Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Investigation into illegal liquor case under Chandrababu direction1
బాబు అరాచకం.. సిట్‌ గూండాయిజం

సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడి బీభత్సం సృష్టించిన తీరును తలపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నియమించి­న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పనితీరు. దర్యాప్తు ముసు­గు­లో గూండాగిరీకి బరితెగించమని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసి రాష్ట్రం మీదకు వదలినట్టుంది సిట్‌ అరాచకం. అందుకే బెదిరింపులు, వేధింపులు, కిడ్నాపులు, చిత్రహింసలతో చెలరేగిపోతోంది. చివరకు పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానిస్టేబుల్‌ను కూడా విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం సిట్‌ దాష్టీ­కా­నికి పరాకాష్టగా నిలుస్తోంది. అత్యు­న్నత న్యాయస్థానం ఆదేశా­లను బేఖాతరు చేస్తూ సిట్‌ చీఫ్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం అధికారిక రౌడీయిజం చలాయిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నికల కమిషన్‌ నమోదు చేసిన కేసును వక్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టుకు తెగబడింది. లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్‌ చేశారు. బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్‌ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్‌ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలా­లు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజా అంకమే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అక్రమ అరెస్టు.. ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్‌ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్‌ యాదవ్‌ (ఏ35), యద్దాల నవీన్‌ (ఏ36), హరీశ్‌ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్‌ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాత­రు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.పోలీసు శాఖలో చిరుద్యోగులపై కూడా థర్డ్‌ డిగ్రీ!చివరకు పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులను కూడా దర్యాప్తు పేరుతో వేధించి భౌతికంగా హింసించడం సిట్‌ దాష్టీకానికి నిదర్శనం. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని ఈ అక్రమ కేసులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి అనే ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) కానిస్టేబుల్‌ను కొన్ని రోజులపాటు సిట్‌ ఆఫీసులో నిర్బంధించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెబితే తాను నగదు తరలించే వాహనానికి భద్రత కోసం వెళ్లానని చెప్పాలని వేధించారు. ఆయన్ను కొట్టి మరీ ఒప్పించినట్టు తెలుస్తోంది. సిట్‌ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారని సమాచారం. అనంతరం చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా చేసిన ఏఆర్‌ విభాగానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌ రెడ్డిని సిట్‌ అధికారులు తిరుపతి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్నూ వేధించారు. దాదాపు రూ.250 కోట్ల నగదును అక్రమంగా తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు మదన్‌ రెడ్డి సమ్మతించకపోవడంతో సిట్‌ అధికారులు ఆయనపై పోలీసు మార్కు ప్రతాపం చూపించారు. ఆయన ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టారు. అంటే పోలీసుకే పోలీసు మార్కు ట్రీట్మెంట్‌ రుచి చూపించారు. సిట్‌ అధికారులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్‌రెడ్డి ఆసుప­త్రిలో చేరారు. సిట్‌ అధికారులు కొట్టడంతో తనకు తగిలిన గాయాల ఫొటోలతో సహా ఆయన డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఫిర్యాదు చేయడంతోపాటు పూర్తి ఆధా­రాలతోసహా హైకోర్టులో పిటిషన్‌ దా­ఖలు చేయగా దాన్ని కోర్టు విచారణకు స్వీక­రించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడులను సిట్‌ నిందితులుగా చేర్చనేలేదు. కానీ వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేయడం సిట్‌ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్‌ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), వెంకటేశ్‌ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్‌ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్‌ అవుట్‌నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవ­డం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్‌ విచారణకు రావడా­నికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్‌ రహస్యంగా లుక్‌ అవుట్‌ నోటీసులిచ్చి అరెస్ట్‌ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం వారిని బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలి. ఆ సమయంలో ఏ కేసులో వారు నిందితులుగా ఉన్నారని అక్కడి న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. అందుకే సిట్‌ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తర్వాత హడా­వుడిగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు పేర్లను నిందితులుగా చేరుస్తూ విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.బండారం బయట పడుతుందనే..రెడ్‌బుక్‌ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే చంద్రగిరిలో ఆయన బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆ ని­యో­జకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2సార్లు ఎమ్మెల్యేగా గెలి­చారు. ప్రస్తుతం కూడా చంద్రగిరితోపాటు ఒంగోలు లోక్‌­సభ నియో­జకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. దాంతో చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం రెడ్‌­బుక్‌ కుట్రకు తెగబడింది. అందుకోసం తిరుపతి, చంద్ర­గిరిలో ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు యత్నించారు. అక్రమంగా పోక్సో కేసు పెట్టారు. అందు­కోసం నిరక్షరాస్యుడైన ఓ వ్యక్తితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా అక్రమ కేసు నమోదు చేశా­రు. కానీ పోలీసుల కుట్ర తెలుసుకున్న ఆ వ్యక్తి కోర్టులో అసలు విషయం వెల్లడించారు. తాను చెవి­రెడ్డి్డ­పై ­ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనతో ఖాళీ కాగి­తాలపై సంతకాలు చేయించుకుని వారికి నచ్చినట్టు­గా అబద్ధపు ఫిర్యాదు రాసుకున్నారని చెప్పడంతో పోలీసు­ల కుట్ర బెడిసి కొట్టింది. దీంతో ఆయనపై మ­ద్యం అక్రమ కేసు నమోదు చే­యాలని ప్రభుత్వ పెద్దలు ఆ­దే­శించారు. అందుకోసం ఆయ­న వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్‌ రెడ్డి అనే ఏ­ఆర్‌ కానిస్టేబుళ్లను వేధించి,హింసించి అబద్ధపు వాంగ్మూ­లం కోసం బల­వం­తం చేశా­రు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడు, ఆయన సతీమణిని సిట్‌ అధికారులు విచా­రణ పేరిట హైద­రాబాద్‌ నుంచి విజయవాడ తీసుకు­వచ్చి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. తిరుపతికి చెందిన బాలాజీని వేధించి లొంగదీసుకునేందుకు యత్నించారు. తనను చిత్రహింసలకు గురి చేశారని ఏఆర్‌ కానిస్టేబుల్‌ మదన్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తమ కుట్ర పూర్తిగా బట్టబయలవుతుందని భావించిన సిట్‌ అధికారులు వెంటనే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు పావులు కదిపారు.మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకే..గన్‌మెన్లను పిలిచి అబద్ధపు స్టేట్‌మెంట్ల కోసం చిత్రహింసలురాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారుతప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ అవివేకంవైఎస్సార్‌సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆగ్రహంసాక్షి,అమరావతి/సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: లిక్కర్‌ అక్రమ కేసులో కుట్రపూరితంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్లుగా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను సిట్‌ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్‌మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. మదన్‌రెడ్డి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోహిత్‌రెడ్డి ప్రదర్శించారు. మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్టు అబద్ధపు స్టేట్‌మెంట్‌ ఇవ్వనందుకు మదన్‌రెడ్డిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్‌ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.ఈ ప్రశ్నలకు బదులేదీ?మద్యం అక్రమ కేసులో ప్రతిపక్ష నేతలందరినీ ఇరికించడానికి సిట్‌ అనుసరిస్తున్న విధానం, అరెస్టు చేసిన వారిపై తెస్తున్న ఒత్తిడి, తప్పుడు స్టేట్‌మెంట్లకు వారు ఎంచుకున్న మార్గాన్ని నిలదీస్తూ మోహిత్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నావళిని సంధించారు. వీటికి నిజాయతీగా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.⇒ ఏడాదిగా విచారణ చేస్తున్న సిట్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి రాజ్‌ కేసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని గానీ, దానిని ప్రజలకు పంచారనిగానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజే చెప్పడంలో అర్థం ఏమిటీ..? అది నిజం కాదు కనుకే కదా..? ⇒ 20 ఏళ్ల సర్వీసున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని పణంగాబెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీకి విన్నవించుకోవడంపై అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్‌ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?⇒ మదన్‌రెడ్డిని సిట్‌ కార్యాలయానికి పిలిపించి అతను చెప్పినట్టు స్టేట్‌మెంట్‌ రాయకుండా, సిట్‌ చెప్పినట్టు రాయాలని, చెప్పమన్నట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్‌మెంట్‌పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం వల్లే కదా అతడు చనిపోతానన్నది. కాదని చెప్పగలరా?⇒ ఒక హెడ్‌కానిస్టేబుల్‌ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్‌ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లూ రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్‌ కానిస్టేబుల్‌ను సిట్‌ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అనగలడు. ఎవరైనా కాదని చెప్పగలరా?⇒ సిట్‌ విచారణకు వచ్చే వరు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది సిట్‌ కాదా..?⇒ ‘‘సిట్‌ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవరినీ టార్చర్‌ చేయడం లేదు’’ అని సిట్‌లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా? ⇒ సిట్‌ రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్‌కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్‌కు ఆగమేఘాలపై రాత్రికి రాత్రి ఇప్పుడు అతనికి వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం పెంచి ఆక్టోపస్‌లో ఉద్యోగం ఇచ్చారంటేనే సిట్‌ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది కదా.. అది వాస్తవం కాదా?⇒ సిట్‌ తన పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారితో విచారణ చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలంటే సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరపాలి. అలా చేయాలని సిట్‌ అధికారులు కోరగలరా..?⇒ సత్యమేవ జయతే.. అంటున్నారు.. నిజమే ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమే జయిస్తుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్‌ అధికారులందరికీ న్యాయస్థానం శిక్ష విధించి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది.. రాసి పెట్టుకోండి.. అంటూ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

YS Jagan mohan Reddy fires on Chandrababu naidu on kuppam incident2
మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు­నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో భర్త అప్పు చెల్లించలేదనే కారణంతో ఒక మహిళను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకుల దుర్మార్గాలకు మహిళలు, యువ­తులు, బాలికలు బలైపోతున్నారని మండిపడ్డారు. మహిళను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించిన ఫొటోను ట్యాగ్‌ చేస్తూ మంగళారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘చంద్ర­బాబూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మ గౌరవం ఇదేనా? సాక్షాత్తు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసించిన ఘటన.. మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపి విడిచి పెట్టలేదు. మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్‌ గవర్నెన్స్, రెడ్‌బుక్‌ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాను’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Donald Trump Plans joining Israeli strikes on Iranian nuclear sites3
‘ఇరాన్‌’ పని ఖతం.. ట్రంప్‌ సంచలన నిర్ణయం

వాషింగ్టన్‌: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా కూడా ఇరాన్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరాన్‌పై దాడుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.ఇక, జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ షెడ్యూల్‌ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన అమెరికా చేరుకున్నారు. అమెరికా వెళ్లిన అనంతరం, అమెరికా జాతీయ భద్రతా బృందంతో ట్రంప్‌ సమావేశమయ్యారు. దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై సమీక్షించారు. చర్చల అనంతరం టెహ్రాన్‌లోని న్యూక్లియర్‌ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. దీంతో, ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం కానున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందే ట్రంప్‌.. ఇజ్రాయెల్‌ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్‌ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్‌కు ట్రంప్‌ హితవు పలికారు. దాడులు ఆగాలంటే అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్‌ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్‌ సైన్యం ఇరాన్‌పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీ‌ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ను తొలగించే (చంపే) ఉద్దేశం మాకు లేదు. అయితే, పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. మా సహనం నశిస్తోంది. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు. సుప్రీం లీడర్‌ బేషరతుగా లొంగిపోతే మంచిది అని స్పష్టం చేశారు.ఇరాన్‌కు అణుబాంబు దక్కదు అణు బాంబు తయారీకి ఇరాన్‌ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్‌ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ట్రంప్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్‌ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసి గబ్బార్డ్‌ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్‌ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 18-06-2025 In Telugu4
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.సప్తమి ప.10.38 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.10.03 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.27 వరకు, అమృతఘడియలు: ప.2.16 నుండి 3.50 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.32. మేషం... అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.వృషభం... సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.మిథునం... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో కొంత నిరాశ. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.కర్కాటకం... ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో బాధ్యతలు అధికం.సింహం.... కొత వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. భూములు, వాహనాలు కొంటారు. అరుదైన సన్మానాలు. వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.కన్య..... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.తుల... మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. అనుకోని ప్రయాణాలు. శ్రమధిక్యం. అనారోగ్యం. పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.వృశ్చికం... పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.ధనుస్సు... చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.మకరం...... ఆర్థిక ఇబ్బందులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.కుంభం... సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు.మీనం.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

Delimitation process begins as soon as new census results are available5
రంగారెడ్డిలో ఎక్కువ.. నిజామాబాద్‌లో తక్కువ

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు దీరనుంది. అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. 2027 మార్చికి జనాభా లెక్కలు పూర్తి కాగానే, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ (డీలిమిటేషన్‌) పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుంది. తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్‌–డిసెంబర్‌లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్‌ కూడా వర్తించనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు జరుగుతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సగటు జనాభా ప్రామాణికంగా...ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2,30,064 జనాభా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాల్సి ఉంది. కానీ వివిధ రాజకీయ కారణాలతో దానిని వాయిదా వేస్తూ వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పునర్విభజనను జాప్యం చేస్తున్నారంటూ ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమాధానమిస్తూ.. కొత్త జనాభా లెక్కలు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. కోర్టు కేసుతో సంబంధం లేకుండానే 2027 తర్వాత దేశమంతా పునర్విభజన చేస్తుండటంతో రాష్ట్రంలో నియోజకవర్గాల్లో చేర్పులు, మార్పులు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అనివార్యం కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్థానాలు 2011 జనాభా లెక్కలతోపాటు, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ తాజా అంచనాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 9 శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. అవన్నీ ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న శివారు ప్రాంతాల్లోనే కావటం విశేషం. జాతీయ సగటును మించి, విద్య, ఉపాధి, ఐటీ, ఫార్మా, సినిమా, ఇతర అవకాశాల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పెరిగిన వలసల తాకిడి కారణంగా నగరంలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. పునర్విభజనలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో కనీసం పది అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్‌ కోర్‌సిటీ (హైదరాబాద్‌ జిల్లా)లో రెండు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో భాగమైన శివార్లలోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కొత్తగా 9 కొత్త నియోకజవర్గాలు ఏర్పాటు కానున్నాయి.ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్ధితిడీలిమిటేషన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్థితి ఏర్పడనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 27,97,370. అయితే, ఆ జిల్లా నుంచి 5 మండలాలు ఏపీలో విలీనం కావటం, కొన్ని మండలాలు ములుగు జిల్లాల్లోకి వెళ్లటంతో జిల్లా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. అయినా, ఆదివాసీ ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆ జిల్లాలో శాసనసభ స్థానాలు తగ్గించకుండా అదనంగా రెండుస్థానాలు పెంచే అవకాశం ఉంది.డీలిమిటేషన్‌ ఇలా..– దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటయ్యే కమిషన్‌ రాజకీయ పక్షాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తుంది. కొత్త జిల్లాల మేరకు ఒక మండలం ఒకే నియోజకవర్గం, ఒకే జిల్లాలో ఉండే విధంగా భౌగోళిక మార్పులు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో పలు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో కూడా ఉండగా, వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొస్తారు.– రాష్ట్ర మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్న గత కమిషన్‌ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 2,30,064 సగటు జనాభాగా నిర్దారించింది. అయితే ఈ సగటుకు 10 శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువైనా ఉండొచ్చు.– 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జనాభాను సగటుగా తీసుకుని డీలిమిటేషన్‌ చేయటంతో తెలంగాణలో అంతకు ముందు 107 ఉన్న అంసెబ్లీ స్థానాలు 119కి పెరిగాయి. 12 స్థానాలు ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిపోయాయి.– డీలిమిటేషన్‌లో కొండప్రాంతాలు, గిరిజనులు, ఇతర ప్రత్యేక కారణాలను కూడా పరిగణనలోకి తీసుకుని నియోకజవర్గాలు ఏర్పాటు చేస్తారు. కొండలతో, విసిరేసినట్లు ఉండే హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్‌ – స్పితి అసెంబ్లీ నియోజకవర్గం 25 వేల జనాభాతోనే ఏర్పాటైంది. సిక్కింలోని సాంగ్మో అసెంబ్లీ స్థానం సైతం తక్కువ జనాభాతో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 6,98,000 మందితో అత్యధిక జనాభా కలిగిన శాసనసభ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి రికార్డుకెక్కింది. ఢిల్లీలోని చాందినీచౌక్, యూపీలోని ఘజియాబాద్‌లు సైతం జనాభా పరంగా అదిపెద్ద నియోజకవర్గాలే.

Iran attacks Israeli spy agency Mossad office: Iran top military commander Ali Shadmani Dead6
మరింత ఉధృతంగా దాడులు

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/దుబాయ్‌: అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఇరాన్‌ సముపార్జించకుండా అడ్డుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్‌ తన దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఇరాన్‌ అత్యున్నత నేత, సుప్రీం కమాండర్‌ అయ తొల్లా అలీ ఖమేనీకి సన్నిహితుడు, ఖాటమ్‌ అల్‌ –అన్బియా సెంట్రల్‌ హెడ్‌క్వార్డర్స్‌ సారథి, సైనిక జనరల్‌ అలీ షాద్మానీని ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని షాద్మానీ ఉంటున్న ఒక రహస్య ప్రదేశంపై క్షిపణుల వర్షం కురిపించి ఆయన ప్రాణాలుతీసింది. భూతలం నుంచి భూతలం మీది లక్ష్యాలను ఛేదించే 120 మిస్సైల్‌ లాంఛర్లను నాశనం చేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది.ఎఫ్‌–14 రకం రెండు యుద్ధవిమానాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. 10 కమాండ్‌ సెంటర్లను నేలకూల్చామని పేర్కొంది. దీంతో ఇరాన్‌ సైతం తీవ్రస్థాయిలో బాలిస్టిక్‌ క్షిపణులతో బదులు చెప్పింది. టెల్‌ అవీవ్‌ సిటీలో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ కార్యాల యంపై మెరుపు దాడులు చేసింది. దీంతో ఆ భవనం ధ్వంసమైనట్లు వార్తలొచ్చాయి. టెల్‌ అవీవ్‌తోపాటు వెస్ట్‌ జెరూసలేంలోనూ బాంబుల మోతలు మోగాయి.ఇజ్రాయెల్‌లోని హెర్జిలియాలో 8 అంతస్తుల భవంతి ధ్వంసమైంది. ఇకపై మరింతగా దాడులు చేస్తామని ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సయ్యద్‌ అబ్దుల్‌రహీం మౌసావీ ప్రకటించారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో ఇరాన్‌లో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,277 మంది గాయపడ్డారు. ఇరాన్‌ జరిపిన మిస్సైళ్ల దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు. 500 మందికిపైగా పౌరులు గాయపడ్డారు.హెర్జిలియాపై ఇరాన్‌ దాడిలో ధ్వంసమైన భవంతి నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు , మిలటరీ కమాండర్‌ షాద్మానీ టెహ్రాన్‌లో హాహాకారాలుఇరాన్‌ గగనతల రక్షణవ్యవస్థ దెబ్బతినడంతో ఇజ్రాయెల్‌ క్షిపణులు పట్టపగ్గాల్లేకుండా విచ్చలవిడిగా విరుచుకుపడ్డాయి. దీంతో టెహ్రాన్‌ నగరవ్యాప్తంగా మంగళవారం అప్రమత్త సైరన్‌లు మోగుతూనే ఉన్నాయి. కొందరు ప్రాణభయంతో ఇళ్లలో, బంకర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటే లక్షలాది మంది కాస్పియన్‌ సముద్రతీరాలకు వాహనాల్లో తరలిపోతున్నారు. వందలాది మంది సమీప అజర్‌బైజాన్‌ దేశానికి వలసవెళ్లారు. సొంత వాహనాల్లో జనం వలసవెళ్తుండటంతో రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. స్టాక్‌మార్కెట్‌ పనిచేయలేదు. సరఫరాలేక పెట్రోల్‌బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు కనిపించాయి. స్టాక్‌ ఉన్నచోట్ల చాంతాడంత క్యూ లైన్లు కనిపించాయి.ఖమేనీ జాడ తెలుసు... ఇప్పుడే చంపం: ట్రంప్‌జీ7 సదస్సు నుంచి హడావిడిగా అమెరికాకు పయనమైన డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ సుప్రీంనేత ఖమేనీ జాడపై మాట్లాడారు. ‘‘ ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ప్రస్తుతానికి ఆయనను అక్కడే తలదాచుకోనిద్దాం. ఆయనను చంపేందుకు మిస్సైళ్లను ప్రయోగిస్తే సాధారణ పౌరులు, అమెరికా జవాన్లూ చనిపోయే ప్రమాదముంది. అందుకే ఇప్పుడే ఆయనను చంపబోం. కానీ ఆయనను అలా ప్రాణాలతో ఎక్కువ రోజులు ఉండనివ్వం.అసలే మాకు ఓపిక చాలా చాలా తక్కువ’’ అని ట్రంప్‌ అన్నారు. ‘‘ ఖమేనీగానీ, ఇరాన్‌గానీ మాకు వీలైనంత త్వరగా బేషరతుగా లొంగిపోతే మంచిది. అణుఒప్పందం కుదుర్చుకోవాలని ఇప్పటికే సూచించా. మధ్యవర్తిత్వం వహించాలనే ఆసక్తి నాలో తగ్గుతోంది. ఇరాన్‌ అణుఆశలపై నీళ్లు చల్లాం. నేను కాల్పుల విరమణను కోరుకోవట్లేదు. అంతకుమించిన ఫలితాన్ని ఆశిస్తున్నా. ఇప్పుడు ఈ సమస్యకు వాస్తవిక ‘ముగింపు’ పలకాల్సిందే’’ అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో మరో పోస్ట్‌పెట్టారు.బంకర్‌ బస్టర్‌ బాంబు ఇవ్వండిఇరాన్‌లో ఫోర్దో అణుఇంధన శుద్ధి కార్మాగారం ఒక పర్వతం కింద భూగర్భంలో నిర్మించారు. దీనిని భూస్థాపితం చేస్తేగానీ ఇరాన్‌ అణు కార్యక్రమం ఆగదని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. అందుకే ఎలాగైనా బంకర్లను బద్దలుకొట్టే భారీ బాంబు కోసం అమెరికాను సాయం కోరనుంది. మ్యాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ పెనిట్రేటర్‌(ఎంఓపీ)గా పిలుచుకునే జీబీయూ–57ఏ/బీ బాంబు బరువు ఏకంగా 14,000 కేజీలు. ఇది పేలితే అక్కడ భూమి 200 అడుగుల లోతుదాకా బద్ధలైపోతుంది. అంటే భూగర్భంలోని బంకర్, అణుస్థావరం పూర్తిగా సమాధిదిబ్బగా మారుతుంది.అందుకే ఈ బంకర్‌ బస్టింగ్‌ బాంబును తమకు ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్‌ కోరుతున్నట్లు సమాచారం. ఇంతటి బరువైన బాంబును కేవలం బీ–2 స్టెల్త్‌ బాంబర్‌ యుద్దవిమానం నుంచే ప్రయోగించే వీలుంది. ఈ విమానం కూడా ఇజ్రాయెల్‌ వద్ద లేదు. ఇజ్రాయెల్‌ అభ్యర్థనను అంగీకరిస్తే అమెరికానే స్వయంగా తన విమానంతో ఈ బాంబును యురేనియం శుద్ధికర్మాగారంపై పడేయాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు వాడొద్దని నిషేధాజ్ఞలుఇజ్రాయెల్‌ తన శత్రుదేశంలో సైనికుల చేతుల్లోకి వాకీటాకీలు, రేడియోసెట్లను ఏకకాలంలో పేల్చి సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వ అధికారులు, వారి వ్యక్తిగత సహాయకులు ఎవరూ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉపయోగించకూడదని ఇరాన్‌ నిషేధం విధించింది.

6 Dreamliners among 7 Air India flights cancelled amid tough post-crash checks7
ఎయిరిండియా రద్దుల పర్వం

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌/కోల్‌కతా: అహ్మదా బాద్‌ ఘోర ప్రమాదం తర్వాత డ్రీమ్‌లైనర్‌ రకం విమానాలతో కొనసాగుతున్న ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులకు ‘క్యాన్సిల్‌’ మచ్చ అంటుకుంది. మంగళవారం ఏడు ఎయిర్‌ఇండియా విమా నాలు రద్దుకాగా వాటిలో ఆరు విమానాలు డ్రీమ్‌ లైనర్‌ 787–8 రకానికి చెందినవి ఉండడం గమనార్హం. సాంకేతికలోపం సహా ఇతరత్రా కారణాలతో డ్రీమ్‌లైనర్లు గాల్లో చక్కర్లుకొట్టడం మానేసి పార్కింగ్‌ ప్రాంతానికే పరిమితమయ్యాయి. సాంకేతికలోపంతో..ఢిల్లీ నుంచి పారిస్‌కు వెళ్లాల్సిన డ్రీమ్‌లైనర్‌ విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో దానిని రద్దుచేశారు. ఇలాంటి మరో విమానం అందుబాటులో లేకపోవడంతో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమాన సర్వీస్‌ క్యాన్సిల్‌ అయింది. అహ్మదాబాద్‌ ఘటన తర్వాత ఎయిర్‌ఇండియా సంస్థ తన విమానాలను క్షణ్ణంగా తనిఖీలు చేశాక రాకపోకలకు పంపిస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ విమానాలు క్యాన్సిలేషన్‌ బారినప డుతున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతు న్నారు. మంగళవారం అధిక సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.దీనిపై ఎయిర్‌ఇండియా స్పందించింది. ‘‘రద్దయిన విమాన ప్రయాణికులను హోటల్‌ వసతులు, లేదంటే టికెట్‌ క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్‌ లేదంటే తదుపరి రీషెడ్యూలింగ్‌కు వెసులుబాటు కల్పిస్తున్నాం’’ అని ఎయిర్‌ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అహ్మదాబాద్‌ నుంచి ‘తొలి’విమానం రద్దుఅహ్మదాబాద్‌ దుర్ఘటన తర్వాత అదే ఎయిర్‌పోర్ట్‌ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు లండన్‌కు బయల్దేరి వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా వారి ఏఐ159 విమానం రద్దయింది. విమానప్రమాదం తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్న తొలి ఎయిర్‌ఇండియా అహ్మదాబాద్‌–లండన్‌ సర్వీస్‌ విమానం ఇదే. మరోవైపు ఢిల్లీ నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌ ఛార్లెస్‌ డీ గాలే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిన ఏఐ143 విమానం సైతం రద్దయింది.ఎయిరిండియా విమానంలో పనిచేయని ఇంజన్‌శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి ముంబైకి రావాల్సిన ఎయిర్‌ఇండియా విమా నం సాంకేతిక లోపంతో కోల్‌కతాలో ఆగిపోయింది. దీంతో ఈ సర్వీసును రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 211 మంది ప్రయాణికులతో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన బోయింగ్‌ 777–200ఎల్‌ఆర్‌ విమానం ముంబైకి చేరుకో వాల్సి ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వస్తూ పాకిస్తాన్‌ గగనతలం మీదుగా ముంబైకి చేరుకో వాల్సి ఉంటుంది.అయితే, పాక్‌ తన గగనతలాన్ని భారతీయ సర్వీసులకు మూసి వేసిన కారణంగా ఈ విమానం నేరుగా రావడం కుదర్లేదు. దాంతో చుట్టూతిరిగి తొలుత కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. రాత్రి 2 గంటల సమయంలో టేకాఫ్‌ తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజన్‌ మొరాయించింది. ఇంజనీర్లు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో ఆ సర్వీస్‌ను రద్దుచేశారు. కొందరిని ఇతర విమానాల్లో ముంబైకి పంపించారు.ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుముంబై: మస్కట్‌–ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో, విమానాన్ని అధికారులు నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేయించి, తనిఖీలు చేపట్టారు. బెదిరింపు వట్టిదేనని ధ్రువీకరించుకున్నాక విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది. మస్కట్‌లో బయలు దేరిన ఈ విమానంలో 157 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్‌ ప్రకారం విమానం కోచిలో ల్యాండయ్యింది. తిరిగి టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని బెదిరింపు మెయిల్‌ వచ్చింది.

SIT officers third degree against two constables8
సుప్రీంకోర్టు చెప్పినా సిట్‌కు లెక్కే లేదా?

సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలో భాగంగా ఏర్పడిన సిట్‌ రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతోంది. రెడ్‌బుక్‌ కుట్రలో భాగంగా అక్రమ అరెస్ట్‌లు, దర్యాప్తు ముసుగులో వేధింపులు, చిత్రహింసలకు బరి­తెగిస్తోంది. సిట్‌ అరాచకం ఎంతగా సాగుతోందంటే సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు, హెచ్చరికలను నిర్భీతిగా ఉల్ల­ంఘిస్తూ దాష్టీకానికి పాల్పడుతోంది. ఇదే అక్రమ కేసులో నిందితులుగా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎ.ధనుంజయ్‌ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ గోవిందప్ప దాఖలు చేసిన పిటి­షన్‌ను విచా­రిస్తూ సుప్రీంకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు, విచారణ పేరిట ఈ కేసులో సాక్షులు, నిందితులను ఏ విధంగానూ వేధించకూ­డ­దని.. వారిని శారీరకంగా హింసించ కూడదని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరి­ణా­మాలు తప్పవని కూడా హెచ్చరించింది. అంతేకాదు ఆధారాలు లేకుండా అరెస్టు చేయకూ­డదని పేర్కొంది. కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఏమాత్రం సరైంది కాదని కూడా విస్పష్టంగా తేల్చి చెప్పింది. అది పౌరుడి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారమని కూడా వ్యా­ఖ్యానించింది. అందుకు విరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో వ్యవ­హరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సిట్‌ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించింది.మా పని మాది..సుప్రీంకోర్టు ఆదేశాలను తామేమాత్రం పట్టించుకోబోమని సిట్‌ చీఫ్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం తమ చేతల ద్వారా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఎంతో మంది సాక్షులను వేధించి, హింసించిన సిట్‌ అధికారులు తాజాగా తమ పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఏకంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి మరీ చిత్రహింసలకు గురి చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. అంతే కాకుండా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ వ్యవహారంలో కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించింది. ఆయనకు వ్యతిరేకంగా సిట్‌ ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు చూపించనే లేదు. ఆయనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవనే లేదు. మంగవారం మధ్యాహ్నం వరకు ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో కూడా చేర్చనే లేదు. అయినా సరే మంగళవారం ఉదయం ఆయన్ను అక్రమంగా అరెస్ట్‌ చేసి.. సీఎం చంద్రబాబు కుట్రలకు సిట్‌ వత్తాసు పలికింది. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే చెవిరెడ్డిని అరెస్ట్‌ చేసినట్లుగా స్పష్టమవుతోంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్కలేదని, ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలకు వత్తాసు పలికి.. వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడటమే తమ ఏకైక లక్ష్యమని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం స్పష్టం చేస్తోంది.

Jasprit Bumrah is only player can influence the outcome of the England series9
కొత్త ఆరంభానికి సిద్ధం

భారత జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై 19 సిరీస్‌లు ఆడితే 14 సిరీస్‌లలో పరాజయమే పలకరించింది. రెండు సిరీస్‌లు సమంగా ముగియగా మూడుసార్లు భారత జట్టు విజేతగా నిలిచింది. అయితే పాత రికార్డుల్లోకి వెళ్లకుండా గత మూడు సిరీస్‌లనే చూసుకుంటే టీమిండియా ప్రదర్శనలో అక్కడక్కడ చెప్పుకోదగ్గ మెరుపులు ఉన్నాయి. చివరిసారిగా 2021–22లో పర్యటించిన సమయంలో ఐదు టెస్టుల సిరీస్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకోవడం మన జట్టు మెరుగైన ప్రదర్శనకు సూచిక.అంతకుముందు రెండు పర్యటనల్లో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన రికార్డు అంకెల్లో కనిపిస్తున్నా... భారత్‌ చాలా సందర్భాల్లో పైచేయి సాధించింది. దురదృష్టవశాత్తూ కీలక క్షణాల్లో పట్టు తప్పడంతో మ్యాచ్‌లు చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో శుబ్‌మన్‌ గిల్‌ బృందం పట్టుదలను, పోరాటపటిమను ప్రదర్శిస్తే ఇంగ్లండ్‌తో గట్టి పోటీనివ్వడం ఖాయం. అంచనాలకు అనుగుణంగా రాణిస్తే సిరీస్‌ ఏకపక్షంగా సాగకుండా ఇంగ్లండ్‌ను టీమిండియా నిలువరించవచ్చు. –సాక్షి క్రీడా విభాగం ప్రస్తుతం సిరీస్‌కు సిద్ధమైన జట్టులో ఇంగ్లండ్‌ గడ్డపై అనుభవంరీత్యా చూస్తే రవీంద్ర జడేజాఅందరి కంటే సీనియర్‌. గత మూడు సిరీస్‌లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, అశ్విన్‌లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరమైన స్థితిలో జడేజా అనుభవం జట్టుకు కీలకం కానుంది. కేఎల్‌ రాహుల్, బుమ్రా, రిషభ్‌ పంత్‌ ఇంగ్లండ్‌లో గత రెండు సిరీస్‌లు ఆడగా... కుల్దీప్‌ యాదవ్, సిరాజ్, శార్దుల్‌ ఠాకూర్‌లకు కూడా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్‌లో ఆడటాన్ని పక్కన పెడితే మిగతా ప్లేయర్లంతా అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ఇంగ్లండ్‌లో బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడున్న జట్టును చూస్తే స్టార్‌ అంటూ ఎవరూ లేరు. మున్ముందు సిరీస్‌లో ఇదే భారత్‌కు సానుకూలాంశం కూడా కావచ్చు. ఒక్కొక్కరి వ్యక్తిగత ఆటపై కాకుండా టీమిండియా సమష్టి ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు కూడా ఈ సిరీస్‌ సవాల్‌గా నిలవనుంది. బ్యాటర్‌గా ఇంగ్లండ్‌ గడ్డపై పేలవమైన రికార్డు (5 టెస్టుల్లో కలిపి 127 పరుగులు) ఉన్న గంభీర్‌ కోచ్‌గా తన వ్యూహాలకు పదును పెట్టి జట్టుకు ఎలా మార్గనిర్దేశం చేస్తాడనేది ఆసక్తికరం. బ్యాటర్లకు సవాల్‌... మబ్బు పట్టిన వాతావరణంలో బంతి అనూహ్యంగా స్వింగ్‌ కావడం... డ్రైవ్‌ కోసం ప్రయతి్నస్తే చాలు బంతి బ్యాట్‌ అంచులను తాకి స్లిప్స్‌లోకి దూసుకుపోవడం... ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌లలో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలాంటి స్థితిని దాటి బ్యాటర్లు రాణించాలంటే ఎంతో పట్టుదల, ఓపిక కనబర్చాల్సి ఉంటుంది. తమ బ్యాటింగ్‌ స్టాన్స్‌లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్లది ప్రధాన పాత్ర కానుంది. ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి చూస్తే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌ ఓపెనింగ్‌ చేయడం ఖాయమే. జైస్వాల్‌ 19 మ్యాచ్‌ల స్వల్ప కెరీర్‌ను చూస్తే ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్‌లపై ఆకట్టుకున్న అతను దక్షిణాఫ్రికాలో రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌లో అతను సత్తా చాటాల్సిన సమయం వచి్చంది. తొలి సిరీస్‌లోనే సుదర్శన్‌ నుంచి అతిగా ఆశించలేం. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ రెండు ఫైనల్‌లను వదిలేస్తే గిల్‌ ఇంగ్లండ్‌లో ఒకే ఒక టెస్టు ఆడాడు. కెప్టెన్‌గా అదనపు బాధ్యతతో అతను ఎంత బాగా ఆడతాడనేది కీలకం. గణాంకాల పరంగా చూస్తే మరో ప్రధాన బ్యాటర్‌ రాహుల్‌కు ఇంగ్లండ్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పుడు తన స్థానంపై సందేహాలు లేవు కాబట్టి స్వేచ్ఛగా ఆడగలడు. ఇక మిడిలార్డర్‌లో కరుణ్‌ నాయర్‌పై అందరి దృష్టీ ఉంది. నాయర్‌కు చోటు దక్కడంలో దేశవాళీ ప్రదర్శనతో పాటు నార్తాంప్టన్‌షైర్‌ అనుభవం కీలకపాత్ర పోషించింది. కాబట్టి అతను తనపై ఉంచిన నమ్మ కాన్ని నిలబెట్టుకునేందుకు ఏమాత్రం శ్రమిస్తాడనేది ఆసక్తికరం. ఇక పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా ఆట దిశను మార్చగల పంత్‌పై కూడా జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. మెల్‌బోర్న్‌ టెస్టు తర్వాత నిలకడ చూపించలేకపోయిన నితీశ్‌ రెడ్డి మరోసారి తన బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది.బుమ్రా, సిరాజ్‌ చెలరేగితే...ఈ సిరీస్‌ ఫలితాన్ని ప్రభావితం చేయగల ఏకైక ప్లేయర్‌లా జస్‌ప్రీత్‌ బుమ్రా కనిపిస్తున్నాడు. పని భారంతో అతను గరిష్టంగా మూడు టెస్టులే ఆడవచ్చని మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే చెప్పింది. ఆ మూడు టెస్టుల్లో ఇంగ్లండ్‌ బ్యాటర్లకు ‘నరకం’ కనిపించడం ఖాయం. ఇటీవల ఆ్రస్టేలియాకు ఈ అనుభవం ఏమిటో బాగా తెలిసింది. కాబట్టి బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయం. ఎరుపు బంతితో మొహమ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌ కూడా చాలా పదునెక్కింది. అక్కడి పరిస్థితుల్లో సిరాజ్‌ బౌలింగ్‌ ప్రత్యర్థి పాలిట ప్రమాదకరంగా మారడం ఖాయం. గత సిరీస్‌లో సిరాజ్‌ 5 టెస్టులూ ఆడి 18 వికెట్లు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ అనుభవం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. సిడ్నీ టెస్టులో ఆకట్టు కున్న ప్రసిధ్‌ కృష్ణ మూడో పేసర్‌గా బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ సిరీస్‌ కాబట్టి అర్ష్ దీప్‌కు ఏదో ఒకదశలో అవకాశం దక్కవచ్చు కానీ ఏమాత్రం ప్రభావం చూపగలడో సందేహమే. అశ్విన్‌ రిటైర్మెంట్‌తో ఇప్పుడు కుల్దీప్‌కు తొలిసారి ప్రధాన స్పిన్నర్‌గా చోటు ఖాయం. 2018లో ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్‌లో విఫలమైన అతను పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ముఖ్యం. కెరీర్‌ చివరి దశలో ఉన్న జడేజా ఆల్‌రౌండర్‌గా రాణించడం ముఖ్యం. సీమ్‌ బౌలర్‌ శార్దుల్‌ శైలితో ఇక్కడ మంచి ఫలితం రాబట్టవచ్చు కాబట్టి మేనేజ్‌మెంట్‌ మొగ్గు శార్దుల్‌ వైపు ఉంది.

Sakshi Guest Column On Child Labor system10
ఇంకా బాల కార్మికులా?

ఇప్పటికీ వెట్టి చాకిరీ వలలో చిక్కుకు పోయిన బాల కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, ఇళ్ళలో పని చేస్తున్న నిస్సహాయ బాలల ఆర్తనాదాలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి రక్షించిన వందలాది మంది బాలలు 1998లో నా చుట్టూ అల్లు కున్న సంగతి గుర్తుకొస్తోంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 103 దేశాలను చుట్టి వచ్చిన గ్లోబల్‌ మార్చ్‌లో నా వెంట వచ్చిన బాలలు నిర్భయంగా చేసిన నినాదాలు కూడా గుర్తున్నాయి. యాత్ర ముగింపులో జెనీవా లోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ప్రధాన కార్యాలయంలో ప్రసంగించవలసిందిగా మమ్మల్ని కోరారు. అక్కడ మేం తక్షణం అమలుపరచవలసిన సరళమైన డిమాండును వినిపించాం: ‘‘చిట్టి చేతుల్లో ఇక ఎంతమాత్రం పనిముట్లు ఉండకూడదు. మాకు పుస్త కాలు, బొమ్మలు కావాలి!’’ నెరవేరని లక్ష్యంఆ యాత్ర చరిత్ర సృష్టించింది. ఫలితంగా, ఐఎల్‌ఓ 1999లో (182వ) తీర్మానాన్ని ఆమోదించింది. అది బానిసత్వం, మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా వచ్చిన మొదటి అంతర్జా తీయ చట్టం. ఆ తీర్మానాన్ని ఆమోదించిన మొదటి 16 ఏళ్ళలో గణనీయమైన ప్రగతి కనిపించడంతో ఎన్నో ఆశలు చిగురించాయి. బాల కార్మికుల సంఖ్య 2000–2016 సంవత్సరాల మధ్యలో గణనీయంగా 25 కోట్ల నుంచి 15 కోట్ల 20 లక్షలకు తగ్గింది. దాంతో మార్పు తేగలం అనిపించింది. కానీ, అది సరిపోదు. బాలల విష యంలో ప్రతి క్షణమూ విలువైనదే. స్కూలుకు వెళ్ళలేకపోయిన ప్రతి రోజూ ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే లెక్క. ఒక్క నిమిషం బాని సత్వంలో మగ్గినా బాల్యాన్ని కోల్పోయినట్లే లెక్క.ఐరాస 2016లో సతత వికాస లక్ష్యా (ఎస్‌.డి.జి.)లను నిర్దేశించుకున్నపుడు ఉద్యమాన్ని పునర్జీవింపజేసే అవకాశం వచ్చింది. బాల కార్మికుల నిర్మూలనను ఒక ఎస్‌.డి.జి.గా చేర్చేట్లు చూసేందుకు మేం ఉద్యమాన్ని చేపట్టాం. అంతర్జాతీయ అభివృద్ధి అజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చితే ఎంతో ఊతం లభిస్తుందని భావించాం. మా కృషి ఫలించింది. ప్రపంచం 2025 కల్లా బాల కార్మిక వ్యవస్థ ఏ రూపంలోనూ లేకుండా చూస్తామని వాగ్దానం చేసింది.గ్లోబల్‌ మార్చ్‌లో పాల్గొన్నవారిలో పిన్న వయస్కుడు బసు రాయ్‌. ఆ ఎనిమిదేళ్ళ పిల్లాడిని నా భుజాల మీదకు ఎక్కించుకుని నడిచాను. వాడిది కంచు కంఠం. ‘‘బాల కార్మికులను ఎవరు నిరో ధిస్తారు? మేమే’’ అని నినదించేవాడు. మనం పెట్టుకున్న 2025 గడువు ఇంక కొద్ది నెలల్లో ముగుస్తుందనగా, బసు లాంటి లక్షలాది మంది నుంచి అదే రకమైన గొంతు ఇప్పటికీ వినిపిస్తోందని బరువెక్కిన హృదయంతో చెప్పాల్సి వస్తోంది.ఎస్‌.డి.జి.లు చేపట్టిన మొదటి నాలుగేళ్ళలో, 2020 వరకు బాల కార్మికుల సంఖ్య 16 కోట్లకు పెరిగింది. అప్పటికి 20 ఏళ్ళలో బాల కార్మికుల సంఖ్య పెరగడం అదే మొదటిసారి. ఒక్క ఆఫ్రికాలోనే రోజూ 10,000 మంది బాలలు బలవంతపు చాకిరీలోకి దిగు తున్నారు. అదే కాలంలో, ప్రపంచం 10 ట్రిలియన్‌ డాలర్లకు సంప దను పెంచుకుంది. మరో రకంగా చెప్పాలంటే, కనీసం వారానికొక కోటీశ్వరుడు తయారయ్యాడు. ఇది దయారాహిత్యానికి సంకేతం. దీన్ని నిజంగా మనం అభివృద్ధి అనగలమా? కొన్నేళ్ళ క్రితం నేను ఐరాసలో మాట్లాడుతూ, 2025 నాటికి ప్రపంచంలో బాల కార్మికులు లేకుండా చూడగలమని చెప్పాను. కానీ, ‘‘అయ్యా! బాల కార్మిక వ్యవస్థకు అంతం ఎన్నడు?’’ అని ఈ మధ్య ఎవరో నన్ను అడిగి నపుడు నాకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అది హక్కుల సమస్యబాల కార్మికులు లేకుండా చేసే ఉద్యమాన్ని ప్రభావవంతంగా ఎలా మలచాలనే విషయంలో 2016కు ముందు మనం కొన్ని విలు వైన పాఠాలు నేర్చుకున్నాం. ప్రజా ఉద్యమ స్ఫూర్తి, రాజకీయ సంకల్ప బలంతో కూడిన నైతిక నాయకత్వం ప్రగతిని సాధించేందుకు తోడ్పడ్డాయి. చాలా దేశాలు విద్యా రంగంపై భారీగా పెట్టుబ డులు పెట్టాయి. నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన బ్రెజిల్, భారత్, కెన్యా, దక్షిణాఫ్రికా సత్ఫలితాలు చూశాయి. ఎక్కడి నుంచి కూడా బాల కార్మికులు వ్యవస్థలోకి రాకుండా చూడాలని రాజ కీయంగా బలమైన వాణి (ముఖ్యంగా యూరప్, అమెరికా నుంచి) వినిపించడంతో పరిశ్రమలు కూడా తలొగ్గక తప్పలేదు.నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆ రకమైన ఉద్యమ స్ఫూర్తి కొరవడింది. మనం కూడా బాల కార్మికులను ఒక ఉప అంశంగా చూడటం మొదలెట్టాం. దాన్నొక కార్మిక సమస్యగా పరిగణిస్తున్నాం తప్పించి న్యాయాన్ని, మానవ హక్కులను కాలరాస్తున్న సంక్షోభంగా చూడటం లేదు. లోతైన సమస్యలు మరికొన్ని ఉన్నాయి. అనేక పేద దేశాలు (ముఖ్యంగా ఆఫ్రికాలోనివి) అసమంజస పన్నుల వ్యవస్థల్లో, కునారి ల్లజేస్తున్న అప్పుల ఊబిలో, అవినీతి, అవకతవకల పాలనలో, వివిధ వర్గాల మధ్య ఘర్షణల్లో చిక్కుకుపోయాయి. దాంతో ఈ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మరో ప్రమాదకరమైన ధోరణిని గమనించాను. అమెరికాలో 30కి పైగా రాష్ట్రాలు బాల కార్మికుల సంరక్షణ చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్త సవరణలు తీసుకొచ్చాయి. సభ్యులుగా ఉన్న దేశాల నుంచి నిరసన ఎదురవడంతో, బాల కార్మి కులకు కంపెనీలను బాధ్యులను చేసే చట్టాన్ని యూరోపియన్‌ యూనియన్‌ సడలింపజేసింది. బ్రెజిల్‌లోనూ ఆ దిశగా చర్చలు సాగుతున్నాయి. మన పిల్లలు అనుకుంటేనే!అయితే, చిన్నవే అయినా, కొన్ని అర్థవంతమైన చర్యలూ కని పించకపోలేదు. ‘యునిసెఫ్‌’ ఇటీవల ప్రపంచ బాలల సంరక్షక నిధిని ఏర్పాటు చేసింది. కానీ, ఆ సాయం సరిపోదు. లక్ష్యంలో సుమారు 30 శాతాన్నే ఆ నిధి అందుకోగలిగింది. ప్రపంచ దేశాలు కూడా మునుపెన్నడూ లేనంత ఘర్షణలను చూస్తున్నాయి. యుద్ధ మండలాల్లో జీవిస్తున్న బాలల శాతం 1990ల నుంచి రెండింతలైంది. నేనిది రాస్తున్న సమయానికి 47 కోట్ల 30 లక్షల మంది బాలలు ఘర్షణలు సాగుతున్న చోట్ల నలిగిపోతున్నారు. వాతావరణ సంక్షోభం బడుగు వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇది బాల కార్మి కుల సంఖ్యను పెంచుతూ, పేదరిక, అన్యాయాల వలయాన్ని కొనసాగిస్తోంది. చాలా దేశాలు బాల కార్మికుల సంఖ్యను తగ్గించు కోగలగడం ఒక్కటే ఆశలు మోడువారకుండా చూస్తోంది. బాల కార్మి కులకు వ్యతిరేకంగా ప్రజా గొంతుకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించగల సత్తా భారత్‌కు ఉంది. మనకు పటిష్ఠమైన చట్టాలు, చక్కని సంక్షేమ పథకాలు, రాజ కీయంగా ఏకాభిప్రాయం ఉన్నాయి. పరిశ్రమల నుంచి కూడా ప్రతి ఘటన నామమాత్రంగానే ఉంది. అన్నీ అనువైన పరిస్థితులున్నాయి. కనుక, సత్వర కార్యాచరణకు నడుం బిగించాలి. మొదట చట్టాలను అమలుపరచాలి. కాగితాలకు మాత్రమే పరిమితమైన చట్టాల వల్ల ఉపయోగం లేదు. బాల కార్మికులను వివిధ (విద్య, ఆరోగ్యం, పేదరికం) రంగాలతో ముడిపడిన సమస్యగా చూడాలి. అలాగే, విద్యా రంగంలో పెట్టుబడులు కీలకం. ప్రమాణాలతో కూడిన పాఠ శాల విద్య బాల కార్మికులను చాకిరీ నుంచి విముక్తులను చేయ గలదు. అన్నింటికన్నా ముఖ్యంగా బాల కార్మికులుగా పని చేస్తున్న వారందరూ మన పిల్లలేననే భావన అంకురించాలి. అప్పుడే సమస్య పరిష్కారానికి త్వరపడగలుగుతాం. బాలలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.కైలాశ్‌ సత్యార్థి వ్యాసకర్త నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, సామాజిక కార్యకర్త (‘హిందుస్థాన్‌ టైమ్స్‌ సౌజన్యంతో)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement