించింది. పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద గంటలకొద్నీ క్యూలైన్లలో నిలబడలేక అవస్థలు పడ్డారు. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. క్యూ లైన్లలో మహిళలదీ అదే పరిస్థితి. ఇక జీ తం డబ్బులు తీసుకుందామని బ్యాంకులకు వచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. సెలవు పెట్టి వచ్చినా నగదు చేతికిరాలేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేయని ఏటీఎంలు.. తూర్పుగోదావరి జిల్లాలో 931 ఏటీఎంలు ఉంటే.. మంగళవారం సాయంత్రం వరకూ ఒక్క ఏటీఎం కూడా పనిచేయలేదు. రాజమండ్రి వద్ద ఏటీఎంలో నగదు పెట్టిన గంటకే డబ్బు లు అయిపోవడంతో బ్యాంకుపై జనం ఎగబడ్డారు. దీంతో మేనేజర్ కొంత సమయం తీసుకొని తిరిగి నగదు నింపడంతో ప్రజలు శాంతించారు. అలాగే కర్నూలు జిల్లాలోని 475 ఏటీఎం ల్లో కేవలం రెండు మాత్రమే కొద్ది సేపు పనిచేశాయి. వైఎస్సార్ జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మినహా మరెక్కడా ఏటీఎంలు పనిచేయలేదు. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. పనిచేసిన ఏటీఎంల్లో రెండు వేల నోటు వస్తుండటంతో చిల్లర మార్చుకోలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కాగా, బ్యాంకులకు జనం భారీ ఎత్తున తరలిరావడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. అంతేగాక అదనంగా ప్రైవేటు సెక్యూరిటీ సేవలను వినియోగించుకున్నారు. కొనసాగుతున్న నగదు కొరత పెద్ద నోట్ల రద్దయి ఐదు వారాలు గడుస్తున్నా అటు బ్యాంకులకు, ఇటు ప్రజలకు కష్టాలు తీరడంలేదు. బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆర్బీఐ నుంచి అదనపు నిధులు రాకపోగా, ప్రజల నుంచి డిపాజిట్లు కూడా తగ్గిపోయాయి. కేవలం రెండు వేల నోట్లు తప్ప మిగిలిన చిన్న నోట్లు బ్యాంకులకు తిరిగి రావడం లేదని ఎస్బీఐ మేనేజర్ ఒకరు చెప్పారు. దీంతో ఇప్పటికీ కేవలం నాలుగు వేలు, ఆరువేలు మించి ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. శుక్రవారం వచ్చిన 20, 50 నోట్లను మంగళవారం మధ్యాహ్నానానికి అన్ని శాఖలకు పంపిణీ చేసినట్లు బ్యాంకర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నగదు మరో రెండు రోజులకు సరిపోతుందని, శుక్రవారం లోపు మళ్లీ నగదు వస్తే ఫర్వాలేదు కానీ, లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అర్థరాత్రి నుంచే క్యూలో.. వైఎస్సార్ జిల్లాలోని రాయచోటిలో సోమవారం రాత్రి నుంచే జనాలు బ్యాంకుల వద్దకు వచ్చి క్యూలైన్లలో నిద్రించారు. జిల్లాలో అక్కడక్కడ తోపులాటలు జరిగాయి. అయితే ఈ పరిస్థితిని ఊహించిన పోలీసులు ముందస్తుగా బ్యాంకుల ఎదుట బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో కొంతమేరకు ఒత్తిడి తగ్గింది. ప్రొద్దుటూరు మున్సిపల్కార్యాలయంలో పింఛన్ల పంపిణీ రసాభాసగా మారింది. ఐసీఐసీఐ బ్యాంకు చెందిన పంపిణీ సిబ్బంది రాకపోవడంతో పింఛన్దారులు ఆందోళన చేశారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు బ్యాంకు మేనేజర్లు తీవ్ర ఒత్తడి ఎదుర్కొంటున్నారు. ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. కర్నూలు నగర కేంద్రంలోని ట్రెజరీశాఖకు నగదు రాకపోవడంతో ఉద్యోగులందరూ బ్యాంకును చుట్టుముట్టారు. తాము జీతం ఇంత వరకూ తీసుకోలేదని మండిపడ్డారు. బ్యాంకు మేనేజర్పై చేయి చేసుకునే దాకా పరిస్థితి వచ్చింది. అయితే, కేవలం మీ శాఖకు రూ.5 లక్షలు ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పడంతో తన వల్ల కాదంటూ మేనేజర్ బ్రాంచ్ నుంచి వెళ్లిపోయే పరిస్థితి. పలుచోట్ల ధర్నాలు గంటల తరబడి క్యూలో నిల్చొన్నాక బ్యాంకు అధికారులు వచ్చి చెల్లింపులకు డబ్బుల్లేవు, డిపాజిట్ చేసేవారే లోపలకి రండి అనడంతో ఖాతాదార్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మేము మనుషులమనుకుంటున్నారా.. యంత్రాలమనుకుంటున్నారా..’ అంటూ గుంటూరు జిల్లా రొంపిచర్ల ఎస్బీహెచ్ ఎదుట మంగళవారం వృద్ధులు, పింఛన్దారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఇదే జిల్లా యడ్లపాడు ఎస్బీఐ బ్రాంచి ఖాతాదారులు, పెన్షనర్లు జాతీయ రహదారి పైకి వెళ్లి రాస్తారోకో చేశారు. తుళ్లూరు మండలం పెద్దపరిమిలోలోనూ ఇదేపరిస్థితి నెలకొంది. స్థానిక చైతన్యగోదావరి బ్యాంకు ముందు ఉదయం నుంచి క్యూలో ఉన్న ఖాతాదార్లకు బ్యాంకు సిబ్బంది డబ్బుల్లేవని చెప్పడంతో ఆందోళనకు దిగారు. బ్యాంకు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు రివ్యూలో పాల్గొనేందుకు వస్తున్న ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ల వాహనాలను ఖాతాదార్లు అడ్డుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారికి డబ్బులు రాలేదని మేనేజర్ సమాధానం ఇవ్వటంతో ఖాతాదారులను శాంతింపజేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. డబ్బులు వస్తాయని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకొన్నారు. క్యూలైన్లో కుప్పకూలిన వృద్ధుడు జంగారెడ్డిగూడెం రూరల్: పింఛను సొమ్ము కోసం గంటలతరబడి క్యూలైన్లో నిల్చొన్న వృద్ధుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం కేతవరంలో మంగళవారం చోటు చేసుకుంది. బొర్రా వెంకట్రావు (65) అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామంలోని ఎస్బీఐ కియోస్క్ బ్రాంచికి వెళ్లి క్యూలో నిల్చొన్నాడు. కొద్దిసేపటికి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని ఆటోలో జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించాడు. క్యూలో సొమ్మసిల్లిన యువతి క్రోసూరు: ఇంటి ఖర్చుల కోసం నగదు తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన ఓ యువతి గంటల తరబడి క్యూలో నిలబడలేక సొమ్మసిల్లి పడిపోయింది. గుంటూరు జిల్లా క్రోసూరులోని ఎస్బీఐ బ్రాంచి వద్ద ఈ ఘటన జరిగింది. మంగళవారం పెద్దసంఖ్యలో జనం బారులుతీరడంతో బ్యాంకు సిబ్బంది లోపలికి కొంతమందిని అనుమతిస్తూ తలుపులు వేసుకొని పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూలో నిలుచున్న యువతి అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. మిగిలినవారు ఆమెకు సపర్యలు చేయటంతో తేరుకుంది. ఏటిఎంలో నగదు పెట్టం ‘ఏటీఎంలో నగదు పెట్టడం జరగని పని. నగదు పెట్టిన గంటలోపే ఖాళీ చేస్తున్నారు. పైగా అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డు దారులు వినియోగించుకొంటున్నారు. అందుకని కేవలం మా బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందించాలంటే బ్యాంకులోనే చెల్లింపులు చేయాలని నిర్ణయించాం. అంతకంటే మేమేమీ చేయలేం’ క్రోసూరు ఎస్బీఐ మేనేజర్ కిరణ్ కుమార్ కరాఖండిగా చెప్పారు. క్యూలో నిలవలేక... పిట్టలవానిపాలెం: నగదు కోసం బ్యాంకుకు వచ్చిన ఓ వృద్ధుడు క్యూలో నిలబడిన కొద్దిసేపటికే నీరసించి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకు శాఖ వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. మండలంలోని గోకరాజు నల్లిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన రిటైర్డు ఉద్యోగి నల్లిబోయిన సాంబయ్య పింఛను కోసం బ్యాంకు ముందు క్యూలో నిలబడ్డారు. కొద్దిసేపటికి నీరసించి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జన వేదన తిరగలేక చస్తున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఏటీఎంలలో ఎక్కడ డబ్బులొస్తున్నాయోనని తిరుగుతున్నా. ఏడు ఏటీఎంల వద్దకెళితే డబ్బులు రావడంలేదు. చివరికి ఇక్కడకొచ్చా. మూడు గంటలు నిలబడితే గానీ డబ్బులు రాలేదు. డబ్బుల కోసం నరకం చూస్తున్నాం. – రామారావు, గాంధీనగర్, విజయవాడ ఈ వయసులో ఈ బాధేంటి? ఈ వయసులో నాకు ఈ బా«ధేంటీ.. మంచంలో ఉన్న నేను ఇద్దరి సహకారంతో పింఛన్ కోసం బ్యాంక్కు రావాల్సి వచ్చింది. కాళ్లు, చేతులు సహకరించక అల్లాడుతున్న మాలాంటి వారిని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది. మా ఉసురు తగులుతుంది. – హుస్సేన్బీ, వృద్దురాలు, మాచర్ల, గుంటూరు జిల్లా పెళ్లికి డబ్బులివ్వకపోతే ఎలా? ఈ నెల 24న మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కోసం ముందుగా తెచ్చుకున్న రూ.లక్ష అనంతసాగరం సిండికేట్ బ్యాంక్లో జమ చేశాం. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే అంత మొత్తం ఇవ్వలేమంటున్నారు. మేము పెళ్లి ఎలా చేయాలో దిక్కు దోచటం లేదు. –షేక్ గుల్జార్, సోమశిల, నెల్లూరు జిల్లా జీతం కూడా తీసుకోలేకపోతున్నాం జీతం కూడా తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలకు సమయానికి వెళ్లడం తప్పనిసరి. బ్యాంకులేమో పది గంటలు అయితే తప్ప తెరుచుకోవడం లేదు. శుక్రవారం ఏటీఎం వద్ద క్యూలో నిలబడి రెండు వేలు తీసుకున్నా. మరలా ఈరోజు పాఠశాల ముగియడంతోనే వచ్చి క్యూలో నిల్చున్నా. నావంతు ఎప్పటికి వస్తుందో.. అప్పటిదాకా నోట్లు ఉంటాయో లేదో అర్థం కావడం లేదు. – రవి, ఉపాధ్యాయుడు, ఒంగోలు పెన్షన్ రాకపోతే ఇబ్బంది నాకు ప్రతినెలా రూ.14 వేలు పెన్షన్ వస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో రూ.2 వేలు ఇస్తున్నారు. మందులకు సరిపోని పరిస్థితి. నిత్యావసర సరుకులు, ఇతర ఖర్చులకు చాలా ఇబ్బంది పడుతున్నాం. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. – కావలి ఎర్రియ్య, రిటైర్డు ఉద్యోగి, పాలకొల్లు బతుకు దైవాధీనం పెద్ద నోట్ల రద్దు నుంచి బతుకు దైవాధీనంగా ఉంది. బ్యాంకుల్లో నోట్లు దొరుకుతాయో లేదో అన్నట్లు పరిస్థితి ఉంది. నేను విజయనగరంలో ఉండి పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్నాను. నాకు రోజుకు రూ.100, రూ. 200 అవసరమవుతాయి. ఇక్కడ బ్యాంకు ఖాతా లేకపోవడంతో ఏటీఎంకే వెళతాను. కానీ చాలా ఏటీఎంల్లో డబ్బులు ఉండడం లేదు. ఉన్న వాటిల్లో నుంచి రూ. 2000 నోటు వస్తోంది. ఆ నోటుకు చిల్లర దొరక్క అవస్థలు పడుతున్నాను. – బి.అప్పలనాయుడు, పెనసాం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా రెండు వేల నోటుతో పాట్లు రెండు వేలు కోసం ఏటీఎంల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. నేను మూడు రోజులుగా డబ్బులు అత్యవసరమై అమలాపురంలోని రెండు ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడ్డాను. నా వంతు రాకుండానే డబ్బులు అయిపోయాయి. మంగళవారం రెండు వేలు నోటు వచ్చింది. ఆ నోటును మార్చేందుకు మూడు గంటలు కష్టపడ్డాను. – డేగల నాగేంద్రబాబు, పేరూరు. అమలాపురం. పిల్లాడి ఫీజు కట్టాలని.. మా అబ్బాయికి ఎమ్ఫార్మసీ సీటు వచ్చింది. ఫీజు కట్టాలన్నా కట్టలేని పరిస్థితి. అక్కడేమో పాతనోట్లు తీసుకోరు. బ్యాంకుల్లో కొత్త నోట్లు ఇవ్వరు. సాధారణ ప్రజలకు ఇలాంటి కష్టాలు తగవు. గత మూడు రోజులుగా రాజాం వచ్చి ఏటీంలు ముందు నిలవడమే తప్ప క్యాష్ పొందలేని పరిస్థితి వచ్చింది. ఏటీఎంలు పని చేయక, బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటీ? – కంచరాపు వెంకటరమణ, రైతు, మేడమర్తి, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా ఈ కష్టం కంటే చావడం మేలు పింఛన్ డబ్బు కోసం వారం రోజు లుగా తిరుగుతున్నా. నడవలేని స్థితిలో ఉన్న నన్ను మా పక్కింటి వారు రిక్షాలో బ్యాంక్కు తీసుకొచ్చారు. ఇక్కడికి వస్తే విపరీతమైన జనా లు. డబ్బు ఎలా తీసుకోవాలో, ఎప్పుడిస్తారో అర్థం కావడం లేదు. మాలాంటి పేదలకు ఎందుకింత కష్టం?! ఈ కష్టాల కంటే దేవుడుపైకి తీసుకెళ్లినా బాగుండేది. – లక్ష్మక్క, మరువకొమ్మ కాలనీ, అనంతపురం రూ. 200 ఇచ్చి వేధిస్తున్నారు పింఛన్ డబ్బులో ఈ నెల ఒకటో తేదీన రూ. 200 ఇచ్చారు. రోజూ నేను బ్రహ్మంగారిమఠం నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి వెళుతున్నాను. చార్జీలకే డబ్బు అయిపోతోంది. మంగళవారం ఉదయం నుంచి క్యూలో కూర్చున్నాను. నా వంతు సాయంత్రం వచ్చింది. అయితే నాకు ఇవ్వలేదు. గతంలో నాకు పంపిణీ చేసిన సిబ్బంది ద్వారానే తీసుకోవాలని చెబుతున్నారు. ఆమె ఎప్పడు వస్తుంది. నాకు పింఛన్ ఎప్పుడు ఇస్తుందో అర్థం కావడం లేదు. – సుంకమ్మ, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లా -
తెలంగాణకు రూ.1,800 కోట్ల కరెన్సీ
-
బ్యాంకుకు వెళితే చిల్లర చేతిలో పెట్టారు!
జలంధర్: ప్రజలకు కరెన్సీ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 10 వేల రూపాయలు చొప్పున నగదు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా చాలా బ్యాంకుల్లో కేవలం 2 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. పంజాబ్లోని జలంధర్లో పెన్షనర్లకు వింత అనుభవం ఎదురైంది. బ్యాంకుల్లో పెన్షనర్లకు 10 వేల రూపాయల నగదు అయితే ఇచ్చారు కానీ 9 వేల రూపాయలకు మాత్రమే నోట్లను అందజేశారు. మిగిలిన 1000 రూపాయలకు రెండు రూపాయల నాణేలు ఇచ్చారు. ఓ కవర్లో ఉంచిన చిల్లరను బ్యాంకర్లు పెన్షనర్ల చేతిలో పెట్టారు. దీంతో వారు అవాక్కయ్యారు. ఈ రెండు రూపాయల నాణేలతో ఏం చేయాలి? ఎలా ఉపయోగపడుతుంది? అంటూ ఓ పెన్షనర్ ప్రశ్నించారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా 2 రూపాయల నాణేలను తీసుకోవడం లేదు.. ఇవి ఎలా ఉపయోగపడతాయి? ప్రభుత్వం మమ్మల్ని ఆ స్థాయికి దిగజార్చిందంటూ వాపోయారు. దీనిపై బ్యాంకు అధికారులు వివరణ ఇస్తూ.. నగదు సమస్య అని కొందరు చెప్పగా, కంప్యూటర్ల సమస్య అని మరికొందరు అన్నారు. -
రాష్ట్రానికి రూ. 1,800 కోట్ల కరెన్సీ
రాష్ట్రానికి అన్నీ రెండు వేల నోట్లే పంపిన ఆర్బీఐ సాక్షి, హైదరాబాద్: నగదు కొరత తీవ్రమవటంతో రిజర్వు బ్యాంకు తెలంగాణకు రూ.1,800 కోట్ల విలువైన నోట్లు పంపిణీ చేసింది. కానీ చిన్న నోట్లు ఇవ్వాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆర్బీఐ పట్టించుకోలేదు. మొత్తం రూ.2వేల నోట్లనే పంపించింది. దీంతో రాష్ట్రంలో చిన్ననోట్ల కొరత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ పంపిణీ చేసిన నోట్లన్నీ గ్రామీణ ప్రాంతాలకే చేరేలా చూడాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కొరతను తీర్చేందుకు కనీసం రూ.5,000 కోట్ల విలువైన నోట్లను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల కిందటే ఆర్బీఐకి లేఖ రాసింది. రూ.500, రూ.100, అంతకు చిన్న నోట్లు పంపించాలని కోరింది. కానీ నోట్ల కొరతతో ఆర్బీఐ రూ.20 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. మరోవైపు రాష్ట్రానికి ఇప్పటివరకు విడుదల చేసిన రూ.12వేల కోట్లలో 96 శాతం రూ.2వేల నోట్లే ఉన్నాయి. మరోవైపు ఒకటో తేదీ రావటంతో నోట్ల కొరత పెరిగిపోయింది. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, పెన్షన్దారులు జీతాలను తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులు, పెన్షన్దారులు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో బ్యాంకులపై మరింత ఒత్తిడి పెరిగింది. -
కరెన్సీ...కట్..కట!
కనికరించని బ్యాంకర్లు.. తెరచుకోని ఏటీఎంలు యథావిధిగా జనం వెతలు క్యూలలోనే పెన్షనర్లు.. ఉద్యోగులు సిటీబ్యూరో : ఆబిడ్స...చార్మినార్...సికింద్రాబాద్...మాదాపూర్..కూకట్పల్లి..ఎల్బీనగర్...రాజేంద్రనగర్...బంజారాహిల్స్..ప్రాంతమేదైనా రెండోరోజూ అదే సీన్. బ్యాంకుల ముందు భారీ క్యూలు. అరకొర నగదుతో సరిపెట్టిన బ్యాంకులు..తెరచుకోని ఏటీఎంలు...నగరవాసికి తప్పని కరెన్సీ ఇక్కట్లు. శుక్రవారం కూడా గ్రేటర్ వ్యాప్తంగా ఇదే దుస్థితి. ఎడారిలో ఒయాసిస్సులా ఎక్కడో ఓ చోట ఏటీఎం తెరచుకున్నప్పటికీ అక్కడి లైన్లు చూస్తే సొమ్మసిల్లి పడిపోయే దుస్థితి. గంటల తరబడి క్యూలో నిల్చున్నా తీరా మావంతు వచ్చే సరికి నగదు నిల్వలు నిండుకున్న దుస్థితి ఎదురైందని పలువురు సిటీజన్ల ఆక్రోశం. అత్యవసర చికిత్సలు, ప్రాణాధార మందుల కొనుగోలుకూ చేతిలోచిల్లి గవ్వ లేదని పెన్షనర్ల ఆందోళన. ఇంటి అద్దె, పాలబిల్లు, పిల్లల ట్యూషన్ ఫీజులు, నిత్యావసరాలుఎలా కొనుగోలు చేయాలో తెలియడంలేదని సగటు వేతన జీవి ఆవేదన. ఇదీ నగరంలో సర్వత్రా కనిపించిన దుస్థితి. మహానగరం పరిధిలోని 1435 బ్యాంకులుండగా..శుక్రవారం పలు బ్యాంకుల్లో సేవింగ్స ఖాతా వినియోగదారులకు రూ.2 నుంచి రూ.4 వేల నగదు ఉపసంహరణకే అనుమతించారుు. పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో మధ్యాహ్నానికే మూతపడ్డారుు. నగదు ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమంటూ బ్యాంకర్లు చేతులెత్తేయడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారారుు. ఏటీఎంలలో వస్తున్న రూ.2 వేల నోట్ల మార్పిడికీ అష్టకష్టాలు పడాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తంచేశారు. వెరుు్యకి పైగా బిల్లు చేస్తేనే చిల్లర ఇస్తామంటూ వ్యాపారులు చుక్కలు చూపుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. గ్రేటర్ పరిధిలోని ఏడువేల ఏటీఎం కేంద్రాలుండగా..తెరచుకున్నవి రెండు వేలలోపు మాత్రమే కావడం గమనార్హం. పెట్రోల్ బంకుల్లోనూ పాత రూ.500 నోట్ల స్వీకరణకు స్వస్తి పలకడంతో బండి నడిచేదెలాగో అర్ధంకాని పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. కాగా నగరంలోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఏటీఎంల వద్ద రోగుల బంధువులు, సహాయకులు నగదు కోసం గంటలతరబడి క్యూలైన్లలో నిల్చున్పటికీ ఫలితం లేదని వాపోయారు. కుదేలైన చిరువ్యాపారులు... పెద్ద నోట్ల రద్దు గ్రేటర్లో చిరు వ్యాపారుల్ని చిదిమేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి ఉపాధిపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. నోట్ల రద్దుకు ముందు కళకళలాడిన వ్యాపారాలు నేడు జనం లేక బోసిపోరుు కనిపిస్తున్నారుు. పెద్ద నోట్లు రద్దు చేసి 23 రోజులు గడుస్తున్నా.. ఇంకా చిల్లర కష్టాలు జనాన్ని వెంటాడుతుండడంతో చిరువ్యాపారుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంటోంది. పెద్ద నోట్లు తీసుకువస్తే వాటిని తీసుకోలేని పరిస్థితి...దీంతో వ్యాపార లావాదేవీలన్నీ స్తంభించిపోయారుు. ఈ 23 రోజుల్లో 50 శాతం నుంచి 70 శాతం అమ్మకాలు పడిపోవడంతో చిరువ్యాపారుల కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కళ తప్పిన మార్కెట్లు... గ్రేటర్ పరిధిలోని బేగంబజార్, చార్మినార్, ఆబిడ్స, బషీర్బాగ్, జనరల్బజార్, సుల్తాన్బజార్ వంటి మార్కెట్లన్నీ కరెన్సీ కష్టాల కారణంగా కళతప్పారుు. గత 20 రోజులుగా తమ వ్యాపారాలు 50 శాతానికి పైగా పడిపోయాయని, దుకాణాల అద్దెలు, పనివాళ్ల వేతనాలు, కరెంట్ బిల్లులు ఇతరత్రా నిర్వహణ వ్యయాలకు నగదు ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకావడం లేదని పలువురు వ్యాపారులు వాపోయారు. -
ఖాతాలో జమ.. అంతా మమ
1.25 లక్షల మంది వేతన జీవులు, పింఛ¯ŒSదారుల ఇక్కట్లు రూ.1000 ఇస్తాం కానీ మరో వెయ్యి ఇస్తేనే రూ.2000. పింఛన్దారులకు బ్యాంకర్ల మెలిక 60 శాతం ఏటీఎంల తలుపులు మూతే కొత్తపేట ఎస్.బి.ఐ.లో రూ.500లే గతి ర్యాలి ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నా నిర్దిష్ట తేదీ ప్రకటించకుండా పింఛన్లిస్తామని దండోరాలు పరిస్థితిదీ... జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, రిటైర్డ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్షా 25 వేలు పైనే ఉన్నారు. వీరందరికీ జీతాల బడ్జెట్ రూ.500 కోట్లు. కానీ బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లో నిలబడినా నాలుగు వేలు మించి చేతికి రాని వైనం. 761 బ్రాంచీల పరిధిలో 931 ఏటీఎంల ద్వారా రూ.5.30 కోట్లు మాత్రమే డ్రా అయింది. మధ్యాహ్నం తరువాత సుమారు 560 ఏటీఎంలలో నోక్యాష్ బోర్డులు కనిపించాయి. రూ.1000 డిపాజిట్ చేస్తే రూ.2000 నోటు ఇస్తామని రాజమండ్రి రూరల్లో బ్యాంకు సిబ్బంది రూ.1000 వృద్ధాప్య పింఛ¯ŒSదారుల జీవితాలతో ఆటలాడుకున్నారు. సాక్షిప్రతినిధి, కాకినాడ : డబ్బు లేదు. డబ్బు లేదు. డబ్బు లేదు..ఎక్కడ చూసినా...ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా ఇదే అంశం. జీతాలు ఖాతాలో పడ్డాయనే ఆశ క్షణాల్లో ఆవిరైపోతుంటే ఆగ్రహం కట్టలు తెంచుకునే పరిస్థితి జిల్లా అంతటా నెలకుంది. జీతం పడింది ... నెల అవసరాలకు డబ్బులు తీసుకుందామని శుక్రవారం బ్యాంకులకు వెళ్లేసరికి ఐదారు వేలు చేతిలో పెట్టి ‘మమ’ అనిపించి బ్యాంకర్లు చేతులు దులుపుకోవడంతో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక పింఛ¯ŒSదారులనే కనికరం లేకుండా మొండి చేయి చూపిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో అయితే సామాజిక పింఛ¯ŒS రూ.1000 ఇస్తాం, కానీ మరో రూ.1000 జమ చేస్తే రెండు వేలు నోటు ఇస్తామని పింఛ¯ŒSదారులకు బ్యాంకులు మెలికి పెట్టాయి. ఆ వచ్చే కొద్దిపాటి పింఛ¯ŒSతోనే పొట్టపోసుకునే తమబోటి వాళ్లు మరో వెయ్యి ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వగలమంటూ పింఛ¯ŒSదారులు బ్యాంకు అధికారులపై మండిపడటం కనిపించింది. రెండో తేదీ శుక్రవారం కూడా జీతాలు, పింఛన్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద పడిగాపులుపడ్డా పట్టుమని ఐదు వేలు కూడా చేతికి చిక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రూ.500లే గతి... గురువారం రూ.4 వేలు చెల్లించిన కొత్తపేట ఎస్.బి.ఐ. బ్రాంచిలో శుక్రవారం రూ.500 చేతిలో పెట్టి ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఆత్రేయపురం మండలం ర్యాలి ఆంధ్రాబ్యాంక్ విధులు ప్రారంభమైన అరగంటకే నో క్యాష్ బోర్డు పెట్టడంతో ప్రజలు ధర్నాకు దిగారు. రూ.1000 డిపాజిట్ చేస్తే రూ,2000 నోటు ఇస్తామని రాజమండ్రి రూరల్లో బ్యాంకు సిబ్బంది వృద్ధాప్య పింఛ¯ŒSదారుల జీవితాలతో ఆటలాడుకున్నారు.రామచంద్రపురం, కాకినాడ సిటీ, మండపేట, రాజోలు నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుంచీ ఏటీంలలో నగదు లేదనే బోర్డులు దర్శనమిచ్చాయి. జగ్గంపేట, పి గన్నవరం, పెద్దాపురం, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో సామాజిక పింఛన్లు అందకపోవడంతో బ్యాంకుల చుట్టూ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు కాళ్లరిగేలా తిరిగారు. ఆటోలకు రూ.20 చార్జీలు చెల్లించి బ్యాంకులకు వద్దకు వచ్చి పడిగాపులు పడి తీరా ఇవ్వడం లేదని చెప్పడంతో కంటతడి పెట్టుకుంటూ వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ అధికారులు పింఛన్లు ఇచ్చే తేదీన ప్రకటిస్తామని దండోరా వేయించారే తప్ప ఎప్పుడు ఇస్తామనేది ప్రకటించలేదు. రాజమండ్రి నగరంలో సేవింగ్ ఖాతాదారులకు రూ.4వేలు, కరెంటు ఖాతాదారులకు రూ.10 వేలు ఇచ్చారు. సగానికి పైగా ఏటీఎంలు మూతేశారు. రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లోని బ్యాంకుల్లో రూ.4 వేలు, రూ.6 వేలు మాత్రమే ఇచ్చారు. మధ్యాహ్నం తరువాత ఏటీఎంలో నగదు లేదంటూ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏటీఎంలు పని చేయలేదు. మోతుగూడెంలో ఆంధ్రాబ్యాంకులో డబ్బులు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇలా ఎన్ని రోజులు బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటారో తెలియడం లేదని, ఉద్యోగాలు మానేసి బ్యాంకుల చుట్టూ నెలంతా తిరిగినా జీతం మొత్తం చేతికొస్తుందనే గ్యారెంటీ లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 రోజులుగా బ్యాంకుల్లో నెలకొన్న పరిస్థితి వేరు, గడచిన రెండు రోజులుగా ఉత్పన్నమైన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దుచేసిన దగ్గర నుంచి ఇంతవరకు జిల్లాలో ప్రజలు డిపాజిట్లు చేసింది రూ.3,800 కోట్లు. రిజర్వు బ్యాంకు జిల్లాకు ఇచ్చింది రూ.1200 కోట్లు. వీటిలో రూ.410 కోట్లు ఆంధ్రాబ్యాంకు ఎక్కువగా మారకం చేసింది. శుక్రవారం రాత్రికి రూ.140 కోట్లు రానుంది. మరో రూ.600 కోట్లు ప్రతిపాదనలున్నాయి. అయినా సరే అవసరాలు తీర్చలేని పరిస్థితి కనిపిస్తోంది. నో క్యాష్తో కష్టాలు... జిలా ్లవ్యాప్తంగా ఉద్యోగులు, రిటైర్డ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లక్షా 25 వేల పైచిలుకుగానే ఉన్నారు. వీరందరికీ జీతాల బడ్జెట్ రూ.500 కోట్లు. కానీ బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లోల నిలబడినా నాలుగు వేలు మించి చేతికి రాని వైనం. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎవరికైనా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలో నాలుగు వేలు మించి ఇవ్వలేదు, రంపచోడవరం ఏజెన్సీలో మాత్రం రిటైర్డ్ ఉద్యోగులకు రూ.6000 వంతున ఇచ్చారు. రూ.35,000 జీతగాడికి నాలుగైదు వేలు చేతిలో పెట్టడంతో ‘ఇది ఏ మూలకు వస్తుంద’ని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. బ్యాంకుల్లో నగదు ఉదయానికే నిండుకోవడంతో నిలువుకాళ్ల జపం చేసినా అరకొరగానే అందడంతో ఈసురోమంటూ తిరిగి వెళ్లిపోయారు. మొత్తం జీతం నాలుగైదు దఫాలుగా డ్రా చేయాలంటే నెలంతా తిరగాల్సిందేననని, ఇదేమి శిక్షంటూ వాపోతున్నారు. పోనీ ఏటీఎంల వద్ద తీసుకుందామంటే విత్డ్రా పరిమితి రూ.2 వేలే. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 60 శాతం ఏటీఎంలు నగదు లేదనే బోర్డులతోనే దర్శనమిచ్చాయి. 761 బ్రాంచీల పరిధిలో 931 ఏటీఎంల ద్వారా రూ.5.30 కోట్లు మాత్రమే డ్రా అయింది. మధ్యాహ్నం తరువాత సుమారు 560 ఏటీఎంలలో నోక్యాష్ బోర్డులతో కనిపించాయి. 761 బ్యాంక్ బ్రాంచిలలో నగదు మార్పిడితో పాటు విత్డ్రాలు రూ.60 కోట్లయ్యాయి. శని, ఆదివారాల్లో జిల్లాలో అవసరాలు తీరాలంటే రూ.500 కోట్లు అవసరం. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు పంపించారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. -
భువనగిరిలో పింఛనుదారుల నిరసన
భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరిలోని బ్యాంకుల వద్ద పింఛనుదారులు నిరసన తెలిపారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రభుత్వ పింఛను దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రూ. 10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయగా రూ. 4 వేలే ఇస్తున్నారని నిరసన తెలిపారు. గంటలకొద్దీ క్యూలైన్లలో తాము నిలబడలేమని, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రూ.4 వేలతో నెలంతా ఎలా గడపాలని ప్రశ్నించారు. వయోభారంతో ఉన్న తాము బ్యాంకుల చుట్టూ తిరిగి అస్వస్థత పాలైతే ఎవరు బాధ్యులని బ్యాంకు మేనేజర్ను నిలదీశారు. దీనిపై బ్యాంక్మేనేజర్ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి అందిన నగదును ఆ నిష్పత్తి మేరకే పెన్షనర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో వృద్ధులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. -
ఒకటో తారీఖు కోసం ఏర్పాట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు, పింఛనుదారులకు డిసెంబరు 1వ తేదీన నోట్ల ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. చిన్న నోట్లు అందించే దిశగా కేంద్రంతోనూ, రిజర్వు బ్యాంకుతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని మంగళ వారం రాత్రి కమాండ్ కంట్రోల్ కార్యా లయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పింఛనుదారులకు అవసర మైన చిన్న నోట్లను బ్యాంకు కరస్పాం డెంట్లు, గ్రామ కార్యదర్శులు ఇస్తారని, వారి ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిన మొత్తాలకు అనుగుణంగా ఈ చెల్లింపులు ఉంటాయని చెప్పారు. డ్వాక్రా గ్రూపులు, నరేగా గ్రూపు సభ్యులు తమ ఖాతాల్లో డిసెంబరు 1న ప్రభుత్వం జమ చేసిన మొత్తాలను ఒకేసారి విత్ డ్రా చేయకుండా అవసరమైన మేరకు తీసుకోవాలని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించండి ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి అద్దె, ఇతర ముఖ్య చెల్లింపులకు నగదు తీసుకుని, మిగి లిన మొత్తాలకు ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిం చాలని సూచించారు. ‘ఏపీ పర్సు’ యాప్ను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. బ్యాంకు అధికారులను అవమాన పరిచే రీతిలో తానేమీ మాట్లాడలేదని, వారలా భావిస్తే తానేమీ బాధపడనని, అవసరమైతే వారితో ఇంకా గట్టిగా కూడా మాట్లాడతానని బాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుపతిలో సైన్స్ మ్యూజియం తిరుపతిలో జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనున్న 104వ ఇండియన్ సైన్స కాంగ్రెస్ కోసం జరుగుతున్న ఏర్పాట్లపై మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులు, విశ్వవిద్యాలయాల వీసీలతో సమీక్ష జరిపారు. ప్రతిష్టాత్మక సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు చిహ్నంగా తిరుపతిలో వంద ఎకరాల్లో బ్రహ్మాండ పేరుతో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, అదేరోజు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేరుుంచాలని సమావేశంలో నిర్ణరుుంచారు. -
50లక్షల మంది పెన్షనర్లకు ఊరట!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కష్టాల నేపథ్యంలో దాదాపు 50 లక్షల మంది పెన్షనర్లకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఊరట కల్పించింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ వద్ద సమర్పించాల్సిన జీవిత ధృవీకరణ పత్ర తుది గడువును జనవరి 15వరకు పొడిగించింది. ఈ మేరకు 120 మందికి పైగా ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీచేశామని, 2017 జనవరి 15వరకు జీవిత ధృవీకరణ పత్రాల సమర్పణ గడువును పొడిగిస్తున్నట్టు తెలిపినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల ఈ గడువును పొడిగిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ పెన్షనర్లు నవంబర్ వరకు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంది. లేని పక్షంలో వారి పెన్షన్లను ఆగిపోనున్నాయి. కానీ ఈ తుది గడువును పెంచి ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఊరట కల్గించింది. కాగ ఈ జీవిత ధృవీకరణ పత్రాలను మొబైల్ ఫోన్ల జీవన్ ప్రమాణ్ సాప్ట్వేర్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓ స్వీకరిస్తోంది. అదేవిధంగా ఈ పత్రాల సమర్పణకు రెండు లక్షల కామన్ సర్వీసు సెంటర్లను ఈపీఎఫ్ఓ ఏర్పాటుచేసింది. -
పింఛన్ ఆసరాకు ’నోటు’ పాట్లు
-
పెన్షనర్లకు కరువుభృతి పెంపు
జనవరి నుంచే వర్తింపు సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు కరువు భృతిని (డీఆర్) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు ప్రస్తుతం 15.196 శాతం డీఆర్ అమల్లో ఉండగా దీనికి అదనంగా 3.144 శాతం కలిపి 18.340 శాతం డీఆర్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు (జీవో నంబర్ 112) జారీ చేశారు. ప్రభుత్వోద్యోగులకు ఇటీవల కరువు భత్యం పెంచిన తరహాలోనే పెన్షనర్లకు ప్రభుత్వం డీఆర్ను వర్తింపజేసింది. జనవరి నుంచి చెల్లించాల్సిన బకాయిలను సెప్టెంబర్ పెన్షన్తో కలిపి చెల్లించనుంది. అక్టోబర్ 1న బకాయిలతోపాటు పెరిగిన డీఆర్తో కూడిన పెన్షన్ పెన్షనర్లకు అందనుంది. 2013 జూలై 1 తర్వాత రిటైరైన వారితోపాటు అప్పటికే రిటైరై పెన్షన్ అందుకుంటున్న వారందరికీ డీఆర్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు వచ్చే నెల బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థికశాఖ అన్ని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
పెన్షనర్లకు డీఆర్ పెంపు
హైదరాబాద్: పెన్షనర్లకు కరువు భృతిని(డీఆర్) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు ప్రస్తుతం 15.196 శాతం డీఆర్ అమల్లో ఉంది. అదనంగా 3.144 శాతం కలిపి... ఇప్పట్నుంచి 18.340 శాతం డీఆర్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణారావు గురువారం ఉత్తర్వులు (జీవో 112) జారీ చేశారు. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే పద్ధతిన పెన్షనర్లకు డీఆర్ను వర్తింపజేసింది. జనవరి నుంచి చెల్లించాల్సిన బకాయిలను సెప్టెంబర్ పెన్షన్తో కలిపి చెల్లించనుంది. అక్టోబరు ఒకటిన బకాయిలతో పాటు పెరిగిన డీఆర్తో కూడిన పెన్షన్ వారి చేతికందుతుంది. 2013 జులై 1 తర్వాత రిటైరై పెన్షన్ అందుకుంటున్న ఉద్యోగులతో పాటు అప్పటికే రిటైరై పెన్షన్ అందుకంటున్న వారందరికీ ఈ డీఆర్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అధికారులు, పెన్షన్ పేమేంట్ అధికారులు వచ్చే నెల బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థిక శాఖ అన్ని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఏపీ ఉద్యోగులకు అత్తెసరు డీఏ!
-
ఉద్యోగులకు అత్తెసరు డీఏ!
♦ ఒక్క కరవు భత్యంతోనే సరి ♦ గత ఏడాది జూలై నుంచి డీఏకు నేటి కేబినెట్లో ఆమోదం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నెలల తరబడి ఎదురు చూస్తున్న కరువు భత్యం (డీఏ)పై కోత వేసేం దుకు సర్కారు సిద్ధమైంది. గత ఏడాది జూలై నుంచి, ఈ ఏడాది జనవరి నుంచి రెండు డీఏలను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉండగా... ప్రస్తుతం ఒక్క డీఏ ఇచ్చేందుకే సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన కరువు భత్యాన్ని పెండిం గ్లో పెట్టేశారు. మరోవైపు ఈ ఏడాది జూలై నుంచి కూడా మరో కరువు భత్యం ఇవ్వాల్సి ఉంది. ఒక్క డీఏ మంజూరు ఫైలును విజయవాడలో శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి పంపించాలని ప్రభుత్వ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జూలై నుంచి డిసెంబర్ వరకు 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేయనున్నారు. అంటే కరువు భత్యం 12.052 శాతం నుంచి 15.196 శాతానికి పెరగనుంది. జూలై నుంచి ఆగస్టు వరకు పెరిగిన కరువు భత్యాన్ని ఉద్యోగుల జీపీఎఫ్లో జమ చేస్తారు. సెప్టెంబర్ నుంచి పెరిగిన కరువు భత్యాన్ని అక్టోబర్ 1వ తేదీ జీతాలతో కలిపి ఇవ్వనున్నారు. కరువు భత్యం పెంపు కారణంగా ఏడాదికి రూ.1900 కోట్ల వ్యయం కానుంది. ఇలా ఉండగా బియ్యం, పప్పులు విక్రయాలపై రాష్ట్రంలో రెండు శాతం సీఎస్టీ చెల్లిం చాల్సి ఉంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, మహారాష్ర్టలో సీఎస్టీ లేదని, ఆ రాష్ట్రాల్లో విక్రయించిన బియ్యం, పప్పులపై సీఎస్టీ చెల్లించాలనడం సమంజసం కాదని, రద్దు చేయాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు వాణిజ్య, ఆర్థిక శాఖలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ మంత్రి మిల్లర్లతో మాట్లాడుకుని సీఎస్టీ రద్దుకు పావులు కదిపారు. ఈ మేరకు శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సీఎస్టీ రద్దు అంశం రానుంది. ఇదే జరిగితే రాష్ట్ర ఖజానాకు రూ.450 కోట్లు నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్నుల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు! వచ్చే నెల 8వ తేదీలోగా జీఎస్టీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారా లేదా వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదిస్తారా? అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిందిగా వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కూడా శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. -
జీపీఎఫ్ ఖాతాల్లో పీఆర్సీ బకాయిలు
పెన్షన్దారులు, ఖాతాల్లేని ఉద్యోగులకు నగదు సీఎం సూచనతో మళ్లీ ఫైలు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది నెలలుగా ఈ బకాయిల ఊసెత్తకుండా పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం.. ఈ ఫైలును సిద్ధం చేయాలని తాజాగా ఆర్థిక శాఖకు పురమాయించింది. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో పీఆర్సీ బకాయిల చెల్లింపులకు ఎంత మొత్తం అవసరం.. జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఎంత మొత్తం అవసరం, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్న కొత్త ఉద్యోగులకు నగదు చెల్లింపులకు ఎన్ని నిధులు అవసరమవుతాయనే తదితర వివరాలతో ఆర్థిక శాఖ మరోసారి ఈ ఫైలును సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో బకాయిల చెల్లింపులపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారా..? జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా..? అనే తర్జన భర్జనలతో ఏడాదికి పైగా ప్రభుత్వం ఈ చెల్లింపులను ఆపేసింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా బాండ్ల రూపంలో చెల్లించాలనే ప్రత్యామ్నాయాన్ని పరిశీలించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బకాయిల మొత్తం రూ. 2,800 కోట్లు గత ఏడాది మార్చి నుంచి పీఆర్సీ వేతన సవరణను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలలకు సంబంధించిన బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. వీటిని ఒకేసారి చెల్లించాలంటే దాదాపు రూ. 2,800 కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. వీటిలో జీపీఎఫ్ ఖాతాలున్న ఉద్యోగులకు రూ.1,300 కోట్లు జమ చేయాలి. జీపీఎఫ్ ఖాతాల్లేని కొత్త ఉద్యోగులు, పెన్షన్దారులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు రూ.1,500 కోట్లు కావాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అంచనా వేసింది. బకాయిల చెల్లింపులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలసిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీంతో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ముందుగా జీపీఎఫ్ ఖాతాలున్న వారికి బకాయిలు జమ చేసి.. తర్వాత పెన్షన్దారులు, సీపీఎస్ ఖాతాలున్న కొత్త ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాలనే ప్రతిపాదన సైతం అధికారుల పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. కానీ ఆలస్యమైనప్పటికీ అందరికీ బకాయిలను ఒకేసారి చెల్లింపులు చేయాలనే తుది నిర్ణయానికి వచ్చారు. ఫైలును పంపించిన తర్వాత సీఎం నుంచి తుది నిర్ణయం వచ్చేంత వరకు తొందరపడవద్దని నిర్ణయించుకున్నారు. -
ఇదండీ... రాజన్ ‘దోశ’ కథ
వడ్డీరేట్లు తగ్గుతుండటంపై పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై ఆర్బీఐ గవర్నరు రాజన్కు లేఖలు కూడా రాశారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక సమావేశంలో ఆయనే స్వయంగా చెప్పారు. ‘ఈ మధ్య నాకు పెన్షనర్ల నుంచి అనేక లేఖలొస్తున్నాయి. చాలామంది తమకు ఏడాది కిందట 10 శాతం వడ్డీ వచ్చేదని, ఇప్పుడు 8 శాతం కూడా రావడం లేదని పేర్కొన్నారు. తమ అవసరాలు తీరాలంటే వడ్డీ రేట్లు తగ్గించకూడదని కోరుతున్నారు. కానీ నేను చెప్పేదేంటంటే... వడ్డీ రేట్లు తగ్గుతున్నా పెన్షనర్లకి గతంలో కన్నా డబ్బులు ఎక్కువే మిగులుతున్నాయని. అదెలాగని మీరు అడగొచ్చు. మీ అందరికీ అర్థమయ్యేటట్లు ‘దోశ’లతో చెపుతా. ఉదాహరణకు దోశ ఖరీదు రూ.50 అనుకుందాం. మీరు దాచుకున్న లక్ష రూపాయలతో సుమారు 2,000 దోశెలు కొనుక్కోవచ్చు. కానీ ఈ పెన్షనర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకా అదనపు మొత్తం కావాలనుకుంటున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే... వడ్డీరేటు 10% ఉందనుకుంటే ఇన్వెస్ట్ చేసిన లక్ష రూపాయల మీద వడ్డీ రూపంలో అదనంగా రూ. 10,000 వస్తాయి. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం 10% వల్ల దోశె రేటు కూడా రూ.55 అయ్యింది. అంటే ఈ వడ్డీతో అదనంగా 182 దోశెలు వస్తాయి. ద్రవ్యోల్బణం తగ్గితే.. వడ్డీరేటు 8 శాతం, ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉందనుకుందాం. అప్పుడు మీకు వడ్డీ కింద రూ. 8,000 వస్తుంది. ఇదే సమయంలో దోశె ఖరీదు రూ. 52.75 అవుతుంది. అప్పుడు ఈ వడ్డీతో మీకు 152 దోశలే వస్తాయి. ఈ లెక్కన చూసినపుడు... వడ్డీరేటు తగ్గగానే దోశలు తగ్గిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. కానీ ఇక్కడ వడ్డీని మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. అసలు లక్ష రూపాయల విలువను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 10 శాతం ద్రవ్యోల్బణం ఉంటే లక్ష రూపాయలకు వచ్చే దోశలు 1,818 మాత్రమే. అదే ద్రవ్యోల్బణం 5.5 శాతానికి తగ్గితే 1,896 దోశలు వస్తాయి. ఇప్పుడు వీటికి వడ్డీతో వచ్చే దోశెలను కూడా కలిపితే 10 శాతం వడ్డీరేటు ప్రకారం 2,000 (1,818 + 182), అదే 8 శాతం వడ్డీ ప్రకారం 2,048 (1,896 + 152) దోశెలు వస్తాయి. అంటే వడ్డీరేటు తగ్గినా 2.5 శాతం అధికంగా దోశెలు పొందుతున్నారు!! అంటూ దోశ ఎకనామిక్స్తో ఢిల్లీలో పెన్షనర్లకి పెద్ద క్లాసే తీసుకున్నారు రాజన్. అయితే నెల రోజుల తిరక్క ముందే కేరళ విద్యార్థిని నుంచి రాజన్కు దోశె రూపంలోనే దిమ్మ తిరిగే ప్రశ్న ఎదురయ్యింది. ద్రవ్యోల్బణం పెరిగితే దోశె రేటు పెరుగుతోంది!! కానీ తగ్గినప్పుడు దోశె రేట్లు దిగిరాకపోవడానికి కారణం ఏమిటని ఆ అమ్మాయి ప్రశ్నించింది. ఒక్కసారిగా ఊహించని ప్రశ్న వచ్చినప్పటికీ... వెంటనే తేరుకొని ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ దోశె తయారీకి ‘పెనం (తవ్వా)’ వాడుతుండటమే ధరలు తగ్గకపోవడానికి కారణమంటూ జారుకున్నారు. ఒకరకంగా ద్రవ్యోల్బణం తగ్గినా ఆ ప్రయోజనం పెన్షనర్ల జేబును తాకడం లేదని ఆయన పరోక్షంగా అంగీకరించారు. -
ఆందోళనలో వేల మంది పెన్షనర్లు
♦ 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి వరకు రిటైరైన ♦ 10 వేల మంది వారికి వర్తించని ♦ పదో పీఆర్సీ గ్రాట్యుటీ పెంపు ♦ ఒక్కొక్కరికీ రూ. 4 లక్షల చొప్పున నష్టం సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ ప్రయోజనాల వర్తింపులో వేల మంది పెన్షనర్లు అన్యాయానికి గురయ్యారు. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి నాటికి రిటైరైన ఉద్యోగులకు పెరిగిన గ్రాట్యుటీ వర్తించకపోవడంతో ఒక్కొక్కరూ రూ. 4 లక్షల చొప్పున నష్టపోయారు. దీంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడినప్పటికీ పదో పీఆర్సీ సిఫార సులను కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేయలేకపోయింది. దీనిపై ఉద్యోగుల ఆందోళనల ఫలితంగా 2015 మార్చి నుంచి పీఆర్సీని ఉద్యోగులకు నగదు రూపంలో వర్తింపజేసింది. అంటే 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలలపాటు పీఆర్సీని నోషనల్గానే (రికార్డుల్లోనే ఉంటుంది) ఇచ్చింది. కానీ గ్రాట్యుటీ విషయంలో పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పదో పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ సిఫారసుల ప్రకారం.. రిటైరైన ఉద్యోగులకు గతంలో ఉన్న రూ. 8 లక్షల గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచారు. అయితే ఈ పెంపును ప్రభుత్వం 2015 మార్చి తరువాత నుంచి రిటైరైన వారికే వర్తింపజేసింది. అంతకుముందు 9 నెలల కాలంలో రిటైరైన వారికి రూ. 8 లక్షల గ్రాట్యుటీనే వర్తింపజేసింది. దీంతో ఒక్కో రిటైర్డ్ ఉద్యోగి రూ. 4 ల క్షల చొప్పున నష్టపోయారు. ఈ నేపథ్యంలో తమకు కూడా రూ. 12 లక్షల గ్రాట్యుటీని వర్తింపజేయాలని, నష్టపోయిన గ్రాట్యుటీ ఇవ్వాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్, టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ పి.వెంకట్రెడ్డి, అధ్యక్షుడు హన్మంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ 9 నెలల కాలంలో సుమారు 10 వేల మంది వరకు ఉద్యోగులు పదవీ విరమణ చేశారని...అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి పెన్షనర్లకు న్యాయం చేయాలని కోరారు. -
చిన్న సంస్థలకు రుణ నిబంధనల సవరణ
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. దాదాపు రూ. 25 కోట్ల దాకా లోన్ పరిమితులున్న సంస్థల రుణ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించింది. మరోవైపు, వార్షిక ఖాతాల క్లోజింగ్కి ముందు రెండు రోజులూ బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ఆర్బీఐ తెలిపింది. మార్చి 30న పూర్తి రోజు, 31న రాత్రి 8 గం.ల దాకా బ్యాంకులు పనిచేస్తాయని వివరించింది. పెన్షనర్లకు చెల్లింపుల్లో పక్కాగా నిబంధనలు పెన్షనర్లకి తప్పుగా చెల్లింపులు/అధిక మొత్తంలో రికవరీ చేసుకోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బ్యాంకులు నిర్దిష్ట నిబంధనలను పక్కాగా పాటించాలని ఆర్బీఐ సూచించింది. ఒకవేళ అధిక మొత్తం చెల్లించినట్లు బ్యాంకు దృష్టికి వస్తే.. సత్వరం పెన్షనరు ఖాతాలో ఆ మేరకు సర్దుబాటు చేయాలని పేర్కొంది. అలా పూర్తి మొత్తాన్ని సర్దుబాటు చేయడం సాధ్యం కాకపోతే, మిగిలిన దాన్ని తిరిగి చెల్లించాలని పెన్షనరుకు సూచించాలని ఆర్బీఐ తెలిపింది. పెన్షనరు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉంటే భవిష్యత్లో వారికి చేసే చెల్లింపుల నుంచి మినహాయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలా నికరంగా పెన్షనరుకు చెల్లించే దానిలో మూడింట ఒక్క వంతును మాత్రమే మినహాయించుకోవాల్సి ఉంటుంది. పెన్షనరు సమ్మతి తెలియజేస్తే మరింత ఎక్కువ మొత్తం మినహాయించుకోవచ్చు. -
'పింఛన్ కు మీరు అనర్హులు'
చేవెళ్ల: ‘పింఛనుకు మీరు అనర్హులు. ఇప్పటి వరకు తీసుకున్న పింఛన్ సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు చెల్లించండి..’అంటూ లబ్ధిదారులకు నోటీసులు అందుతున్నాయి. ఈ హుకుంతో లబ్దిదారులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆసరా పింఛను మొత్తాన్ని రూ.200 నుంచి వేయి రూపాయలకు పెంచింది. కాగా, అర్హులే పింఛన్లు తీసుకోవాలని, అనర్హులు తీసుకుంటే తిరిగి రాబడతామని అప్పట్లోనే ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు అధికారులు పింఛన్లు మంజూరు చేశారు. గత నెల 5 వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్-17 విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ, కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బంది తల్లిదండ్రులు ఎవరైనా పింఛన్ తీసుకుంటే రద్దు చేస్తున్నామని, ఇప్పటివరకు తీసుకున్న పింఛను దారులను అనర్హులుగా గుర్తించామని ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల తల్లిదండ్రులు తీసుకున్నపింఛన్ను రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారం తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు విడుదల చేస్తూ అనర్హులుగా గుర్తించినవారికి రికవరీకోసం ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇలాంటి అనర్హుల్లో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో 48, మొయినాబాద్ 19, శంకర్పల్లి మండలంలో 22 మంది ఉన్నారు. వీరు తీసుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ చర్యతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
తెలంగాణలో అందని అసరా పింఛన్లు
-
మానసిక క్షోభలో లక్షలాది పెన్షనర్లు
రెండున్నర లక్షల మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, వారి మీద ఆధారపడుతున్న దాదాపు పది లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ రోజు అసంతృప్తికి గురై దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరంతా గత 60 ఏళ్లుగా విద్యార్థులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, రిటైర్డు ఉద్యోగులుగా అన్ని దశలలో తెలంగాణ రాష్ట్ర సాధనకై వివిధ ఉద్యమాలలో పాల్గొన్నవారే. తెలంగాణ రాష్ట్రం గాఢంగా కాంక్షించిన వారే. తాము కోరుకున్న తెలంగాణ రాష్ట్రం అవ తరించగానే తమ సమస్యలు సత్వరంగా పరిష్కా రం కాగలవని ఆశించిన వారే. తమది ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వమని నూతన పాలకులు ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆశలు మరింత బలప డ్డాయి. కానీ కొత్త రాష్ట్రంలో ఇంత త్వరగా తమకు ఆశాభంగం కలుగుతుందని వారు అసలు ఊహించలేదు. పదవ పే రివిజన్ కమిషన్ పదవ పీఆర్సీ తన నివేదికను అవిభక్త ఆంధ్రప్రదేశ్ చివరి రోజుల్లో 29.5.2014వ తేదీన రాష్ర్ట ప్రభుత్వానికి సమర్పిం చింది. అప్పుడు రాష్ట్రంలో ఉన్నది గవర్నర్ పాలన. 2014 జూన్లో రాష్ట్ర విభజన జరుగగానే ఈ నివేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అం దింది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల నిరీక్షణ మొదలైంది. ఆరు నెలలు గడచినా తెలంగాణ ప్రభుత్వంలో స్పందన కనిపిం చలేదు. పెన్షనర్ల సంఘం పలు పర్యాయాలు సమర్పించిన విజ్ఞప్తి పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పలేదు. 2015 జనవరిలో సీఎం కేసీఆర్, అందరికి గరిష్ట సంతృప్తి కలిగే రీతిగా పదవ పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరో రెండు మాసాల పిదప ఉద్యోగులకు, పెన్షనర్లకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. వెంటనే ఉద్యోగుల నేతలు సంబరాలు చేసుకున్నప్పటికీ నేటి ద్రవ్యోల్బ ణం, ధరల పెరుగుదలతో పోల్చి చూస్తే 43 శాతం ఫిట్మెంట్ చాలా తక్కువ. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన పిదప మరో మూ డు మాసాలకు 2015 ఏప్రిల్ 7వ తేదీన ఫిట్మెంట్ జీఓ 33 జారీ అయింది. జారీ అయిన తరువాత రెండు నెలలకు ఫిట్మెంట్ జీఓ అమలులోకి వచ్చింది. 12 నెలల తీవ్ర జాప్యం తర్వాత పదవ పీఆర్సీ మొదటి జీఓ కంటి తుడుపుగా అమలు జరిగింది. 2015 జూన్ 1వ తేదీన ఇచ్చింది రెండు మాసాల (2015 మార్చి, ఏప్రిల్) బకాయిలే. 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 మాసాల బకాయిల సంగతి ఇంత వరకు తేలలేదు. బకాయిలను బాండ్ల రూపంలో ఇస్తారన్న వదంతులతో పెన్షనర్లు కుంగి పోయారు. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ అమలుైపై జాప్యం చేసిన పన్నెండు మాసాలలో తెలంగాణ అం తట కొన్ని వందల మంది ప్రభుత్వ పెన్షనర్లు నిస్పృ హపాలై మృతి చెందారు! ప్రభుత్వాలలో మానవతా దృక్పథం లోపిం చడం వల్ల శ్రేయోరాజ్య సదాశయం నేతి బీరకాయ అవుతున్నది. సీనియర్ పెన్షనర్ల, జూనియర్ పెన్షనర్ల పెన్షన్లలో వ్యత్యాసాలను వీలైంత వరకు తగ్గించడా నికి కేంద్ర ప్రభుత్వపు 6వ పీఆర్సీలో అదనపు క్వాం టమ్కు అంకురార్పణ జరిగింది. పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన (ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తిస్తున్న) పదవ పీఆర్సీ.. ప్రభుత్వ పెన్షనర్లకు 70 ఏళ్ల నుంచే 15 శాతం అదనపు క్వాంటమ్ ఇవ్వాలని సమంజసంగా సిఫారసు చేసింది. సమష్టి కుటుంబాలు అంతరి స్తున్న, వృద్ధులైన తల్లిదండ్రులను వారి పిల్లలు ఆదు కునే సత్సంప్రదాయం క్రమంగా అడుగంటుతున్న నేటి సామాజిక పరిస్థితులలో వృద్ధ, సీనియర్ పెన్ష నర్లకు కనీసం 70 ఏళ్ల వయసు నుంచైనా అదనపు క్వాంటమ్ లభించడం సముచితం, సహేతుకం. ఈ సిఫారసును 15 నెలలు గడిచినా తెలంగాణ ప్రభు త్వం నేటికీ ఆమోదించకపోవడం బాధాకరం. 2014 జూన్ నుంచి రావలసిన 9 మాసాల ఫిట్మెంట్ బకా యీల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది ప్రభుత్వ పెన్షనర్ల, వారి కుటుంబాల ఓరిమిని ప్రభుత్వం ఇం కా పరీక్షించడం విజ్ఞత కాదని మనవి చేస్తున్నాం. - కె.చంద్రప్రకాశ్రావు, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం మొబైల్: 94414 55412 -
పింఛన్ కోసం ధర్నా
తంబళ్లపల్లి (చిత్తూరు) : సామాజిక పింఛన్దారులు పింఛన్ కోసం ఆందోళనకు దిగారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని లబ్ధిదారులు ఈ రోజు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలు చూపుతూ వితంతు, వృద్ధాప్య, వికలాంగు పింఛన్లను ఇప్పటివరకు అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో పింఛన్దారులంతా కలసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సకాలంలో పింఛన్ పంపిణీ చేసి ఆదుకోవాలని వారు కోరారు. -
ఉద్యోగులు, పెన్షనర్లకు కంటివైద్య శిబిరం
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యుల కోసం ప్రతి నెలా ఒకటి, మూడో గురువారాల్లో నల్లగొండలోని జిల్లా పరిషత్ వెనక గల పెన్షనర్ల సామాజిక సేవా సదన్ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.దామోదరరెడ్డి, కార్యదర్శి ఎం.ఎ. అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరంలో ప్రాథమిక కంటి చూపు పరీక్ష, కళ్లజోడు పరీక్ష, కంటి ఒత్తిడి, నరాల పరీక్షలు నిర్వహిస్తారు. కంటిలో శుక్లం, రెటీనా, గ్లకోమా లాంటి శస్త్ర చికిత్సలు అవసరమైతే రాజమండ్రిలోని ఆస్పత్రిలో చేస్తారు. ఈ పరీక్షలన్నింటినీ హెల్తు కార్డులు గల రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యులకు రుసుము లేకుండా అందజేస్తారు. ప్రాథమిక పరీక్షల అనంతరం, ఆపరేషన్ కు సిద్ధపడినవారికి ఏసీ బస్సులో ప్రయాణ సౌకర్యం, వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవాలని దామోదర్ రెడ్డి, అజీజ్ కోరారు. శిబిరానికి సంబంధించిన ఇతర వివరాలకు 9100447444/ 9100448444 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
పెన్షనర్ల ఆన్లైన్ కష్టాలు
కర్నూలు(కల్లూరు): ఈ నెలలో ఎనిమిదో తేదీ వచ్చినా ఇంకా ఆ గ్రామంలో సామాజిక పింఛను దారులకు పింఛను అందలేదు. ఇప్పటికీ ఆన్లైన్ (వెబ్సైట్) మోరాయిస్తుండటంతో పింఛను దారులు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో పెదపాడు గ్రామంలో ఇంకా 63 మంది లబ్ధిదారులకు పింఛను అందలేదు. దీంతో పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో ఏర్పడిన సమస్య కారణంగా పింఛను అందజేయలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. -
ఉద్యోగుల కార్పొరేట్ వైద్యంపై పీటముడి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల కార్పొరేట్ వైద్యంపై పీటముడి వీడడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అమలుకాకపోవడం... సమస్య పరిష్కారానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పలుమార్లు చర్చలు జరి పినా కొలిక్కిరాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నగదు రహిత ఆరోగ్య కార్డులు ఇచ్చినప్పటికీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు లెక్కచేయడం లేదని వారంటున్నారు. ఆసుపత్రులను ఒప్పించడంలో సర్కారు విఫలమైందన్న భావన ఏర్పడింది. ఉద్యోగులకు ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు ఉచి తంగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిం చగా... సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజ మాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఎంతోకొంత ఫీజు వసూలు చేయాల్సిందేనని తేల్చిచెబుతున్నాయి. దీనిపైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజాగా సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్చందా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) ప్రతినిధులతో మరోమారు సమావేశం నిర్వహించారు. ఆ భేటీలోనూ ఎటువంటి ముఖ్యనిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్శర్మ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. వచ్చే నెల 3న టీషా ప్రతినిధులతో నేరుగా సీఎస్ చర్చలు జరుపుతారు. సీఎం ఆదేశాల మేరకే ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందులో కీలకమైన నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. అప్పటికీ చిన్నచిన్న సమస్యలు పరిష్కారం కాకుంటే నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతారని అంటున్నారు. ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు సంబంధించి ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం దీనిపై పెద్దగా శ్రద్ధ చూపించడంలేదన్న విమర్శలున్నాయి. రెండింటినీ కొనసాగిస్తే...? కార్పొరేట్ ఆసుపత్రుల గగ్గోలు, ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో వైద్యాధికారులు అయోమయంలో పడిపోయారు. సీఎస్ సమావేశం నాటికి ఈ సమస్య ఒక కొలిక్కి రాకపోతే నగదు రహిత కార్డులు, రీయిం బర్స్మెంట్ ఈ రెండు పద్దతులనూ కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఉన్నతాధికారుల్లో నెలకొంది. ఏదేమైనా త్వరగా ఈ సమస్యను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని సంఘాలు కోరుతున్నాయి. -
ప్రీమియమూ చెల్లించాలి బిల్లులూ కట్టాలి
బిల్లుల కోసం 22 వేల మంది ఎదురు చూపులు ♦ ప్రహసనంగా నగదు రహిత వైద్యం ♦ ప్రీమియం చెల్లిస్తున్నా వైద్యానికి తప్పని నగదు చెల్లింపు ♦ జబ్బు నయమయ్యాక ఎనిమిది నెలలకుగానీ డబ్బు రాని పరిస్థితి ♦ ఉద్యోగులు, పెన్షనర్ల వెతలు.. సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు జబ్బు చేస్తే ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్లి రూపాయి కూడా చెల్లించకుండా వైద్యం చేయించుకోవచ్చునని రాష్ట్రప్రభుత్వం చెబుతుండగా.. పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకోసం కల్పించిన ‘నగదు రహిత వైద్యం’ ఏమాత్రం సక్రమంగా అమలవట్లేదు. ఒకవైపు ప్రీమియం చెల్లిస్తూనే మరోవైపు ఆస్పత్రుల్లో చేతినుంచి డబ్బులు చెల్లించే పరిస్థితి ఉద్యోగులు, పెన్షనర్లకు ఏర్పడుతోంది. గడిచిన ఐదున్నర నెలల్లో.. అంటే 2015 జనవరి 1 నుంచి ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో వైద్యంకోసం వెళ్లి చేతి నుంచి డబ్బులు చెల్లించిన వారి సంఖ్య 22 వేలకు పైనే. వీరంతా మెడికల్ రీయింబర్స్మెంట్ కోరుతూ వైద్యవిద్యా సంచాలకుల(డీఎంఈ) కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంతస్థాయిలో దరఖాస్తులు వచ్చాయంటే నగదు రహిత వైద్యం ఎంత ప్రహసనంగా సాగుతున్నదో అర్థమవుతోంది. ఉద్యోగుల స్థాయినిబట్టి కొందరు నెలకు రూ.90, మరికొందరు రూ.120 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా ప్రీమియం చెల్లిస్తూనే మరోవైపు ఆస్పత్రుల్లో చేతినుంచి డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితిపై ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. జబ్బు నయమయ్యాక ఎనిమిది నెలలకు డబ్బు.. ఉద్యోగికి జబ్బు చేస్తే జేబులో పైసా లేకుండా ఆస్పత్రికి భరోసాగా వెళ్లొచ్చునని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ జబ్బు నయమైన ఎనిమిది నెలలకుగానీ ఆ డబ్బు రావట్లేదని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఖర్చు రూ.50 వేలు దాటితే జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఆ బిల్లును హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి పంపించాలి. అక్కడనుంచి డీఎంఈ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ అనుమతి పొంది తిరిగి పేరెంట్ విభాగానికి రావాలి. అక్కడనుంచి జిల్లాకు రావాలి.. ఇదీ తంతు.అలా ఐదారునెలల్లో రావచ్చు. లేదా ఏడాదికీ రావట్లేదు. పైగా వైద్య సేవలకైన ఖర్చు మొత్తం రీయింబర్స్మెంట్ కింద రాదు. ఒక్కోసారి రూ.3 లక్షలైతే.. రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్యాకేజీ సెటిల్మెంట్ ఏదీ?.. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు సుమారు 35 లక్షలమందికి సంబంధించిన అంశమిది. దీనిపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుండడంపై వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్యాకేజీ రేట్లు గిట్టుబాటు కాదని ప్రైవేటు ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లకే చేయాలని ప్రభుత్వం.. ఇలా ఇరువర్గాలు పట్టుదలకు వెళుతుండడంతో పథకం వెనక్కు వెళ్లింది. యాజమాన్యాలను పిలిచామని, నగదురహిత పథకం ఇదిగో.. ఇప్పుడు.. రేపూ.. అంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఏమీ చేయలేకపోయింది. దీంతో ఓవైపు ప్రీమియం చెల్లిస్తూ, మరోవైపు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లిస్తూ, ఈ డబ్బు రీయింబర్స్మెంట్ ఎంతొస్తుందో తెలియక ఉద్యోగులంతా అయోమయంలో ఉన్నారు. ఇక పెన్షనర్ల బాధ చెప్పనలవి కాదు. ఇదిలావుంటే.. డీఎంఈ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులకు కమీషన్లు ఇస్తేగానీ అక్కడి సిబ్బంది అనుమతివ్వని పరిస్థితి. ఇదీ నగదు రహిత వైద్యం దుస్థితి. -
పెన్షనర్లపై నిర్దయ తగదు
వయోవృద్ధులైన 79 ఏళ్లకు పైబడిన పెన్షనుదార్లలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలనే సత్సంకల్పంతో 5వ పీఆర్సీ సిఫారసుతో అమలులోకి వచ్చిన ఎడిషనల్ క్వాంటమ్ ఆప్పెన్షన్ను 10వ వేతన సంఘం 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు వయోపరిమితిని తగ్గిస్తూ సిఫారసు చేసింది. కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సూచనను ప్రస్తావించకుండా ఫిట్మెంట్ జీవో జారీచేయడం, పెన్షనర్లలో తీవ్రమైన భయాందోళన లను రేకెత్తిస్తోంది. 70కి పైబడిన వయోభారం, మానసిక, శారీరక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వయో వృద్ధులకు ఎంతో ఉపశమనాన్ని కలి గించే అదనపు పెన్షన్ సౌకర్యం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్దయగా రద్దుచేయడానికి పూనుకోవడం అత్యంత బాధాకరం. గతంలో పెన్షనుదార్ల డీఏ తొలగించిన ఈ ప్రభుత్వం మళ్లీ అలాంటి పోకడలకు పోరాదని మనవి. మానవతావాద దృక్పథంతో 10వ పీఆర్సీ సిఫార్సు యథాతథంగా అమలు చేయాలి. ఆర్.హేమన్నస్వామి బాలిగాం హరిపురం, మందస మండలం -
పెన్షనర్లతో చెలగాటం!
పీఆర్సీ సిఫారసుల అమలుపై సర్కారు జాప్యం ⇒ ప్రసుత అదనపు పెన్షన్ విధానానికి గండి కొట్టే యత్నం ⇒ రూ. 327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలు చెల్లింపులోనూ మీనమేషాలు ⇒ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కనికరించని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లతో రాష్ట్ర సర్కారు చెలగాటమాడుతోంది. పీఆర్సీ సిఫారసులను యథాతథంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించినా వాటి అమలు విషయంలో జాప్యం చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పెన్షన్ విధానానికి గండికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పెరిగిన ఫిట్మెంట్తో పెన్షన్ పెరుగుతుందనుకొని సంబరపడ్డ రిటైర్డ్ ఉద్యోగులు డీలా పడ్డారు. మరోవైపు 1998కు ముందు రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలను చెల్లించేందుకు కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వీటిని చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయటంలోనూ జాప్యం చేస్తోంది. అదనపు పెన్షన్కు గండి... 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ మంజూరు చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. పెన్షన్లో 15 శాతం అదనపు పెన్షన్గా చెల్లిస్తారు. పదో పీఆర్సీ సైతం 70-75 ఏళ్ల వయసున్న రిటైర్డ్ ఉద్యోగులకు 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ పెరుగుతుంది. ఒకే హోదాలో పని చేసినప్పటికీ కొన్నేళ్ల కిందట రిటైరైన ఉద్యోగులకు.. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు అందే పెన్షన్లో భారీగా వ్యత్యాసముంటోందని తొమ్మిదో పీఆర్సీ గుర్తించింది. దీన్ని కొంతమేరకైనా తగ్గించేందుకు 75 ఏళ్లు దాటిన రిటైర్డ్ ఉద్యోగులకు వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ ఇవ్వాలని సూచించటంతో ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ విధానాన్ని 70 ఏళ్లకే కుదించాలని పదో పీఆర్సీ సిఫారసు చేసింది. కానీ అందుకు సంబంధించిన వివరణను పొందుపరచలేదు. అదే సాకుగా అదనపు పెన్షన్ల విషయాన్ని ఆర్థికశాఖ దాటవేసింది. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తటంతో 70 ఏళ్ల వయసు నుంచే అదనపు పెన్షన్ మంజూరు చేస్తే ఈ భారం మరింత పెరిగిపోతుందని.. పాత పద్ధతినే అనుసరించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీంతో ఉత్తర్వులు వెలువడే వరకు అదనపు పెన్షన్ పీటముడి వీడేలా లేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలపై మొండి వైఖరి... చివరి 10 నెలల వేతన సగటు ఆధారంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ అందించే విధానం గతంలో అమల్లో ఉండేది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1998లో ఆ విధానానికి స్వస్తి పలికింది. ఉద్యోగుల చివరి నెల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో తమకు అన్యాయం జరిగిందని, తమకు అందుతున్న పెన్షన్కు, కొత్త విధానంతో రావాల్సిన పెన్షన్కు వ్యత్యాసముందని 1998కు ముందు రిటైరైన ఉద్యోగులు ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రభుత్వం లెక్కచేయకపోవటంతో 2003లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికీ సర్కారు మొండికేయటంతో రిటైర్డ్ ఉద్యోగులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. గత ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ వ్యత్యాసానికి సంబంధించిన బకాయిలు చెల్లించాలని.. ఇకపై కొత్త విధానంలోనే పెన్షన్ లెక్కించి ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ బకాయిల మొత్తం రూ. 900 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. తెలంగాణ వాటాగా రూ. 327 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దాదాపు 30 వేల మంది లబ్ధి పొందుతారు. ఇప్పట్నుంచి వీరికి కొత్త విధానంలో పెన్షన్ చెల్లించటం వల్ల ప్రతి నెలా మరో రూ.10 కోట్లు భారం పడుతుందని సర్కారు భావిస్తోంది. ఆరు నెలలుగా ఈ ఫైలు సీఎం దగ్గరే పెండింగ్లో ఉంది. -
పెన్షనర్లకు సర్కారు వెన్నుపోటు
- అదనపు పెన్షన్ సిఫారసును విస్మరిస్తూ జీవో - 75 ఏళ్ల వయసు దాటితే 15 శాతం అదనపు పెన్షన్ సౌకర్యం - దాన్ని 70 ఏళ్లకు తగ్గించాలని సిఫారసు చేసిన పదో పీఆర్సీ - పట్టించుకోని ప్రభుత్వం .. ఇప్పటికే పొందుతున్న వారికి.. - పీఆర్సీ అమలు వల్ల తగ్గనున్న పెన్షన్ - పెన్షనర్లకు 43 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ ఉత్తర్వులు హైదరాబాద్: పెన్షనర్లను ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. పదో వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన ‘అదనపు పెన్షన్’ ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఉద్యోగులకు అమలు చేసిన విధంగా పెన్షనర్లకు 43 శాతం ఫిట్మెంట్ను అమలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో ‘అదనపు పెన్షన్’ను విస్మరించాలని పేర్కొనడంతో లక్షలాది పెన్షనర్లకు నష్టం వాటిల్లనుంది. అదనపు పెన్షన్ అంటే.. పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయని, అందుకు అనుగుణంగా పెన్షన్ పెంచుతారు. 5వ వేతన సం ఘం.. 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ మంజూరు చేయాలని సూచించింది. ఈ అదనపు పెన్షన్ను బేసిక్ పెన్షన్లో కలపాలని, దాని మీద డీఏ ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులు ప్రస్తుతం అమలవుతున్నాయి. అదనపు పెన్షన్ అర్హత వయసు తగ్గింపు అదనపు పెన్షన్ అర్హత వయసును పదో పీఆర్సీ తగ్గించింది. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. 2013 జూలై 1 నాటికి ఉన్న 63.344 శాతం ఉన్న డీఆర్, ఫిట్మెంట్ను బేసిక్ పెన్షన్లో విలీనం చేసిన తర్వాత నిర్ధారించే కొత్త పెన్షన్ మీద అదనపు పెన్షన్ను గణించాలని సూచించింది. తాజా జీవో ఏం చెబుతోంది కొత్త పెన్షన్ గణింపులో ‘అదనపు పెన్షన్’ను విస్మరించాలని శుక్రవారం జారీ చేసిన జీవో 51లో పేర్కొన్నారు. 9వ పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా ఇప్పటికే అదనపు పెన్షన్ పొందుతున్న వారికి ఈ జీవో అమలు చేస్తే, పెన్షన్ మొత్తం పెరగాల్సింది పోయి తగ్గుతుందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవోలోని మిగతా ముఖ్యాంశాలు.. కొత్త పెన్షన్లు 2013 జూలై 1 నుంచి నోషనల్గా(పెంపు కాగితాలకే పరిమితం) అమలవుతాయి. 2014 జూలై 2 నుంచి ఆర్థిక లబ్ధి అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి 2015 మార్చి వరకు 9 నెలల బకాయిలను ఎలా చెల్లించాలనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2013 జూలై 1 నాటికి ఉన్న బేసిక్ పెన్షన్+ 43 శాతం ఫిట్మెంట్+ 63.344 శాతం.. గణించి కొత్త బేసిక్ పెన్షన్ నిర్ణయిస్తారు. కొత్త పెన్షన్ మీద 8.908 శాతం డీఆర్(కరువు భృతి) అమలవుతుంది. కనీస పెన్షన్ రూ. 3,350 నుంచి రూ. 6,500కు పెరగనుంది. సొంత పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్.. రెండూ పొందుతున్న వారు, పెంచిన మేరకు కనీస పెన్షన్లు పొందడానికి అర్హులే. అదనపు పెన్షన్ చెల్లింపు సిఫారసు ఇలా.. వయసు అదనపు (సంవత్సరాల్లో) పెన్షన్ శాతం 70 - 74 15 75 - 79 25 80 - 84 35 85 - 89 45 90 - 94 55 95 - 99 65 100, ఆపైన 75 -
గ్రామ కార్యదర్శిని నిర్బంధించిన పింఛన్దారులు
అశ్వరావుపేట (ఖమ్మం): సకాలంలో పింఛను పంపిణీ చేయలేదని గ్రామ పంచాయతీ కార్యదర్శిని కార్యాలయంలోనే పింఛనుదారులు నిర్బంధించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లిలోఈ నెల మంజూరైన పింఛను ఇప్పటి వరకు ఇవ్వకుండా జాప్యం చేయడంతో ఆగ్రహం చెందిన పింఛను దారులు గ్రామ కార్యదర్శిని నిర్బంధించి, పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. -
ఈ ఆనందం అందరికీ పంచుదాం
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరు స్తోంది. పదో పీఆర్సీ సిఫారసుల అమలు కోసం పలు పోరాటాలు చేసిన తర్వాత, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అందిన ఆనందమిది. ప్రభుత్వ ఖజానాపై పడే ఈ భారాన్ని భర్తీ చేయడం కోసం వారి కుటుంబాలే కాక, ఇంకా రెండు కోట్ల కుటుంబాలు పన్నుల భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఆ బరువును మోస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు చేరే సామాన్యుల పనులను బాధ్యతతో, సంతోషంగా చేయడానికి కొత్త జీతాలు ప్రేరణ కాగలవని ఆశిద్దాం. బతుకుపోరు నిత్య సంఘర్షణలో మునిగి ఉండేవారు బాధైనైనా, సంతోషా న్నయినా తమకు తాము అనుభవించాల్సిందే తప్ప ఇతరులతో పంచుకునే తీరిక, తెగువ వారికి ఉండవు. కానీ, ఇతరులతో పంచుకుంటే బాధ తగ్గుతుం దని, సంతోషం రెట్టింపవుతుందనీ పెద్దల మాట. కొందరి బాధల్ని, మరి కొందరి సంతోషాల్ని చర్చకు పెట్టడం ద్వారా అటు బాధను తగ్గించి, ఇటు సంతోషాన్ని పెంచాలనే ఈ చిరు ప్రయత్నం. సందర్భం... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో వెల్లివిరుస్తున్న సంతోషం. మారుతున్న కాలమాన పరిస్థితులు, పెరిగిన జీవన వ్యయం, చట్టబద్ధంగా పెరగాల్సిన జీతభత్యాల లెక్కల ఆధారంగా వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చేసిన సిఫారసుల అమలుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన ఫలితమది. పదో పీఆర్సీ సిఫారసుల అమలు కోసం పలు ఉద్యమాలు, పోరా టాలు చేసిన తర్వాత, ఉద్యోగులు, వారి కుటుంబాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అంది వచ్చిన ఆనందమది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర ఉపశ మనంతో కలుపుకొని మూలవేతనాలు దాదాపు రెట్టింపవుతున్నాయి. ఇది అందరికీ సంతోషదాయకమే. ఎవరికీ ఈర్ష్యాసూయలు లేవు. ఏ అభ్యంత రాలూ లేవు. కాకపోతే, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, టీఎన్జీవో నేత దేవీప్రసాద్, ఏపీ ఉద్యోగుల సంఘ నాయకుడు అశోక్బాబు సహా చాలా మంది భావిసు ్తన్నట్టు... ఉద్యోగస్తులు ఇంకా బాగా పనిచేయాలి. సామాన్యపౌరుల అవస రాల్ని దృష్టిలో పెట్టుకొని తమ సేవల్ని విస్తరించాలి. సామాజిక సృహతో మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో విధు లను నిర్వహించాలి. ఉద్యోగస్తుల జీత, భత్యాలను చెల్లించే ప్రభుత్వ ఖజా నాకు పన్నుల రూపంలో పైసా పైసా జమచేస్తున్నది తెలుగు ప్రజలే. వారిలో సుమారు రెండు కోట్ల కుటుంబాలకు ఆ ఖజానాలు నేరుగా ఎలాంటి ఉపాధి భద్రతను కల్పించడం లేదు. నిజాయితీగా, ఆత్మపరిశీలనతో సేవలందించి వారి రుణం తీర్చు కోవాలి. అప్పుడే అందరి సంతోషం ద్విగుణీకృతం అవుతుంది. ఎవరు ఎవరికి భారం-భాగ్యం! 2011 జనాభా లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల జనాభా దాదాపు తొమ్మిది కోట్లు. అంటే సుమారు 2.10 కోట్ల కుటుంబాలు. వాటిలో ప్రభుత్వో ద్యోగుల కుటుంబాలు 8.5 లక్షలు. ప్రభుత్వోద్యోగులతోపాటూ, 5.5 లక్షల మంది పెన్షనర్ల పెన్షన్ కూడా పెరుగుతుంది. మరో 6 నుంచి 7 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వోద్యోగు లకు అమలు చేసే కనీస వేతనాన్ని వారికి కూడా అమలు చేయాలని పీఆర్సీ సూచించింది. కాబట్టి వారి జీతాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అంటే, ఈ పెంపుదల వర్తించే కుటుంబాల మొత్తం సంఖ్య సుమారు 20 లక్షలు. ఇవి పోను దాదాపు 2 కోట్ల కుటుంబాలు వ్యవస్థీకృతంగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు పొందనివి. వారిలో ప్రైవేటు ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, వృత్తి పనుల వారు, వివిధ సేవా కార్మికులు, రోజు కూలీ చేసుకునే అసం ఘటిత రంగ కుటుంబాలూ ఉంటాయి. జీతాల పెరుగుదలకు సంతోషిస్తున్న ఉద్యోగుల కుటుంబాలేకాక దాదాపు రెండు కోట్ల ఇతర కుటుంబాలు పీఆర్సీ వల్ల పడే అధిక పన్నుల భారాన్ని మోయాల్సి ఉంటుంది. మాడు పగిలే పన్నుల మోతను తట్టుకుని, బతుకు బండి లాక్కుంటూ బక్కచిక్కిన సామా న్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి అడిగిన పనిని బాధ్యతగానే గాక సంతోషంగా చేయడానికి కొత్త జీతాలు ప్రేరణ కాగలవని ఆశించడంలో తప్పులేదు. మన ఖజానా శేష, విశేష భాగాలివీ రెండు తెలుగు ప్రభుత్వాలు లక్ష కోట్ల రూపాయలకు తగ్గని వార్షిక బడ్జెట్లను రూపొందిస్తున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, అప్పుల ద్వారా ఈ బడ్జెట్లకు వనరుల్ని సమీకరిస్తారు. ప్రణాళికా పద్దుల కన్నా, ప్రణాళికేతర పద్దులకే పెద్ద పీట లభిస్తుంది. ఉదాహరణకు, గత ఏడా ది ఏపీ ప్రభుత్వం రూ. 26,673 కోట్లు ప్రణాళికా వ్యయంగా, రూ.85,151 కోట్లు ప్రణాళికేతర పద్దుగా చూపింది (మొత్తం వ్యయం రూ 1,11,823 కోట్లు). ప్రణాళికేతర వ్యయంలో దాదాపు మూడో వంతు (రూ. 30 వేల కోట్లు) ఉద్యోగుల జీతాలకు వెచ్చిస్తున్నారు. పీఆర్సీ అదనపు భారం తోడవు తుంది. ఇక భత్యాలు, ఇతర నిర్వహణ వ్యయాలు, ఉద్యోగులకిచ్చే పరోక్ష ప్రయోజనాలు, రాయితీలు వేరే! తెలంగాణ బడ్జెట్లో రూ 48,648 కోట్లు ప్రణాళికా పద్దుల కింద, రూ 51,989 కోట్లు ప్రణాళికేతర పద్దుల కింద (మొత్తం రూ 1,00,637 కోట్లు) చూపించారు. ప్రణాళికేతర వ్యయంలో మూడో వంతుకుపైగా (రూ.18,437 కోట్లు) ఉద్యోగుల జీతాలు. పీఆర్సీ పెరుగుదల అదనం. ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరగాల్సిందే. కానీ, వ్యవస్థీకృత ఉద్యోగ-ఉపాధి చట్రంలోకి రాని నిరుద్యోగులు, అల్పాదాయ, బడుగు, బలహీన వర్గాల పరిస్థితేంటి? వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరే దెలా? నిర్దాక్షిణ్యంగా వాటిని అణచివేస్తే, రాజకీయ, ఉద్యోగ, కార్పొరేట్ శక్తులు మాటల గారడీతో తొక్కిపెడితే.... ఎగదన్నే లావాలా విరుచుకు పడతాయి, నిన్నటి ఢిల్లీవాలాలా రాజకీయ సునామీలను సృష్టిస్తాయి. జీతాలు పెరిగితే అవినీతి తగ్గుతుందా? చేతినిండా జీతాలుంటే అవినీతికి పాల్పడరనే ఆలోచనా స్రవంతి ఒకటుంది. నిజంగా అలా జరుగుతుందా? అంటే, కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ తగ్గే ఆస్కారమైతే ఉంది. అది వ్యక్తుల నిజాయితీ, ప్రవృత్తి, ఆలోచనా సరళిని బట్టి ఉంటుంది. ప్రజా ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్నాం. ఇతరు లకు ఉన్నా, లేకున్నా మన నెల జీతం మనకు ఠంచనుగా వస్తోంది. కాబట్టి వారి పట్ల మనం బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలన్న స్పృహ ఉద్యోగుల్లో ఉంటే అవినీతి కచ్చితంగా తగ్గుతుంది. నిజాయితీగా ఉండాలనిఎవరికి వారు వ్యక్తిగతంగా దీక్ష పూనితే తప్ప ఈ జాడ్యం పోదు. ‘నేను లంచాలు తీసుకోను, నిబంధనలకి విరుద్ధంగా వెళ్లను, పలుకుబడికి, సంపదల ప్రలోభాలకు లొంగి ప్రాథమ్యాలను మార్చను’ అనే సంకల్పానికి ప్రతి ఉద్యోగి కట్టుబడితే అవినీతి తొలగిపోతుంది. రాజకీయ నేతల, సంప న్నుల, పలుకుబడి గలవారల ఫైళ్లు కదిలినట్టే, పనులు జరిగినట్టే.... సామా న్యుల ఫైళ్లు కదిలితే, పనులు జరిగితే వ్యవస్థ దానంతట అదే బాగుపడు తుంది. అంతరాలు తగ్గుతాయి. ప్రభుత్వంలోని ఒక శాఖ ఉద్యోగులు జీవితంలోని పలు అవసరాలకు ఇతర శాఖలపై ఆధారపడాల్సి వస్తుంది. అక్కడ అమలు కావాలనుకునే నీతి, నిజాయితీ, సుపరిపాలన తన శాఖలో, తన సీటులో కూడా అమలుకావాలని ఎవరికి వారు కోరుకుంటే అది చాలు. అతీంద్రియ శక్తులు అవసరం లేదు రెండు రాష్ట్రాల్లోనూ పల్లెల నుంచి పట్టణాలకు వలసపోతున్న మధ్య తరగతి కుటుంబాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఉపాధి వేట ఓ కారణమైతే, పిల్లల చదువుల కోసమే వెళ్తున్న కుటుంబాలు కోకొల్లలు. సర్కారు బడుల్లో నాణ్యమై న విద్య దొరకకపోవడమే దీనికి కారణం. కేజీ నుంచి పీజీ వరకు విద్య మీద రెండు రాష్ట్రాలు ఏటా దాదాపు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని సర్కారు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య అధికారికంగా 97 లక్షలు. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న వారు మరో 50 లక్షలని అంచనా. ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 10 వేలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న పిల్లలకు నాలుగు అక్షరాలు నేర్పి ప్రయోజకులను చేసే బాధ్యతను 3.5 లక్షల మంది ఉపాధ్యాయులు తీసుకోవాలి. వైద్య వ్యవస్థ స్థితి కూడా తెలుగు నేలంతటా కడు దయనీయంగా ఉంది. ఏటా అయిదారు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నా గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాలు, నగరాలు, చివరకు రాజధాను ల్లో కూడా పరిస్థితేమీ బాగోలేదు. ప్రజాసుపత్రులు మృత్యు కుహరాలుగా మారాయి. ప్రజారోగ్య వ్యవస్థలోనే కీలక మైన పీహెచ్సీల్లోనే సదుపాయాలు శూన్యం. అన్ని స్థాయిల వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తే తప్ప సగటు మనిషికి సాంత్వన చేకూరని స్థితి. ఇక సామాన్యుని రోజువారీ జీవితా న్ని శాసించే పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర విభాగాల సిబ్బంది మరింత మానవీయకోణంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. సిబ్బంది కొరత, సదు పాయాల లేమి వంటి వ్యవస్థాగత లోపాలకు తోడు సిబ్బంది అమానవీయ ప్రవర్తన వల్ల ప్రభుత్వాలపై పౌరులకు సదభిప్రాయం కొరవడుతోంది. జనజీవితంతో సజీవ సత్సంబంధాలలో ఉండాల్సిన శాంతిభద్రతల వ్యవస్థ ఇంకా బ్రిటిష్ కాలపు పద్ధతుల్లో, నిందితుల్ని, బాధితుల్ని ఒకే గాటనకట్టి చూసే దృష్టితో పనిచేస్తోంది. పోలీసు వ్యవస్థ భద్రతకు భరోసాగా పరివర్తిన చెందితే తప్ప పౌరుల మన్నన పొందలేదు. మునిసిపల్ సేవలు సక్రమంగా అందకుంటే పట్టణాలు, నగరాల్లో మనిషి జీవితం దుర్భరం. మౌలికంగా పాలనను నిర్దేశించేవి ప్రభుత్వ విధాన నిర్ణయాలు, రాజకీయ వ్యవస్థ పనితీరులే. అయితే తుది ఫలితాలు అధికార వ్యవస్థ పని తీరు, వ్యవహారశైలిని బట్టే ఉంటాయి. అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది ఈ సూక్ష్మాన్ని గ్రహించి మసలుకుంటేనే సగటు జీవికి న్యాయం జరిగేది. జాతిపిత గాంధీజీయే అందుకు తగు మార్గం సూచించారు. స్వాతంత్య్రానం తరం తాను ఎలాంటి ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించబోనని బాపూజీ స్పష్టం చేయడంతో... అనునిత్యం మహాత్ముని మార్గదర్శకత్వం తనకిక ఉండబోదనే ఊహే జవహర్లాల్ నెహ్రూకు మింగుడు పడలేదు. ‘‘బాపూ! నాకేదో భయం గా ఉంది, మీ మార్గదర్శకత్వం లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకోవాలని ఆం దోళనగా ఉంది’’ అన్నారు. అప్పుడు గాంధీజీ బక్కచిక్కిన ఒక సామాన్యుడి ఫొటో ఒకటి తీసి నెహ్రూకిస్తూ, ‘‘ఇది నీ టేబుల్పై పెట్టుకో, విధాన నిర్ణయా లకు సంబంధించి సంతకం పెట్టాల్సి వచ్చిన ప్రతిసారీ ఈ ఫొటో వంక చూడు. తీసుకోబోయే నిర్ణయం ఈ సామాన్యుడికి ఏ మాత్రం ఉపయోగపడు తుందని భావించినా నిస్సంకోచంగా సంతకం చెయ్యి. లేదనిపిస్తే చెయ్యకు’’ అని చెప్పారు. ఆ మాట నెహ్రూని ఎంతగానో ప్రభావితం చేసింది. తెలుగు రాష్ట్రాల సగటు స్వరూపమైన సామాన్యులతో వ్యవహరించే శైలికి సంబం దించి ప్రతి ఉద్యోగికీ బాపూజీ మాటలు స్పూర్తి కావాలి. ఈమెయిల్: dileepreddy@sakshi.com -
అర్హులందరికీ 'ఆసరా'గా నిలుస్తాం
నిజామాబాద్: ఆసరా పింఛన్ల పంపిణీలో అధికారుల తీరుపై కలెక్టర్ రొనాల్డ్రోస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'పింఛినిప్పించండి సారూ..' అంటూ వేడుకున్న దరఖాస్తుదారులను అనునయించారు. 'అర్హులందరికీ వస్తుందమ్మా..' అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్న వృద్ధులను ఓదార్చారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన పింఛన్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని, అలా అడిగిన వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ రొనాల్డ్రోస్ మంగళవారం కామారెడ్డి, డిచ్పల్లి, దోమకొండ మండలాల్లో పర్యటించారు. ఆసరా పింఛన్ల సర్వే, లబ్ధిదారుల ఎంపికల తీరుపై సమీక్షించారు. అధికారులు, సిబ్బంది చేసిన తప్పులు, లోపాలపై మండిపడ్డారు. దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను ఓపిక విని.. పరిష్కరిస్తానంటూ భరోసానిచ్చారు. తమ కాలనీలకు కలెక్టర్ రావడం.. భరోసా ఇవ్వడంతో స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. కామారెడ్డిలో పట్టణంలో ఆసరా పింఛన్ల సర్వే, లబ్దిదారుల ఎంపికలో మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కంప్యూటర్ విభాగంలో ఎస్కేఎస్ సర్వే, ఆసరా పింఛన్ల రికార్డులను పరిశీలించారు. సరైన వివరాలు లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, ఆర్డీవో గడ్డం నగేశ్, తహశీల్దార్ గఫర్మియా, మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఐకేపీ పీడీ వెంకటేశం,మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఆసరా లబ్ధిదారున్ని ఎంపిక చేయడంతో ఐకేసీ సీఓ అర్చనను సస్పెండ్ చేయాలని పీడీని ఆదేశించారు. పేదలు ఎక్కువగా నివసించే బతుకమ్మ కుంటలో పర్యటించారు. ఆసరా పింఛన్ల గురించి వృద్దులు, వితంతువులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 13 వేలమందికి టెక్నికల్ సమస్యలతో పింఛన్లు అందించలేకపోయామన్నారు. ఫిబ్రవరి నుంచి అందరికీ ఫించన్లు అందిస్తామన్నారు. అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్టు తేలితే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోమకొండలో మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాల వారీగా ఆన్లైన్లో పింఛన్ల పరిస్థితిని సమీక్షించారు. అంగన్వాడీలు, వీఆర్ఏలు, హోంగార్డులు అర్హులుగా ఉంటే వారికి పింఛన్లు అందించాలని సూచించారు. అరవైఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్ వచ్చేలా చూడాలని ఎంపీడీఓ హిరణ్మయిని ఆదేశించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి గంగారాం, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ సుధాకర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. డిచ్పల్లి మండలంలో... అమృతాపూర్ పంచాయతీ పరిధిలోని దేవనగర్ లెప్రసీ క్యాంపును కలెక్టర్ సందర్శించి, కాలనీవాసులతో మాట్లాడారు. తమకు పింఛన్లు మంజూరు కాలేదని ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన స్వయంగా క్యాంపును సందర్శించారు. లెప్రసీ రోగులతో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. డీఆర్డీఏ పీడీ వెంకటేశం, ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహశీల్దార్ రవీంధర్ తదితరులు ఉన్నారు. -
పింఛన్ పాట్లు
తిరుపతి క్రైం: అధికారుల్లో ముందుచూపు లేకపోవడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడ్డం పింఛనుదారుల పాలిట శాపంగా మారుతోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గంటల తరబడి పింఛన్ కోసం ఎదురు చూసేలా, రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తోంది. గురువారం తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తపాలశాఖ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం తపాలాశాఖ ఆధ్వర్యంలోనే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో గందరగోళం నెలకొంది. తిరుపతితో పాటు జిల్లాలోని దాదాపు 32వేల మందికి పింఛన్ మంజూరు చేయాల్సి ఉంది. ఏపీ ఆన్లైన్, డీఆర్డీఏ నగర పాలక సంస్థ అవగాహన చేస్తూ బయోమెట్రిక్ యంత్రాలను తపాలాశాఖకు అందించాయి. తిరుపతిలో 10 తపాలా కార్యాలయాల్లో బయోమెట్రిక్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. అయితే కేటాయింపుల్లో నిర్లక్ష్యం చూపారు. నివాసం ఉన్న ప్రాంతం ఒకటైతే పింఛన్ ఇచ్చే కార్యాలయం మరో ప్రాంతంలో కేటాయించారు. దీంతో పింఛన్దారులు ఏ కార్యాలయానికి పోవాలో తెలియక హెడ్పోస్టాఫీస్కు చేరుకుంటున్నారు. ఎక్కడ పింఛన్ తీసుకోవాలో తెలియకే... తిరుపతిలో దాదాపు 4,800 మంది లబ్ధిదారులున్నారు. ఏపీ ఆన్లైన్లో ఇచ్చిన సమాచారం మేరకు వారికి ఖాతాలు తెరిచి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఈ సోమవారం నుంచి పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న పింఛన్ పొందే వృద్ధులు, వికలాంగులు తిరుపతిలోని ప్రధాన కార్యాలయానికి నాలుగు రోజులుగా తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఇటు తపాలాశాఖ అధికారులు ఏమి చేయాలో అర్థం కాక ప్రతి ఒక్కరికీ నచ్చజెప్పుకుంటూ వారికి మార్గనిర్దేశం చేసి పంపిస్తున్నారు. అయినా గంటల తరబడి వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం తపాలా కార్యాలయం వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. తమ ఇళ్ల వద్దకే వచ్చి పింఛను పంపిణీ చేస్తే బాగుంటుందని పింఛన్లు పొందే వృద్ధులు, వితంతువులు వికలాంగులు కోరుతున్నారు. -
గట్లైతే పెన్షన్లు రావ్!
-
3.65 లక్షల పింఛన్లు నిలబెట్టిన ‘సాక్షి’
► బాధితుల తరఫున వరుస కథనాలతో కదలిన రాష్ట్ర ప్రభుత్వం ► లక్షల సంఖ్యలో అర్హులేనని పునఃపరిశీలనలో తేలిన వైనం ► రద్దు చేసిన పింఛన్లు దాదాపు 10 లక్షలు ► ‘ఆధార్’తో రద్దైన వాటిల్లోనే 3.65 లక్షలు సక్రమమే సాక్షి, హైదరాబాద్: వంద కాదు రెండు వందలు కాదు.. దాదాపు ఒక జిల్లా మొత్తం పింఛనుదారుల సంఖ్యకు సమానమైన పింఛన్లను ‘సాక్షి’ నిలబెట్టగలిగింది. ముదిమి వయసులో ఆసరా కోసం ఎదురు చూసే వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను ప్రభుత్వం రద్దు చేస్తే ‘సాక్షి’ ఆ బాధితుల గొంతుకై జరిగిన అన్యాయాన్ని జనం ముందు ఉంచింది. ప్రజలతో కలసి ‘సాక్షి’ చేసిన పోరాటం ఫలించింది. పునఃపరిశీలన చేసిన సర్కారు అనర్హులంటూ తొలగించిన 3.65 లక్షల మందిని తిరిగి అర్హులుగా గుర్తిస్తూ పింఛన్లను మంజూరు చేసింది. డిసెంబర్ నెల నుంచే తిరిగి వారికి పింఛన్లు అందజేయాలని అధికారులను ఆదేశించింది. 3.65 లక్షలు అర్హులే ప్రభుత్వం నియమించిన గ్రామ, మున్సిపల్ వార్డు కమిటీలు 3,34,569 మంది పింఛనుదారులను అనర్హులుగా తేల్చగా.. ఆధార్తో అనుసంధానం అనంతరం మరో 4.19 లక్షల మంది అనర్హులని సర్కారు తేల్చింది. గ్రామ కమిటీల పరిశీలన నివేదికలు నిర్ణీత సమయానికి ప్రభుత్వానికి అందక సుమారు మరో 1.62 లక్షల మంది అనర్హులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్లో 9,16,310 మంది పింఛన్లను నిలిపివేసింది. అయితే ఆధార్ అనుసంధానం సమయంలో అనర్హులుగా తేలిన 4.19 లక్షల మంది పింఛన్ల విషయంలో మాత్రమే పునఃపరిశీలనకు ఆదేశాలిచ్చింది. వీటిపై పునఃపరిశీలన చేసిన అధికారులు 3.65 లక్షల మంది పింఛన్లకు అర్హులేనని నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. కేవలం ఆధార్ కాకుండా తొలగించిన మొత్తం ఫించనుదారుల విషయంలో ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ఉంటే మరింత మంది అర్హులుగా తేలే అవకాశం ఉండేదంటున్నారు. 3,72,655 కొత్త పింఛన్లు మంజూరు ఏరివేత సమయంలో కొత్త ఫించన్ల కోసం కమిటీలకు దాదాపు ఐదున్నర లక్షల దరఖాస్తులు అందగా పరిశీలన తరువాత 3,72, 655 పింఛన్లు కొత్తగా మంజూరు చేస్తున్నట్టు అక్టోబరు 25వ తేదీన ప్రభుత్వం జీవో ఇచ్చింది. అనర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తరువాత అక్టోబరులో పెరిగిన ఫించన్లకు అర్హులుగా తేల్చిన 33,96,223 మందికి తోడు కొత్తగా మంజూరు చేసిన 3,72, 655 మంది, తాజాగా అర్హులుగా తేల్చిన 3.65 లక్షల మందితో కలిపి డిసెంబరులో దాదాపు 41 లక్షల మందికి పింఛన్లు చెల్లిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. జన్మభూమిమరో 5 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇవి పరిశీలనలో ఉన్నాయి. నిలదీసిన బాధితులు ఏళ్ల తరబడి ఫించన్లు తీసుకుంటున్న వారిని అనర్హులంటూ టీడీపీ ప్రభుత్వం దాదాపు పది లక్షల మంది పింఛన్లను తొలగించింది. సెప్టెంబరు వరకు రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 43.12 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా 15 రోజుల వ్యవధిలో తనిఖీల పేరుతో 9.16 లక్షల మందిని ఏరి వేశారు. పింఛన్లను 33,96,223 మందికి కుదించారు. వెయ్యి రూపాయలకు పెంచిన పింఛన్లును వీరికి మాత్రమే అందజేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పింఛను పొందుతున్న సారా వ్యతిరేక ఉద్యమ నాయకురాలు దూబగుంట రోశమ్మకు ఐదెకరాలకంటే ఎక్కు వ భూమి ఉందంటూ ఆమెను జాబితా నుంచి తొలగించారు. గుంటూరు జిల్లా సంతగుడిపాడులో పూరి గుడిసెలో అద్దెకు ఉంటున్న షేక్ గాలిబ్ సాహెబ్కు ఐదెకరాల కంటే ఎక్కువ పొలం ఉందని సాకు చూపి పింఛను తొలగిం చారు. ఈ నేపథ్యంలో అర్హత ఉన్నా పింఛన్లు కోల్పోయిన వారి అక్రోశాన్ని ‘సాక్షి’ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కళ్లకు కట్టినట్టు వివరించింది. ఈ ప్రక్రియలో రాజకీయాలు జొప్పిస్తున్నారంటూ ‘సాక్షి’ తప్పుపట్టింది. దీంతో బాధితులు అధికారులు, టీడీపీ నేతలను నిలదీయడంతో పునఃపరిశీలనకు నిర్ణయించిన ప్రభుత్వం 3.65 లక్షల మందిని తిరిగి అర్హులుగా గుర్తించింది. -
సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు గల్లంతు
ఘట్కేసర్: మండలంలో సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) పత్రాలు గల్లంతయ్యాయి. మండలవ్యాప్తంగా 12 వేల మంది పింఛన్ కోసం దరఖాస్తుచేసుకోగా వాటిలో అధిక భాగం పరిశీలన పూర్తయింది. వీటిలో 1,158 సర్వే పత్రాలు మిస్సయినట్లు అధికారులు కనుగొన్నారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి పత్రాలను కంప్యూటర్లో ఫీడ్ చేయాలనే నిబంధన విధించడంతో పత్రాలు గల్లంతైన విషయం వెలుగుచూసింది. ఇప్పటివకూ మండలంలో అవుశాపూర్లో 187 మందికి, కొండాపూర్లో 132 మందికి మాత్రమే పింఛన్లు అందజేశారు. మిగితా గ్రామాల్లో పింఛన్ల కోసం లబ్ధిదారులు ప్రతి రోజు పంచాయతీ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. లబ్ధిదారుల పేర్లు కంప్యూటర్లో ఫీడ్ కాలేదని, అందుకే ఆలస్యమవుతోందని అధికారుల నుంచి సమాధానం వస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ఒకేరోజు నిర్వహించడం, సర్వే పూర్తి కాగానే వాటిని కంప్యూటర్లో ఫీడ్ చేయించే పని వేగంగా చేయడం, అందుకు విద్యార్థులను ఉపయోగించడం, వారికి సరైన అవగాహన కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపకపోవడం వల్లే పత్రాలు గల్లంతై ఉండవచ్చని భావిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు లేని కుటుంబాల నుంచి పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి విడతలో పింఛన్ ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. వారిని రెండో విడతలో ఎంపిక చేసి అందజేస్తామంటున్నారు. దీంతో ఒక నెల పింఛన్ అందకుండా పోతుందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. తమకు మొదటి విడతలో పింఛన్ అందేలా చూడాలని కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా జాప్యం జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో పింఛన్లు పంపిణీ చేసే తేదీ ప్రకటిస్తామని అధికారులు అంటున్నారు. -
అ‘భయం’
పథకం కొనసాగుతుందా..? * ఆందోళన చెందుతున్న పింఛన్దారులు * ఈ నెల నిధులు నిలిపేసిన సర్కారు * ఆసరా పథకం వర్తింపజేయాలని విజ్ఞప్తి నల్లగొండ : అభయహస్తం పథకం అమలుపై మహిళా స్వయంసహాయక సంఘాల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆసరా’తో పింఛన్ పెరుగుతుందని ఆశించిన అభయహస్తం పింఛన్దారులకు నిరాశే ఎదురైంది. నవంబర్ నెలకు చెల్లించాల్సిన అభయహస్తం పింఛన్ సొమ్మును కూడా ప్రభుత్వం నిలిపేసింది. దీంతో పాటు సంఘాల్లోని సభ్యుల్లో 9, 10, ఇంటర్, ఐటీఐ చదివే పిల్లలకు చెల్లించే ఉపకార వేతనాలు కూడా ఆగిపోయాయి. అదీగాక కొంతకాలంగా ఈ పథకం అమలుతీరు గురించి రాష్ట్రస్థాయిలోనే ఎలాంటి సమీక్షలూ నిర్వహించలేదంటే ప్రభుత్వ ఆలోచన ఏమైఉంటుందనేది కూడా జిల్లా అధికారులకు అంతుచిక్కడం లేదు. లబ్ధిదారుల్లో ఉత్కంఠ.... మహిళలకు చేయూతనివ్వాలని, వారికి ఆర్థికస్వావలంబన కల్పించాలన్న ఉద్దేశంతో వైఎస్.రాజశేఖరరెడ్డి 2009లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే సంవత్సరం నవంబర్ 1 నుంచి అభయహస్తం పింఛన్ కింద అర్హులైన వారికి నెలకు 500 రూపాయల చొప్పున చెల్లించారు. ఇలా జిల్లాలో 26,354 మంది మహిళలు ఈ పెన్షన్ పొందుతున్నారు. 60 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలో పెన్షన్ పొందేందుకు అర్హులు. అదే సామాజిక భద్రత పెన్షన్లు 65 ఏళ్లు నిండిన వారికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు. పాత పద్ధతి ప్రకారం సామాజిక పింఛన్లు రూ.200 చెల్లిస్తున్నప్పుడు..అభయహస్తం పింఛన్ రూ.500లు చెల్లించారు. ఈ ప్రభుత్వం సామాజిక పింఛన్లు రెండు వందల నుంచి వెయ్యికి పెంచింది కానీ అభయహస్తం పింఛన్దారులకు దానిని వర్తింపజేయలేదు. అయితే అభయహస్తంలో పెన్షన్ పొందుతున్న వారిలో 65 ఏళ్లు నిండిన వారు ‘ఆసరా’కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు మౌఖికంగా సంఘాలకు చెప్పాయి. కానీ ఆచరణలో అది ఎంతవరకు సక్సెస్ అయ్యిందన్న సమాచారం లేదు. పెన్షన్ నిధిపై సందేహాలు... అభయహస్తం పెన్షన్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మహిళలు డబ్బులు జమచేశారు. మొత్తం 60వేల సంఘాల్లో 24,105 సంఘాలు అభయహస్తంలో చేరాయి. ఈ సంఘాల్లో మొత్తం 2 లక్షల 77 వేల మంది సభ్యులు ఉన్నారు. ఐదేళ్ల నుంచి ప్రతి ఏడాది 365 రూపాయల చొప్పున సెర్ప్కు చెల్లిస్తున్నారు. సభ్యులు తమ వాటాధనం కింద రూ.365లు చెల్లిస్తే...ప్రభుత్వ మరో వాటా రూ.365లు అదనంగా జమ చేస్తుంది. ఈ మొత్తం నగదు అంతా సెర్ప్ నుంచి ఎల్ఐసీకి చేరుతుంది. ఇలా ఇప్పటివరకు 5 కోట్ల 55 లక్షల 25 వేల రూపాయలు పెన్షన్ నిధికి జమ చేశారు. ఇలా జమచేస్తే వృద్ధాప్యంలో తమకు అదనంగా పెన్షన్ వస్తుందని పైసాపైసా కూడబెట్టుకుని అభయహస్తం వాటా ధనం చెల్లిస్తున్నారు. అయితే ఇప్పుడు పెన్షన్లో ఈ విషయమై అధికారులను అడిగితే... తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని, తామేమీ చేయలేమని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ ఇంకా ఇవ్వలేదు.. నేను మూడేళ్ల క్రితం అభయహస్తం పథకంలో చేరి రూ.3700 చెల్లించా. నాకు 60 ఏండ్లు నిండిన తరువాత నెలకు రూ.500 పింఛన్ వస్తుందని చెప్పారు. అన్నట్లుగా నాకు గత ఏడాదిన్నర క్రితం 60 ఏండ్లు నిండడతో ప్రతి నెలా రూ.500 పింఛన్ వచ్చేది. కానీ ఈ నెల ఇంకా ఇవ్వలేదు. ఎందుకు వస్తలేదో ఎవరూ చెప్పడం లేదు. గ్రామ పంచాయతీ వారు త్వరలో లిస్టు పెడుతారంటా, అందులో పేరు ఉంటే ఇస్తామంటున్నారు. వారు ఇంకా లిస్టు పెట్టలేదు. - కరాట్ని లక్ష్మమ్మ, మునుగోడు -
ఉద్యోగుల, పెన్షనర్లకు దీపావళి కానుక
-
జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ హెల్త్కార్డులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీహెచ్ఎంసీలోని రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్కార్డులు జారీ చేయనున్నారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్కు ఈ విషయాన్ని తెలిపారు. హెల్త్కార్డులతోపాటు అర్హులైన వారికి పదోన్నతులు, బదిలీలు కూడా జరిపేందుకు కమిషనర్ హామీ ఇచ్చారని గోపాల్ విలేకరులతో అన్నారు. త్వరలోనే పీఆర్సీ అమలు కూడా జరుగనున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని అన్నారు. హెల్త్కార్డులతో నగదు లేకుండానే ఏ ఆస్పత్రిలోనైనా వైద్యచికిత్సలు చేయించుకోవచ్చునన్నారు. -
ఆరోగ్య భాగ్యం, ఆంక్షల్లేని వైద్యం
టీ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుక ఉద్యోగ సంఘాలతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వ్యయ పరిమితి లేకుండా నగదు రహిత వైద్యం {పీమియం కూడా చెల్లించనక్కర్లేదు నేడు సీఎం చేతుల మీదుగా హెల్త్కార్డుల జారీ షురూ దశలవారీగా అన్ని శాఖల వారికీ వర్తింపు వచ్చే నెల 1 నుంచే వైద్య సేవలు మొదలు సర్కారుపై ఏటా రూ. 400 కోట్ల మేర భారం కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు సమగ్ర వివరాలు మొత్తం ఉద్యోగులు: 3.19 లక్షలు హెల్త్ కార్డులకు ఎన్రోల్ చేసుకున్నది: 2.41 లక్షలు ఇంకా నమోదు చేసుకోవాల్సింది: 78 వేలు మొత్తం పెన్షనర్లు: 2.56 లక్షలు ఇప్పటివరకు నమోదైన వారు: 1.19 లక్షలు ఇంకా మిగిలిన వారు: 1.37 లక్షలు వైద్య సేవలు అందించే ఆసుపత్రులు: 460 ప్రభుత్వం గుర్తించిన రోగాల సంఖ్య: 1,885 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆంక్షల్లేని వైద్య సేవల కల నెరవేరింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు మంగళవారం ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన భేటీలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎలాంటి పరిమితి లేకుండా, వైద్యానికి ఎంత ఖర్చయినా, ఆ మొత్తాన్ని భరించేందుకు ఆయన అంగీకరించారు. దీంతో దాదాపు 5.75 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇకపై ఆంక్షల్లేని వైద్యం అందనుంది. గత ప్రభుత్వాల హయాంలో అనేకసార్లు సమావేశాలు జరిగినా ఈ విషయం కొలిక్కిరాలేదు. వైద్య సౌకర్యాలు, నగదు పరిమితి తదితర అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో హెల్త్కార్డుల జారీపై తాజాగా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ఉద్యోగవర్గాలను సంతృప్తిపరిచేలా నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుతో వచ్చే నెల 1 నుంచి అన్ని రిఫరల్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా బుధవారమే కొంత మంది ఉద్యోగులకు(100 మంది వరకు) కేసీఆర్ స్వయంగా హెల్త్ కార్డులను జారీ చేసి ప్రక్రియను ప్రారంభించనున్నారు. క్రమంగా మిగతా ఉద్యోగులు, పెన్షనర్లందరికీ హెల్త్ కార్డులు అందుతాయి. మొదట ఉద్యోగులకు ఈ పథకం అమలుకానుంది. ప్రభుత్వరంగ సంస్థలు, మున్సిపల్, ఎయిడెడ్, గ్రంథాలయ తదితర శాఖల ఉద్యోగులకు దశలవారీగా వర్తింపజేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధ, గురువారాల్లో ప్రభుత్వం జారీ చేయనుంది. ఉద్యోగుల సర్వీసు రూల్స్ సరళీకరణ వంటి అంశాలపై దీపావళి తర్వాత.. అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలతో వస్తే చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ దేవీప్రసాద్ వెల్లడించారు. ప్రీమియం, పరిమితి నిబంధనలన్నీ రద్దు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వం గుర్తించిన ఏ ఆసుపత్రిలోనైనా హెల్త్ కార్డు చూపించి పూర్తిస్థాయి వైద్య సేవలు పొందవచ్చు. రెండు లక్షల రూపాయల వరకే వైద్య ఖర్చుల పరిమితి నిబంధనన తాజాగా తొలగిపోయింది. సర్కారు గుర్తించిన 1,885 రోగాలకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్.. ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు. గతంలో 345 రోగాలకు వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే పొందాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం దీన్ని కూడా తొలగించారు. అలాగే గత ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు నెలకు రూ. 90 చొప్పున, అధికారులు రూ. 120 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఏటా రూ. 86.27 కోట్లవుతుంది. దీనికితోడు ప్రభుత్వం తన వాటాగా రూ. 129 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. అయితే కేసీఆర్ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఉద్యోగులు, పెన్షనర్లు పైసా చెల్లించాల్సిన అవసరముండదు. స్టంట్లకు ఇంత మొత్తమే చెల్లించాలని విధించిన ప్యాకేజీలు రద్దయినట్లే. ప్రీమియం విధానంపై కొంతమంది అధికారులు సూచనలు చేసినా సీఎం పట్టించుకోలేదు. ఉద్యోగుల నుంచి పైసా తీసుకోవద్దని, ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఉచిత వైద్యం కారణంగా ప్రభుత్వంపై ఏటా దాదాపు 400 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. ఆరు నెలల తర్వాత సమీక్ష! ఈ పరిమితి లేని నగదు రహిత వైద్య విధానం ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని సమీక్షించనుంది. ఆలోగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను రూ. 100 కోట్ల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేయనుంది. నిలోఫర్ ఆసుపత్రిని రూ. 30 కోట్లతో, మిగతా ఆసుపత్రులకు రూ. 25 కోట్ల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఉద్యోగ నేతలకు సీఎం కేసీఆర్ తెలియజేసినట్లు సమాచారం. ఆరు నెలల తర్వాత ఉద్యోగులు, పెన్షనర్లంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడాన్ని తగ్గించాలని, తద్వారా 60 శాతం వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందేలా చర్యలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక ్టర్ రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, వెంకట్రెడ్డి, విఠల్, చంద్రశేఖర్గౌడ్, మధుసూదన్రెడ్డి, మమత, హర్షవర్ధన్రెడ్డి, రాజిరెడ్డి, మణిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలన్నీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నాయి. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తనది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వంగా కేసీఆర్ నిరూపించారు. ఏ రాష్ట్రంలో లేని ఆరోగ్య విధానాన్ని తెచ్చారు. ఉద్యోగులపై సీఎంకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా సేవలో సర్కారుకు అండగా ఉంటాం. ఆరు నెలల్లో రాష్ర్టంలో పాలనను దేశానికే ఆదర్శమయ్యేలా చేస్తాం. పీఆర్సీ కూడా ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. సర్వీసు రూల్స్పై ఉద్యోగ సంఘాల తరఫున ప్రతిపాదనలు అందజేస్తాం. గత ప్రభుత్వాలు తేల్చనేలేదు: టీజీవోల సంఘం చైర్మన్ శ్రీనివాస్గౌడ్ హైల్త్ కార్డులపై గత ప్రభుత్వాలు 42 సార్లు సమావేశాలు పెట్టినా తేల్చలేదు. ఉద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోలేదు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ స్పందించి.. నగదు రహిత, పరిమితి లేని వైద్యం అందించేందుకు అంగీకరించారు. ఉద్యోగుల ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. ఏ జబ్బుకైనా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్కారు ఆదాయం పెంచడంలో ఉద్యోగులంతా భాగస్వాములవుతారు. ఎయిడెడ్ టీచర్లకూ సీఎం హామీ: పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఎయిడెడ్ టీచర్లకు కూడా హెల్త్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సీఎం ఆకాంక్షల మేరకు విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులంతా కృషి చేస్తారు. ఇందుకు రాష్ర్టంలోని లక్షన్నర మంది టీచర్లు పాటుపడతారు. సర్వీసు రూల్స్లో మార్పులు: టీ-ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ ఉద్యోగులకు అమలు చేస్తున్న బ్రిటీష్కాలం నాటి సర్వీసు రూల్స్ మార్పునకు చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ప్రతిపాదనలతో రమ్మని చెప్పారు. నిబంధనలన్నీ తొలగించి ఉద్యోగులు, పెన్షనర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన ఘనత కేసీఆర్దే. -
కేసీఆర్ దీపావళి కానుక
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు, పింఛన్దారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులు, పింఛన్దారుల వైద్య ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. బుధవారం హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉద్యోగుల వైద్య ఖర్చులపై పరిమితిని తొలగించారు. -
అక్టోబర్ 20 తేది డెడ్ లైన్ కాదు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెన్సన్లు, ఆహార భద్రతా కార్టులకు అక్టోబర్ 20 తేది డెడ్ లైన్ కాదు అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణ నిరంతర ప్రక్రియ, అర్హులైన ప్రతి లబ్దిదారుడు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. గతంలో మాదిరిగానే సంతృప్తికరమైన పద్దతిలోనే పథకాల అమలు జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. దరఖాస్తు ఇప్పుడు ఇచ్చి, ధృవీకరణ పత్రం తర్వాత ఇచ్చినా ఫర్వాలేదని కేటీఆర్ మీడియాకు వివరించారు. లబ్దిదారులకు పథకాల సమాచారాన్ని అందించేందుకు కలెక్టర్లు, అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
అక్టోబర్ 20.. డెడ్లైన్ కాదు!
-
పింఛను మంటలు
పెన్షన్ల లబ్ధిదారుల ‘సర్వే’లో నిబంధనలను తుంగలో తొక్కిన ప్రభుత్వం అర్హతలున్నా 84,617 మందినిఅనర్హులుగా చిత్రీకరించిన వైనం నోటికాడ ముద్దను లాగేయడంతో వృద్ధులు, వికలాంగుల ఆకలికేకలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడం కోసం కాటికి కాలు చాపిన పండుటాకులు.. ఊతం లేని వికలాంగులు.. దిక్కులేని వితంతువుల నోళ్లను ప్రభుత్వం కొట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఇస్తోన్న పింఛన్లలో కోత విధించింది. అనర్హుల ఏరివేత కోసం చేపట్టిన సర్వేలో నిబంధనలను యథేచ్ఛగా తుంగలోతొక్కింది. నిబంధనలను వక్రీకరించి అర్హులను అనర్హులుగా చిత్రీకరించి.. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో పింఛన్ల లబ్ధిదారుల జాబితా నుంచి 84,617 మందిని తొలగించేసింది. జిల్లాలో అనర్హులను జాబితా నుంచి తొలగించడం వల్ల ఖజానాకు నెలకు రూ.8.61 కోట్లు.. ఏడాదికి రూ.103.32 కోట్లు మిగులుబాటు అవుతుందని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు జబ్బలు చరుచుకుంటుండడంపై సామాజికవేత్తలు విస్తుపోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కగానే కోతలకు తెరతీశారు. ఇదే క్రమంలో పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడానికి ఎత్తు వేశారు. అనుకున్నదే తడవుగా అధికారులు, సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలతో కమిటీ వేసి.. తస్మదీయులు అర్హులైనా అనర్హులుగా చిత్రీకరించి పెన్షన్ల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని కనుసైగలు చేశారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. పింఛనుదారుల్లో అనర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. రెండున్నర ఎకరాల మాగాణి, ఐదెకరాల మెట్ట భూమి ఉన్న వారు పింఛను పొందడానికి అనర్హులు. మూడు గదులకు మించి శ్లాబ్ ఇల్లు.. కారు ఉన్న వారు కూడా అనర్హులే. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగంతో సహా ఎలాంటి ఉద్యోగం చేస్తూ జీతం లేదా ఉద్యోగానికి సంబంధించి పింఛను పొందుతున్న వారు కూడా అనర్హులే.. నెలవారీ జీతం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగం చేసే వారు సైతం అనర్హులే. వృద్ధాప్య పెన్షన్దారులకు కనీస వయస్సు 65 సంవత్సరాలు.. వితంతువులకు కనీస వయస్సు 16 ఏళ్లు. వికలాంగులకు కనీస అంగవైకల్యం 40 శాతం కలిగి ఉన్న వాళ్లే అర్హులు. ఆధార్ సీడింగ్ చేసుకోని వారూ అనర్హులే. కానీ.. ఈ నిబంధనలను సర్వేకమిటీ తుంగలో తొక్కిం ది. అన్ని అర్హతలున్నా అనర్హులుగా చిత్రీకరిస్తూ 54,254 మంది వృద్ధులు, 22,108 మంది వితంతువులు, 3,330 వికలాంగులు, 1,673 మంది చేనేత కార్మికులు, 2,786 మంది అభయహస్తం, 16 మంది గీత కార్మికులను పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం గమన్హాం. తప్పులతడకగా లబ్ధిదారుల సర్వే! పింఛను లబ్ధిదారులపై నిర్వహించిన సర్వే తప్పులతడకగా అధికారవర్గాలే అభివర్ణిస్తుండడం గమనార్హం. కమిటీలో టీడీపీ కార్యకర్తలు ఉండడం.. ఆ పార్టీ అగ్రనేతలు ఒత్తిడి తేవడంతో సర్వే మొత్తం వారి కనుసన్నల్లోనే సాగిందని రెవెన్యూశాఖకు చెందిన ఓ కీలకాధికారి ఇటీవల బాహాటంగా వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోం ది. తిరుపతి మండలం ఎమ్మార్పల్లెకు చెందిన వికలాం గుడు బాలకృష్ణను సకలాంగుడుగా తేల్చడమే అందుకు తార్కాణం. భూమి లేకున్నా ఉన్నట్లు.. ఇళ్లు లేకున్నా ఉన్నట్లు తిమ్మిని బిమ్మిని చేసి అనర్హులుగా చిత్రీకరించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పింఛను లబ్ధిదారుల జాబితాలో ఉంటే.. ఒకరి పేరును నిర్ధాక్షిణ్యంగా తొలగిం చారు. ఇదే పద్ధతిలో 84,617 మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. నెలనెలా వృద్ధాప్య, వితం తు, గీత, నేత కార్మికులు రూ.వెయ్యి.. వికలాంగులు రూ.1500 పింఛను వస్తుందని ఆశించారు. కానీ.. ఉన్న పింఛనే పీకేయడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోడ్డెక్కుతున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా పింఛను జాబితా నుంచి తొలగించిన వృద్ధులు, వికలాం గులు, వితంతువులు ఆందోళనలు చేయడమే అందుకు తార్కాణం. -
సామాజిక పింఛన్దారుల్లో ఆందోళన
సాక్షి, ఒంగోలు: ఏ దిక్కూ లేనివారికి కాస్తాకూస్తో ఆసరాగా ఉంటుందనుకున్న ప్రభుత్వ పింఛన్ చేతికందని ద్రాక్షగా మారుతోంది. చంద్రబాబు సర్కారు ఆంక్షల పర్వంతో అక్టోబర్ నెల నుంచి పింఛన్ సొమ్ము తీసుకోలేని బాధితుల సంఖ్య వేలల్లో పెరగనుంది. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ అర్హుల జాబితా తయారైందని, తమకు నచ్చని వారి పేర్లను అడ్డగోలుగా తొలగించారనే విమర్శలు జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ నుంచి పింఛన్ కోల్పోతున్న వారి సంఖ్య జిల్లాలో 42 వేల మందికి పైగా ఉండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రతినెలా ఠంఛనుగా అందే పింఛన్లు గత కొన్ని మాసాలుగా అందకపోవడంతో పండుటాకులకు నిరాశే ఎదురవుతోంది. ఆర్థికపొదుపు పేరిట బహిరంగ ప్రకటనలిస్తూనే అనవసర వ్యవహారాలకు ఇష్టానుసారంగా ఖర్చుచేస్తున్న ప్రభుత్వం అభాగ్యుల మెడపై కత్తి దూస్తోంది. ప్రత్యేక కమిటీల్లో సభ్యులుగా ఉన్న అధికారుల సర్వేనే తప్పుల తడకగా సాగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరగకుండా ఒకే దగ్గర కూర్చొని కూడికలు, తీసివేతలు చేశారని, వాస్తవాలను వక్రీకరించారని కనిగిరి, మార్కాపురం, యరగొండపాలెం నియోజకవర్గాల నుంచి అనేక ఫిర్యాదులొచ్చాయి. ఇదీ లెక్క... జిల్లాలో ఇప్పటిదాకా నెలనెలా పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు మొత్తం 3,12,983 మంది ఆధార్కార్డుతో అనుసంధానం చేసుకున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో 2,54,505 పట్టణ ప్రాంతాల్లో 24,700. ఇంకా అనుసంధానం కాని లబ్థిదారుల సంఖ్య 31,078. ఆధార్తో అనుసంధానం చేసుకున్నప్పటికీ సరైన ధ్రువీకరణ పత్రాల్లేవంటూ తాజాగా జిల్లాలో 22,200. బయోమెట్రిక్ విధానంతో చేతివేలి ముద్రలు సరిగా పడనివారు 1450 పైవారందరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వడం లేదు. జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ వరకు పింఛన్ల పంపిణీ 2,82,774 మందికి రూ.8.73 కోట్లు అవుతుండగా, అక్టోబర్ నుంచి లబ్థిదారుల సంఖ్య భారీగా తగ్గనుంది. ఒకేసారి 42 వేల మందిపై వేటు వేయనుండడంతో ఈ సంఖ్య మరింత తగ్గనుంది.