Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

Top Stories

ప్రధాన వార్తలు

55 thousand tons of Tobacco crop unsold at farmers1
రైతుపై సర్కారు పగాకు

నాలుగేళ్లుగా నల్లబర్లీ సాగు చేస్తున్నా. కిందటి సంవత్సరం వరకు మంచి ధర లభించింది. కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ వేశా. కౌలుకే ఎకరాకు రూ.30 వేల వరకు చెల్లించా. సాగుకు ఎకరాకు రూ.1.30 లక్షలైంది. బంగారం కుదవపెట్టి రూ.4 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 వడ్డీకి మిగిలిన మొత్తం తెచ్చా. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వాలిటీతో సంబంధం లేకుండా క్వింటా రూ.15వేలు–18 వేల మధ్య కొన్నారు. ఈ ఏడాది కంపెనీల చుట్టూ తిరిగినా కొనేవారు లేరు. కంపెనీల మాయమాటలు నమ్మి మోసపోయాం. పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొంటే కనీసం కొంత గట్టెక్కుతాం. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. – గెద్దల నాగబాబు, బాపట్ల జిల్లా వంకాయలపాడు (బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి) : నాలుగు జిల్లాలు.. దాదాపు లక్ష ఎకరాల్లో పంట.. వేలమంది రైతులు.. ఇప్పుడు లబోదిబోమంటు­న్నారు. పొగాకు కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగామని గుండెలు బాదుకుంటున్నారు. కూట­మి ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో ఏంచేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు..! బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా రైతుల్లో ఒకటే వ్యథ. ‘‘గతేడాది వరకు మంచి ధరలు లభించడంతో పాటు కంపెనీ­లు ఇచ్చిన భరోసాతో ఈసారి పెద్ద­ఎత్తున నల్లబర్లీ పొగాకు (హెచ్‌డీ బర్లీ) సాగు చేశాం. పంట పండాక ప్రభుత్వం, కంపె­నీలు మొహం చాటేస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవా­లి’’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. కౌలు, కూలీల ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఎకరా సాగుకు రూ.లక్షన్నర అయిందని.. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి సగటున 10–12 క్వింటాళ్లకు పడిపోయిందని వారు వాపోతున్నారు. ఐడీ నంబర్లు ఇచ్చి మరీ సాగుచేయించిన పొగాకు కంపెనీలు.. డిమాండ్‌ లేదనే సాకుతో పంట కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కళ్లుమూసుకున్న కూటమి ప్రభుత్వంసీఎం యాప్‌ ద్వారా ప్రతి పంటకు కోతకొచ్చే సమయంలోనే మార్కెట్‌ ధరలను అంచనా వేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం నల్లబర్లీ రైతులను గాలికొదిలేసింది. మిర్చి రైతుల మాదిరిగానే పొగాకు రైతులను ఏమార్చేందుకు యత్నిస్తోంది. నల్లబర్లీకి సాధార­ణంగా డిసెంబరు నుంచి ఆకు కొట్టడం మొదలు­పెట్టి మార్చి ఆఖరుకు పూర్తిచేస్తారు. ఫిబ్రవరిలో కొనుగోళ్లు మొదలై ఏప్రిల్‌కు దాదాపు పూర్తవు­తాయి. అరకొరగా ఆఖరులో వచ్చే పొగాకును మాత్రమే మే నెలలో మార్కెట్‌కు తెస్తుంటారు. ఈసారి జూన్‌ తొలివారంలోనూ కనీసం మూడో వంతు పొగాకు కూడా కొనని పరిస్థితి నెలకొంది.పంట అమ్మితేనే కూలీ డబ్బులిచ్చే దుస్థితిపంట కొనేవారు లేకపోవడంతో రైతులు పొలాల్లో కట్టెలు పెట్టి వాటిపై బేళ్లు నిల్వ చేశారు. పైన పట్టా­లు కప్పి కాపలా కాస్తున్నారు. ఆకు కొట్టడం నుంచి తాళ్లకు గుచ్చడం వరకు కూలీలకు ఒప్పందాలు ఇచ్చి పనులు చేయించారు. పంట అమ్మితే కానీ వీరికి సొమ్ములివ్వలేని పరిస్థితి. ఇటుచూస్తే క్వింటా రూ.7 వేలకు కూడా కొనేవారు లేరు. దాదాపు ప్రతి రైతు ఎకరాకు రూ.­80 వేల నుంచి రూ.లక్ష నష్టపోతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్‌సీపీతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా, చివరి కేజీ వరకు పొగాకును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఖరీఫ్‌ సాగుకు దూరంగా ఉండాలని (క్రాప్‌ హాలిడే) భావిస్తున్నారు.కూటమి కార్యకర్తలకు మేలు చేసేందుకేకంపెనీల భరోసాతోనే రైతులు ఈసారి నల్లబర్లీ సాగు చేశారని, చాలా కంపెనీలు రైతులకు బాండ్‌లు ఇచ్చాయని ప్రభుత్వానికి తెలిసినా... వాటిపై ప్రభుత్వానికి కనీస నియంత్రణ కొరవడింది. పంట మార్కెట్‌కు వచ్చే సమయంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పొగాకు కోతలు పూర్తయి రెండు నెలలు గడుస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ కూడా మొదలైంది. అయినా సరే నల్లబర్లీ పంట చేలల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది లక్ష టన్నుల దిగుబడి అంచనా వే­యగా, గ్రేడ్‌లను బట్టి 85 వేల టన్నులు మార్కెట్‌కు వస్తుందని లెక్క. కానీ, ఇప్పటివరకు అదీ అతికష్టమ్మీద 24.58 వేల టన్నులు మాత్రమే కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేశారు. రైతు ఎవరైనా 10 చెక్కులు (క్వింటాళ్లు) తీసుకెళ్తే 3–4 చెక్కులు కొని మిగిలింది నాణ్యత లేదనే సాకుతో వెనక్కి పంపేస్తున్నారు. రైతుల వద్ద మరో 55 వేల టన్నుల పంట ఉంది. గత నెలలో వర్షాలకు పొగాకు దెబ్బతిన్నది. పంట నాణ్యతరోజురోజుకు తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం వ్యాపారులకు వత్తాసు పలికేలా వ్యవహరించింది. మిర్చి మాదిరిగానే కాలయాపన చేస్తూ పొగాకు రైతులను కంపెనీలకు వదిలేసింది. ఓవైపు ధర లేక రైతులు ఆత్మహత్య యత్నాలు చేస్తుండగా, మరోపక్క పొగాకు బేళ్లను తగలబెడుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. నెల రోజుల క్రితం కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించినా ఏ ఒక్కటీ కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కాగా, ఏ గ్రామంలో ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు..? ఎంత దిగుబడి వచ్చింది..? ఎంత అమ్ముకున్నారు..? రైతుల వద్ద ఇంకా ఎంత ఉంది? అని ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఇదంతా కూటమి పార్టీల కార్యకర్తలకు మేలు చేసేందుకే అన్న ఆరోపణలు వస్తున్నాయి.నాడు అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం» నేరుగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి చర్యలు» తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు» 30 వేల మంది నుంచి రూ.139 కోట్ల పంట కొనుగోలునల్లబర్లీ పంట విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20 సీజన్‌లో మార్కెట్‌లో ధర లేని సమయంలో ఏపీ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. తేమ శాతంతో సంబంధం లేకుండా 30 వేల మంది రైతుల నుంచి రూ.139.19 కోట్ల విలువైన 12,933 టన్నుల పొగాకు సేకరించింది. 2022–23లో 1.42 లక్షల టన్నుల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతివ్వగా, మాండూస్‌ తుపాన్‌తో సగానికి పైగా పొగాకుతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో పొగాకు రేటు బాగుండడంతో రైతులంతా ఇదే పంట వేశారు. ఫలితంగా 1.72 లక్షల టన్నుల పొగాకు ఉత్పత్తయింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. అలాంటిది నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చొరవ కారణంగా పైసా పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం ఒప్పుకొంది. నేడు ఈ చొరవ కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రైతులు కంపెనీల దయాదాక్షిణ్యా­లపై ఆధారపడాల్సి వస్తోంది.ధరల నేలచూపు.. రైతుల వద్ద పేరుకున్న నిల్వలునల్లబర్లీ లక్ష టన్నుల దిగుబడి వచ్చింది. పొగాకు బోర్డుతో సంబంధం లేకుండా ట్రేడర్స్, కంపెనీలు కొనుగోలు చేసే ఈ పొగాకును బాపట్ల, గుంటూ­రు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 20 వేల మంది సాగు చేశారు. నిరుడు హై గ్రేడ్‌కు కిలో రూ.155­–180 చొప్పున ధర లభించగా, ఈ ఏడాది రూ.­70­–80 మించడం లేదు. లో గ్రేడ్‌ గత ఏడాది కిలో రూ.80–100 ధర పలకగా, ఇప్పుడు రూ.30–45­కు మించి కొనేవారు లేరు. రాష్ట్రంలో 21 పొగాకు కంపెనీలు ఉన్నాయి. జీపీఐ, ఐటీసీతో సహా ఏడు కంపెనీలు రైతుల నుంచి నేరుగా, మరో 12 ట్రేడర్స్‌ ద్వారా పరోక్షంగా కొనుగోలు చేస్తాయి. కానీ, ఈ ఏడాది కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి రైతులను నిలువునా ముంచేశాయి.ఎకరాకు రూ.60 వేలు నష్టం తప్పేలా లేదుబాపట్ల జిల్లా ఇంకొల్లు మండలానికి చెందిన వంకాయలపాటి లోతుబాబు ఈ ఏడాది 3.5 ఎకరాల్లో నల్లబర్లీ వేశారు. గత ఏడాది ఎకరంలో పొగాకు పండించి రెండెకరాల్లో మిరప వేశారు. పంట దెబ్బ­తినడంతో తీసేసి మొక్కజొన్న పండించారు. ఈ ఏడాది నల్లబర్లీ ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టు­బడి కాగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పొగా­కు పండించమంటూ కంపెనీల వాళ్లు వచ్చి ప్రతి గ్రామంలో మీటింగ్‌ పెట్టారు. కానీ, ఒక్కరూ కొ­నడం లేదు. లోతుబాబు ఒక్క కేజీ కూడా అమ్మ­లేదు. ‘‘శనగ వేసుకున్నా మా డబ్బులు మాకు వచ్చేవి. ఎకరాకు రూ.60 వేలకు పైగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది’’ అని ఆయన ఇప్పుడు వాపోతున్నారు.నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కినేను 10 ఎకరాల్లో నల్లబర్లి పొగాకు సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టా.10 క్వింటాళ్లు వచ్చింది. కంపెనీ వాళ్లు కొంటామని చెప్పారు. నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కి ఇచ్చేశారు. ఒక్క చెక్‌ కూడా ఇప్పటి వరకు కొనలేదు. నా దగ్గర దాదాపు 100 క్వింటాళ్ల పంట ఉంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – భవనం వెంకటరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లాగ్రేడింగ్‌ రావడం లేదని..3 ఎకరాల్లో కౌలుకు తీసుకొని నల్లబర్లీ పొగాకు సాగు చేశా. 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కౌ­లు­కే రూ.27 వేలు అప్పులు చేసి ఇచ్చాను. బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేశాను. 30 క్వింటాళ్ల పంట ఉంది. ఐదు చెక్‌లు తీసుకెళ్తే రెండు వెనక్కి ఇచ్చేశారు. చెక్‌కు చేరా రూ.1000 ఖర్చవుతోంది. క్వింటాకు గ్రేడ్‌ చేసి తొక్కాలంటే రూ.500. ఇక 10 క్వింటాళ్లు గ్రేడింగ్‌ చేస్తే 3 క్వింటాళ్లు బాగుంది. మిగిలింది గ్రేడింగ్‌ రావడం లేదు. కొనేవారు లేక ఇంటి వద్దే ఉంచా. – కాసు కోటిరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లాపురుగుమందుల షాపులకే రూ.7లక్షలు కట్టాలి..11 ఎకరాల్లో నల్ల బర్లీ సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్ష­లు పెట్టుబడి పెట్టా. నిరుడు క్వింటా రూ.15,500కు కొన్నారు. ఈ సారి రూ.6–8 వేలకు కూడా తీసుకోవడం లేదు. పురుగుమందుల దుకాణం వాళ్లకే రూ.7 లక్షలు ఇవ్వాలి. బంగారం పూర్తిగా బ్యాంక్‌లోనే ఉంది. నిరుడు ఎకరాకు రూ.50వేలు మిగిలింది. ఈసారి ఎకరాకు రూ.50–70 వేలు నష్టపోతున్నాం. – ఎర్రం సుబ్బారెడ్డి, ఇంకొల్లు, బాపట్ల జిల్లాపొగాకు రైతు ఆత్మహత్య» ప్రకాశం జిల్లా కొండపిలో విషాదం» పంట సాగులో నష్టాలతో మనస్తాపంకొండపి: పొగాకు పంట సాగు చేసి నష్టాలు రావడంతో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా కొండపిలో శుక్రవారం జరిగింది. బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చల్లా మధుసూదన్‌రెడ్డి (43) పొగాకుతో పాటు కొన్ని వాణిజ్య పంటలు పండిస్తున్నాడు. గత సంవత్సరం లాభాలు వచ్చాయన్న ఆశతో ఈ ఏడాది 15 ఎకరాల్లో పొగాకు సాగు చేశాడు. అయితే వేలం ప్రారంభం నుంచి పొగాకుకు గిట్టుబాటు ధర లేదని కుటుంబ సభ్యులకు చెప్పుకుని ఆవేదన చెందాడు. ఇలాగైతే పంటసాగుకు చేసిన ఖర్చు కూడా తిరిగొచ్చే అవకాశం లేదని వాపోయాడు. ఈ క్రమంలో నాలుగో తేదీన కొండపికి వెళ్తున్నానని, సాయంత్రానికి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే మధుసూదన్‌రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం స్థానిక పొగాకు బోర్డు వెనుక గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అది మధుసూదన్‌రెడ్డిదిగా గుర్తించారు. మృతుడి కుమా­రుడు మాట్లాడుతూ పొగాకు సాగు కోసం తన తండ్రి భారీగా అప్పులు చేశారని, అయితే గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా కలత చెందారని కన్నీంటిపర్యంతమయ్యాడు.ఈ ఘటనపై చల్లా మధుసూదన్‌ రెడ్డి తండ్రి బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అయితే పోలీసులు మాత్రం రైతు ఆత్మ హత్యగా కాకుండా, రూ.200 కోసం తల్లిదండ్రులతో గొడవపడి నెన్నూరు పాడు నుంచి వచ్చి కొండపిలోని పొగాకు బోర్డు సమీపం ఒక పాకలో అనుమానాస్పదంగా మృతి చెందాడని కేసు నమోదు చేసినట్టు సమాచారం.పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనాలి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం డిమాండ్‌ సాక్షి, అమరావతి: రైతుల వద్ద పేరుకుపోయిన పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మిర్చి రైతులకు ఇచి్చన హామీ లాగా బుట్టదాఖలు చేయకుండా రైతుల వద్ద ఉన్న చివరి కిలో పొగాకు వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. పొగాకుతో పాటు మామిడి, కోకో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీలు దగా చేస్తున్నాయని ఆరోపించారు.

YSRCP President YS Jagan Bakrid Wishes To Muslims2
ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

తాడేపల్లి : ముస్లిం సోదర, సోద­రీ­­మ­ణు­లకు వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభా­కాంక్షలు తెలిపారు. త్యాగాల పండగ బక్రిద్‌ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్‌ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్‌ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, త్యాగానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బ్రకీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#EidUlAdha— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025

Staring at Crisis Pakistan wrote 4 Letters to India3
కాళ్ల బేరానికి పాక్‌.. ‘సింధు ఒ‍ప్పందం’పై వేడుకోలు

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీని​కితోడు ఇటీవల భారత్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం ఆ దేశాన్ని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్‌ హస్తం ఉందంటూ, భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ)నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్తాన్‌ కాళ్లబేరానికి వచ్చి, భారత్‌కు ఈ విషయమై పునరాలోచించాలని కోరుతూ లేఖ రాసింది.ఇప్పటికే పాకిస్తాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో, భారత్‌ సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్‌ మరింత ఆందోళనకు లోనయ్యింది. వెంటనే తేరుకున్న ఆ దేశ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా తాజాగా ఐడబ్ల్యూటీని పునరుద్ధరించాలని కోరుతూ, భారత జల్ శక్తి మంత్రిత్వ శాఖకు నాలుగు లేఖలు రాశారు. వీటిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పరిశీలనకు పంపినట్లు జల్ శక్తి మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి ఉండలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్‌కు భారతదేశం ఇప్పటికే స్పష్టం చేసింది. ఐడబ్ల్యూటీని పరస్పర నమ్మకం, స్నేహబంధం మేరకు రూపొందించినప్పటికీ, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిందని భారత్‌ పేర్కొంది. భారత్‌ తన జాతీయ భద్రతా అధికారాన్ని ప్రయోగిస్తూ.. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ముగించే వరకు ఈ ఒప్పందం నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్‌) ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.పాక్‌లో నెలకొన్న నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించకపోతే దేశంలోని ప్రజలు చనిపోతారని, తమ దేశానికి వచ్చే నీటిలో మూడు వంతులు దేశం వెలుపల నుండి వస్తున్నందని పాక్‌ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్ ఇటీవల పేర్కొన్నారు. సింధూ బేసిన్‌ పాక్‌ జీవనాడి అని, ఈ దేశంలోని ప్రతీ 10 మందిలో తొమ్మిది మంది తమ జీవనోపాధి కోసం సింధు నీటిపై ఆధారపడతారని ఆయన అన్నారు. దేశంలో పండించే పంటలలో 90 శాతం సింధు జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, పలు విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ దానిపైనే నిర్మితమయ్యాయని సయ్యద్ అలీ జాఫర్ తెలిపారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన

 Russia Offers Elon Musk Political Asylum4
ట్రంప్‌తో ఫైటింగ్‌.. మస్క్‌కు రష్యా బంపరాఫర్‌

మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్‌ మస్క్‌ను రష్యా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. మస్క్‌ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్‌ చెప్పుకొచ్చారు.డొనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్‌ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్‌ డూమా ఫెడరేషన్‌ కమిటీ ఛైర్మన్‌ దిమిత్రి నోవికోవ్‌ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్‌ మస్క్‌​ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్‌ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ లాగానే మస్క్‌కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్‌ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.మరోవైపు.. ట్రంప్‌, మస్క్‌ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ నిరాకరించారు. ఇది యూఎస్‌ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.Breaking News 🔴Russian MP Dmitry Novikov states that Elon Musk may be offered political asylum in Russia. pic.twitter.com/rp2pwqomuD— Global Report (@Globalrepport) June 6, 2025ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్‌ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్‌ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్‌ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్‌ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్‌ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్‌ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్‌ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్‌ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్‌ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్‌ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.

Bat Viruses In China Show Covid-Like Threat, Scientists Warn5
మరో కరోనా మహమ్మారి!

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం ఉధృతంగా మొదలై ఇప్పటికీ మరణశాసనం రాస్తున్న కరోనా వైరస్‌ కుటుంబానికి చెందిన కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కోవిడ్‌–19కు మూలకారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్‌ల ఉనికిని కనిపెట్టారు. వీటిలో మరొక్క చిన్నపాటి ఉత్పరివర్తనం(మ్యుటేషన్‌) జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్‌ కమ్యూనికేషన్స్‌ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్‌లు కరోనా మాదిరిగానే మెర్స్‌–కోవ్‌ కుటుంబానికి చెందుతాయని తెలిపారు. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న ఉత్పాతం గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారిలో 34 శాతం మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → మెర్స్‌–కోవ్‌ కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్‌లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టిపెట్టారు. ఈ ఉపవర్గంలోని హెచ్‌కేయూ5 వైరస్‌లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు. → హెచ్‌కేయూ5 వైరస్‌ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్టు డాక్టర్‌ మైఖేల్‌ లెట్కో చెప్పారు. వీటిలో మరో మ్యుటేషన్‌ జరిగి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమని వెల్లడించారు. → సార్స్‌–కోవ్‌–2 అనే వైరస్‌ కోవిడ్‌–19 వ్యాధిని కలిగించినట్లుగానే హెచ్‌కేయూ5 వైరస్‌లు స్పైక్‌ ప్రొటీన్‌ ఆధారంగా మనుషుల కణాల్లోకి ప్రవేశించి, నాశనం చేయగలవు. → చైనాలో గబ్బిలాల నుంచి మింక్స్‌ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు. ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. → హెచ్‌కేయూ5 వైరస్‌ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్‌ మైఖేల్‌ లెట్కో సూచించారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

Russia largest attack yet on Ukraine fires 400 drones 40 missiles6
400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి దిగింది. ఏకంగా 400 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించి, అతిపెద్ద దాడికి పాల్పడింది. ఈ దాడి దేశమంతటినీ ప్రభావితం చేసిందని, లెక్కలేనంత మంది గాయపడ్డారని, వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుని, ఉక్రెయిన్‌ ‘ఆపరేషన్ స్పైడర్‌వెబ్‌’ను నిర్వహించిన దరిమిలా, రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భీకరదాడి చేసింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ‘ఈరోజు, మన దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్‌తో పాటు అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగాయి. రష్యన్లు 400కు మించిన డ్రోన్లు, 40కిపైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మంది గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ శిథిలాల కింద విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని కొందరు ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్ ఈ కోవకు చెందిన వ్యక్తి. యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌లో ఈ దాడి కారణంగా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. లుట్స్క్‌లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్‌లో మరొక వ్యక్తి మృతిచెందారు. మొత్తం ఆరుగురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఉక్రేనియన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ (సీఎన్‌ఎన్‌) మీడియాకు తెలిపింది. రష్యా జరిపిన ఈ సైనిక దాడి ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న దాడులలో అతిపెద్ద దాడి. కైవ్ ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: కాళ్ల బేరానికి పాక్‌.. ‘సింధు ఒ‍ప్పందం’పై వేడుకోలు

RBI repo rate cut reduce to EMIs or tenure7
ఈఎంఐ.. ఇంకా తగ్గేనోయ్‌

అంతటా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరిన్ని చర్యలకు ఆర్‌బీఐ ఉపక్రమించింది. ధరలు కాస్త అదుపులో ఉంటున్న నేపథ్యంలో కీలక రెపో రేటులో ఏకంగా అర శాతం కోత పెట్టి 5.5 శాతానికి తగ్గించింది. దీంతో గృహ, వాహన, ఇతరత్రా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అలాగే, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం నుంచి మరికాస్త ఉపశమనం లభించనుంది. ఇక నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు లభ్యత పెరిగి, ఎకానమీకి బూస్ట్‌లాగా పని చేయనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అటు మార్కెట్లు కూడా జోరుగా పరుగులు తీశాయి. ముంబై: కీలక పాలసీ రేట్ల కోత ఊహిస్తున్నదే అయినా రిజర్వ్‌ బ్యాంక్‌ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పావు శాతం తగ్గింపు ఉండొచ్చని భావిస్తుండగా.. శుక్రవారం ఏకంగా అరశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కీలకమైన రెపో రేటు 5.5 శాతానికి దిగి వచి్చంది. 2020 మే తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారిగా ఆర్‌బీఐ పాలసీ రేటును తగ్గించింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో కూడా కోతను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తం దీన్ని 100 బేసిస్‌ పాయింట్ల (ఒక్క శాతం) మేర తగ్గించినట్లయింది. ఇక బ్యాంకులకు నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్‌) 100 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఇది 3 శాతానికి చేరింది. ఇప్పటికే మిగులు నిధులున్న బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి దీనితో మరో రూ. 2.5 లక్షల కోట్లు అదనంగా వచ్చి చేరనున్నాయి. సీఆర్‌ఆర్‌ కోత సెప్టెంబర్‌–డిసెంబర్‌ మధ్య నాలుగు విడతలుగా అమల్లోకి వస్తుంది. మరోవైపు, రూ. 2.5 లక్షల లోపు పసిడి రుణాలపై లోన్‌–టు–వేల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని ప్రస్తుతమున్న 75 శాతం నుంచి 85 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. బుధవారం నుంచి మూడు రోజులు పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సారథ్యంలో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పాలసీ రేటును అర శాతం తగ్గించే ప్రతిపాదనకు అనుకూలంగా అయిదుగురు ఓటేశారు. ‘ఉదార’ విధానం నుంచి ‘తటస్థ’ విధానానికి పాలసీని మారుస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అంటే, రెపో రేటును తగ్గించడానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో వచ్చే డేటాను బట్టి పెంచడం, తగ్గించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. రెపో తగ్గితే.. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఈ రేటును తగ్గిస్తే దీనితో అనుసంధానమైన ప్రామాణిక రుణ రేట్లు (ఈబీఎల్‌ఆర్‌) తగ్గుతాయి. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయిస్తే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం అర శాతం మేర తగ్గుతుంది. అయితే, రేట్ల కోతతో రుణ గ్రహీతలకు భారం తగ్గనున్నప్పటికీ.. డిపాజిట్‌ రేట్లు కూడా తగ్గడం వల్ల డిపాజిటర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. వృద్ధికి దన్ను.. ఓవైపు ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టి లకి‡్ష్యత స్థాయి కన్నా దిగువకు రావడం, మరోవైపు సర్వత్రా అనిశ్చితి నెలకొని వృద్ధి నెమ్మదించడం వంటి అంశాల నేపథ్యంలో రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు సంజయ్‌ మల్హోత్రా చెప్పారు. ‘‘వృద్ధికి దోహదపడేలా పాలసీ రేట్లను ఉపయోగించి దేశీయంగా ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం నెలకొంది’’ అని ఆయన తెలిపారు. 7–8 శాతం స్థాయిలో అధిక వృద్ధి ఆకాంక్ష సాధన దిశగా తీసుకున్న చర్యగా మానిటరీ పాలసీని చూడాలని మల్హోత్రా వివరించారు.ఆశ్చర్యపర్చింది.. ఎంపీసీ నిర్ణయం చాలా వినూత్నంగా, ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యపర్చింది. ఎకానమీలో అన్ని రంగాలకు, ముఖ్యంగా బ్యాంకింగ్‌.. ఫైనాన్స్‌కు ఇది కచ్చితంగా సానుకూలాంశం.– సీఎస్‌ శెట్టి, చైర్మన్, ఎస్‌బీఐహౌసింగ్‌ మెరుగవుతుంది.. ఈఎంఐల భారం తగ్గడం వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్‌ మెరుగుపడుతుంది. మొద టిసా రి కొనుగోలు చేసే వారు తగిన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడుతుంది. – శేఖర్‌ జి.పటేల్, ప్రెసిడెంట్, క్రెడాయ్‌వృద్ధికి ఊతమిస్తుంది.. లిక్విడిటీ పెరగడం, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వినియోగానికి ఊతమిస్తుంది. పెట్టుబడులకూ దోహదపడుతుంది. – రాజీవ్‌ సబర్వాల్, ఎండీ, టాటా క్యాపిటల్‌ ఆటో రంగానికి సానుకూలం ‘‘రెపో రేటును తగ్గించడంతో మరింత తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభిస్తాయి ఆటో పరిశ్రమకు ఇది సానుకూలం. – శైలేష్‌ చంద్ర, ప్రెసిడెంట్, సియామ్‌మా పని మేము చేశాం .. ఫిబ్రవరి నుంచి 100 బేసిస్‌ పాయింట్ల స్థాయిలో వేగంగా రెపో రేటును తగ్గించాం. ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేటును ఉపయోగించి వృద్ధికి ఊతమిచ్చేలా మరిన్ని చర్యలను తీసుకునేందుకు అవకాశాలు ఇక పరిమితంగానే ఉన్నాయి. నా విధులను నిర్వర్తించడాన్ని నేను విశ్వసిస్తాను. మేము మా వంతుగా చేయాల్సింది చేసాం. ఇక మిగతావారు తమ వంతుగా చేయాల్సినది చేస్తారని ఆశిస్తున్నాం. – సంజయ్‌ మల్హోత్రా, గవర్నర్, ఆర్‌బీఐ

Director Jyothi Krishna Speech Latest Hari Hara Veera Mallu Movie8
మూడు సార్లు సినిమా చూశారు.. మరో మూవీ చేస్తానని హామీ: డైరెక్టర్

పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా చేశారు. దాదాపు ఐదేళ్ల పాటు చాలా ఇబ్బందులు పడిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. సోషల్ మీడియాలో మాత్రం వేరే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాకు బయ్యర్లు దొరకట్లేదని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు పక్కనబెడితే మూవీని అధికారికంగా వాయిదా వేసినా సరే ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు. తాజాగా మచిలీపట్నంలో ఈవెంట్ నిర్వహించారు.మచిలీపట్నం బీచ్ ఒ‍డ్డున 'హరిహర..' ఈవెంట్ శుక్రవారం సాయంత్రం జరిగింది. దీనికి హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ హాజరయ్యారు. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతికృష్ణ ఏమన్నారంటే.. 'పవన్ కల్యాణ్.. ఒక్కసారి కాదు ఈ సినిమాని మూడు సార్లు చూశారు. గంటపాటు నన్ను మెచ్చుకున్నారు. మళ్లీ ఇంకో సినిమా చేస్తానని మాటిచ్చారు. అసురన్ అనే పాటని అయితే ఏకంగా 500 సార్లు విన్నారు' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు)సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మాట్లాడటం బాగానే ఉంది. కాకపోతే రియాలిటీలో చూసుకుంటే 'హరిహర వీరమల్లు' సినిమాకు మార్కెట్‌లో పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో రావాల్సిన ఈ మూవీ.. దాదాపు 11-12 సార్లు వాయిదా పడింది. దీంతో పవన్ అభిమానులే ఈ చిత్రం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదనిపిస్తుంది. అలాంటిది పవన్.. తన సినిమాని మూడుసార్లు చూడటం, మరో మూవీ చేస్తానని దర్శకుడికి మాటివ్వడం అంటే నెటిజన్లు సందేహపడుతున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి?డైరెక్టర్ జ్యోతికృష్ణ విషయానికొస్తే.. నిర్మాత ఏఎం రత్నం కొడుకు. చాన్నాళ్లుగా డైరెక్షన్ చేస్తున్నాడు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత కేడీ, ఊ ల లా లా అనే తమిళ చిత్రాలు చేశారు. తెలుగులో గోపీచంద్‌తో 'ఆక్సిజన్', కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ రంజన్' తీశారు. ఇవన్నీ థియేటర్ దగ్గర ఆడలేదు. ఇప్పుడు కూడా క్రిష్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. మరి 'హరిహర..'తోనైనా హిట్ కొడతారేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

Where Is Maoist Madvi Hidma9
మడావి హిడ్మా ఎక్కడ?

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే పేరు మడావి హిడ్మా. ఇటీవల హిడ్మా పేరుతో ఓ ఏరియా కమిటీ సభ్యుడు లొంగిపోతే ఆ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పీఎల్‌జీఏ కంపెనీ వన్‌ కమాండర్‌గా ఉన్న హిడ్మాకు సంబంధించిన కీలక సమాచారం భద్రతా దళాలకు చిక్కినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం ఎక్కడ పాగా వేశాడో తెలియరాకున్నా దాదాపు 20 ఏళ్ల తర్వాత హిడ్మాకు సంబంధించిన తాజా ఫొటోగా పేర్కొంటున్న చిత్రం శుక్రవారం వెలుగుచూడడం గమనార్హం.అత్యంత రహస్యంమడావి హిడ్మాకు మూడంచెల భద్రతావ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే ఏ టీమ్‌లో 10–12 మంది సభ్యులు, మధ్యలో ఉండే బీ టీమ్‌లో 20–22 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దళం/కంపెనీలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంప్‌ వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా, ప్రత్యేక క్యాంపులో ఉంటాడు. హిడ్మాను ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆరు నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడని తెలిసింది. ఆయన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుండగా, పొలిటికల్‌ వింగ్‌ కంటే ఆర్మీ విభాగంపైనే ఎక్కువగా మక్కువ చూపిస్తాడు. ప్రస్తుతం పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ కంపెనీ 1కి కమాండర్‌గా ఉన్నాడు. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ, సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో, తెలంగాణ కమిటీలకు ఈ కంపెనీ రక్షణ కల్పిస్తోంది. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉంది.జిరామ్‌ఘాటీతోసల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్‌గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జిరామ్‌ఘాటీ దగ్గర జరిపిన దాడిలో కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్‌ సుజాతతోపాటు హిడ్మా కీలకపాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్‌ అగ్రనేత నందకుమార్‌ పటేల్‌తో పాటు 27 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతకు నెలరోజుల ముందు సుక్మా జిల్లా కంచాల దగ్గర పోలీసులపై మెరుపుదాడికి దిగారు. హెలికాప్టర్‌ ఎక్కుతున్న ఓ పోలీసు ఉద్యోగిపైకి కాల్పులు జరిపారు. ఆయన మృతదేహం అప్పగింత విషయంలో మూడు రోజులు నెలకొన్న ఉత్కంఠ హిడ్మా అంటే హడల్‌ అనే విధంగా మారింది. దీంతో భద్రతాదళాలు హిడ్మాపై కూపీ లాగడం మొదలుపెట్టాయి. చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్‌లో బీజాపూర్‌ జిల్లా తెర్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అంబూష్‌ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతాదళాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్‌ 26న బీజాపూర్‌ జిల్లా ఆరాన్‌పూర్‌ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డీఆర్‌జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతాదళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది.కిషన్‌జీ, చలపతి అడుగుజాడల్లో హిడ్మా సొంతూరు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి. ఆయన మురియా తెగకు చెందిన ఆదివాసీ. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాల ను నరనరాన ఒంట బట్టించుకున్నాడు. మావోయిస్టులు నడిపే స్కూల్‌లో చదువుతూ ఏ ఫర్‌ ఆరమ్స్, బీ ఫర్‌ బెంగాల్, సీ ఫర్‌ చారు మంజుదార్‌ అన్నట్టుగా కిషన్‌ జీ ఆలియాస్‌ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్‌గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్‌లో జరిగిన చింతల్నార్‌ –టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ అంబూష్‌దాడిలో 76 మంది సీర్‌ఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనంతరం మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు.

Cyber fraudsters use US visa policy change to con applicants10
వీసా మోసగాళ్లున్నారు జాగ్రత్త!

న్యూఢిల్లీ: సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని వీసా దరఖాస్తుదారులను ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరించింది. ఇటీవల మారిన నిబంధనలను ఆసరాగా చేసుకునేందుకు మోసగాళ్లు ప్రయతి్నస్తున్నారంటూ ఓ ప్రకటనలో అలర్ట్‌ చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఇంజినీర్‌ను సైబర్‌ నేరగాడు బీ1/బీ2 నాన్‌ ఇమిగ్రాంట్‌ వీసా ఇంటర్వ్యూ ముందుగానే ఇప్పిస్తామని మోసం చేశారని వివరించింది. అమెరికా వీసా దరఖాస్తు పోర్టల్‌లో వ్యక్తిగత వివరాలను, అర్హతలను షేర్‌ చేయవద్దంటూ శుక్రవారం అమెరికా ఎంబసీ ‘ఎక్స్‌’లో కోరింది. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగానే వచ్చేందుకు ఎక్కువ ప్రాసెస్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎవరైనా చెబితే నమ్మవద్దని, అది వట్టి మోసమని వెల్లడించింది. ఇంజినీర్‌ ఎలా మోసపోయారంటే.. బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర్‌కు చెందిన ఇంజినీర్‌(45) అమెరికా సందర్శనకు అవసరమైన బీ1/బీ2 నాన్‌ ఇమిగ్రాంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ఇంటర్వ్యూ షెడ్యూల్‌ 2026 మార్చిలో ఖరారైంది. టెలీగ్రామ్‌ యాప్‌లో వచ్చిన ఓ ప్రకటనను చూసి ఆయన.. ఓ వ్యక్తిని మే 22న సంప్రదించాడు. ఆ మోసగాడు తన పేరు వనం శ్రవణ్‌ కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగా రావాలంటే అడ్వాన్స్‌గా రూ.10వేలు చెల్లించాలన్నాడు. ఆ మేరకు డబ్బు పంపగా, వ్యక్తిగత వివరాలు కావాలడిగాడు. అమెరికా వీసా అప్లికేషన్‌ పోర్టల్‌ లాగిన్‌ పాస్‌వర్డ్‌ కూడా తీసుకున్నాడు. ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ పత్రం పంపించిన మోసగాడు...మరో రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. లేదంటే లాగిన్‌ పాస్‌వర్డును మారుస్తానని బెదిరించాడు. ఆ మేరకు రూ.10వేలు చెల్లించిన తర్వాత కూడా ఆ మోసగాడు లాగిన్‌ పాస్‌వర్డును మార్చేశాడు. దీంతో, బాధితుడు చేసేదిలేక మే 24న పోలీసులను ఆశ్రయించాడు.అవకాశం కోల్పోయిన బాధితుడు ఈ విషయంలో బాధితుడికి అమెరికా ఎంబసీ నుంచి ఎటువంటి సాయం అందదని సీనియర్‌ సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. బాధితుడు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ తొందరగా వచ్చేందుకు తనంతట తానే థర్డ్‌ పార్టీని ఆశ్రయించాడని, అధికారిక ప్రక్రియను కాదని దొడ్డిదారిన పని పూర్తి చేసుకునే ఇటువంటి వారిని ఎంబసీ అధికారులు ప్రోత్సహించరన్నారు. వ్యక్తిగత వివరాలతోపాటు పాస్‌వర్డ్‌ సైతం మోసగాడికి ఇవ్వడం మరీ దారుణమన్నారు. బాధితుడు మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇలా ఉండగా, విద్యార్థి వీసా ఇంటర్వ్యూలతోపాటు విజిటర్‌ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం గత నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులందరి సోషల్‌ మీడియా అకౌంట్లను తనిఖీ చేయాలంటూ విదేశాంగ శాఖ నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా, నాన్‌ ఇమిగ్రాంట్‌ వీసా దరఖాస్తుదారుల నుంచి ప్రాసెసింగ్‌ ఫీజుగా ఇకపై వెయ్యి డాలర్లు వసూలు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇందులో వీసా ఇంటర్వ్యూలు తొందరగా పూర్తవ్వాలని కోరుకునే పర్యాటక వీసా దరఖాస్తు దారులు సైతం ఉన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement