టీచర్లకు జీతాల్లేవు..పెన్షనర్లకు పెన్షన్‌ లేదు | no pension for pensioners in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టీచర్లకు జీతాల్లేవు..పెన్షనర్లకు పెన్షన్‌ లేదు

Published Wed, Oct 2 2024 6:06 AM | Last Updated on Wed, Oct 2 2024 6:06 AM

no pension for pensioners in Andhra Pradesh

రూ.3,000 కోట్లు అప్పుల నిధులు వచ్చాకే చెల్లింపులు

సాక్షి, అమరావతి: ప్రతీ నెలా ఒకటో∙తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్‌ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు మాట తప్పింది. సెప్టెంబర్‌ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మినహా మిగతా ఉద్యోగులు, టీచర్లకు మంగళవారం వేతనాలు చెల్లించలేదు.

మున్సి­పల్‌ శాఖతోపాటు పలు శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్‌ కూడా చెల్లించలేదు. మంగళవారం నాడు రాష్ట్ర ప్రభు­త్వం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,000 కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తరువాతే వేతనాలు, పెన్షన్‌ చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గా­లు తెలిపాయి. బుధవారం గాంధీ జయంతి సెలవు కారణంగా గురువారం రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరే అవ­కాశం ఉంది. దీంతో గురు, శుక్రవారం వరకు వేతనాలు, పెన్షన్‌కు ఎదురు చూడక తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement