-
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
-
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
-
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
-
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
-
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. -
పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..
-
ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర
కడప కార్పొరేషన్: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. 10,177 మంది రెగ్యులరైజ్ రాష్ట్ర బడ్జెట్ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియెర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్ష¯Œన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్ చేశారని, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్.. 12వ పే రివిజన్ కమిషన్ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు. వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్రెడ్డి వివరించారు. -
అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు, దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్చైర్కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. -
అవ్వాతాతలూ ఆలోచించండి.. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే: సీఎం జగన్
వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికేముంది? నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు.. ఎలాగూ చేసేది లేదు కదా! అనే మనస్తత్వం వాళ్లది. మీ బిడ్డ అలా కాదు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడమే. – పింఛన్దారులతో సీఎం జగన్ సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ‘‘పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఏ వర్గానికైనా సరే.. మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే ఎక్కడా మీ బిడ్డ తగ్గడు. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు అని స్పష్టంగా చెబుతున్నా. మన ప్రమాణ స్వీకారం రోజు వలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమంపైనే మొట్ట మొదటి సంతకం చేస్తా’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం, మోసం చేయడం తెలియదు కాబట్టి బాబు, ఆయన కూటమితో ఈ రెండు విషయాల్లో మాత్రం పోటీ పడలేడని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే.. అవ్వాతాతలపై ప్రేమతో... ఈరోజు అవ్వాతాతలతోపాటు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ ఇచ్చిన పెన్షన్ రూ.1,000 మాత్రమే. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకుంటేనే అందిన దుస్థితి. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అప్పట్లో నెలకు వెచ్చించిన వ్యయం కేవలం రూ.400 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ అవ్వాతాతల గురించి, వారి కష్టాలు, ఆత్మగౌరవం గురించి ఆలోచన చేశాడు. అధికారంలోకి రాగానే దేశంలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను నెలకొల్పి వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా 1వ తారీఖునే అది సెలవు రోజైనా, ఆదివారమైనా సరే ఇంటివద్దే నేరుగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్లు పెట్టిన పరిస్థితి 56 నెలలు మన ప్రభుత్వం హయాంలోనే జరిగింది. గతంలో 39 లక్షలు మంది మాత్రమే íపింఛనుదారులుండగా ఈరోజు వివక్ష లేకుండా 66.34 లక్షల మందికి ఠంఛన్గా పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా గత సర్కారు హయాంలో మాదిరిగా రూ.వెయ్యి కాకుండా ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళ్లి అవ్వాతాతలకు మంచి చేశాం. ఈ తేడాను ఒక్కసారి గమనించండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఆ అవ్వలు, తాతలు, అభాగ్యుల పట్ల మనసులో నిజమైన ప్రేమ ఉంటేనే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సభకు హాజరైన అవ్వాతాతలు బాబు ఆ ఆలోచనే చేయలేదు.. మీరంతా గత పాలకులను చూశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు పరిపాలన చేశానని చెబుతుంటారు. కానీ ఏ ఒక్క రోజైనా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఆయన ఆలోచన చేశాడా? అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలనే తాపత్రయం, మనసులో ప్రేమ ఉంటేనే చేతల్లో బయటకు వస్తుంది. ఇవాళ రాజకీయాలు పాతాళానికి దిగజారాయి. విలువలు, విశ్వసనీయత లేవు. ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ తొలిసారిగా అడుగులు వేగంగా వేశాడు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఏకంగా 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చాడు. మీ బిడ్డకు అబద్ధాలు, మోసాలు తెలియవు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ ముందు ఉంచుతున్న వాస్తవాలపై ఆలోచన చేయమని అందరినీ కోరుతున్నా. దేశంలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదే జనాభా ప్రకారం చూస్తే ఐదు కోట్ల మందిలో 66.34 లక్షల మందికి పెన్షన్లు, అత్యధికంగా పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రం మనదే. నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే అందచేస్తున్నాం. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నాం. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలిపితే ఏకంగా రూ.90 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. ఏటా రూ.24 వేల కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా బిహార్లో రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో రూ.5,160 కోట్లు, కర్ణాటకలో రూ.4,700 కోట్లు, పక్కన తెలంగాణలో రూ.8,180 కోట్లు చొప్పున ఏటా పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే అవ్వాతాతలను మోసం చేసేందుకు రూ.4 వేలు.. రూ.5 వేలు.. రూ.6 వేలు అని చెబుతారు. ఇంకా అవసరం అయితే ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు అని కూడా అంటారు. మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా చేయగలిగిందే చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాదు. ఈ 58 నెలల పాలన చూస్తే చెప్పనివి కూడా చాలా చేసిన పరిస్థితి మీ అందరికీ కనిపిస్తుంది. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. మీ అందరికీ అందుకే చెబుతున్నా. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండీ. మీ బిడ్డ పేదల సంక్షేమానికి సంవత్సరానికి దాదాపుగా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తేవడంతో ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని నమ్మబలుకుతున్న చంద్రబాబు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. సునాయాసంగా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మీలో ఎవరైనా నాకు సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్లిప్పులో రాసి బాక్సులో వేస్తే నావద్దకు వస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు చంద్రబాబు చేసిన పనికి... నాకు కాలు విరగడంతో ఆపరేషన్లు జరిగాయి. అన్ని పథకాలు కలిపి రూ.3.40 లక్షలు అందాయి. నీ మేలు ఎప్పుడూ మరవలేం. చంద్రబాబు చేసిన పనికి చాలా కష్టం అయింది. నాకు ఆయాసం ఉంది. మూడుసార్లు కూర్చుని లేచి సచివాలయానికి వెళ్లా. తోడు కోసం ఓ పాపను తీసుకెళితే రాయి తగిలి కింద పడటంతో ఆమె ముక్కుకు గాయం అయింది. మమ్మల్ని ఇంత కష్టపడేలా చేసింది చంద్రబాబే. రైతుభరోసా సహా నాకు ఎన్నో పథకాలు అందాయి. మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకున్నా. నీవల్లే ధైర్యంగా బతుకుతున్నా. – కర్నాటి సుబ్బులు, కుర్చేటి మండలం, అగ్రహారం ఎంత ఇబ్బంది బాబూ.. ఇన్నాళ్లూ వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెడితే ఈనెలలో మాత్రం మూడు చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళితే అక్కడ కాదన్నారు. ఇంకో చోటకు వెళితే అక్కడా కాదన్నారు. మోకాళ్ల నొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ బాబు! ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. మాకు వలంటీర్లు, వలంటీర్ల వ్యవస్థ కావాలి. కరోనాలో మాసు్కలతో సహా ఇంటివద్దకే పంపించారు. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకు పథకాలు అందుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తే ఒప్పుకోం. – పట్రా ప్రభావతి, దర్శి దివ్యాంగులు, వృద్ధులపై అక్కసు.. టీడీపీ హయాంలో దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. మీరు (సీఎం జగన్) పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలిచ్చారు. అందులో ఇవ్వని హామీ ఒకటి ఏమిటంటే దేవుడి దూతలా వలంటీర్లను పంపించడం. వారు ఇంటింటికీ వచ్చి దివ్యాంగులకు పెన్షన్లే కాకుండా సదరం సర్టిఫికెట్ నుంచి ఆధార్ కార్డు దాకా ప్రతి ఒక్కటీ అందేలా చేశారు. బాబు మిమ్మల్ని ఏమీ చేయలేక అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టి కొట్టుకుపోతారు. 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోవటాన్ని నేను కళ్లారా చూశా. దీనికి ఎవరు కారణమనేది అందరూ ఆలోచన చేయాలి. – నర్సింహారావు, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు నిన్నే నమ్ముకున్నానయ్యా.. నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాకు వైఎస్సార్ ఇల్లు కట్టించాడు. నాకు నలుగురు కొడుకులున్నా నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది బ్యాంకుల నుంచి రూ.23 వేలు వచ్చాయి. నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా. – గంగిరెడ్డి మంగమ్మ, బొట్టపాలెం దోమలు కుడుతున్నా.. పింఛన్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి మాకు పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలే ఉండేవి. దోమలు కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుందనే భయంతో వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వుండేవాడ్ని. సిబ్బంది 8 గంటలకు వచ్చేవారు. అన్ని పూర్తి చేసేసరికి 9 గంటలు అయ్యేది. అప్పటికే దాదాపు రెండు మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లను తరువాత రావాలని పంపేవారు. అలా వారం రోజులు పెన్షన్లు ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన బంగారు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వారికి మే 13న ప్రజాకోర్టు శిక్ష వేస్తుంది. జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది. – వెంకటపతి, దర్శి పల్లెటూళ్లకు పాలన తెచ్చారు.. నవరత్నాల పథకాల వల్ల మాలాంటి పేదలకు నాలుగు వేళ్లు నోట్లోకి పోతున్నాయి. నాడు పరిపాలన కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. నేడు పల్లెటూళ్లకు పరిపాలన తెచ్చిన ఘనత మన జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీస్కు వెళ్లాల్సిందే. ఇప్పుడు అన్నీ గ్రామాల్లోనే లభిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నీలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడ్ని చూసి భయపడుతున్నారు. – శ్రీనివాస్రెడ్డి, బసిరెడ్డిపాలెం గ్రామం నీ నీడన మేం ఉండాలి.. నా పెనిమిటి మరణించి 15 ఏళ్లు అయింది. నాకు ఇల్లూ వాకిలీ లేదు. ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. ఇప్పటి వరకూ రూ.1.30 లక్షల మేర లబ్ధి పొందా. ఈనెల పెన్షన్ వలంటీర్ ఇవ్వలేదు. నా కుమారుడిని అడిగితే దర్శి వెళ్లి తెచ్చుకోవాలన్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేను. ఎవరినో బతిమాలి వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నా. జగనన్నా మళ్లీ నువ్వే రావాలి. 175కి 175 రావాలి. నీ నీడన మేం ఉండాలి. మంచి మనసున్న మారాజు నువ్వు. సొంత కొడుకులు, కోడళ్లు పదెకరాల ఆస్తి ఇచ్చినా మనల్ని చూడరు. కానీ అందరినీ చూసే మంచి మనసున్న మనిషి దైవబలంతో ఆ తల్లికి జన్మించాడు. అలాంటి జగనన్నను మనం గెలిపించుకోవాలి. – వెంకాయమ్మ, శివాజీ నగరం వార్డు, దర్శి, వితంతు పెన్షన్ లబ్ధిదారు ఐదు గద్దలు మాపై పడ్డాయి.. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలు అరకొర పెన్షన్లు ఇవ్వడంతోపాటు ఒక íపింఛనుదారుడు చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలు మంజూరు చేసేవి. వలంటీర్లను అడ్డుకునేందుకు రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి లాంటి ఐదు గద్దలు తోడయ్యాయి. ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి నాలాంటి గుడ్డోళ్లు, ముసలోళ్లను దెబ్బ తీశారు. పది మంది చూపు పడితే బండ రాళ్లైనా పగిలిపోతాయి. 69 లక్షల మంది చూపు పడి ఆ ఐదుగురూ నామరూపాలు లేకుండా పోతారు. – శ్రీను, పెద ఉయ్యాలవాడ, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు -
పింఛన్ల లబ్ధిదారులపై అక్కసు వెళ్లగక్కుతున్న టీడీపీ నేతలు
-
అవ్వాతాతలకు ఇంటి దగ్గర పెన్షన్ రాకుండా చేసిన పచ్చ గ్యాంగ్
-
బాబు నిర్వాకం వల్లే సచివాలయాలకు వెళ్లే దుస్థితి: పెన్షన్ దారులు
-
జగన్ సీఎం అయ్యాకే సక్రమంగా పింఛన్: వృద్ధులు
-
‘పచ్చ’పగ.. పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు (ఫొటోలు)
-
ఊహల్లో బ్రతుకుతున్న బాబు.. ముమ్మాటికీ ఇది చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్ర
-
చంద్రబాబు వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందని అవ్వాతాతల ఆవేదన
-
చంద్రబాబు వేస్ట్...వాలంటీర్లే బెస్ట్
-
కుట్ర ఫలించి.. గడప దాటించి!
చంద్రబాబు అండ్ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్దారులకు పింఛన్ కష్టాలు పునరావృతం కానున్నాయి. తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అనుంగు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్ ఒకవైపు కోర్టుల్లో వలంటీర్లపై కేసులు వేయడం.. మరోవైపు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ దూరం పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఐదేళ్లుగా ఇంటి వద్దే పింఛను అందుకుంటున్న లబి్ధదారులు టీడీపీ కుట్రతో మొదటిసారి గడప దాటాల్సి రావడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 4,69,789 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.140,15,56,500 బ్యాంకులకు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి బుధవారం నగదు డ్రా చేయనున్నారు. వీలైనంతవరకు బుధవారమే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ అయినా గురువారం నుంచి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 సచివాలయాల్లో పించన్ల పంపిణీ జరుగుతుంది. 6వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 2,46,863 పింఛన్లకు రూ.73.90 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,22,935 పింఛన్లకు రూ.66.24 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. దీంతో పింఛన్దారులు వలంటీర్లను గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా పింఛన్ పొందుతున్న వారికి పచ్చ కూటమి కారణంగా మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాల్సి ఉన్నందున మొదటి రోజు పంపిణీలో జాప్యం జరుగుతుంది. 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్దారులు కిలో మీటర్ల దూరంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4.70 లక్షల మందికి కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీపై పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికే పింఛన్ పంపితే... చంద్రబాబు మళ్లీ పాత పద్ధతిలో సచివాలయాల చుట్టూ తిప్పేలా చేశాడని పింఛన్దారుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అందరికీ పింఛన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ ముగిసే వరకు సచివాలయాల వద్ద షామియానాలు వేయడంతో పాటు నీటి సదు పాయం కలి్పంచేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీరికి ఇంటి వద్దే పంపిణీ ► ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల పింఛన్లు ఉండగా... ఇందులో వికలాంగులు, వయోవృద్ధులు (నడవలేని వారు), మంచానికే పరిమితమైనవారు, కిడ్నీ, డయాలసిస్ పేషెంట్లకు ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగులు పింపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ► ఇటువంటి వారు దాదాపు 30–40 శాతం మంది ఉంటారు. ► సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ► సచివాలయాల్లేని మజరా గ్రామాల్లో పింఛన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఒకవైపు 30–40 శాతం మందికి ఇంటి వద్ద.. మిగిలిన వారికి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయనుండటం గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. బాబు ఎంత పని చేశావయ్యా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లూ ఎప్పుడూ పింఛన్ కోసం ఆలోచించలేదు. ఠంచన్గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇప్పడు భయపడుతున్నారు. మా లాంటి వారికి ఇంటికొచ్చి ఎవరు వస్తారో తెలియదు. ఎవరినీ అడగాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ముసలోళ్ల మీద దయలేదు. –కరీంబీ, డబ్ల్యూ.గోవిందిన్నె, దొర్నిపాడు మండలం లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో.. నాకు వితంతు పింఛన్ వస్తుంది. ప్రతి నెలా వలంటీర్లు తెల్లవారుజూమున ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. కానీ ఈ నెల ఒకటవ తేదీ వచ్చింది కానీ పింఛను అందలేదు. వలంటీర్ను అడిగితే సచివాలయానికి రావాలని చెబుతున్నారు. అందరూ అక్కడికి పోతే పెద్ద లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో తెలియడం లేదు. కూలీకి వెళ్లకుండా పింఛన్ కోసం వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు మాలాంటి పేదల మీద ఎప్పుడూ ఏడుస్తుంటాడు. – తెలుగు వెంకట లక్ష్మమ్మ, గిద్దలూరు గ్రామం, సంజామల మండలం మా ఉసురు తగులుతుంది టీడీపీ పాలనలో పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయలేదు. అప్పట్లో పంచాయతీ కార్యాలయం వద్ద వారాల కొద్ది ఎదురు చూసేటోళ్లం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ ద్వారా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దకు పింఛన్ ఇచ్చి పంపుతున్నాడు. పింఛన్లు వలంటీర్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణం. చంద్రబాబుకు ఓటు వేసే ప్రసక్తే లేదు. మా ముసలోళ్ల ఉసురు ఆయనకు తగులుతుంది. – బోయ నరసమ్మ, నాగలదిన్నె, నందవరం మండలం -
పండుటాకులపై పగా?
‘మేం ఏం పాపం చేశాము. మాపైన వాళ్లకు ఎందుకంత పగ. వలంటీర్లపై కక్షగట్టి మా నుంచి దూరం చేశారు. ఒకటో తేదీ తెల్లవారేసరికి ఇంటికొచ్చే పెన్షన్ని రానీయకుండా చేశారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ మేము క్యూల్లో నిలబడాలా..?. మండుటెండల్లో సొమ్మసిల్లి పడిపోవాలా..?. పనులు మానుకుని.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరీక్షించాలా..?’ అంటూ పెన్షన్ దారులు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు అండ్ కో.. వలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని సంక్షేమ పథకాల నుంచి మినహాయించింది. లబి్ధదారులకు ఒకటో తేదీ అందాల్సిన పెన్షన్ అందకుండా పోయింది. దీంతో లబి్ధదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. గుడ్డివారి గోష్ట టీడీపీకి తగులుతుంది నాకు కంటి చూపులేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మనిషి తోడుకావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే ప్రతినెలా ఒకటవ తేదీ గ్రామ వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేదాన్ని. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఈ నెల నుంచి ఎన్నికల సాకు చూపి వలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి పక్కన పెట్టడం దురదృష్టకరం. నా లాంటి కంటిచూపు లేని వాళ్లు ఎక్కడో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి క్యూలో నిలబడి పింఛన్ ఎలా తీసుకోవాలి..?. మాలాంటి వారి గోడు తప్పక తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము.గత 58 నెలలు ఆ బాధల నుంచి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని విముక్తి లభించింది. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. –నాగమ్మ, వెంగారెడ్డికండ్రిగ, వరదయ్యపాళెం మండలం లేవలేని స్థితిలో ఉన్నా నాకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదల్లేక మంచానికే పరిమితమైనాను. నెలనెలా వచ్చే పింఛనుపైనే మందులుమాకులు ఇతరులతో చెప్పి తెప్పించుకునేవాడిని. ప్రతినెలా ఒకటో తారీఖున వలంటీర్ నిద్రలేపి నా వేలిముద్ర తీసుకుని ఇంటివద్దనే పింఛన్ ఇచ్చేవాడు. ఈ రోజు(సోమవారం) పింఛన్ ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారు. నేను అంత దూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకునేది..?. ఏ పుణ్యాత్ముడో ఫిర్యాదు చేసి నాలాంటి వారి ఉసురు పోసుకున్నాడు. పింఛన్ ఇంటికి రాకుండా చేశారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నలుగురిని మంచంపై సచివాలయం వద్దకు మోసుకెళ్లాలి. అదే వలంటీర్ అయితే ఇంటివద్దకే వచ్చి ఇచ్చిపోయుండేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏ దిగులూ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇవ్వకపోయినా ఆయన చేసిన మేలు మరిచిపోతామా?. – గోవిందనాయుడు, కుప్పంబాదూరు గ్రామం, రామచంద్రాపురం టీడీపీ పాలనలో అష్టకష్టాలు..మళ్లీనా? వాకాడు మండలం, ఇన్నమాల గ్రామానికి చెందిన పోలయ్య వయసు 91, చేను చెంగమ్మ వయసు 85, ఇన్నమాల సుబ్బమ్మ వయసు 86, బండి వెంకటసుబ్బయ్య వయసు 78. వీరి వలంటీర్లు ఉమ్మడి మోహన్, పీ.సులోచన, అఖిల కవిత. సోమవారం ఒకటో తేదీ కావడంతో వారి రాకకోసం ఎదురు చూశారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా నాయనా.. మీరు మాకు పింఛన్ ఇచ్చే వారా?.. అయితే నా పేరు ఫలానా.. నాకు పింఛన్ ఇవ్వండి’ అని అడిగి మరీ నిరాశ చెందారు. తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు వీ«ధి కాలవలపై కూర్చుని పింఛన్ కోసం ఎదురు చూసి నిట్టూర్పుతో వెనుదిరిగారు. చంద్రబాబు పుణ్యమా అంటూ మరో మూడు నెలలు పింఛన్ ఇంటికి రాదని సమాచారం తెలుసుకున్న అవ్వాతాతలు మాకు పింఛన్ రాకుండా చేసిన చంద్రబాబు, వారి మనుషులు మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు బాబు కుట్రలకు బలైపోయాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతిరోజూ అవస్థలే. ఎప్పుడు..? ఎక్కడిస్తారో తెలియని పరిస్థితి. పంచాయతీ, పోస్టల్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కష్టాల నుంచి వృద్ధులను, వితంతువులను గట్టెక్కించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ వలంటీర్ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. అనారోగ్య కారణంతో మంచానికే పరిమితమైన నాలాంటి వారికి ఈ పద్ధతి ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. నేను సచివాలయానికి వెళ్లాలంటే అద్దె ఆటో కావాలి. దానికి తోడు నా వెంట మరో వ్యక్తి సహాయం అవసరం. ఇంట్లో వారు సైతం పనులు మానుకుని నా వెంట రావాల్సిన పరిస్థితి. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు. నాలాంటి వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. –మాచాలమ్మ, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం మేమంటే బాబుకు ఎందుకంత కక్ష గతంలో వెయ్యి రూపాయల పింఛన్ కోసం మండుటెండల్లో కిలోమీటరు పొడవున ఉండే క్యూలో నిలబడేదాన్ని. నా మనవడు జగన్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. నాకు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు జామున్నే మా వలంటీర్ సులోచన ఇంటికొచ్చి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేది. ఈనెల ఒకటోతేదీ వచ్చినా మా వలంటీర్ ఇంటికి రాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడపలో కూర్చుని ఎదురు చూశాను. ఎందుకు రాలేదని వేరే వాళ్లను అడిగితే చంద్రబాబు, వాళ్ల మనుషులు వలంటీర్లుపై కోర్టుకు వెళ్లి కేసు వేశారని చెప్పారు. మరో మూడు నెలలు ఆఫీసుకాడికి వెళ్లి పింఛన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గరపడి పేదలను ఇలా కష్టాలు పెడుతున్నాడు. చంద్రబాబు అప్పుడు అలా చేశాడు.. ఇప్పుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన పాలనలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని నాలుగో రోజున పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు నా మనవడు జగన్ దయతో ఐదేళ్లు ఆ కష్టాలు తప్పినాయి. మళ్లీ చంద్రబాబు పాత రోజులను తీసుకురావడం దుర్మార్గం. చేను చెంగమ్మ వృద్ధురాలు, గొల్లపాళెం, వాకాడు మండలం మా ఉసురు తగలకుండా పోదు జగనన్న ప్రభుత్వ హయంలో మాకు తెల్లారేసరికి నిద్రలేపి పింఛన్ ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛను ఇచ్చి, సమస్యలు అడిగి తెలుసుకునేవారు. జీతం తరహాలో పింఛను తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు మాకు అండగా నిలిచారు. వలంటీర్ల సేవలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడేమో ఎన్నికలు అని చెప్పి మాకు పింఛన్ అందకుండా చేశారు. పింఛన్ అడ్డుకున్న వాళ్లకు మాలాంటి ముసలోళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం వలంటీర్ల ద్వారా మాకు మంచి చేస్తుంటే ఓర్వలేక అడ్డుపడడం బాధగా ఉంది. ఎవరో వద్దన్నారని వలంటీర్లు ఏమో ఈరోజు పింఛను ఇవ్వలేదు. ఎందుకని అడిగితే టీడీపీ వాళ్లు వలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతేనా..?. మాలాంటి ముసలోళ్లకి మంచి జరిగితే ఓర్వలేరా..?. మాలాంటి వాళ్లపైన కక్షగడ్డి పింఛన్ రాకుండా చేశారు. మా ఉసురు తలగకుండా పోదు. – సరసమ్మ, ఎర్రమిట్ట, తిరుపతి -
మేమంటే బాబుకు ఎందుకంత కక్ష
‘మేం ఏం పాపం చేశాము. మాపైన వాళ్లకు ఎందుకంత పగ. వలంటీర్లపై కక్షగట్టి మా నుంచి దూరం చేశారు. ఒకటో తేదీ తెల్లవారేసరికి ఇంటికొచ్చే పెన్షన్ని రానీయకుండా చేశారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ మేము క్యూల్లో నిలబడాలా..?. మండుటెండల్లో సొమ్మసిల్లి పడిపోవాలా..?. పనులు మానుకుని.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరీక్షించాలా..?’ అంటూ పెన్షన్ దారులు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు అండ్ కో.. వలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని సంక్షేమ పథకాల నుంచి మినహాయించింది. లబి్ధదారులకు ఒకటో తేదీ అందాల్సిన పెన్షన్ అందకుండా పోయింది. దీంతో లబి్ధదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. గుడ్డివారి గోష్ట టీడీపీకి తగులుతుంది నాకు కంటి చూపులేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మనిషి తోడుకావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే ప్రతినెలా ఒకటవ తేదీ గ్రామ వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేదాన్ని. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఈ నెల నుంచి ఎన్నికల సాకు చూపి వలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి పక్కన పెట్టడం దురదృష్టకరం. నా లాంటి కంటిచూపు లేని వాళ్లు ఎక్కడో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి క్యూలో నిలబడి పింఛన్ ఎలా తీసుకోవాలి..?. మాలాంటి వారి గోడు తప్పక తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము.గత 58 నెలలు ఆ బాధల నుంచి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని విముక్తి లభించింది. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. –నాగమ్మ, వెంగారెడ్డికండ్రిగ, వరదయ్యపాళెం మండలం లేవలేని స్థితిలో ఉన్నా నాకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదల్లేక మంచానికే పరిమితమైనాను. నెలనెలా వచ్చే పింఛనుపైనే మందులుమాకులు ఇతరులతో చెప్పి తెప్పించుకునేవాడిని. ప్రతినెలా ఒకటో తారీఖున వలంటీర్ నిద్రలేపి నా వేలిముద్ర తీసుకుని ఇంటివద్దనే పింఛన్ ఇచ్చేవాడు. ఈ రోజు(సోమవారం) పింఛన్ ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారు. నేను అంత దూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకునేది..?. ఏ పుణ్యాత్ముడో ఫిర్యాదు చేసి నాలాంటి వారి ఉసురు పోసుకున్నాడు. పింఛన్ ఇంటికి రాకుండా చేశారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నలుగురిని మంచంపై సచివాలయం వద్దకు మోసుకెళ్లాలి. అదే వలంటీర్ అయితే ఇంటివద్దకే వచ్చి ఇచ్చిపోయుండేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏ దిగులూ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇవ్వకపోయినా ఆయన చేసిన మేలు మరిచిపోతామా?. – గోవిందనాయుడు, కుప్పంబాదూరు గ్రామం, రామచంద్రాపురం టీడీపీ పాలనలో అష్టకష్టాలు..మళ్లీనా? వాకాడు మండలం, ఇన్నమాల గ్రామానికి చెందిన పోలయ్య వయసు 91, చేను చెంగమ్మ వయసు 85, ఇన్నమాల సుబ్బమ్మ వయసు 86, బండి వెంకటసుబ్బయ్య వయసు 78. వీరి వలంటీర్లు ఉమ్మడి మోహన్, పీ.సులోచన, అఖిల కవిత. సోమవారం ఒకటో తేదీ కావడంతో వారి రాకకోసం ఎదురు చూశారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా నాయనా.. మీరు మాకు పింఛన్ ఇచ్చే వారా?.. అయితే నా పేరు ఫలానా.. నాకు పింఛన్ ఇవ్వండి’ అని అడిగి మరీ నిరాశ చెందారు. తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు వీ«ధి కాలవలపై కూర్చుని పింఛన్ కోసం ఎదురు చూసి నిట్టూర్పుతో వెనుదిరిగారు. చంద్రబాబు పుణ్యమా అంటూ మరో మూడు నెలలు పింఛన్ ఇంటికి రాదని సమాచారం తెలుసుకున్న అవ్వాతాతలు మాకు పింఛన్ రాకుండా చేసిన చంద్రబాబు, వారి మనుషులు మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు బాబు కుట్రలకు బలైపోయాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతిరోజూ అవస్థలే. ఎప్పుడు..? ఎక్కడిస్తారో తెలియని పరిస్థితి. పంచాయతీ, పోస్టల్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కష్టాల నుంచి వృద్ధులను, వితంతువులను గట్టెక్కించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ వలంటీర్ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. అనారోగ్య కారణంతో మంచానికే పరిమితమైన నాలాంటి వారికి ఈ పద్ధతి ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. నేను సచివాలయానికి వెళ్లాలంటే అద్దె ఆటో కావాలి. దానికి తోడు నా వెంట మరో వ్యక్తి సహాయం అవసరం. ఇంట్లో వారు సైతం పనులు మానుకుని నా వెంట రావాల్సిన పరిస్థితి. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు. నాలాంటి వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. –మాచాలమ్మ, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం మేమంటే బాబుకు ఎందుకంత కక్ష గతంలో వెయ్యి రూపాయల పింఛన్ కోసం మండుటెండల్లో కిలోమీటరు పొడవున ఉండే క్యూలో నిలబడేదాన్ని. నా మనవడు జగన్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. నాకు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు జామున్నే మా వలంటీర్ సులోచన ఇంటికొచ్చి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేది. ఈనెల ఒకటోతేదీ వచ్చినా మా వలంటీర్ ఇంటికి రాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడపలో కూర్చుని ఎదురు చూశాను. ఎందుకు రాలేదని వేరే వాళ్లను అడిగితే చంద్రబాబు, వాళ్ల మనుషులు వలంటీర్లుపై కోర్టుకు వెళ్లి కేసు వేశారని చెప్పారు. మరో మూడు నెలలు ఆఫీసుకాడికి వెళ్లి పింఛన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గరపడి పేదలను ఇలా కష్టాలు పెడుతున్నాడు. చంద్రబాబు అప్పుడు అలా చేశాడు.. ఇప్పుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన పాలనలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని నాలుగో రోజున పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు నా మనవడు జగన్ దయతో ఐదేళ్లు ఆ కష్టాలు తప్పినాయి. మళ్లీ చంద్రబాబు పాత రోజులను తీసుకురావడం దుర్మార్గం. చేను చెంగమ్మ వృద్ధురాలు, గొల్లపాళెం, వాకాడు మండలం మా ఉసురు తగలకుండా పోదు జగనన్న ప్రభుత్వ హయంలో మాకు తెల్లారేసరికి నిద్రలేపి పింఛన్ ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛను ఇచ్చి, సమస్యలు అడిగి తెలుసుకునేవారు. జీతం తరహాలో పింఛను తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు మాకు అండగా నిలిచారు. వలంటీర్ల సేవలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడేమో ఎన్నికలు అని చెప్పి మాకు పింఛన్ అందకుండా చేశారు. పింఛన్ అడ్డుకున్న వాళ్లకు మాలాంటి ముసలోళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం వలంటీర్ల ద్వారా మాకు మంచి చేస్తుంటే ఓర్వలేక అడ్డుపడడం బాధగా ఉంది. ఎవరో వద్దన్నారని వలంటీర్లు ఏమో ఈరోజు పింఛను ఇవ్వలేదు. ఎందుకని అడిగితే టీడీపీ వాళ్లు వలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతేనా..?. మాలాంటి ముసలోళ్లకి మంచి జరిగితే ఓర్వలేరా..?. మాలాంటి వాళ్లపైన కక్షగడ్డి పింఛన్ రాకుండా చేశారు. మా ఉసురు తలగకుండా పోదు. – సరసమ్మ, ఎర్రమిట్ట, తిరుపతి -
మాపై నీకెందుకింత కక్ష?.. చంద్రబాబుపై పింఛన్దారుల ఆగ్రహం
రాజమహేంద్రవరం సిటీ/పెదబయలు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ‘మాపై నీకెందుకింత కక్ష? వృద్ధుల విషయంలో కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావ్. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకుంటావా?’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ పింఛన్ కానుక లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జాంపేట గణేష్ చౌక్ వద్ద వందలాది మంది పింఛన్దారులు సోమవారం ఆందోళన చేశారు. ఎంపీ, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్లు తమ ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్ డబ్బులు చేతిలో పెట్టేవారని చెప్పారు. కానీ ఈ దుర్మార్గపు చంద్రబాబు చేసిన పని వల్ల ఈరోజు ఇంటి వద్ద పింఛన్ అందుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అసలు పింఛన్ మంజూరవ్వడానికే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని.. పింఛన్ కోసం ఎండలో క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు పడేవాళ్లమంటూ గుర్తు చేసుకున్నారు. ఆకలి వేసినా, వడదెబ్బ కొట్టి పడిపోయినా, అనారోగ్యం వచ్చినా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదన్నారు. అధికారం నుంచి దించేసినా చంద్రబాబుకు సిగ్గురాలేదని మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని.. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు పాలన, ఆ జన్మభూమి కమిటీలను తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. టీడీపీ పాలనలో పింఛన్ కోసం కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలన వచ్చాక ప్రతి నెలా క్రమం తప్పకుండా వలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారని.. ఇంత చక్కని పాలన ఇంకెవ్వరూ అందించలేరన్నారు. తమకు మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలంటూ నినాదాలు చేశారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని ఎంపీ భరత్ చెప్పారు. బాబు నిర్వాకంతో 10 కిలోమీటర్లు నడవాలి అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గోమంగి, గుల్లేలు పంచాయతీల పరిధిలోని పింఛన్దారులు సోమవారం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థ వల్ల ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే వలంటీర్లు తమ ఇళ్లకు వచ్చి పింఛన్ ఇచ్చేవారని చెప్పారు. కానీ చంద్రబాబు చేసిన పని వల్ల ఏజెన్సీలో ఉండే తాము ఎంతో బాధపడాల్సి వస్తోందన్నారు. గుల్లేలు పంచాయతీ కించూరు, బూరుగువీధి, పెదవంచరంగి, జంగంపట్టు గ్రామాలకు సుమారు 10 కిలోమీటర్ల దూరమని, గోమంగి పంచాయతీ కరుగొండ, బొండ్డాపుట్టు, కుంతురుపుట్టు, వన్నాడ, వంకరాయి గ్రామాలకు కూడా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నిర్వాకం వల్ల తాము 10కిలోవీుటర్లు నడిచి వచ్చి సచివాలయంలో పింఛన్ తీసుకోవడం కష్టంతో కూడుకున్నదని వాపోయారు. చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులను నమ్మవద్దని ఎన్నికల కమిషన్ను కోరారు. -
పాపాల చంద్రబాబుకు అవ్వాతాతల హెచ్చరిక
-
పెనుకొండ సభలో పింఛనుపై తన వైఖరి ప్రకటించిన చంద్రబాబు
-
సీఎం జగన్ చిత్రపటానికి రాజధాని ప్రాంత రైతు కూలీల క్షీరాభిషేకం
మంగళగిరి : రాజధాని ప్రాంత రైతు కూలీలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు కూలీల పింఛన్ను సీఎం జగన్ రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా యర్రబాలెం, నిడమర్రులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవితో కలిసి పర్యటించి వలంటీర్ల ద్వారా రైతు కూలీలకు రూ.5 వేల చొప్పున పింఛన్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో యర్రబాలెంలో పలువురు లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి, నిడమర్రులో వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకతీతంగా రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ రూ.5 వేల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతులను, రైతు కూలీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులు లబ్ధిపొందలేకపోయారని, ఇక రైతు కూలీల జీవితాలైతే అగమ్యగోచరంగా తయారైన పరిస్థితులను చూశామన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. రాజధానిని నిర్మించలేకపోవడంతో పాటు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయలేకపోయాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా తాను రైతు కూలీలను ఆదుకుంటానని వాగ్దానం చేశారని, ఆ మేరకు రూ.2,500గా ఉన్న రైతు కూలీల పింఛన్ను రూ.5 వేలకు పెంచారని ప్రశంసించారు. -
AP: పింఛనే కాదు.. పెన్షనర్లూ పెరిగారు
సాక్షి, అమరావతి/కాకినాడ: అవ్వాతాతలతో పాటు వితంతువులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్ మొత్తం ఈనెల నుంచి రూ.మూడు వేలకు సీఎం వైఎస్ జగన్ సర్కారు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పింఛను పెంపు ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. వలంటీర్లు ఓ వైపు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తుండగా.. మరోవైపు రెండ్రోజులుగా వివిధ మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చురుగ్గా పాల్గొంటున్నారు. నాలుగున్నర ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో కొత్తగా పింఛన్లు మంజూరు కావాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక పింఛన్ల పంపిణీలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు గుర్తుచేస్తున్నారు. దీంతో.. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచి్చన మాట ప్రకారం రూ.3,000ల పెన్షన్ అమలుపై వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు కాకినాడ ఉత్సవాలకు సీఎం జగన్.. ఈ నేపథ్యంలో.. బుధవారం సీఎం జగన్మోహన్రెడ్డి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో జరిగే పింఛన్ల పెంపు ఉత్సవంలో స్వయంగా పాల్గొననున్నారు. ఈ జనవరి ఒకటో తేదీ నుంచి 66,34,742 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల మొత్తం రూ.1,967.34 కోట్లు విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన మెగాచెక్ను ముఖ్యమంత్రి కాకినాడలో ఆవిష్కరిస్తారు. అలాగే, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరుకు ఇటీవల జాతీయ స్థాయిలో స్కోచ్ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన ప్లాటినం అవార్డును సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. అంతేకాక.. లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడుతారు. అనంతరం.. రూ.65 కోట్లతో నిర్మించిన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ను (ముత్తా గోపాలకృష్ణ వారధి), రూ.20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి వెంకట జయరామ్కుమార్ కళాక్షేత్రాన్ని, రూ.9.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్ను సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిచేశారు. సీఎం పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆయన ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎంపీ వంగా గీత, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీ‹Ùకుమార్, ఇతర ప్రముఖులు సమీక్షించారు. సీఎం షెడ్యూల్ ఇలా.. – ఉ.9.30కు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి 10.20 గంటలకు కాకినాడకు చేరుకుంటారు. – ఉ.10.40కు బహిరంగ సభ జరిగే రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) గ్రౌండ్స్కు చేరుకుంటారు. – 11.55 వరకూ వైఎస్సార్ పింఛన్ పెంపు ఉత్సవంలో పాల్గొంటారు. – మ.12 గంటల ప్రాంతంలో కాకినాడ నుంచి బయల్దేరుతారు. – మ.2 గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement