pensioners
-
ఈ నెలా తగ్గిపోయిన పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య ఈ నెల కూడా తగ్గిపోయింది. గత నెల (జనవరి)లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన పింఛన్లకంటే శనివారం (ఫిబ్రవరి 1న) విడుదల చేసిన పింఛన్లు 18,036 తగ్గిపోయాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.ఇలా గత ఎనిమిది నెలల్లో ఏకంగా 1,89,957 పింఛన్లు తగ్గిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు గత ఏడాది మే నెలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 65,49,864 మందికి పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేయగా, శనివారం చంద్రబాబు ప్రభుత్వం 63,59,907 మంది లబ్దిదారులకే నిధులు విడుదల చేసింది. జనవరి నెల పింఛన్ల పంపిణీకి డిసెంబరు 31న 63,77,943 మందికే నిధులివ్వడం గమనార్హం.భయం భయంగా లబ్ధిదారులుచంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే కొత్తగా ఎవరూ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకుండా ఆన్లైన్ సేవలు పూర్తిగా నిలిపివేసింది. మరోపక్క.. గత ఐదేళ్లుగా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రతి నెలా ఠంఛన్గా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లబ్ధిదారుల సంఖ్యనూ తగ్గించేస్తోంది. ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను ఇప్పుడు అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే, స్పెషల్ డ్రెవ్ల పేరుతో రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త పింఛన్దారుల అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన జరుపుతోంది. దీంతో తమ పింఛనుకు ఎప్పుడు ఎలా ఎసరు పెట్టేస్తారోనని లబ్ధిదారులు నిత్యం భయంభయంగా గడుపుతున్నారు. -
వచ్చే పెన్షన్ ఆపేశారు.. అడుక్కుతిని బతకాల్సివస్తుంది..
-
బకాయిలు కొండంత.. చెల్లించేది గోరంత
సాక్షి, అమరావతి: ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిలకుగానూ అరకొర నిధులను విడుదలచేస్తూ, సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25,000 కోట్లు ఉంటే, కూటమి ప్రభుత్వం రూ.1,300 కోట్లే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఇవ్వాల్సిన బకాయిలెంత? ఇప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం బయటపడుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునేది. కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కు పిలిచి మాట్లాడిన దాఖలాల్లేవు. ⇒ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన రూ.1,300 కోట్లలోనూ రూ.519 కోట్లు జీపీఎఫ్ కోసం, రూ.214 కోట్లు పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం రూ. 300 కోట్లు మాత్రమే కడతామని చెబుతున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక? ⇒ జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు. దీనికి మొత్తం ఇవ్వకుండా రూ. 519 కోట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం? ఏడాదికి 15 రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునేందుకు వీలుంది. దీనిని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు.. అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు. సీపీఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు. ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రూ.265 కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. 36 ఏళ్లు ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగిగా ప్రభుత్వ తీరు అర్థం కావడంలేదు. ⇒ రాష్ట్రంలోని 3.80 లక్షల మంది పెన్షనర్లకు ఏమాత్రం మేలు చేయడంలేదు. డీఎ ఎరియర్స్, పీఆర్సీ ఎరియర్స్, సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటేషన్ ఆఫ్ లీవ్, గ్రాట్యూటీ వంటి బెనిఫిట్స్ పెండింగ్ లో పెడుతున్నారు. అలాగే, మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్, ఏపీజేఎల్ వంటివి రూ. కోట్లలో ఉన్నాయి. వాటిల్లో ఇంతమేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టంచేయాల్సి ఉంది. ⇒ మంచి పీఆర్సీని, మధ్యంతర భృతిని ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీలిచ్చింది. 7 నెలలు గడుస్తున్నా పీఆర్సీని నియమించలేదు, ఐఆర్ను ప్రకటించలేదు. రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రతి ఆరునెలలకు కేంద్రం డీఏను ప్రకటిస్తుంది. ఏపీలో 2024లో రావాల్సిన రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ⇒ కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామన్నారు. తొలి రెండు నెలలే అలా ఇచ్చారు. హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత, ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది. ప్రతిసారీ ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడంవల్ల ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. సకాలంలో ప్రభుత్వ వాటా చెల్లించాలి. -
ఇంటి పన్ను కడితేనే పింఛన్!
గుడిపాల: ఇంటి పన్నుకు, పింఛన్లకు కూటమి సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో మంగళవారం 27 పంచాయతీల్లో ఇదే తంతు నడిచింది. పైనుంచి ఆదేశాలొచ్చాయంటూ..సచివాలయాల సిబ్బంది, వీఆర్ఓలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పన్ను వసూలు చేశారు. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లిస్తామని చెప్పిన తర్వాతే పింఛన్ సొమ్ము అందజేశారు. అయితే పన్ను చెల్లించిన వారికి ఎక్కడా కూడా రశీదులు ఇవ్వలేదు. ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదని, ఇలా బలవంతం చేయడం తగదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పింఛన్ డబ్బులిచ్చేటప్పుడే ఇంటి పన్ను వసూలు చేయండి. తర్వాత అయితే డబ్బులు లేవు అని చెబుతారు. ఇప్పుడైతే డబ్బులు లేవు అని చెప్పడానికి వారికి ఆస్కారం ఉండదు. ఇది ఇయర్ ఎండింగ్ అని చెప్పండి’ అని ఒక ప్రజాప్రతినిధి అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై స్పందించడానికి అధికారులెవరూ ఇష్టపడలేదు. -
కమీషన్ ఇవ్వకపోతే పెన్షన్ కట్..
-
పింఛన్ లబ్ధిదారులను దొంగలతో పోల్చిన స్పీకర్
-
పేదల పెన్షన్లతో రాజకీయం చేస్తున్న కూటమి ప్రభుత్వం
-
చంద్రబాబు కోతలు.. 1.5 లక్షల పెన్షన్లు గోవింద
-
ఏపీలో నెలనెల తగ్గిపోతున్న పింఛన్లు
-
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
‘పెన్షన్ ఆగిపోతుంది’.. బురిడీకొట్టిస్తున్న కొత్త స్కామ్!
పెన్షనర్లను మోసగాళ్లు కొత్త స్కామ్తో బురిడీకొట్టిస్తున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (CPAO) అధికారులమని చెప్పుకుంటూ పెన్షనర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మోసగాళ్లు ఫేక్ వాట్సాప్ సందేశాలు పంపి తప్పుడు ఫారమ్లను నింపమని కోరుతున్నారు. పాటించకపోతే వారి పెన్షన్ చెల్లింపులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు.వార్తా నివేదికల ప్రకారం.. బ్యాంకు ఖాతా వివరాలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా మోసగాళ్లు ఈ స్కామ్ చేస్తున్నారు. ఈ సమాచారంతో వారు పెన్షనర్ల వివరాలను దొంగిలించి ఆర్థిక మోసానికి పాల్పడవచ్చు. ఈ నేపథ్యంలో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.సీపీఏఓ పేరుతో ఏదైనా సందేశం వస్తే దాని ప్రామాణికతను పరిశీలించుకోవాలి. అధికారిక ఏజెన్సీలు వాట్సాప్ లేదా ఇతర అనధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా వ్యక్తిగత వివరాలను అడగవు. మీ పీపీఓ నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని మెసేజింగ్ యాప్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. అనుమానం వస్తే సీపీఏఓ లేదా బ్యాంక్ వారిని అధికారిక సంప్రదింపు వివరాలను ఉపయోగించి సంప్రదించండి. -
టీచర్లకు జీతాల్లేవు..పెన్షనర్లకు పెన్షన్ లేదు
సాక్షి, అమరావతి: ప్రతీ నెలా ఒకటో∙తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు మాట తప్పింది. సెప్టెంబర్ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మినహా మిగతా ఉద్యోగులు, టీచర్లకు మంగళవారం వేతనాలు చెల్లించలేదు.మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ కూడా చెల్లించలేదు. మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,000 కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తరువాతే వేతనాలు, పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం గాంధీ జయంతి సెలవు కారణంగా గురువారం రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. దీంతో గురు, శుక్రవారం వరకు వేతనాలు, పెన్షన్కు ఎదురు చూడక తప్పదు. -
క్యాష్ లెస్.. యూజ్ లెస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అటకెక్కింది. నగదు రహిత వైద్యసేవలు అందక ఉద్యోగులు, పింఛన్దారులు గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు వా పోతున్నారు. ఉద్యోగులు గత్యంతరం లేక లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా, పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు బకాయిలతో.. ఈహెచ్ఎస్ పరిధిలో సుమారు 5.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 20 లక్షల మంది ఈ పథకంలోకి వస్తారు. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చి వైద్యం చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. ఆస్పత్రులకు ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారం.. ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దాదాపు రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. రీయింబర్స్మెంట్తో మరింత సమస్య ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకంతోపాటు రీయింబర్స్మెంట్ను కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకోవాలి. తర్వాత ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వానికి సమరి్పస్తే.. ఆ సొమ్ము రీయింబర్స్మెంట్ అవుతుంది. కానీ దీనితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. రూ.10 లక్షల బిల్లు అయితే.. రూ.లక్ష, లక్షన్నర మాత్రమే వెనక్కి ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత వైద్య పథకం సరిగా అమలవకపోవడం, రీయింబర్స్మెంట్ పూర్తిగా రాకపోవడంతో.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని, ఏటా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్పై అస్పష్టత గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్కు కొన్ని రోజుల ముందు ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ)’ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత కలిపి జమ చేయాలని పేర్కొంది. అది అమల్లోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఈ స్కీంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నగదు రహిత వైద్యం అందేలా చూడాలి హెల్త్కార్డులు నిరుపయోగంగా మారాయి. రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తి మొత్తం అందడం లేదు. ఉపాధ్యాయుల మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లిస్తామని, ప్రత్యేక ట్రస్టుతో పథకం అమలు చేయాలని గత ప్రభుత్వాన్ని కోరాం. అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. విధివిధానాలు ఖరారుకాలేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఎం.పర్వత్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయడంలేదు హెల్త్కార్డులు నామ్ కే వాస్తేగా మారాయే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు అందించేలా చూడాలి. – కొమ్ము కృష్ణకుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ జిల్లా బిల్లు కట్టి.. ఎదురుచూపులు నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ పెన్షనర్ ప్రభుదాస్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. రూ.లక్ష బిల్లు అయింది. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలైంది. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తల్లికి చికిత్స చేయించి.. నిజామాబాద్ జిల్లాలోని డీఆర్డీవో ఆఫీసులో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రూ.లక్షకుపైగా బిల్లు అయితే సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, మూడు నెలలైనా ఇంకా రాలేదు. రూ.28 వేలు ఖర్చయితే.. రూ.12 వేలు వచ్చాయి మా అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించడం కోసం రూ.28 వేలు ఖర్చయ్యాయి. రీయింబర్స్మెంట్ కింద మెడికల్ బిల్లులు సమర్పించినప్పుడు రూ.12 వేలు మాత్రమే, అదీ ఏడాది తర్వాత అందాయి. ప్రభుత్వం నగదు రహిత చికిత్సఅందిస్తేనే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. – బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం -
ఏపీలో పెన్షన్.. టెన్షన్
అమరావతి, సాక్షి: ‘అమ్మో ఒకటో తారీఖు..’ అనుకుంటున్న ఏపీ పెన్షనర్లను ఆ ‘టెన్షన్’ ఇప్పుడు ఒకరోజు ముందుగానే పలకరించబోతోంది. కూటమి ప్రభుత్వం వరుసగా 3వ నెల పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి ఒక రోజు ముందే పెన్షన్ రానుంది. దీంతో.. అకారణంగా లిస్టు నుంచి తమ పేరును తొలగిస్తారేమో అనే ఆందోళన పింఛన్దారుల్లో నెలకొంది.ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరిట రెండో నెల(ఆగష్టు 1వ తేదీన) జరిగిన ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడింది.గడిచిన రెండు నెలల కాలంలో ఏపీలో పెన్షనర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు.ఆగష్టు నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది (ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052)జులై కంటే ఆగష్టులో ఏకంగా 79, 455 పెన్షన్లు తగ్గించింది ప్రభుత్వం. జగన్ హయాంలో ఏ నెల ఫించన్దారుల్లో కోతలు విధించిన దాఖలాలు లేవు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల కాలంలోనే పెన్షనర్లను భారీగా తగ్గించింది. దీనిపై సిబ్బందిని ఆరా తీస్తే.. నిబంధనల పేరుతోనే ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా ఉండొచ్చని చంద్రబాబు సర్కార్ సూత్రప్రాయంగా సంకేతాలిస్తోంది.వలంటీర్ల ఊసేది?ఏపీలో ఇంటింటికే పెన్షన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పడేసింది. వలంటీర్లు లేకుండానే రెండు నెలలు పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే సన్నద్ధం చేసింది. ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా.. ‘అసలు వలంటీర్లు అవసరం ఏముంది?’ అనే ధోరణితో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను కొనసాగించడం కన్నా.. ఏదో ఒక రకంగా రద్దు చేయాలని చూస్తోంది.మమ్మల్ని ముంచేశారుప్రతిపక్షంలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.ఇబ్బందులమయంగా పంపిణీ..చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని ఆదేశాలిప్పిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సర్వర్లో ఇబ్బందులతో సచివాలయ ఉద్యోగులు సతమతమవుతుండగా.. ఫించన్దారుల నిలదీతతో ఇబ్బందికర పరిస్థితి టీడీపీ ఈవెంట్గా.. పెన్షన్ల పంపిణీని గత ప్రభుత్వం ఏనాడూ రాజకీయ కార్యక్రమంగా చూడలేదు. కానీ, చంద్రబాబు మాత్రం దాన్ని టీడీపీ ఈవెంట్గా మార్చేశారు. టీడీపీలో చోటా లీడర్ల దగ్గరి నుంచి మంత్రుల స్థాయిదాకా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. లబ్ధిదారులతో ఉత్తుత్తి పంపిణీ ఫొజులు ఇచ్చి.. సోషల్ మీడియాలో పోస్టర్లు వేయించుకుంటున్నారు. పెన్షన్ వచ్చేనా?ఏపీలో దివ్యాంగుల్లో 8 లక్షల మంది పెన్షన్ పొందుతుండగా.. వారిలో 60 వేల మందికి మళ్లీ వైకల్య పరీక్షలు జరపాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందువల్ల వాళ్లకు పెన్షన్ వస్తుందా అనేది అనుమానమే. వృద్ధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇస్తున్న పెన్షనర్ల విషయంలోనూ రివిజన్ నిర్వహించాలని బాబు సర్కార్ యోచిస్తోంది. తద్వారా రకరకాల నిబంధనల పేరుతో మరికొందరిని జాబితా నుంచి తొగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లుంది. ఈసారి ఒకరోజు ముందుగానే ఆగస్టు 31న పెన్షన్ పంపిణీ చేస్తునప్పటికీ.. పెన్షన్ ఇవ్వడానికి ఎవరూ రాకపోతే ఎలా? అనే ఆందోళన లబ్దిదారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పెన్షన్ రాకపోతే.. సచివాలయాల చుట్టూ తిరగండి. అసలు మీ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోండి.. లేకపోతే ఇక అంతే.. అంటూ అధికారులు చెబుతున్నారని పెన్షనర్లు వాపోతున్నారు. -
ఏపీలో పెన్షనర్లకు షాక్..
-
పెన్షనర్లపై బాబు కొత్త కుట్ర..
-
డబుల్ పెన్షనర్ల నుంచి రూ.10 లక్షలు రికవరీ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ సర్వీసు పెన్షన్లు, సామాజిక ఆసరా పెన్షన్.. రెండూ పొందుతున్న పది మంది రూ.10 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. జిల్లాలో 71 మంది రెండు పెన్షన్లు పొందుతున్నట్లుగా పేర్కొంటూ జూలై 6న ‘సాక్షి’లో ‘ప్రభుత్వ పెన్షనర్లకు ఆసరా’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రెండు పెన్షన్లు పొందుతున్న వారికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీచేశారు. రెండు పెన్షన్లు పొందుతున్న వారు ఆసరా పెన్షన్ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశించారు.కాగా, ఏళ్ల తరబడి పొందిన ఆసరా పెన్షన్ డబ్బులను ఒకేసారి చెల్లించడం ఇబ్బందిగా ఉండడంతో రికవరీకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వారికి వెసులుబాటు కలి్పంచారు. ఇప్పటికే 10 మంది రూ.10 లక్షలు చెల్లించగా.. ఇంకా 61 మంది, రూ.47.75 లక్షల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని దశలవారీగా రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆసరా పెన్షన్లు నిలిపివేసి, సరీ్వసు పెన్షన్ నుంచి ఆ సొమ్మును దశలవారీగా రికవరీ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయకుండా వాయిదా పద్ధతిలో వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
పింఛన్లకు ‘అధికార’ గ్రహణం
బత్తలపల్లి/గాండ్లపెంట/పుట్టపర్తి అర్బన్/కోటనందూరు: రాష్ట్రంలో పెన్షన్లకు ‘అధికార’ గ్రహణం పట్టింది. టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్ నగదు అందకుండా చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్ను ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు బుధవారం వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎంపీడీవో శివనాగప్రసాద్ వారితో చర్చించారు. పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్ను ఆరాతీశారు. అందరికీ పింఛన్లు ఇవ్వాలని తాము భావించామని, అయితే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వారు వాపోయారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ అయిందని, వచ్చేనెల రెండునెలల పింఛన్ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కలెక్టర్ను కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. ⇒ గాండ్లపెంట మండలం ఎలుగూటివారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు పింఛన్ మంజూరైనా అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు కె.రమాదేవి, ఎం.నారాయణరెడ్డి, ఎం.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి బుధవారం ఎంపీడీవో రామానాయక్కు ఫిర్యాదు చేయాలని కార్యాలయానికి ఎంపీడీవో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్ను ఇప్పుడు నిలిపేశారని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. ⇒ స్థానిక టీడీపీ నాయకులను కలిసి వస్తేనే పింఛన్ ఇస్తామంటూ మూడురోజుల నుంచి తిప్పుకొన్న సచివాలయ సిబ్బంది చివరకు సైట్ క్లోజ్ అయిందంటూ పింఛన్ సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంసీపల్లి 1, 2 సచివాలయాలకు చెందిన పెన్షన్దారులు బుధవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ రోజూ ఇలా జరగలేదని, వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ మొత్తాన్ని ఇచ్చేవారని చెప్పారు. ప్రభుత్వం మారగానే పింఛన్ ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సిబ్బంది సూచన మేరకు వారు డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పీడీ నరసయ్య లేకపోవడంతో అధికారి శివమ్మ వద్ద గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై డీఆర్డీఏ పీడీ నరసయ్యను వివరణ కోరగా .. ఈ విషయాన్ని పరిశీలించాలని రామగిరి ఎంపీడీవోని ఆదేశించామని, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ⇒ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛనుదారులకు అధికారులు పింఛన్ నిలిపేశారు. సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి ఏడుగంటల వరకు సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సమస్యను బుధవారం ఎంపీపీ లగుడు శ్రీనివాసుకి వివరించారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీడీవో జయమాధవికి వినతిపత్రమిచ్చారు. దీనిపై ఎంపీడీవో జయమాధవిని వివరణ అడగగా.. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు తీసుకుంటున్నారని 18 మందిపై ఫిర్యాదు అందడంతో వారికి పింఛన్లు ఆపేశామన్నారు. విచారించి వారు అర్హులైతే వచ్చేనెల నుంచి ఇస్తామని చెప్పారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు ఇంత దారుణం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో ఒక్కనెల కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు. కలెక్టర్ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. - సిద్ధయ్య, ఎంసీపల్లి, రామగిరి మండలం అప్పుడు ఎవరికీ తొలగించలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ పెన్షన్ తొలగించలేదు. ఒకవేళ మా నాయకులు తప్పుచేస్తే నాకు చెప్పండి లేదా కోర్టుకు వెళ్లండని చెప్పిన గొప్ప నాయకుడు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా చేస్తున్నారు. - నరసింహారెడ్డి, ఎంసీపల్లి, రామగిరి మండలం సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? నా కుమార్తె నందివర్ధినీబాయికి తలసేమియా పెన్షన్ వస్తోంది. పాపను ఎత్తుకుని నా భార్య మూడురోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది. టీడీపీ వాళ్లను కలిసి ఫోన్చేయిస్తే ఇస్తామని చెప్పారు. లోకల్ లీడర్ల ప్రెజర్ ఉందని, వాళ్లను కలవాలని సెక్రటరీ, ఎంపీడీవో చెప్పడం అన్యాయం. సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలీల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు స్పందించి నందివర్ధినీబాయికి బాసటగా నిలవాలి. - ముత్యాలనాయక్, ఆర్.కొత్తపల్లి, రామగిరి మండలం -
పెన్షన్ దారులకు వెన్ను పొట్లు బాబు మార్క్ కుట్ర
-
మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు
-
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
-
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
-
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
-
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
-
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. -
పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..
-
ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర
కడప కార్పొరేషన్: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. 10,177 మంది రెగ్యులరైజ్ రాష్ట్ర బడ్జెట్ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియెర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్ష¯Œన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్ చేశారని, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్.. 12వ పే రివిజన్ కమిషన్ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు. వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్రెడ్డి వివరించారు. -
అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు, దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్చైర్కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. -
అవ్వాతాతలూ ఆలోచించండి.. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే: సీఎం జగన్
వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికేముంది? నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు.. ఎలాగూ చేసేది లేదు కదా! అనే మనస్తత్వం వాళ్లది. మీ బిడ్డ అలా కాదు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడమే. – పింఛన్దారులతో సీఎం జగన్ సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ‘‘పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఏ వర్గానికైనా సరే.. మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే ఎక్కడా మీ బిడ్డ తగ్గడు. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు అని స్పష్టంగా చెబుతున్నా. మన ప్రమాణ స్వీకారం రోజు వలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమంపైనే మొట్ట మొదటి సంతకం చేస్తా’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం, మోసం చేయడం తెలియదు కాబట్టి బాబు, ఆయన కూటమితో ఈ రెండు విషయాల్లో మాత్రం పోటీ పడలేడని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే.. అవ్వాతాతలపై ప్రేమతో... ఈరోజు అవ్వాతాతలతోపాటు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ ఇచ్చిన పెన్షన్ రూ.1,000 మాత్రమే. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకుంటేనే అందిన దుస్థితి. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అప్పట్లో నెలకు వెచ్చించిన వ్యయం కేవలం రూ.400 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ అవ్వాతాతల గురించి, వారి కష్టాలు, ఆత్మగౌరవం గురించి ఆలోచన చేశాడు. అధికారంలోకి రాగానే దేశంలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను నెలకొల్పి వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా 1వ తారీఖునే అది సెలవు రోజైనా, ఆదివారమైనా సరే ఇంటివద్దే నేరుగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్లు పెట్టిన పరిస్థితి 56 నెలలు మన ప్రభుత్వం హయాంలోనే జరిగింది. గతంలో 39 లక్షలు మంది మాత్రమే íపింఛనుదారులుండగా ఈరోజు వివక్ష లేకుండా 66.34 లక్షల మందికి ఠంఛన్గా పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా గత సర్కారు హయాంలో మాదిరిగా రూ.వెయ్యి కాకుండా ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళ్లి అవ్వాతాతలకు మంచి చేశాం. ఈ తేడాను ఒక్కసారి గమనించండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఆ అవ్వలు, తాతలు, అభాగ్యుల పట్ల మనసులో నిజమైన ప్రేమ ఉంటేనే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సభకు హాజరైన అవ్వాతాతలు బాబు ఆ ఆలోచనే చేయలేదు.. మీరంతా గత పాలకులను చూశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు పరిపాలన చేశానని చెబుతుంటారు. కానీ ఏ ఒక్క రోజైనా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఆయన ఆలోచన చేశాడా? అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలనే తాపత్రయం, మనసులో ప్రేమ ఉంటేనే చేతల్లో బయటకు వస్తుంది. ఇవాళ రాజకీయాలు పాతాళానికి దిగజారాయి. విలువలు, విశ్వసనీయత లేవు. ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ తొలిసారిగా అడుగులు వేగంగా వేశాడు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఏకంగా 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చాడు. మీ బిడ్డకు అబద్ధాలు, మోసాలు తెలియవు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ ముందు ఉంచుతున్న వాస్తవాలపై ఆలోచన చేయమని అందరినీ కోరుతున్నా. దేశంలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదే జనాభా ప్రకారం చూస్తే ఐదు కోట్ల మందిలో 66.34 లక్షల మందికి పెన్షన్లు, అత్యధికంగా పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రం మనదే. నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే అందచేస్తున్నాం. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నాం. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలిపితే ఏకంగా రూ.90 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. ఏటా రూ.24 వేల కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా బిహార్లో రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో రూ.5,160 కోట్లు, కర్ణాటకలో రూ.4,700 కోట్లు, పక్కన తెలంగాణలో రూ.8,180 కోట్లు చొప్పున ఏటా పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే అవ్వాతాతలను మోసం చేసేందుకు రూ.4 వేలు.. రూ.5 వేలు.. రూ.6 వేలు అని చెబుతారు. ఇంకా అవసరం అయితే ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు అని కూడా అంటారు. మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా చేయగలిగిందే చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాదు. ఈ 58 నెలల పాలన చూస్తే చెప్పనివి కూడా చాలా చేసిన పరిస్థితి మీ అందరికీ కనిపిస్తుంది. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. మీ అందరికీ అందుకే చెబుతున్నా. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండీ. మీ బిడ్డ పేదల సంక్షేమానికి సంవత్సరానికి దాదాపుగా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తేవడంతో ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని నమ్మబలుకుతున్న చంద్రబాబు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. సునాయాసంగా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మీలో ఎవరైనా నాకు సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్లిప్పులో రాసి బాక్సులో వేస్తే నావద్దకు వస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు చంద్రబాబు చేసిన పనికి... నాకు కాలు విరగడంతో ఆపరేషన్లు జరిగాయి. అన్ని పథకాలు కలిపి రూ.3.40 లక్షలు అందాయి. నీ మేలు ఎప్పుడూ మరవలేం. చంద్రబాబు చేసిన పనికి చాలా కష్టం అయింది. నాకు ఆయాసం ఉంది. మూడుసార్లు కూర్చుని లేచి సచివాలయానికి వెళ్లా. తోడు కోసం ఓ పాపను తీసుకెళితే రాయి తగిలి కింద పడటంతో ఆమె ముక్కుకు గాయం అయింది. మమ్మల్ని ఇంత కష్టపడేలా చేసింది చంద్రబాబే. రైతుభరోసా సహా నాకు ఎన్నో పథకాలు అందాయి. మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకున్నా. నీవల్లే ధైర్యంగా బతుకుతున్నా. – కర్నాటి సుబ్బులు, కుర్చేటి మండలం, అగ్రహారం ఎంత ఇబ్బంది బాబూ.. ఇన్నాళ్లూ వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెడితే ఈనెలలో మాత్రం మూడు చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళితే అక్కడ కాదన్నారు. ఇంకో చోటకు వెళితే అక్కడా కాదన్నారు. మోకాళ్ల నొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ బాబు! ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. మాకు వలంటీర్లు, వలంటీర్ల వ్యవస్థ కావాలి. కరోనాలో మాసు్కలతో సహా ఇంటివద్దకే పంపించారు. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకు పథకాలు అందుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తే ఒప్పుకోం. – పట్రా ప్రభావతి, దర్శి దివ్యాంగులు, వృద్ధులపై అక్కసు.. టీడీపీ హయాంలో దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. మీరు (సీఎం జగన్) పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలిచ్చారు. అందులో ఇవ్వని హామీ ఒకటి ఏమిటంటే దేవుడి దూతలా వలంటీర్లను పంపించడం. వారు ఇంటింటికీ వచ్చి దివ్యాంగులకు పెన్షన్లే కాకుండా సదరం సర్టిఫికెట్ నుంచి ఆధార్ కార్డు దాకా ప్రతి ఒక్కటీ అందేలా చేశారు. బాబు మిమ్మల్ని ఏమీ చేయలేక అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టి కొట్టుకుపోతారు. 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోవటాన్ని నేను కళ్లారా చూశా. దీనికి ఎవరు కారణమనేది అందరూ ఆలోచన చేయాలి. – నర్సింహారావు, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు నిన్నే నమ్ముకున్నానయ్యా.. నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాకు వైఎస్సార్ ఇల్లు కట్టించాడు. నాకు నలుగురు కొడుకులున్నా నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది బ్యాంకుల నుంచి రూ.23 వేలు వచ్చాయి. నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా. – గంగిరెడ్డి మంగమ్మ, బొట్టపాలెం దోమలు కుడుతున్నా.. పింఛన్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి మాకు పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలే ఉండేవి. దోమలు కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుందనే భయంతో వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వుండేవాడ్ని. సిబ్బంది 8 గంటలకు వచ్చేవారు. అన్ని పూర్తి చేసేసరికి 9 గంటలు అయ్యేది. అప్పటికే దాదాపు రెండు మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లను తరువాత రావాలని పంపేవారు. అలా వారం రోజులు పెన్షన్లు ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన బంగారు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వారికి మే 13న ప్రజాకోర్టు శిక్ష వేస్తుంది. జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది. – వెంకటపతి, దర్శి పల్లెటూళ్లకు పాలన తెచ్చారు.. నవరత్నాల పథకాల వల్ల మాలాంటి పేదలకు నాలుగు వేళ్లు నోట్లోకి పోతున్నాయి. నాడు పరిపాలన కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. నేడు పల్లెటూళ్లకు పరిపాలన తెచ్చిన ఘనత మన జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీస్కు వెళ్లాల్సిందే. ఇప్పుడు అన్నీ గ్రామాల్లోనే లభిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నీలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడ్ని చూసి భయపడుతున్నారు. – శ్రీనివాస్రెడ్డి, బసిరెడ్డిపాలెం గ్రామం నీ నీడన మేం ఉండాలి.. నా పెనిమిటి మరణించి 15 ఏళ్లు అయింది. నాకు ఇల్లూ వాకిలీ లేదు. ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. ఇప్పటి వరకూ రూ.1.30 లక్షల మేర లబ్ధి పొందా. ఈనెల పెన్షన్ వలంటీర్ ఇవ్వలేదు. నా కుమారుడిని అడిగితే దర్శి వెళ్లి తెచ్చుకోవాలన్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేను. ఎవరినో బతిమాలి వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నా. జగనన్నా మళ్లీ నువ్వే రావాలి. 175కి 175 రావాలి. నీ నీడన మేం ఉండాలి. మంచి మనసున్న మారాజు నువ్వు. సొంత కొడుకులు, కోడళ్లు పదెకరాల ఆస్తి ఇచ్చినా మనల్ని చూడరు. కానీ అందరినీ చూసే మంచి మనసున్న మనిషి దైవబలంతో ఆ తల్లికి జన్మించాడు. అలాంటి జగనన్నను మనం గెలిపించుకోవాలి. – వెంకాయమ్మ, శివాజీ నగరం వార్డు, దర్శి, వితంతు పెన్షన్ లబ్ధిదారు ఐదు గద్దలు మాపై పడ్డాయి.. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలు అరకొర పెన్షన్లు ఇవ్వడంతోపాటు ఒక íపింఛనుదారుడు చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలు మంజూరు చేసేవి. వలంటీర్లను అడ్డుకునేందుకు రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి లాంటి ఐదు గద్దలు తోడయ్యాయి. ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి నాలాంటి గుడ్డోళ్లు, ముసలోళ్లను దెబ్బ తీశారు. పది మంది చూపు పడితే బండ రాళ్లైనా పగిలిపోతాయి. 69 లక్షల మంది చూపు పడి ఆ ఐదుగురూ నామరూపాలు లేకుండా పోతారు. – శ్రీను, పెద ఉయ్యాలవాడ, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు -
పింఛన్ల లబ్ధిదారులపై అక్కసు వెళ్లగక్కుతున్న టీడీపీ నేతలు
-
అవ్వాతాతలకు ఇంటి దగ్గర పెన్షన్ రాకుండా చేసిన పచ్చ గ్యాంగ్
-
బాబు నిర్వాకం వల్లే సచివాలయాలకు వెళ్లే దుస్థితి: పెన్షన్ దారులు
-
జగన్ సీఎం అయ్యాకే సక్రమంగా పింఛన్: వృద్ధులు
-
‘పచ్చ’పగ.. పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు (ఫొటోలు)
-
ఊహల్లో బ్రతుకుతున్న బాబు.. ముమ్మాటికీ ఇది చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్ర
-
చంద్రబాబు వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందని అవ్వాతాతల ఆవేదన
-
చంద్రబాబు వేస్ట్...వాలంటీర్లే బెస్ట్
-
కుట్ర ఫలించి.. గడప దాటించి!
చంద్రబాబు అండ్ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్దారులకు పింఛన్ కష్టాలు పునరావృతం కానున్నాయి. తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అనుంగు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్ ఒకవైపు కోర్టుల్లో వలంటీర్లపై కేసులు వేయడం.. మరోవైపు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ దూరం పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఐదేళ్లుగా ఇంటి వద్దే పింఛను అందుకుంటున్న లబి్ధదారులు టీడీపీ కుట్రతో మొదటిసారి గడప దాటాల్సి రావడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 4,69,789 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.140,15,56,500 బ్యాంకులకు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి బుధవారం నగదు డ్రా చేయనున్నారు. వీలైనంతవరకు బుధవారమే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ అయినా గురువారం నుంచి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 సచివాలయాల్లో పించన్ల పంపిణీ జరుగుతుంది. 6వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 2,46,863 పింఛన్లకు రూ.73.90 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,22,935 పింఛన్లకు రూ.66.24 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. దీంతో పింఛన్దారులు వలంటీర్లను గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా పింఛన్ పొందుతున్న వారికి పచ్చ కూటమి కారణంగా మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాల్సి ఉన్నందున మొదటి రోజు పంపిణీలో జాప్యం జరుగుతుంది. 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్దారులు కిలో మీటర్ల దూరంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4.70 లక్షల మందికి కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీపై పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికే పింఛన్ పంపితే... చంద్రబాబు మళ్లీ పాత పద్ధతిలో సచివాలయాల చుట్టూ తిప్పేలా చేశాడని పింఛన్దారుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అందరికీ పింఛన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ ముగిసే వరకు సచివాలయాల వద్ద షామియానాలు వేయడంతో పాటు నీటి సదు పాయం కలి్పంచేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీరికి ఇంటి వద్దే పంపిణీ ► ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల పింఛన్లు ఉండగా... ఇందులో వికలాంగులు, వయోవృద్ధులు (నడవలేని వారు), మంచానికే పరిమితమైనవారు, కిడ్నీ, డయాలసిస్ పేషెంట్లకు ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగులు పింపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ► ఇటువంటి వారు దాదాపు 30–40 శాతం మంది ఉంటారు. ► సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ► సచివాలయాల్లేని మజరా గ్రామాల్లో పింఛన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఒకవైపు 30–40 శాతం మందికి ఇంటి వద్ద.. మిగిలిన వారికి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయనుండటం గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. బాబు ఎంత పని చేశావయ్యా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లూ ఎప్పుడూ పింఛన్ కోసం ఆలోచించలేదు. ఠంచన్గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇప్పడు భయపడుతున్నారు. మా లాంటి వారికి ఇంటికొచ్చి ఎవరు వస్తారో తెలియదు. ఎవరినీ అడగాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ముసలోళ్ల మీద దయలేదు. –కరీంబీ, డబ్ల్యూ.గోవిందిన్నె, దొర్నిపాడు మండలం లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో.. నాకు వితంతు పింఛన్ వస్తుంది. ప్రతి నెలా వలంటీర్లు తెల్లవారుజూమున ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. కానీ ఈ నెల ఒకటవ తేదీ వచ్చింది కానీ పింఛను అందలేదు. వలంటీర్ను అడిగితే సచివాలయానికి రావాలని చెబుతున్నారు. అందరూ అక్కడికి పోతే పెద్ద లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో తెలియడం లేదు. కూలీకి వెళ్లకుండా పింఛన్ కోసం వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు మాలాంటి పేదల మీద ఎప్పుడూ ఏడుస్తుంటాడు. – తెలుగు వెంకట లక్ష్మమ్మ, గిద్దలూరు గ్రామం, సంజామల మండలం మా ఉసురు తగులుతుంది టీడీపీ పాలనలో పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయలేదు. అప్పట్లో పంచాయతీ కార్యాలయం వద్ద వారాల కొద్ది ఎదురు చూసేటోళ్లం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ ద్వారా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దకు పింఛన్ ఇచ్చి పంపుతున్నాడు. పింఛన్లు వలంటీర్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణం. చంద్రబాబుకు ఓటు వేసే ప్రసక్తే లేదు. మా ముసలోళ్ల ఉసురు ఆయనకు తగులుతుంది. – బోయ నరసమ్మ, నాగలదిన్నె, నందవరం మండలం -
పండుటాకులపై పగా?
‘మేం ఏం పాపం చేశాము. మాపైన వాళ్లకు ఎందుకంత పగ. వలంటీర్లపై కక్షగట్టి మా నుంచి దూరం చేశారు. ఒకటో తేదీ తెల్లవారేసరికి ఇంటికొచ్చే పెన్షన్ని రానీయకుండా చేశారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ మేము క్యూల్లో నిలబడాలా..?. మండుటెండల్లో సొమ్మసిల్లి పడిపోవాలా..?. పనులు మానుకుని.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరీక్షించాలా..?’ అంటూ పెన్షన్ దారులు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు అండ్ కో.. వలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని సంక్షేమ పథకాల నుంచి మినహాయించింది. లబి్ధదారులకు ఒకటో తేదీ అందాల్సిన పెన్షన్ అందకుండా పోయింది. దీంతో లబి్ధదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. గుడ్డివారి గోష్ట టీడీపీకి తగులుతుంది నాకు కంటి చూపులేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మనిషి తోడుకావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే ప్రతినెలా ఒకటవ తేదీ గ్రామ వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేదాన్ని. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఈ నెల నుంచి ఎన్నికల సాకు చూపి వలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి పక్కన పెట్టడం దురదృష్టకరం. నా లాంటి కంటిచూపు లేని వాళ్లు ఎక్కడో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి క్యూలో నిలబడి పింఛన్ ఎలా తీసుకోవాలి..?. మాలాంటి వారి గోడు తప్పక తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము.గత 58 నెలలు ఆ బాధల నుంచి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని విముక్తి లభించింది. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. –నాగమ్మ, వెంగారెడ్డికండ్రిగ, వరదయ్యపాళెం మండలం లేవలేని స్థితిలో ఉన్నా నాకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదల్లేక మంచానికే పరిమితమైనాను. నెలనెలా వచ్చే పింఛనుపైనే మందులుమాకులు ఇతరులతో చెప్పి తెప్పించుకునేవాడిని. ప్రతినెలా ఒకటో తారీఖున వలంటీర్ నిద్రలేపి నా వేలిముద్ర తీసుకుని ఇంటివద్దనే పింఛన్ ఇచ్చేవాడు. ఈ రోజు(సోమవారం) పింఛన్ ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారు. నేను అంత దూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకునేది..?. ఏ పుణ్యాత్ముడో ఫిర్యాదు చేసి నాలాంటి వారి ఉసురు పోసుకున్నాడు. పింఛన్ ఇంటికి రాకుండా చేశారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నలుగురిని మంచంపై సచివాలయం వద్దకు మోసుకెళ్లాలి. అదే వలంటీర్ అయితే ఇంటివద్దకే వచ్చి ఇచ్చిపోయుండేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏ దిగులూ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇవ్వకపోయినా ఆయన చేసిన మేలు మరిచిపోతామా?. – గోవిందనాయుడు, కుప్పంబాదూరు గ్రామం, రామచంద్రాపురం టీడీపీ పాలనలో అష్టకష్టాలు..మళ్లీనా? వాకాడు మండలం, ఇన్నమాల గ్రామానికి చెందిన పోలయ్య వయసు 91, చేను చెంగమ్మ వయసు 85, ఇన్నమాల సుబ్బమ్మ వయసు 86, బండి వెంకటసుబ్బయ్య వయసు 78. వీరి వలంటీర్లు ఉమ్మడి మోహన్, పీ.సులోచన, అఖిల కవిత. సోమవారం ఒకటో తేదీ కావడంతో వారి రాకకోసం ఎదురు చూశారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా నాయనా.. మీరు మాకు పింఛన్ ఇచ్చే వారా?.. అయితే నా పేరు ఫలానా.. నాకు పింఛన్ ఇవ్వండి’ అని అడిగి మరీ నిరాశ చెందారు. తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు వీ«ధి కాలవలపై కూర్చుని పింఛన్ కోసం ఎదురు చూసి నిట్టూర్పుతో వెనుదిరిగారు. చంద్రబాబు పుణ్యమా అంటూ మరో మూడు నెలలు పింఛన్ ఇంటికి రాదని సమాచారం తెలుసుకున్న అవ్వాతాతలు మాకు పింఛన్ రాకుండా చేసిన చంద్రబాబు, వారి మనుషులు మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు బాబు కుట్రలకు బలైపోయాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతిరోజూ అవస్థలే. ఎప్పుడు..? ఎక్కడిస్తారో తెలియని పరిస్థితి. పంచాయతీ, పోస్టల్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కష్టాల నుంచి వృద్ధులను, వితంతువులను గట్టెక్కించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ వలంటీర్ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. అనారోగ్య కారణంతో మంచానికే పరిమితమైన నాలాంటి వారికి ఈ పద్ధతి ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. నేను సచివాలయానికి వెళ్లాలంటే అద్దె ఆటో కావాలి. దానికి తోడు నా వెంట మరో వ్యక్తి సహాయం అవసరం. ఇంట్లో వారు సైతం పనులు మానుకుని నా వెంట రావాల్సిన పరిస్థితి. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు. నాలాంటి వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. –మాచాలమ్మ, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం మేమంటే బాబుకు ఎందుకంత కక్ష గతంలో వెయ్యి రూపాయల పింఛన్ కోసం మండుటెండల్లో కిలోమీటరు పొడవున ఉండే క్యూలో నిలబడేదాన్ని. నా మనవడు జగన్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. నాకు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు జామున్నే మా వలంటీర్ సులోచన ఇంటికొచ్చి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేది. ఈనెల ఒకటోతేదీ వచ్చినా మా వలంటీర్ ఇంటికి రాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడపలో కూర్చుని ఎదురు చూశాను. ఎందుకు రాలేదని వేరే వాళ్లను అడిగితే చంద్రబాబు, వాళ్ల మనుషులు వలంటీర్లుపై కోర్టుకు వెళ్లి కేసు వేశారని చెప్పారు. మరో మూడు నెలలు ఆఫీసుకాడికి వెళ్లి పింఛన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గరపడి పేదలను ఇలా కష్టాలు పెడుతున్నాడు. చంద్రబాబు అప్పుడు అలా చేశాడు.. ఇప్పుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన పాలనలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని నాలుగో రోజున పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు నా మనవడు జగన్ దయతో ఐదేళ్లు ఆ కష్టాలు తప్పినాయి. మళ్లీ చంద్రబాబు పాత రోజులను తీసుకురావడం దుర్మార్గం. చేను చెంగమ్మ వృద్ధురాలు, గొల్లపాళెం, వాకాడు మండలం మా ఉసురు తగలకుండా పోదు జగనన్న ప్రభుత్వ హయంలో మాకు తెల్లారేసరికి నిద్రలేపి పింఛన్ ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛను ఇచ్చి, సమస్యలు అడిగి తెలుసుకునేవారు. జీతం తరహాలో పింఛను తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు మాకు అండగా నిలిచారు. వలంటీర్ల సేవలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడేమో ఎన్నికలు అని చెప్పి మాకు పింఛన్ అందకుండా చేశారు. పింఛన్ అడ్డుకున్న వాళ్లకు మాలాంటి ముసలోళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం వలంటీర్ల ద్వారా మాకు మంచి చేస్తుంటే ఓర్వలేక అడ్డుపడడం బాధగా ఉంది. ఎవరో వద్దన్నారని వలంటీర్లు ఏమో ఈరోజు పింఛను ఇవ్వలేదు. ఎందుకని అడిగితే టీడీపీ వాళ్లు వలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతేనా..?. మాలాంటి ముసలోళ్లకి మంచి జరిగితే ఓర్వలేరా..?. మాలాంటి వాళ్లపైన కక్షగడ్డి పింఛన్ రాకుండా చేశారు. మా ఉసురు తలగకుండా పోదు. – సరసమ్మ, ఎర్రమిట్ట, తిరుపతి -
మేమంటే బాబుకు ఎందుకంత కక్ష
‘మేం ఏం పాపం చేశాము. మాపైన వాళ్లకు ఎందుకంత పగ. వలంటీర్లపై కక్షగట్టి మా నుంచి దూరం చేశారు. ఒకటో తేదీ తెల్లవారేసరికి ఇంటికొచ్చే పెన్షన్ని రానీయకుండా చేశారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ మేము క్యూల్లో నిలబడాలా..?. మండుటెండల్లో సొమ్మసిల్లి పడిపోవాలా..?. పనులు మానుకుని.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరీక్షించాలా..?’ అంటూ పెన్షన్ దారులు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు అండ్ కో.. వలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని సంక్షేమ పథకాల నుంచి మినహాయించింది. లబి్ధదారులకు ఒకటో తేదీ అందాల్సిన పెన్షన్ అందకుండా పోయింది. దీంతో లబి్ధదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. గుడ్డివారి గోష్ట టీడీపీకి తగులుతుంది నాకు కంటి చూపులేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మనిషి తోడుకావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే ప్రతినెలా ఒకటవ తేదీ గ్రామ వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేదాన్ని. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఈ నెల నుంచి ఎన్నికల సాకు చూపి వలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి పక్కన పెట్టడం దురదృష్టకరం. నా లాంటి కంటిచూపు లేని వాళ్లు ఎక్కడో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి క్యూలో నిలబడి పింఛన్ ఎలా తీసుకోవాలి..?. మాలాంటి వారి గోడు తప్పక తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము.గత 58 నెలలు ఆ బాధల నుంచి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని విముక్తి లభించింది. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. –నాగమ్మ, వెంగారెడ్డికండ్రిగ, వరదయ్యపాళెం మండలం లేవలేని స్థితిలో ఉన్నా నాకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదల్లేక మంచానికే పరిమితమైనాను. నెలనెలా వచ్చే పింఛనుపైనే మందులుమాకులు ఇతరులతో చెప్పి తెప్పించుకునేవాడిని. ప్రతినెలా ఒకటో తారీఖున వలంటీర్ నిద్రలేపి నా వేలిముద్ర తీసుకుని ఇంటివద్దనే పింఛన్ ఇచ్చేవాడు. ఈ రోజు(సోమవారం) పింఛన్ ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారు. నేను అంత దూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకునేది..?. ఏ పుణ్యాత్ముడో ఫిర్యాదు చేసి నాలాంటి వారి ఉసురు పోసుకున్నాడు. పింఛన్ ఇంటికి రాకుండా చేశారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నలుగురిని మంచంపై సచివాలయం వద్దకు మోసుకెళ్లాలి. అదే వలంటీర్ అయితే ఇంటివద్దకే వచ్చి ఇచ్చిపోయుండేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏ దిగులూ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇవ్వకపోయినా ఆయన చేసిన మేలు మరిచిపోతామా?. – గోవిందనాయుడు, కుప్పంబాదూరు గ్రామం, రామచంద్రాపురం టీడీపీ పాలనలో అష్టకష్టాలు..మళ్లీనా? వాకాడు మండలం, ఇన్నమాల గ్రామానికి చెందిన పోలయ్య వయసు 91, చేను చెంగమ్మ వయసు 85, ఇన్నమాల సుబ్బమ్మ వయసు 86, బండి వెంకటసుబ్బయ్య వయసు 78. వీరి వలంటీర్లు ఉమ్మడి మోహన్, పీ.సులోచన, అఖిల కవిత. సోమవారం ఒకటో తేదీ కావడంతో వారి రాకకోసం ఎదురు చూశారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా నాయనా.. మీరు మాకు పింఛన్ ఇచ్చే వారా?.. అయితే నా పేరు ఫలానా.. నాకు పింఛన్ ఇవ్వండి’ అని అడిగి మరీ నిరాశ చెందారు. తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు వీ«ధి కాలవలపై కూర్చుని పింఛన్ కోసం ఎదురు చూసి నిట్టూర్పుతో వెనుదిరిగారు. చంద్రబాబు పుణ్యమా అంటూ మరో మూడు నెలలు పింఛన్ ఇంటికి రాదని సమాచారం తెలుసుకున్న అవ్వాతాతలు మాకు పింఛన్ రాకుండా చేసిన చంద్రబాబు, వారి మనుషులు మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు బాబు కుట్రలకు బలైపోయాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతిరోజూ అవస్థలే. ఎప్పుడు..? ఎక్కడిస్తారో తెలియని పరిస్థితి. పంచాయతీ, పోస్టల్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కష్టాల నుంచి వృద్ధులను, వితంతువులను గట్టెక్కించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ వలంటీర్ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. అనారోగ్య కారణంతో మంచానికే పరిమితమైన నాలాంటి వారికి ఈ పద్ధతి ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. నేను సచివాలయానికి వెళ్లాలంటే అద్దె ఆటో కావాలి. దానికి తోడు నా వెంట మరో వ్యక్తి సహాయం అవసరం. ఇంట్లో వారు సైతం పనులు మానుకుని నా వెంట రావాల్సిన పరిస్థితి. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు. నాలాంటి వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. –మాచాలమ్మ, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం మేమంటే బాబుకు ఎందుకంత కక్ష గతంలో వెయ్యి రూపాయల పింఛన్ కోసం మండుటెండల్లో కిలోమీటరు పొడవున ఉండే క్యూలో నిలబడేదాన్ని. నా మనవడు జగన్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. నాకు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు జామున్నే మా వలంటీర్ సులోచన ఇంటికొచ్చి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేది. ఈనెల ఒకటోతేదీ వచ్చినా మా వలంటీర్ ఇంటికి రాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడపలో కూర్చుని ఎదురు చూశాను. ఎందుకు రాలేదని వేరే వాళ్లను అడిగితే చంద్రబాబు, వాళ్ల మనుషులు వలంటీర్లుపై కోర్టుకు వెళ్లి కేసు వేశారని చెప్పారు. మరో మూడు నెలలు ఆఫీసుకాడికి వెళ్లి పింఛన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గరపడి పేదలను ఇలా కష్టాలు పెడుతున్నాడు. చంద్రబాబు అప్పుడు అలా చేశాడు.. ఇప్పుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన పాలనలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని నాలుగో రోజున పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు నా మనవడు జగన్ దయతో ఐదేళ్లు ఆ కష్టాలు తప్పినాయి. మళ్లీ చంద్రబాబు పాత రోజులను తీసుకురావడం దుర్మార్గం. చేను చెంగమ్మ వృద్ధురాలు, గొల్లపాళెం, వాకాడు మండలం మా ఉసురు తగలకుండా పోదు జగనన్న ప్రభుత్వ హయంలో మాకు తెల్లారేసరికి నిద్రలేపి పింఛన్ ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛను ఇచ్చి, సమస్యలు అడిగి తెలుసుకునేవారు. జీతం తరహాలో పింఛను తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు మాకు అండగా నిలిచారు. వలంటీర్ల సేవలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడేమో ఎన్నికలు అని చెప్పి మాకు పింఛన్ అందకుండా చేశారు. పింఛన్ అడ్డుకున్న వాళ్లకు మాలాంటి ముసలోళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం వలంటీర్ల ద్వారా మాకు మంచి చేస్తుంటే ఓర్వలేక అడ్డుపడడం బాధగా ఉంది. ఎవరో వద్దన్నారని వలంటీర్లు ఏమో ఈరోజు పింఛను ఇవ్వలేదు. ఎందుకని అడిగితే టీడీపీ వాళ్లు వలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతేనా..?. మాలాంటి ముసలోళ్లకి మంచి జరిగితే ఓర్వలేరా..?. మాలాంటి వాళ్లపైన కక్షగడ్డి పింఛన్ రాకుండా చేశారు. మా ఉసురు తలగకుండా పోదు. – సరసమ్మ, ఎర్రమిట్ట, తిరుపతి -
మాపై నీకెందుకింత కక్ష?.. చంద్రబాబుపై పింఛన్దారుల ఆగ్రహం
రాజమహేంద్రవరం సిటీ/పెదబయలు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ‘మాపై నీకెందుకింత కక్ష? వృద్ధుల విషయంలో కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావ్. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకుంటావా?’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ పింఛన్ కానుక లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జాంపేట గణేష్ చౌక్ వద్ద వందలాది మంది పింఛన్దారులు సోమవారం ఆందోళన చేశారు. ఎంపీ, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్లు తమ ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్ డబ్బులు చేతిలో పెట్టేవారని చెప్పారు. కానీ ఈ దుర్మార్గపు చంద్రబాబు చేసిన పని వల్ల ఈరోజు ఇంటి వద్ద పింఛన్ అందుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అసలు పింఛన్ మంజూరవ్వడానికే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని.. పింఛన్ కోసం ఎండలో క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు పడేవాళ్లమంటూ గుర్తు చేసుకున్నారు. ఆకలి వేసినా, వడదెబ్బ కొట్టి పడిపోయినా, అనారోగ్యం వచ్చినా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదన్నారు. అధికారం నుంచి దించేసినా చంద్రబాబుకు సిగ్గురాలేదని మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని.. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు పాలన, ఆ జన్మభూమి కమిటీలను తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. టీడీపీ పాలనలో పింఛన్ కోసం కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలన వచ్చాక ప్రతి నెలా క్రమం తప్పకుండా వలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారని.. ఇంత చక్కని పాలన ఇంకెవ్వరూ అందించలేరన్నారు. తమకు మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలంటూ నినాదాలు చేశారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని ఎంపీ భరత్ చెప్పారు. బాబు నిర్వాకంతో 10 కిలోమీటర్లు నడవాలి అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గోమంగి, గుల్లేలు పంచాయతీల పరిధిలోని పింఛన్దారులు సోమవారం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థ వల్ల ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే వలంటీర్లు తమ ఇళ్లకు వచ్చి పింఛన్ ఇచ్చేవారని చెప్పారు. కానీ చంద్రబాబు చేసిన పని వల్ల ఏజెన్సీలో ఉండే తాము ఎంతో బాధపడాల్సి వస్తోందన్నారు. గుల్లేలు పంచాయతీ కించూరు, బూరుగువీధి, పెదవంచరంగి, జంగంపట్టు గ్రామాలకు సుమారు 10 కిలోమీటర్ల దూరమని, గోమంగి పంచాయతీ కరుగొండ, బొండ్డాపుట్టు, కుంతురుపుట్టు, వన్నాడ, వంకరాయి గ్రామాలకు కూడా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నిర్వాకం వల్ల తాము 10కిలోవీుటర్లు నడిచి వచ్చి సచివాలయంలో పింఛన్ తీసుకోవడం కష్టంతో కూడుకున్నదని వాపోయారు. చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులను నమ్మవద్దని ఎన్నికల కమిషన్ను కోరారు. -
పాపాల చంద్రబాబుకు అవ్వాతాతల హెచ్చరిక
-
పెనుకొండ సభలో పింఛనుపై తన వైఖరి ప్రకటించిన చంద్రబాబు
-
సీఎం జగన్ చిత్రపటానికి రాజధాని ప్రాంత రైతు కూలీల క్షీరాభిషేకం
మంగళగిరి : రాజధాని ప్రాంత రైతు కూలీలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు కూలీల పింఛన్ను సీఎం జగన్ రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా యర్రబాలెం, నిడమర్రులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవితో కలిసి పర్యటించి వలంటీర్ల ద్వారా రైతు కూలీలకు రూ.5 వేల చొప్పున పింఛన్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో యర్రబాలెంలో పలువురు లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి, నిడమర్రులో వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకతీతంగా రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ రూ.5 వేల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతులను, రైతు కూలీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులు లబ్ధిపొందలేకపోయారని, ఇక రైతు కూలీల జీవితాలైతే అగమ్యగోచరంగా తయారైన పరిస్థితులను చూశామన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. రాజధానిని నిర్మించలేకపోవడంతో పాటు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయలేకపోయాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా తాను రైతు కూలీలను ఆదుకుంటానని వాగ్దానం చేశారని, ఆ మేరకు రూ.2,500గా ఉన్న రైతు కూలీల పింఛన్ను రూ.5 వేలకు పెంచారని ప్రశంసించారు. -
AP: పింఛనే కాదు.. పెన్షనర్లూ పెరిగారు
సాక్షి, అమరావతి/కాకినాడ: అవ్వాతాతలతో పాటు వితంతువులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్ మొత్తం ఈనెల నుంచి రూ.మూడు వేలకు సీఎం వైఎస్ జగన్ సర్కారు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పింఛను పెంపు ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. వలంటీర్లు ఓ వైపు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తుండగా.. మరోవైపు రెండ్రోజులుగా వివిధ మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చురుగ్గా పాల్గొంటున్నారు. నాలుగున్నర ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో కొత్తగా పింఛన్లు మంజూరు కావాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక పింఛన్ల పంపిణీలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు గుర్తుచేస్తున్నారు. దీంతో.. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచి్చన మాట ప్రకారం రూ.3,000ల పెన్షన్ అమలుపై వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు కాకినాడ ఉత్సవాలకు సీఎం జగన్.. ఈ నేపథ్యంలో.. బుధవారం సీఎం జగన్మోహన్రెడ్డి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో జరిగే పింఛన్ల పెంపు ఉత్సవంలో స్వయంగా పాల్గొననున్నారు. ఈ జనవరి ఒకటో తేదీ నుంచి 66,34,742 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల మొత్తం రూ.1,967.34 కోట్లు విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన మెగాచెక్ను ముఖ్యమంత్రి కాకినాడలో ఆవిష్కరిస్తారు. అలాగే, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరుకు ఇటీవల జాతీయ స్థాయిలో స్కోచ్ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన ప్లాటినం అవార్డును సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. అంతేకాక.. లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడుతారు. అనంతరం.. రూ.65 కోట్లతో నిర్మించిన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ను (ముత్తా గోపాలకృష్ణ వారధి), రూ.20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి వెంకట జయరామ్కుమార్ కళాక్షేత్రాన్ని, రూ.9.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్ను సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిచేశారు. సీఎం పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆయన ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎంపీ వంగా గీత, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీ‹Ùకుమార్, ఇతర ప్రముఖులు సమీక్షించారు. సీఎం షెడ్యూల్ ఇలా.. – ఉ.9.30కు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి 10.20 గంటలకు కాకినాడకు చేరుకుంటారు. – ఉ.10.40కు బహిరంగ సభ జరిగే రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) గ్రౌండ్స్కు చేరుకుంటారు. – 11.55 వరకూ వైఎస్సార్ పింఛన్ పెంపు ఉత్సవంలో పాల్గొంటారు. – మ.12 గంటల ప్రాంతంలో కాకినాడ నుంచి బయల్దేరుతారు. – మ.2 గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు పంపిణీ రెండో రోజు శనివారం కూడా ముమ్మరంగా కొనసాగింది. వలంటీర్లు శనివారం సాయంత్రం వరకు 60,03,709 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,654.61 కోట్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. డిసెంబరు నెలలో మొత్తం 65,33,781 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 91.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ఈ నెల 5వ తేదీ వరకు మిగిలిన లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. -
పెన్షన్ పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం
-
Telangana: కొత్త పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీపి కబురు అందించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.రామయ్య కమిటీ సభ్యుడిగా వ్యవహరించనున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం/మూల పెన్షన్పై 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుత అక్టోబర్ నెల నుంచే ఐఆర్ను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు కొత్త పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించారు. వేతన సవరణ సిఫారసుల కోసం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల వేతన సవరణపై సిఫారసులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత, భవిష్యత్తు మూలధన పెట్టుబడి అవసరాలు/ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి..’ అని సూచించారు. 5% ఐఆర్తో రూ.2 వేల కోట్లకు పైగా భారం! ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ గడువు గత జూన్ 30తో ముగిసింది. జూలై 1 నుంచి ఉద్యోగులకు కొత్త వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. తాజాగా ఏర్పాటైన రాష్ట్ర రెండో పీఆర్సీ.. వేతన సవరణ ఫిట్మెంట్ శాతాన్ని సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు 5 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించనుంది. వేతన సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటివరకు చెల్లించిన ఐఆర్ను సర్దుబాటు చేసి ఉద్యోగులకు రావాల్సిన మిగిలిన వేతన సవరణ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా 5 శాతం ఐఆర్ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి ముందు 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింప చేయాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రయోజనాలను అమలు చేసింది. ఐఆర్ వీరికి వర్తిస్తుంది.. ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందుకుంటున్న సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఐఆర్ను వర్తింపజేయనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించదు.. ► తెలంగాణ ఉన్నత న్యాయ సేవలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు, అఖిల భారత సర్వీసు అధికారులు, యూజీసీ/ఏఐసీటీఈ/ఐసీఏఆర్/ కేంద్ర ప్రభుత్వ వేతనాలు/పెన్షన్లు అందుకుంటున్న ఉద్యోగులు/పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, సొసైటీల ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. -
కస్టమర్కు అనుకూలంగా సేవలు ఉండాలి
ముంబై: బ్యాంకులు కస్టమర్కు ప్రాధాన్యం ఇస్తూ, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్బీఐకి ప్యానెల్ సిఫారసు చేసింది. మరణించిన ఖాతాదారు వారసులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతించాలని, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్ తదితర సూచలను ప్యానెల్ చేసిన వాటిల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ను బ్యాంకుకు సంబంధించి ఏ శాఖలో అయినా, ఏ నెలలో అయినా సమర్పించేందుకు అనుమతించాలని, దీనివల్ల రద్దీని నివారించొచ్చని పేర్కొంది. ఆర్బీఐ నియంత్రణలోని సంస్థల పరిధిలో వినియోగదారు సేవా ప్రమాణాల సమీక్షపై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. గతేడాది మే నెలలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో అద్యక్షతన ఈ కమిటీని నియమించడం గమనార్హం. సూచనలు.. ఇంటి రుణాన్ని తీర్చివేసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తిరిగి రుణ గ్రహీతకు స్వాధీనం చేసే విషయంలో నిర్ధేశిత గడువు ఉండాలి. గడువులోగా ఇవ్వకపోతే బ్యాంక్/ఎన్బీఎఫ్సీపై జరిమానా విధించాలి. డాక్యుమెంట్లు నష్టపోతే, వాటిని తిరిగి పొందే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు అయ్యే వ్యయాలను బ్యాంకులే పెట్టుకోవాలి. కస్టమర్లకు సంబంధించి రిస్క్ కేటగిరీలను సూచించింది. వేతన జీవులు అయితే వారికి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, వారిని హై రిస్క్గా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులను తక్కువ రిస్క్ వారిగా కేటాయించొచ్చని సూచించింది. కస్టమర్లతో వ్యవహారాలు నిర్వహించే సిబ్బంది, వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా నిర్ణీత కాలానికోసారి తప్పనిసరి శిక్షణ పొందాలని కూడా పేర్కొంది. -
తెల్లవారుజాము నుంచే పెన్షన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు
-
ఈపీఎఫ్ఓ పెన్షన్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్: అధిక పెన్షన్(హయ్యర్ పెన్షన్) పథకం దరఖాస్తులకు సాంకేతిక చిక్కులు వీడడం లేదు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) షరతులకు అనుగుణంగా అన్నిరకాల వివరాలను తీసుకుని ఆన్లైన్లో అధిక పెన్షన్ దరఖాస్తు సమర్పించినప్పటికీ మెజార్టీ అర్జీదారులకు సంబంధిత దరఖాస్తు స్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆన్లైన్లో అన్ని వివరాలతో సమర్పించిన దరఖాస్తు ఎవరికి చేరిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో అర్జీదారులు అటు కంపెనీ యాజమాన్యం వద్దకు, ఇటు రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్(ఆర్పీఎఫ్సీ) కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయినాసరే ఈ సమస్యకు యాజమాన్యం వద్ద, ఆర్పీఎఫ్సీ వద్ద సమాధానం దొరకడం లేదని అంటున్నారు. నాలుగు స్థాయిల్లో ఫైలు... భవిష్యనిధి చందాదారుల్లో అధిక పెన్షన్కు అర్హత ఉన్న వారంతా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తును పూరించి సరైన ఆధారాలను జతచేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దరఖాస్తు వెంటనే కంపెనీ యూజర్ ఐడీ ఖాతాకు చేరుతుంది. అలా చేరిన దరఖాస్తును యాజమాన్యం పరిశీలించి అర్హతలను నిర్ధారించుకున్న తర్వాత ఆమోదిస్తుంది. ఇలా ఉద్యోగి, కంపెనీ ఉమ్మడి ఆప్షన్ తర్వాత ఆ దరఖాస్తు సంబంధిత రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ లాగిన్కు చేరుతుంది. అక్కడ మరోమారు పరిశీలించిన అధికారులు ఈ దరఖాస్తును ఆమోదించిన తర్వాత సెంట్రల్ సర్వర్కు ఫార్వర్డ్ చేస్తారు. ఇలా నాలుగు దశల్లో దరఖాస్తు ముందుకు కదులుతుంది. అయితే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో దరఖాస్తు దశ పూర్తిగా మారింది. ఆ దరఖాస్తు నేరుగా సెంట్రల్ సర్వర్కు చేరుతోంది. దీంతో కంపెనీ యాజమాన్యం, ఆర్పీఎఫ్సీ పరిధిలోకి రాకపోవడంతో వాటి పరిశీలన సందిగ్ధంలో పడుతోంది. గడువు దాటితే అనర్హతే... పీఎఫ్ చందాదారులు, పెన్షనర్లకు అధికపెన్షన్ అవకాశం ఇదే చివరిసారి. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆన్లైన్లో ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడం తప్పనిసరి. ఆ తర్వాత ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఇక ఇలాంటి వెసులుబాటు ఉండదని ఇప్పటికే ఈపీఎఫ్ఓ తేల్చిచెప్పింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.62లక్షల మంది అధిక పెన్షన్కు దరఖాస్తులు సమర్పించారు. మరో నెలరోజుల పాటు గడువు ఉండడంతో ఈ దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ దరఖాస్తులు సమర్పించిన వారిని ఇప్పుడు సాంకేతిక సమస్య తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులు నేరుగా సెంట్రల్ సర్వర్కు చేరడంతో అవి తిరిగి యాజమాన్యం, ఆర్పీఎఫ్సీకి చేరేదెలా అనే సందేహం నెలకొంది. మరోవైపు వచ్చే నెల 3వ తేదీలోగా ఉమ్మడి ఆప్షన్ పూర్తవుతుందా? లేదా? అనే ఆందోళన నెలకొంది. -
నకిలీ నోట్ల వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు
-
Aasara Pension: అందని ఆసరా గుర్తింపు కార్డులు..!
ముషీరాబాద్ భోలక్పుర్కు చెందిన మహిళకు వితంతు పింఛన్ మంజూరైంది. కొత్తగా పింఛను మంజూరు కావడంతో గుర్తింపు కార్డు కోసం తహాసిల్ ఆఫీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆశ్రయించింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదంటూ నాలుగైదు రోజులుగా సమాధానం చెబుతూ వచ్చి... చివరకు కార్డు వచ్చింది... ఒంటరిగా రా ఇస్తానని చెబుతున్నాడని ఆరోపిసూ సదరు మహిళ కుటుంబ సభ్యులు, బస్తీ వాసులతో కలిసి తహసీల్దార్ సమక్షంలోనే సదరు సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఆసరా ఫించన్దారులకు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షగా తయారయ్యాయి. ఆసరా పింఛన్లు మంజూరైనా..గుర్తింపు కార్డులు పంపిణీ నత్తలకు నడకనేర్పిస్తోంది. గత నెలలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల చేతులు మీదుగా ఫించను గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టినా... కనీసం 30 శాతం పూర్తి కాలేదు. కొందరికి కార్డు దక్కి మిగతా వారికి పంపిణీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో లబ్ధిదారులు తహాసిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ సంబంధిత సిబ్బందిచే ఛీత్కారాలు, వేధింపులకు గురవుతున్నారు. మహిళలకు వేధింపులే... ఆసరా పించన్ల విషయంలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఒక వైపు సిబ్బంది, మరోవైపు దళారులు మహిళల పేదరికం, అవసరాన్ని ఆసరా చేసుకొని వివిధ రకాలుగా వేధించడం పరిపాటిగా తయారైంది. గుర్తింపు కార్డులు అందని వారు తమకు ఫించన్ మంజూరు కాలేదన్న భయం... కొందరు సిబ్బంది.. దళారులకు కలిసి వచ్చే అవకాశంగా తయారైంది. తాము సహకరస్తామంటూ తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. కార్డుల పంపిణీ అంతంతే.. సరిగ్గా మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఆఫ్లైన్ ఆసరా దరఖాస్తులకు, ఏడాది అనంతరం ఆన్లైన్ ఆసరా దరఖాస్తులకు మోక్షం లబించి కొత్త పింఛన్లు మంజూరైనా గుర్తింపు కార్డుల పంపిణీ అంతంత మాత్రంగా తయారైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం మీద సుమారు 80,824 మంది ఆసరా పింఛన్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 58,066 మంది వద్దులకు, 15,210 మంది వితంతులకు, 3,265 మంది వికలాంగులకు, 2,197 ఒంటరి మహిళలకు, ఇద్దరు బీడీ కార్మికులకు, 1,194 మంది కళాకారులకు, 892 యాలసిస్ బాధితులకు, ఆరుగురు ఫైలేరియా, ఇద్దరు చేనేత కార్మికులను అసరా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీ కింద 1.96 లక్షల మంది సరా పింఛన్లు పొందుతున్నారు. (క్లిక్ చేయండి: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్కు..!) -
ఈపీఎఫ్వో సభ్యులకు శుభవార్త...!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) సభ్యులకు శుభవార్తను అందించింది. పెన్షనర్లకు భారీ ఊరట కలిపిస్తూ ఈపీఎఫ్వో నిర్ణయం తీసుకుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు సంబంధించి రూల్స్ను సడలించింది. ఈపీఎఫ్వో సభ్యులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. పెన్షన్ స్కీమ్ ను పొందాలంటే కచ్చితంగా ఆయా సభ్యులు లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంది. కాగా తాజాగా లైఫ్ సర్టిఫికేట్ విషయములో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షనర్లు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికెట్ను సబ్మిట్ చేసేలా వీలును కల్పించింది. ఇంతకుముందు పెన్షనర్లు ఈ డాక్యుమెంట్ను నవంబర్ నెలలో కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వుండేది. ఒకవేళ ఈ డాక్యుమెంట్ను ఇవ్వకపోతే పెన్షన్ నిలిచిపోతుంది. ఈపీఎఫ్వో పెన్షనర్లు బ్యాంక్ లేదా పోస్టాఫీస్కు వెళ్లి ఈ సర్టిఫికెట్ను సమర్పించాల్సి వుంటుంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్నెస్ అలవెన్స్ (డీఏ) , పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో డియర్నెస్ అలవెన్స్ 34 శాతంకు చేరనుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 31 శాతం మేర డీఏను పెంచాలని కేంద్రం నిర్ణయించగా..ఇప్పుడు అనూహ్యంగా డీఏను 34 శాతంగా పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులు ఆధారంగా డీఏ అమలు జనవరి 1, 2022 అమల్లోకి రానుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో బేసిక్ పే/పెన్షన్కు అదనంగా 3 శాతం డీఏ పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది. డీఏ పెంపు నిర్ణయం 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఇది సివిల్ ఉద్యోగులు, రక్షణ సేవల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుంది. ఇక 3 శాతం డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల మేర అదనపు భారం పడనున్నుట్లు సమాచారం. కోవిడ్-19 కారణంగా 2020లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ను కేంద్రం నిలిపివేసింది. కాగా 2021 జూలైలో డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది. తరువాత మరో 3 శాతం పెంచి 31 శాతం డీఏను ఫిక్స్ చేసింది. చదవండి: టాక్స్ పేయర్లకు అలర్ట్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..! -
మీ ఆనందమే నా తపన: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆర్థిక భారమైనా, కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా.. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలనేదే తన తపన అని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ నూతన సంవత్సర శుభ దినాన పింఛన్లను నెలకు మరో రూ.250 పెంచుతూ రూ.2,500 చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. పెన్షన్ పెంపు నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి నెలా రూ.2,250 చొప్పున డబ్బులు అందుకుంటున్న లబ్ధిదారులు ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ వ్యక్తిగతంగా లేఖ రాశారు. వలంటీర్లు 1వ తేదీన పింఛన్ డబ్బులతో పాటు ఆయా లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖను అందజేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ ‘సాక్షి’కి వివరించారు. సీఎం రాసిన లేఖ ఇలా ఉంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షులు చెబుతూ ఒక శుభవార్త అందించాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. నా సుదీర్ఘ పాదయాత్రలో అవ్వాతాతల కష్టాలను స్వయంగా గమనించా. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గత ప్రభుత్వం పెన్షన్గా మీకిచ్చిన చాలీ చాలని వెయ్యి రూపాయలతో మీరెన్ని అవస్థలు పడ్డారో కళ్లారా చూశాను. ఆత్మాభిమానం చంపుకొని జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరుగుతూ లంచాలు, వివక్షతో కూడిన వ్యవస్థలో వృద్ధులు, దివ్యాంగులు రోజుల తరబడి చేంతాడంత కూలైన్లలో పడ్డ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. గత ప్రభుత్వం కోటా పెట్టింది.. అర్హులు ఎంత మంది ఉన్నా, ఎలాగైనా పెన్షన్ల సంఖ్య తగ్గించాలని ఒక్కో గ్రామానికి ఇన్నే పెన్షన్లని గత ప్రభుత్వం కోటా పెట్టింది. ఆ కోటాకు మించి ఎంత మంది అర్హులున్నా వారెవ్వరికీ పెన్షన్లు ఇవ్వలేదు. అయ్యా.. మేము అర్హులమని అడిగిన వారికి నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, అమానవీయంగా ‘మీ ఊరిలో ఎవరైనా పెన్షనర్ చనిపోతే నీ సంగతి అప్పుడు చూద్దాంలే’ అన్నారు. మనిషన్న వారికెవరికైనా ఇలాంటి సమాధానాలు వింటే కన్నీళ్లు రాకుండా ఉంటాయా? గత ప్రభుత్వంలో దిక్కుమాలిన జన్మభూమి కమిటీలను వారి వర్గం, పార్టీ వారితో నింపి.. ఆ కమిటీలు అర్హులను గుర్తిస్తాయని ఉత్తర్వులు ఇవ్వడంతో సీనియర్ సిటిజన్లు అయిన మీరు ఆ పనికి మాలిన జన్మభూమి కమిటీల ముందు కాళ్లా వేళ్లా పడే పరిస్థితిని కల్పించారు. లంచాలు ఇస్తేనే, తమ వర్గం వారు అయితేనో, తమ పార్టీ వారు అయితేనో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ఇంతా చేసి వారు ఇచ్చింది కేవలం 39 లక్షల మందికి మాత్రమే. వాళ్లు పెన్షన్లపై నెలకు ఖర్చు చేసింది కేవలం రూ.400 కోట్లే. ఈ దుస్థితిని చూసి.. ఈ పరిస్థితి మారాలి.. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడవాలి.. వారి ముఖంలో కనిపించే చిరునవ్వులే నాకు ఆశీర్వాదాలు అవ్వాలని ఆనాడే నా మనస్సులో దృఢంగా సంకల్పించుకున్నాను. ఇదే విషయాన్ని నా పాదయాత్రలో ప్రకటించాను. మేనిఫెస్టోలో కూడా రాశాను. అప్పుడు 39 లక్షలు.. ఇప్పుడు 61 లక్షలు గత పాలకులు దిగిపోయే ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే నేడు మన ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల సంఖ్య దాదాపు 61 లక్షలు. గత ప్రభుత్వం పెన్షన్ల మీద ఖర్చు పెట్టింది నెలకు రూ.400 కోట్లు అయితే నేడు మన ప్రభుత్వం నెలకు ఖర్చు పెడుతున్నది దాదాపు రూ.1,450 కోట్లు. ఆర్థిక భారమైనా, కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలన్న తపనతో ఏటా దాదాపు రూ.18,000 కోట్ల పెన్షన్ల ఖర్చును చిరునవ్వుతో మనందరి ప్రభుత్వం భరిస్తోంది. ఈ జనవరి 1 నుంచి పెంచబోతున్న పెన్షన్తో ఈ ఖర్చు ఈ యేడు దాదాపు రూ.20,000 కోట్లకు చేరుతుంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్లపై ఖర్చు చేసింది దాదాపు రూ.45 వేల కోట్లు. ‘పెన్షన్లను క్రమంగా రూ.3 వేల వరకు పెంచుతాం’ అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈ నెల నుంచి క్రమం తప్పకుండా మీకు పెంచిన పెన్షన్ రూ.2,500 అందుతుంది. ఒకవేళ పెన్షన్ అందుకోవడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మీ గ్రామ, వార్డు వలంటీర్ లేదా గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. వాళ్లే దగ్గర ఉండి మీ చేయి పట్టుకుని నడిపిస్తారు. మీకు పెన్షన్ అందేలా అన్ని విధాలా సహాయం చేస్తారు. మీరు బాగుండాలని, దేవుడు మీకు మంచి చేసే అవకాశం ఇంకా ఎక్కువ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. – ప్రేమతో మీ కుటుంబ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మీ ఇంటికే పెన్షన్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజే తొలి సంతకంగా, నా ప్రమాణ స్వీకారోత్సవంలోనే పెన్షన్ల పెంపునకు ఆదేశాలు ఇచ్చాను. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెలా మొదటి రోజు మీ గడప ముందుకు వచ్చి, మీ తలుపులు తట్టి, మీకు గుడ్మార్నింగ్ చెప్పి, పెంచిన పెన్షన్ మీకు అందేలా వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాను. కరోనా కారణంగా ఎన్ని ఇక్కట్లు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మీ కష్టాలు తెలుసు కాబట్టి ఠంచన్గా పింఛన్ అందే విధంగా చూసుకుంటున్నాను. పెన్షన్లు ఎలా తగ్గించాలనేది గత పాలకుల విధానం అయితే అర్హులు ఏ ఒక్కరూ పెన్షన్కు దూరంగా ఉండకూడదన్నది నా పోరాటం. అందుకే అత్యంత పారదర్శక విధానంలో కులం, మతం, ప్రాంతం ఆఖరుకు ఏ రాజకీయ పార్టీ అనేది కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లంచాలు, వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నామని సగర్వంగా చెబుతున్నాను. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించి మరీ సామాజిక తనిఖీ ద్వారా అర్హులను గుర్తించి వారికి పెన్షన్ అందిస్తున్నాం. అర్హులెవరైనా ఏ కారణం చేతనైనా మిగిలిపోతే కూడా, వాళ్లకు మరో అవకాశం ఇస్తూ వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ధ్రువీకరించుకుని వారికి కూడా పెన్షన్ అందిస్తున్నాం. -
ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్న్యూస్..!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. వ్యక్తిగత పెన్షన్ ప్లాన్(ఐపీపీ) యాన్యుటర్లు, ఎల్ఐసీ సిబ్బంది పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఇక నుంచి ఆన్లైన్లోనే పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయడం కోసం ఎల్ఐసీ బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎల్ఐసీ జీవన్ సాక్ష్య అనే మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేయడం ద్వారా తేలికగా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయవచ్చు అని తెలిపింది. సకాలంలో పెన్షన్ పొందడానికి పెన్షనర్లు ప్రతి ఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక నుంచి సులభంగా ఈ యాప్ ద్వారా సులభంగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని వినివగించడం కోసం పెన్షన్ పాలసీదారులు మీ ఆధార్ ఆధార్ నెంబరుని మొబైల్ నెంబరుకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్ని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. జీవన్ సాక్ష్య యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇలా పొందండి: మొదట ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు మీరు మీ మొబైల్ ద్వారా ఒక సెల్ఫీ దిగి సబ్మిట్ చేయండి. వెంటనే మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి. ఆ తర్వాత మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోండి. "ఫెసిలిటేటర్" ఆప్షన్ ద్వారా కూడా మీ లైఫ్ సర్టిఫికెట్ను పొందవచ్చు. యాన్యుయిటెంట్లు/స్టాఫ్ పెన్షనర్లు కాకుండా వారి కుటుంబ సభ్యులు ఈ ఆప్షన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఫెసిలిటేటర్ ద్వారా మీ లైఫ్ సర్టిఫికెట్ ఇలా పొందండి: ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్లో ఫెసిలిటేటర్ సమాచారాన్ని నమోదు చేయండి. ఆ తర్వాత యాన్యుటెంట్/పెన్షనర్ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు యాన్యుటెంట్/పెన్షనర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటిపిని వెరిఫై చేయండి. యాన్యుటెంట్/పెన్షనర్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ తీసి సబ్మిట్ చేయండి. ఇటీవల ఒక ప్రకటనలో, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి గడువును పొడిగించింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి గడువును ఇప్పుడు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించారు. (చదవండి: 5జీ మొబైల్స్.. ఈ ఫీచర్స్తో ఈ మోడలే చాలా చీప్ అంట!) -
పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
పెన్షన్లరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్(జీవన్ ప్రమాన్) సమర్పించాల్సిన గడువును 2021 డిసెంబర్ 31 వరకు పొడగించింది. ఇంతక ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లను పొందడానికి వారు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను నవంబర్ 30లోపు సబ్మిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ గడువును మరో నెల పొడగించింది. దీంతో పెన్షనర్లకు ఊరట కలగనుంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పుడు, డిసెంబర్ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు సబ్మిట్ చేయవచ్చు. అలాగే, లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను డిజిటల్ రూపంలో పొందడం కోసం రికగ్నైషన్ టెక్నాలజీని కేంద్రం ప్రారంభించింది. పెన్షనర్ల ఫిర్యాదుల మేరకు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్గా లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 31 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా పెన్షనర్లు పెన్షన్ పొందవచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా?) -
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్కు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: వృద్ధాప్యం మీదపడుతున్న పెన్షనర్లు సుదూరంలోని సంబంధిత కార్యాలయాలకు తాము నేరుగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి వచ్చేది. అలాంటి వారికి లైఫ్ సర్టిఫికెట్ విషయంలో ఎంతగానో సాయపడే కొత్త రకం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. ప్రతీ సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ శాఖకు సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్కు ఇకపై ఒక సాక్ష్యంగా పనికొచ్చే ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని పెన్షన్ల శాఖ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ను డిజిటల్ రూపంలో ఇచ్చేందుకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వారికి మరింతగా ఉపయోగపడనుందని మంత్రి చెప్పారు. 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఈపీఎఫ్వో, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వారికీ ఈ టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందన్నారు. -
పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. ఇక వారి కష్టాలు తీరినట్టే!
పెన్షన్లరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆయా పెన్షన్లను పొందుతున్న వారు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉండేది. వీటిస్థానంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పెన్షన్ దారుల కోసం యూనిక్ ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీని ప్రారంభించారు. దీంతో పెన్షనర్లకు ఊరట కల్గనుంది. లైఫ్ సర్టిఫికేట్ల విషయంలో పెన్షన్దారులు ఇబ్బందులను ఎదుర్కొవడంతో పలు ఫిర్యాదులను చేశారు. ఫిర్యాదుల మేరకు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్గా లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. పెన్షన్ దారుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రత్యేకమైన ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీ పెన్షనర్లకు మరింత సులభతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీతో 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈపీఎఫ్వో, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోందని అన్నారు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు యూఐడీఎఐకి సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ పెనాల్టీ..! ఎందుకంటే.. -
పెన్షనర్లకు హై అలర్ట్.. ! రెండు రోజులే గడువు..లేదంటే..
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అలెర్ట్. లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేసేందుకు ఇంకా రెండు రోజులే గడువు (నవంబర్ 30 వరకు) ఉంది. ఈ పత్రాన్ని సమర్పించకపోతే పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉంది. లైఫ్ సర్టిఫికెట్ను ఎలా అప్లయ్ చేయాలంటే? ►పెన్షన్ లబ్ధి దారులకు పాన్ కార్డ్ అవసరం. ► పాన్ కార్డ్ ఉంటే లబ్ధి దారులు లైఫ్ సర్టిఫికెట్ కోసం ఎస్బీఐ పెన్షన్ సేవ పోర్టల్లోకి వెళ్లాలి. ► ఆ పోర్టల్లో 'వీడియో ఎల్సీ' అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఎస్బీఐ పెన్షన్ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ►ఎంటర్ చేసిన తరువాత మనకు ఓటీపీ వస్తుంది. ►ఆ ఓటీపీని ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ను యాక్సెప్ట్ చేసి స్టార్ట్ జర్నీ అనే బటన్పై క్లిక్ చేయాలి. ►ఆ తర్వాత 'ఐయామ్ రెడీ' అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ►ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఎస్బీఐ అధికారుల నుంచి వీడియో కాల్ ప్రారంభం అవుతుంది. ►ఆ వీడియో కాల్లో వెరిఫికేషన్ కోసం మీ ఎదురుగా స్క్రీన్ మీద నాలుగు అంకెల్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను ఎంటర్ చేయాలి. ►అనంతరం ఒరిజనల్ పాన్ కార్డ్ను చూపించాలి ►తర్వాత పాన్ కార్డును లబ్ధిదారులు ఫోటోల్ని తీసుకుంటారు. ► వీడియో లైఫ్ సర్టిఫికెట్ పూర్తవుతుంది. ఈ ప్రాసెస్లో ఏదైనా పొరపాటు జరిగితే మీ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. లైఫ్ సర్టిఫికెట్ను ఎక్కడ సమర్పించాలి లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. పెన్షన్ తీసుకునే బ్యాంక్ బ్రాంచ్లో, జీవన్ ప్రమాణ్ పోర్టల్లో సబ్మిట్ చేయాలి. లేదంటే బ్యాంక్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ యాప్లో లాగిన్ అయితే బ్యాంక్ అధికారులు మీ ఇంటి వద్దకే వస్తారు. పోస్ట్మ్యాన్ ద్వారా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. -
పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ను పోస్టాఫీసులో ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ను ఇకనుంచి పోస్టాఫీసు ద్వారా ఆన్లైన్లో పింఛనుశాఖకు సమర్పించుకోవచ్చునని సిక్రింద్రాబాద్ తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ సంతోష్ నేత తెలిపారు. ఈ సేవలను పోస్టుమెన్ ద్వారా పొందవచ్చునని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: పాము రాసిన విషాద గీతం) -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’
సాక్షి, నెట్వర్క్: ఈ నెల ‘ఆసరా’ లేక పింఛన్దారులు ఆగమాగమవుతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. మందులు కొనలేకపోతున్నారు. నిత్యవసరాలు సమకూర్చుకోలేకపోతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే చేతికందే ‘ఆసరా’పెన్షన్ ఈ సారి మూడు వారాలు గడిచినా ఇంకా జాడలేదు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈసారి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ డబ్బులు వస్తాయన్న ధీమాతో కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే తాము ఫైనాన్స్ విభాగానికి నివేదించామని, వారు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. ఎదురుచూపుల్లో 38 లక్షల మంది... ఆసరా పింఛన్ కింద ప్రతి నెలా ఆయా వర్గాలకు ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆగస్టు నెల కింద అందాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 38 లక్షల 71 వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వీవర్స్, హెచ్ఐవీ బాధితులు, బోదకాలు బాధితులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అయినవారికి దూరంగా ఉంటున్నవారే. ఇంకా పలువురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్న వారూ ఉన్నారు. మస్తు ఇబ్బంది అవుతోంది చిల్లర ఖర్సులకు మస్తు ఇబ్బంది పడుతున్న. రోజూ పోస్ట్ ఆఫీస్కు వచ్చి పోతున్న. ఇప్పుడు, అప్పుడు అంటున్నరు. ఎప్పుడు ఇస్తారో ఏమో. మస్తు ఇబ్బంది అవుతుంది. – అమ్రు, హజీపూర్, కామారెడ్డి జిల్లా పింఛన్ రాక మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఆఫీసర్లను అడిగితే రేపు మాపంటున్నరు. ఇంతకు ముందు ఆరో తారీఖు ఇస్తుండిరి. ఇప్పుడు పదిహేను రోజులైనా అస్తలేవు. – రుక్కవ్వ, సోమార్పేట్, కామారెడ్డి జిల్లా -
పెన్షనర్లకు ఎస్బీఐ శుభవార్త!
సీనియర్ సీటిజన్ ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సీనియర్ సీటిజన్ ఖాతాదారుల కోసం ప్రత్యేక కొత్త పెన్షన్ సేవలను ప్రవేశపెట్టింది. పెన్షన్ తీసుకునే వారి కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్(https://www.pensionseva.sbi) తీసుకొనివచ్చింది. ఈ పోర్టల్ ద్వారా సీనియర్ సీటిజన్ ఖాతాదారులు అన్ని రకాల పెన్షన్ సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు. ముందుగా అవసరమైన సమాచారం అందించి, పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత సేవలు సులభంగా పొందొచ్చని ఎస్బీఐ వివరించింది.(చదవండి: ఈ 4 యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!) Good news for all Pensioners! We have revamped our PensionSeva website for you to manage all your pension related services with ease. Click here: https://t.co/pM0XAgtzuc#PensionSeva #Pension #SBI pic.twitter.com/xioULTSMKC — State Bank of India (@TheOfficialSBI) September 11, 2021 పోర్టల్ ద్వారా ఏ ఏ సేవలు పొందొచ్చంటే.. బకాయిల లెక్కింపు షీట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ స్లిప్ లేదా ఫారం-16ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ లాభం వివరాల సమాచారాన్ని చూడవచ్చు. మీ పెట్టుబడులను తనిఖీ చేయవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇక మీ ఫోన్లో పెన్షన్ చెల్లింపు వివరాలకు సంబంధించి అలర్ట్లు వస్తాయి. అలాగే లైఫ్ సర్టిఫికేషన్ సదుపాయం మీ దగ్గరల్లో ఉన్న బ్రాంచీవద్ద లభిస్తుంది. మీ ఈ-మెయిల్ కు పెన్షన్ స్లిప్ వస్తుంది. ఇకపోతే మీ పేరు పోర్టల్లో రిజిస్టర్ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు support.pensionseva@sbi.co.inకు ఈ-మెయిల్ చేయవచ్చు. అలాగే 'ఎస్ఎమ్ఎస్ అన్ హ్యాపీ' టైప్ చేసి 8008202020కు ఎస్ఎమ్ఎస్ చేయవచ్చు లేదా 18004253800/1800112211 లేదా 08026599990 కాల్ చేయవచ్చు. -
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ఏపీ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు ఆర్ధిక శాఖ తెలిపింది. 2018 జూలై 1వ తేదీన 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంపుదల చేశారు. ఈ పెంపుతో 38.776 శాతానికి పింఛన్దారుల డీఏ పెరగనుంది. -
ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఆర్బీఐ శుభవార్త!
ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. ఇక మీ జీతం, పెన్షన్ డబ్బులు సెలవు రోజుల్లో పడనున్నాయి. ఇప్పటి వరకు వేతనం, పెన్షన్ డబ్బులు, ఈఎమ్ఐ చెల్లింపులు చేయడం అనేది బ్యాంక్ సెలవు రోజుల్లో వీలు కాకపోయేది. కానీ, కొత్తగా ఆర్బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా మీ జీతం, పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కానున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ పనిదినాల కోసం మీ జీతం లేదా పెన్షన్ డబ్బుల క్రెడిట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎన్ఏసీహెచ్ సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, బ్యాంకులు తెరిచి ఉన్నప్పుడు ఎన్ఏసీహెచ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు నెల మొదటి రోజు వారాంతంలో వస్తుంది. దీని కారణంగా ప్రజలు బ్యాంక్ పని దినం వరకు వేచి ఉండాలి. జూన్ క్రెడిట్ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వినియోగదారుల అందించే సేవలను మరింత పెంచడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. -
వృద్ధులకు, పింఛనుదారులకు గుడ్ న్యూస్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా వృద్దులు, పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు అని ప్రకటించింది. తాజా నిర్ణయంతో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ భారీ ఉపశమనం లభించింది. సాంకేతికపరిజ్ఞానం లేని వృద్దులు తమ లైఫ్ సర్టిఫికేట్ పొందడం కోసం వారు బ్యాంకులను సందర్శించాల్సి వచ్చేది. అక్కడ వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లయింది. "ఇకపై వృద్ధులు సులభంగా జీవన ప్రమాణ సేవలను పొందవచ్చు. సమీప పోస్టాఫీసులో ఉండే సీఎస్సీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి" అని పోస్టల్ విభాగం ట్వీట్ చేసింది. తాజా నిర్ణయం వల్ల కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యుటీలు) 60 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ది జీవన్ ప్రమాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందడానికి పెన్షన్ తీసుకునే వ్యక్తి ప్రభుత్వం చేత గుర్తించబడిన ఏజెన్సీ ముందు హాజరు కావాలి లేదా పింఛనుదారుడు ఇంతకు ముందు పనిచేసిన అథారిటీ ద్వారా జారీ చేయబడ్డ లైఫ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. తర్వాత దానిని ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడుఆ వారు లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి సమీప పోస్టాఫీసు కేంద్రాన్ని సందర్శించవచ్చు. అలాగే, మీ దగ్గరలో గనుక జీవన్ ప్రమాన్ కేంద్రాలు ఉంటే దాని ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ కేంద్రాలలో వారు మీ ఆధార్ బయో మెట్రిక్ తీసుకుంటారు. वरिष्ठ नागरिक अब सरलता से नज़दीकी डाकघर के सीएससी काउंटर पर जीवन प्रमाण सेवाओं का लाभ उठा सकते हैं। #AapkaDostIndiaPost Senior citizens can now easily avail the benefit of Jeevan Praman services at the nearest post office CSC counter.#AapkaDostIndiaPost pic.twitter.com/tKrzifc6yc — India Post (@IndiaPostOffice) July 15, 2021 -
ఇకపై వాట్సాప్ ద్వారా పెన్షన్ స్లిప్పులు: కేంద్రం
న్యూఢిల్లీ: పింఛన్దారులకు పెన్షన్ స్లిప్పులను వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పంపించాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ఇందుకోసం ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ లాంటి సదుపాయాలతోపాటు సోషల్ మీడియా యాప్లను ఉపయోగించుకోవాలంటూ తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ పెన్షన్, భత్యాలు, పన్ను కోతలు వంటి పూర్తి వివరాలు పెన్షన్ స్లిప్పులో ఉండాలని పేర్కొంది. ఇలాంటి వివరాలు పెన్షన్ స్లిప్పుల్లో చేర్చేందుకు బ్యాంకులు ఇటీవలే అంగీకారం తెలిపినట్లు పేర్కొంది. -
ఎల్ఐసీ గ్రిహా వరిష్ట లోన్ తీసుకున్నవారికి శుభవార్త!
మీరు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ గ్రిహా వరిష్ట కింద హోమ్ లోన్ లేదా ప్లేట్ కోసం లోన్ తీసుకున్నారా అయితే మీకు శుభవార్త. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్ధ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గ్రిహా వరిష్ట కింద లోన్ తీసుకున్న వారికీ ఆరు ఈఎంఐలు మాఫీని(వేవర్) ప్రకటించింది. రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ అఫర్ ప్రకటించింది. ఒక వేళ మీరు నిర్మించి సిద్ధంగా ఉన్న ఇంటిని లేదా ఫ్లాట్ను కొంటే ఈ అఫర్ వర్తిస్తుంది. బిల్డర్ నుంచి మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడే మీరు ఎంచుకున్న ఈఎంఐలలో 37వ, 38వ, 73వ, 74వ, 121వ, 122వ ఈఎంఐలను మాఫీ చేస్తుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. పేన్షనర్ల కోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గృహ వరిష్ట పథకాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. ఉద్యోగ పదవి విరమణ పొందిన వారు/ భవిష్యత్ లో ఖచ్చితమైన పెన్షన్ సదుపాయాన్ని కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం. కంపెనీ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి రుణ వడ్డీ రేటును తగ్గించింది. 700 కంటే ఎక్కువగా సిబిల్ స్కోరు ఉన్న వారికి 6.90 శాతం రుణ రేటు వర్తిస్తుంది. రుణాన్ని పొందాలని అనుకునే వారికి రూ.50 లక్షల వరకు కంపెనీ గృహ రుణం ప్రస్తుతం అందిస్తోంది. చదవండి: పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ! -
20 ఏళ్ల సర్వీసుంటే.. పూర్తి పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని పదవీ విరమణ చేస్తే వారికి పూర్తిస్థాయిలో పెన్షన్ సదుపాయం కల్పించాలని వేతన సవరణ సంఘం(పీఆర్సీ) సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే రాష్ట్ర మూ అనుసరించాలని సూచించింది. ప్రస్తు తం 33 ఏళ్ల సర్వీసు ఉంటేనే పూర్తి పరిమాణంలో పెన్షన్ను చెల్లిస్తున్నారు. 20 ఏళ్లలోపు సర్వీసుతో పదవీవిరమణ చేసే ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న ఐదేళ్ల సర్వీసు వెయిటేజీ విధానాన్ని కొనసాగించాలని సూచించింది. పెన్షనర్ల విషయంలో పీఆర్సీ కమిటీ సిఫార్సులివీ.. ►75 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు రిలీఫ్గా మూల పెన్షన్పై 15 శాతాన్ని అదనంగా చెల్లించాలి. 100 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు 100 శాతం వరకు మూల పెన్షన్ను అదనంగా చెల్లించాలి. ►కనీస పెన్షన్/ ఫ్యామిలీ పెన్షన్ను నెలకు రూ.9,700కు పెంచాలి. ►సవరించిన కనీస వేతనం (రూ.19 వేలు)లో 50% కనీస పెన్షన్గా ఉండాలి. కరువు భత్యం లేకుండా 2018 జూలై 1 నుంచి ఈ పెంపును వర్తింపజేయాలి. ►సర్వీసులో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే, మరణించిన మరుసటి రోజు నుంచి గరిష్టంగా 10 ఏళ్ల పాటు లేదా మరణించిన ఉద్యోగి/ పెన్షనర్ 65 ఏళ్ల వయస్సుకు చేరే వరకు.. ఈ రెండింటిలో ఏది ముం దు సంభవిస్తే అప్పటి వరకు కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ను చెల్లించాలి. ►మానసికంగా/ శారీరకంగా వికలాంగులైన కుమారుడు/కుమార్తె వివాహమైనప్పటికీ జీవితకాలం పాటు ఫ్యామిలీ పెన్షన్ చెల్లించాలి. ►పదవీ విరమణ సమయంలో చెల్లించే గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలి. ►సర్వీసు పెన్షనర్/ ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు చెల్లించాల్సిన రిలీఫ్ అమౌంట్ను రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలి. ►కేంద్ర ప్రభుత్వం కమ్యుటేషన్ టేబుల్ను సవరించే వరకు పెన్షన్లో కమ్యుటెడ్ పోర్షన్ను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించే విధానాన్ని కొనసాగించాలి. చదవండి: (ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు) (కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జాబితా) -
పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి కొత్త ఏడాదిలో కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసే వారు లేదా ఇప్పటికే పెన్షన్ తీసుకునే వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఒక్క చిన్న క్లిక్తోనే పెన్షనర్లు పీపీఓను ప్రింట్ తీసుకోవచ్చు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇ-పిపిఓను అభివృద్ధి చేసిన అధికారులను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందించారు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది పెన్షన్ దారులు పీపీవో గురించి ఆందోళన చెందారని.. ఇకపై ఈ కొత్త ఇ-పిపిఓ ద్వారా వారికీ అన్ని రకాల సమస్యలు తొలగనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.(చదవండి: సెకండ్ రౌండ్లో టీకా తీసుకోనున్న మోదీ?!) ఇకపై పెన్షన్ దారులు ఆన్లైన్లోనే పీపీవోను పొందొచ్చు. లాక్ డౌన్లో ఉద్యోగ పదవీ విరమణ చెందిన వారికి ఈ సర్వీసులు వల్ల చాలా లాభం కలుగనుంది అని మంత్రి పేర్కొన్నారు. పీపీవో ఆర్డర్ చేతికి రాని వారు ఆన్లైన్లోనే పీపీవో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొరని తెలిపారు. ఉద్యోగ పదవీ విరమణ చెందిన లేదా ప్రభుత్వం పెన్షన్ పెంచిన వారికీ పీపీవో అవసరం అవుతుంది. కరోనా కారణంగా పెన్షన్ దారులు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఇప్పుడు డిజి-లాకర్తో అనుసందించబడిన పిఎఫ్ఎంఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ పిపిఓ కాపీని సులభంగానే పొందవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు భవిష్య అకౌంట్ను డిజి లాకర్ అకౌంట్తో లింక్ చేసుకోవాలి. -
లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు గడువు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్ పత్ర–జేపీపీ) సమర్పించే తుది గడువును వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్వో తెలిపింది. ఆలోగా ఎప్పుడైనా ఇవ్వవచ్చని పేర్కొంది. కోవిడ్–19 కారణంగా జేపీపీ అందజేయలేకపోయిన సుమారు 35 లక్షల పింఛనుదారులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీలోగా జేపీపీ సమర్పించని వారికి ఫిబ్రవరి వరకు పింఛను యథా ప్రకారం అందుతుందని స్పష్టం చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం–1995 ప్రకారం పింఛను పొందుతున్న వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివరించింది. జేపీపీ ఏడాదిపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. -
బాబు డీఏ బకాయిలకు ఏటా రూ.2,400 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కారు ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించకుండా బకాయిపెట్టిన రెండు డీఏలను చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు డీఏ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఏకంగా రూ.2,400 కోట్లకుపైనే భరించనుంది. ఈ రెండు డీఏల 30 నెలల తాలూకు బకాయిలు చెల్లించేందుకు రూ.6,034.80 కోట్ల మేర వ్యయం కానుంది. 2018 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించకుండా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. 2019 జనవరి నుంచి మరో డీఏను కూడా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. ఈ రెండు బకాయిలను చెల్లించడంతో పాటు 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏను కూడా చెల్లించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,011 కోట్లను భరించనుంది. 30 నెలల బకాయిలకు రూ.5,028.90 కోట్లు వ్యయం కానుంది. పెన్షనర్లకు.... ► పెన్షనర్లకు 3.144 శాతం పెంపు జూలై 2018 నుంచి వర్తింపు, జనవరి 2021 నుంచి చెల్లింపు ► 2019 జనవరి నుంచి మరో 3.144 శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జూలై నుంచి చెల్లింపు ► 2019 జూలై నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జనవరి 2022 నుంచి చెల్లింపు ఉద్యోగులకు... ► ఉద్యోగులకు జూలై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి నుంచి చెల్లింపు ► 2019 జనవరి నుంచి 3.144 శాతం పెంచిన డీఏ జూలై 2021 నుంచి చెల్లింపు ► 2019 జూలై నుంచి పెంచిన 5.24 శాతం డీఏ జనవరి 2022 నుంచి చెల్లింపు -
పెన్షనర్లకు ఊరట : కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులకు ఊరట. కేంద్ర పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును మరో రెండు నెలలు పెంచుతూ కేంద్రప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ గడువును పెంచాలన్న పెన్షన్దారుల సంఘాల విజ్ఞప్తి మేరకు 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని లైఫ్ సర్టిఫికేట్ గడువును మరికొంత కాలం పెంచాలంటూ వివిధ పెన్షన్దారుల సంఘాల నుంచి పిటిషన్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్-19 కేసులు వరకు పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంతో సంప్రదించిన పిదప ఈ గడువును 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచినట్టు తెలిపారు. అలాగే పొడిగించిన కాలంలో, (ఫిబ్రవరి వరకు) ప్రతీ నెలా పెన్షన్ యథావిధిగా చెల్లిస్తామని పేర్కొన్నారు. వాయిదా ప్రధాన లక్ష్యం వివిధ శాఖల వద్ద విపరీతమైన రద్దీని నివారించడమనీ, సంబంధిత శాఖలలో సరైన పారిశుద్ధ్యం, సామాజిక దూరాన్ని పాటించాలని నోటీసులో పేర్కొంది. కాగా ప్రతీ ఏడాది పింఛనుదారులు నవంబర్లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. కరోనా ప్రభావం వృద్ధులపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన మేరకు కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసే చివరి తేదీని 2020 డిసెంబర్ 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: తమ లైఫ్ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈపీఎఫ్వో పెన్షనర్లు పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దని, బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు/మీ సేవా కేంద్రాల వద్ద అందజేయొచ్చని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) పేర్కొంది. లేదా ఆధార్తో కూడుకున్న బయోమెట్రిక్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పింవచ్చని ఈపీఎఫ్వో తెలిపింది. సాధారణంగా ఏటా నవంబర్/డిసెంబర్లో పెన్షనర్లు పీఎఫ్ ఆఫీసుల్లో లైఫ్ సర్టిఫికెట్లు అందజేస్తుండగా, ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లంతా ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డిజిటల్ జీవన్ ప్రమాణ్ సమర్పణకు అవసరమైన చర్యల కోసం కామన్ సర్వీసెస్ సెంటర్తో కలసి పనిచేస్తున్నట్లు ఈపీఎఫ్వో వివరించింది. చదవండి: క్వారంటైన్లో డబ్ల్యూహెచ్వో చీఫ్ సౌకర్యవంతంగా ఉండేలా సర్వీస్ డెలివరీ ఏజెన్సీని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఈపీఎస్ పెన్షనర్లు పొందేలా బహుళ సంస్థల ఏజెన్సీ (మల్టీ–ఏజెన్సీ) మోడల్ను ఈపీఎఫ్వో ఎంచుకున్నట్లు పేర్కొంది. దీనికోసం పెన్షనర్లు తమ మొబైల్ ఫోన్లు, బ్యాంకు పాస్బుక్కు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటివి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించింది. స్థానిక పోస్ట్మాన్/సమీపంలోని పోస్టాఫీస్ను సంప్రదించడం లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో తమ చేతివేలిముద్ర స్కానింగ్ను పంపించడంతో సమర్పించవచ్చని పేర్కొంది. ఏడాదిలో ఏ సమయంలోనైనా (కేవలం నవంబర్, డిసెంబర్లోనే కాకుండా) ఈపీఎస్ పెన్షనర్లు ‘డిజిటల్ జీవన్ ప్రమాణ్’ల సమర్పణకు కీలకమైన విధానమార్పును చేపట్టినట్లు తెలిపింది. ఈ విధంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే తేదీ నుంచి ఏడాది పాటు అది చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. చదవండి: ఈపీఎఫ్వో కీలక నిర్ణయం -
దసరా కానుక.. ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదశమి సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ను కలిసి పెండింగ్ డీఏలను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి మొత్తం మూడు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. మూడు డీఏల మంజూరు వల్ల ఖజానాపై ఏడాదికి రూ.3,802 కోట్లు భారం పడుతుంది. అలాగే బకాయిలను ఉద్యోగుల భవిష్య నిధి (జీపీఎఫ్)కు జమ చేయడానికి మరో రూ.9,504 కోట్లు వ్యయం కానుంది. దీనివల్ల 4,49,000 ఉద్యోగులకు, 3,57,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. – జూలై 2018 నుంచి ఇవ్వాల్సిన డీఏను వచ్చే ఏడాది జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను మాత్రం ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్కు జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ బకాయిలను ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. – జనవరి 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ వచ్చే ఏడాది జూలై వేతనాలతో నగదు రూపంలో ఆగస్టు 1న ఇస్తారు. డీఏ బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్కు జమ చేస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. – జూలై 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ 2022 జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను అదే ఏడాది ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో జీపీఎఫ్కు జమ చేస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించిన సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి, ఏపీ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో సైతం గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రెండు డీఏలతోపాటు మరో డీఏను ఒకేసారి మంజూరు చేస్తూ సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇది ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. -
నా వయసు 58!
సాక్షి, హైదరాబాద్: అసహాయులైన పేదలపై కరోనా పంజా విసిరింది. ప్రభుత్వ చేయూత కోసం మరి కొన్నాళ్లు ఎదురుచూసేలా చేసింది. పేదరికంలో మగ్గుతున్న పండుటాకులను ఆదుకునేందుకు గత ఏప్రిల్ నుంచి మరింత మంది వృద్ధులకు ‘ఆసరా’పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బడ్జెట్లోనూ అదనపు నిధులు కేటాయించింది. అయితే, ఊహించనివిధంగా కరోనా మహమ్మారి పడగలు విప్పడం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్ వల్ల రాబడులు తగ్గిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. దీంతో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకు పడింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు లాక్డౌన్ కొనసాగడంతో కొత్త పింఛన్ల పంపిణీ అటకెక్కింది. ప్రజాజీవనం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నా.. ఆర్థికంగా కోలుకోవడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 6.62 లక్షల మంది ఎదురు చూపులు నిరుపేదలకు అండగా నిలుస్తున్న ప్రభు త్వం.. ప్రస్తుతం 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఆసరా పింఛన్లను అందజేస్తోంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వయోపరిమితిని 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న 12.21 లక్షల వృద్ధాప్య పింఛన్లకు అదనంగా మరో 6.62 లక్షల వృద్ధాప్య పింఛన్లు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. తొలుత గతేడాది నుంచే దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇదివరకే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హుల జాబితాను తయారు చేసింది. అయితే, ప్రస్తుతం ఇందులో కొందరు మరణించి ఉంటారని భావిస్తున్న పంచాయతీరాజ్ శాఖ.. తాజాగా మరోసారి వివరాలను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం గ్రామాలవారీగా ఓటర్ల జాబితాను సేకరించి.. అందులో 57 ఏళ్లు పైబడిన ఓటర్ల వివరాల లెక్క తీసింది. అయితే, కేవలం ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకోకుండా.. క్షేత్రస్థాయిలో శిబిరాలు నిర్వహించి వయసును నిర్ధారించాలని నిర్ణయించింది. ఆధార్, ఓటర్ ఐడీల ఆధారంగా అర్హుల జాబితాను స్క్రీనింగ్ చేయాలని భావించింది. ఇంతలోనే కరోనా వైరస్ విశ్వరూపం చూపడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో కొత్త పింఛన్ల మాట అటు ఉంచి..ఉన్నవారికి నెలవారీగా సక్రమంగా చెల్లిస్తే చాలనే పరిస్థితి తలెత్తింది. అదనంగా నెలకు రూ.133.45 కోట్ల భారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లకు ప్రభు త్వం 2019–20లో రూ.9,402 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక సంవత్సరానికి రూ.11,758 కోట్లకు పెంచింది. అయితే, పెంచిన రూ.2,356 కోట్లు ఈసారి అదనంగా పెరిగే వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, కొత్తగా పెరిగే 6.62 లక్షల వృద్ధాప్య పింఛన్లతో నెలకు రూ.133.45 కోట్ల మేర అదనపు భారం పడనుందని అంచనా వేసింది. రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లు వృద్ధాప్య: 12,21,887 వికలాంగులు: 4,91,892 హెచ్ఐవీ బాధితులు: 32,627 వితంతువులు: 14,31,585 బోదకాలు బాధితులు: 14,901 చేనేత కార్మికులు: 36,813 బీడీ కార్మికులు: 4,07,268 గీత కార్మికులు: 62,069 ఒంటరి మహిళలు: 1,33,789 -
ఈపీఎఫ్వో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్)ను అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరో వెసులుబాటు కల్పించింది. కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ఈ)ల ద్వారా వీటిని అందజేయవచ్చునని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్) పింఛనుదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పింఛనుదారులు ఏటా డిసెంబర్లో లైఫ్ సర్టిఫికెట్ను అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల పింఛను అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల సీఎస్సీల్లోనూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించే వీలుంటుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు ఇవి అదనమని తెలిపింది. పింఛనుదారులు ఇకపై తమకు వీలున్న సమయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సీఎస్సీల్లో ఇవ్వవచ్చని, ఇచ్చిన రోజు నుంచి ఇది ఏడాది పాటు చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. (చదవండి: భారత్లో సామాజిక వ్యాప్తి లేదు) -
ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త తెలిపింది. రూ. 868 కోట్ల పెన్షన్ నిధులతో పాటు రూ.105 కోట్ల పెన్షన్ బకాయిలను విడుదల చేస్తున్నట్టు ఈపీఎఫ్ఓ సోమవారం తెలిపింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఈపీఎస్ 95 (ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్) లబ్డిదారులకు ఎంతో మేలు కలుగుతుందని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈపీఎఫ్వోలో 65 లక్షల మంది పెన్షనర్లు లబ్దిదారుల జాబితాలో ఉన్నారని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సభ్యుల నివేదిక ఆధారంగానే పెన్షన్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు కేంద్రం పేర్కొంది. చదవండి: ఈపీఎఫ్ను భారీగా లాగేశారు.. -
పెన్షన్ల కోతపై హైకోర్ట్లో విచారణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లను 25 శాతం ప్రభుత్వం కోత విధించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకు సంబంధించిన పిటిషన్ను పెన్షనర్స్ జేఏసీ నాయకులు లక్ష్మయ్య దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది పెన్షదారుల పెన్షన్ కట్ చేయొద్దని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. చదవండి: మటన్ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు మే నెల పెన్షన్ కట్ చెయ్యకుండా పూర్తి పెన్షన్ వేసేలా చూడాలని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టును కోరారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పెన్షనర్లపై ప్రభుత్వం పునరాలోచనలో ఉందని తెలిపారు. జూన్ 1 వరకు పూర్తి పెన్షన్ చెల్లించకపోతే అదే రోజు ఆదేశాలు జారీచేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్ట్ జూన్ 1కి వాయిదా వేసింది. చదవండి: అమాంతం ఎత్తేస్తున్నారు..