ప్రధాన వార్తలు

రైతులను రౌడీలుగా చూపిస్తూ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరిట ఉద్రిక్తతలకు కారణమైనవాళ్లను వదిలేసి.. అమాయక ప్రజలపై, రైతులపైనా కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని ఎక్స్లో మండిపడ్డారాయన. చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా?. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన.. అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది?. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?.. .. పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ?. రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు..@ncbn గారూ పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2025

సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుకలో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. 2024 ఏడాదిగాను పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప 2 చిత్రానికి అందిన తొలి అవార్డు ఇది. తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు వేడుకను ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను’అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పుష్ప-2 మూవీలోని మాస్ డైలాన్ని చెప్పి ఆకట్టుకున్నాడు. ఇది సినిమా ఫంక్షన్ కదా.. తన సినిమాలోని డైలాగ్ను చెప్పవచ్చా.. అని అడిగి మరీ అల్లు అర్జున్ ‘రప్పా రప్పా’ డైలాగ్ చెప్పాడు.రేవంత్ రెడ్డి ముందు పుష్ప 2 సినిమా డైలాగ్ కొట్టిన హీరో అల్లు అర్జున్ pic.twitter.com/LlQh7mSQfP— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025

AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి చివరిగా వచ్చిన మే డే కాల్లో ఐదు సెకన్ల పాటు రికార్డ్ అయిన ఆడియో సందేశంలో కీలక విషయం వెల్లడైంది. ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి వచ్చిన మే డే కాల్లో.. మే డే.. మే డే.. మే డే.. నో పవర్.. నో త్రస్ట్.. గోయింగ్ డౌన్ ఇవి కెప్టెన్ సబర్వాల్ ఆఖరి సందేశంగా రికార్డైంది. దీనికి సంబంధించి ఆడియో ప్రస్తుతం ఏటీసీ వద్ద ఉందని తాజాగా వెల్లడించారు. మే డే కాల్కు శతాబ్ధానికి పైగా చరిత్ర!సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్కు సమానార్ధకం. ఫ్రెంచ్లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.మేడే కాల్ వస్తే..!ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. కాగా, జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది.

ఘనంగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. విజేతలు వీళ్లే
హైదరాబాద్లోని అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక జరిగింది. 2014 నుంచి 2024 వరకు వచ్చిన సినిమాలు, నటీనటులకుగానూ ఈ పురస్కారాల ప్రదానం చేశారు. అవార్డ్తో పాటు సిల్వర్ మొమెంటో, రూ.5 లక్షల ప్రైజ్మనీ అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు.అవార్డులు అందుకున్న విజేతలు వీళ్లేఉత్తమ నటుడు- అల్లు అర్జున్( 2024 ఏడాదికి గాను పుష్ప-2 మూవీ)ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ఉత్తమ చిత్రం : కల్కి 2898 ఏడీద్వితీయ ఉత్తమ చిత్రం : పొట్టేల్తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్: మేం ఫ్రెండ్సండీఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్)ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్ శ్రీరామ్: ఊరుపేరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్: పుష్ప2 (సూసేటి అగ్గిరవ్వ) ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర-ఆయుధపూజ)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్స్టర్)ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా2)ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అధ్నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్కుమార్ (కల్కి 2898 ఏడీ)ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అరుణ్ దేవ్ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మోనీ సోషల్ అప్లిస్ట్: కమిటీ కుర్రాళ్లు

వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల చిరకాల స్వప్నం. గత 27 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ ఎట్టకేలకు ఆ జట్టు సొంతమైంది. ఇకపై మేము ఛోకర్స్ కాదు ఛాంపియన్స్ అంటూ క్రికెట్ ప్రపంచానికి సఫారీలు చాటి చెప్పారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.మార్క్రమ్ సూపర్ సెంచరీ..సౌతాఫ్రికా వరల్డ్ ఛాంపియన్స్గా నిలవడంతో ఆ జట్టు ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్ది కీలక పాత్ర. భారీ లక్ష్య చేధనలో మార్క్రమ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ తన జట్టుకు రెండో ఐసీసీ టైటిల్ను అందించాడు. అతడి ఇన్నింగ్స్కు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. ఆఖరిలో ఔటయ్యి తిరిగి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తుండగా లార్డ్స్లోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఓవరాల్గా 207 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. 14 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేశాడు.బావుమాది వారియర్..ఈ మ్యాచ్లో మార్క్రమ్ సెంచరీ ఎంతో విలువైందో, బావుమా ఇన్నింగ్స్ కూడా వెలకట్టలేనిది. తొడ కండరాల గాయంతో బాధపడుతునే తన జట్టు కోసం బావుమా పోరాడాడు. 134 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. మార్క్రమ్తో కలిసి కీలక బాగస్వామ్యాన్ని నెలకొల్పిన బావుమా.. దక్షిణాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్ను అందించిన కెప్టెన్గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, హాజిల్వుడ్ కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు.ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో వెబ్స్టెర్(72) టాప్ స్కోరర్గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) రాణించాడు. సఫారీ బౌలర్లలో రబాడ ఐదు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్ మూడు వికెట్లు సాధించాడు. అనంతరం దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకే కుప్పకూలింది. ప్యాట్ కమ్మిన్స్ 6 వికెట్లు పడగొట్టి ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 207 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సఫారీల ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించి ప్రోటీస్ ఛాంపియన్స్గా నిలిచింది.సంక్షిప్త సమాచారం..ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్: 212/10దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్: 138/10ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోర్: 207/10సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోర్: 282/5ఫలితం: ఆసీస్సై 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయంమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: ఐడైన్ మార్క్రమ్

మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్ శిక్షణ.. నెక్స్ట్ వేవ్ & ఎన్ఎస్డిసి కృషితో కొత్త అధ్యాయం
ఉత్తరప్రదేశ్ బాగ్పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్ వేవ్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రైన్యూర్షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.నెక్స్ట్ వేవ్ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్ వేవ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.NxtWave Institute of Advanced Technologiesకపిల్ కావురి హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, తెలంగాణ, 500032

‘నాన్నా.. నేను మాత్రం బ్రతికాను.. తమ్ముడు ఏమయ్యాడో తెలీదు’
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం జూన్ 12వ తేదీ సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు.ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే బ్రతికానన్న ఆనందం అతనికి ఒకవైపు ఉండగా.. తన వెంట వచ్చిన సోదరుడు దుర్మరణం చెందాడన్న దుఃఖం మరొకవైపు కలచివేస్తోంది. రమేశ్ విశ్వాస్ కుమార్తో పాటు అతని సోదరుడు కూడా లండన్ బయల్దేరాడు. కానీ రమేశ్ విశ్వాస్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, సోదరుడు మాత్రం చనిపోయిన 241 మందిలో ఒకడయ్యాడు. ఇది రమేశ్ను అతని కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది.విమానం కూలి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత రమేశ్ తన తండ్రికి ఫోన్ చేసిన విషయాన్ని రమేశ్ మరో సోదరుడు నయన్ కుమార్ రమేశ్ స్కై న్యూస్క వెల్లడించాడు. ‘ మా నాన్నకు రమేశ్ విశ్వాస్ ఫోన్ చేశాడు. విమానం కూలిపోయిందన్నాడు. నేనొక్కడినే బయటపడ్డా. మిగతా ఎవరూ నాకు అక్కడ కనిపించలేదు. తమ్ముడు ఎక్కడ అనే విషయం కూడా తెలీదు. అసలు విమానం ఎలా కూలిపోయిందో నాకైతే అర్థం కాలేదు’ అని చెప్పినట్లు నయన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రమేశ్ ప్రాణాలతో బ్రతికాడన్న సంతోషం ఒకవైపు, ఉన్న మరొక సోదరుడ్ని కోల్పోవడం మాత్రం తీవ్ర వేదనకు గురిచేస్తుందన్నాడు. What Is Mayday Call: AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!

ఇల్లు కొనడానికి ఇదే సరైన కాలం..
వర్షంలో బయటకు వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో కారణాలెన్నో! కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షణ్ణంగా తెలుస్తుంది కాబట్టి.. సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే సౌకర్యం లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతానికి సంబందించి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.నాణ్యత తెలుస్తుంది.. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలంలోనే.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్లో కొనుగోలు చేసే కొనుగోలుదారుల మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశం అయ్యాక కామన్గా ఏర్పాటు చేసిన వసతుల్లో లీకేజ్లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా కాలంలో ప్రాజెక్ట్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్రూమ్, సీలింగ్, పంబ్లింగ్, డ్రైనేజీ లీకేజ్ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్ను కోరే వీలుంటుంది.👉 ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..రీసేల్ ప్రాపర్టీలనూ.. రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధ్రుడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా? అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్ మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది.వర్షంలో రాయితీలు.. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్–అక్టోబర్ పండగ సీజన్ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు.

Indian Students: మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి.. !
ఇజ్రాయిల్ నిన్న(శుక్రవారం) చేసిన దాడుల తర్వాత ఇరాన్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా ఇజ్రాయిల్ విరుచుకుపడటంతో ఇరాన్లో భారీ నష్టమే వాటిల్లింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించిన తర్వాత ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. అయితే దీనికి ప్రతిగా ఇజ్రాయిల్పై ఈరోజు(శనివారం) ఇరాన్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్ చేసిన క్షిపణి దాడులతో ఇజ్రాయిల్లో సైతం భారీ నష్టమే వాటిల్లినట్లే తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్లో ఉన్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. ఏ సమయంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ వేడుకుంటున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం ఇక్కడ అంతా బాగానే ఉందని, మీరంతా సురక్షితంగా ఉన్నారనే భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ భారత విద్యార్థులు మాత్రం ఈ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని, తమకు ఒకానొక సమయంలో భారీగా భూమి కంపించినట్లు అనిపించిందని, సురక్షిత ప్రాంతాలకు తరలించే యత్నం చేయాలని విన్నవిస్తున్నారు. ఈ యుద్ధ సమయంలో ఏది సురక్షిత ప్రాంతమనేది కూడా ఆ యూనివర్శిటీ అధికారులు చెప్పలేకపోతున్నారు. తమకు ఫలానా ప్రాంతం సురక్షితమైనదనే సమాచారం ఏదీ లేదని, మీరు దయచేసి సంయమనం పాటించాలని అంటున్నారు. ‘ మనమంతా సేఫ్ ప్లేస్లో ఉన్నాం. దయచేసి మీరు కామ్గా ఉండండి’ అంటూ టెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టీయూఎంఎస్) అధికారులు చెప్పినట్లు కశ్మీర్ నుంచి వెళ్లి అక్కడ ఎంబీబీఎస్ రెండో ఏడాది చదువుతున్న తబియా జహ్రా పేర్కొన్నారు.ఉత్తర్ ప్రదేశ్ నుంచి వెళ్లిన అలిషా రిజ్వీ మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం మా డేటాను అధికారులు సేకరిస్తున్నారు. మా ఈ మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. ఒకవేళ మమ్మల్ని తరలించే అవసరం ఏర్పడితే అందుకు ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’ ని ఆమె పేర్కొన్నారు. వీరిద్దరి 5.5 ఎంబీఎస్ ప్రోగ్రామ్లో భాగంగా ఇరాన్లోని టెహ్రాన్కు 2023లో రాగా, ఇప్పటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదే తరహాలో చాలామంది విద్యార్థులు ఇరాన్లోని ప్రస్తుత పరిస్థితుల నడుమ భయాందోళనలతో ఉన్నారు. ఇదిలా ఉంచితే, జమ్మూ కశ్మీర్ విద్యార్థి సంఘం.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ను కలిసింది. భారత స్టూడెంట్లు అక్కడ ప్రస్తుత భయానక పరిస్ధితుల్లో ఉన్నారని, వారికి పదేపదే యుద్ధ సైరన్లు వినిపించడంతో వారు బెంబేలెత్తిపోతున్నారని జై శంకర్కు సదరు అసోసియేషన్ పెద్దలు విజ్తిప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇరాన్లో చదువుతున్న తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మరొకవైపు ఇరాన్లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఇప్పుడు తాము ఉన్న ప్రదేశంలో ఉండలేకపోతున్నామనే ఆందోళన భారత విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.

11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. మరో జన్మ ఎత్తిన సింగర్!
మనకేం అవుతుందిలే? అనుకునే రోజులు కావివి. మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్నామనడానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదమే నిలువెత్తు ఉదాహరణ. ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదం (Ahmedabad Plane Crash)లో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు. నా విషయంలోనూ ఇదే మిరాకిల్ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే 27 ఏళ్ల క్రితం తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు థాయ్ సింగర్ రౌంగ్సక్ లోయ్చుసక్ (47). సింగర్ మాట్లాడుతూ.. 'ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను. నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను.రెండో జన్మ..ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత విమానప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు కిటికీవైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని. నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు, పిడుగు శబ్ధం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని. నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది. ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు, ఆ మట్టి వాసన, నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.1998లో విషాదం1998లో సింగర్ ప్రయాణించిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG261 విమానం బ్యాంకాక్ నుంచి సూరత్ బయల్దేరింది. ల్యాండ్ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 101 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు.మాటలకందని విషాదంజూన్ 12.. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరింది. 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే అనూహ్య సమస్య తలెత్తింది. క్షణాల్లోనే బీఆర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోగా మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారు.చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్
ఎస్బీఐలో హోమ్లోన్లు.. గుడ్న్యూస్
ఘనంగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. విజేతలు వీళ్లే
ఏపీ డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు
ఐపీవోకి వస్తోన్న సోలార్ కంపెనీ
గ్రాండ్గా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోలీస్ జులుం
కొమ్మినేనిపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం: పొన్నవోలు
ఆధార్ అప్డేట్కు కొత్త డెడ్లైన్
మూడు సంస్థానాలు.. 46 జాగీర్లు
నన్ను క్షమిస్తావు కదూ.. పూర్ణ ఎమోషనల్ పోస్ట్ (ఫోటోలు)
ఇదే నాకు చివరి రాత్రి.. గుడ్ బై ఇండియా!
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
లైఫ్ అంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు
బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి : సింగర్ సునీత ఫ్యామిలీ పిక్స్ (ఫొటోలు)
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
Plane Crash: బీజే మెడికల్ కాలేజీలో CCTV విజువల్స్
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
Akhil-Zainab డైమండ్ నగలతో గార్జియస్గా అఖిల్ అర్థాంగి
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
డ్యాన్స్ మాస్టర్ కోసం వెళ్లిన రోజా, మీనా, రంభ, దేవయాని (ఫోటోలు)
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
ఈ నకిలీ డాక్టర్కు అసలు ‘హృదయం’ లేద్సార్!
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
ఒక్క లాడెన్కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్
ఎస్బీఐలో హోమ్లోన్లు.. గుడ్న్యూస్
ఘనంగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. విజేతలు వీళ్లే
ఏపీ డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు
ఐపీవోకి వస్తోన్న సోలార్ కంపెనీ
గ్రాండ్గా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోలీస్ జులుం
కొమ్మినేనిపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం: పొన్నవోలు
ఆధార్ అప్డేట్కు కొత్త డెడ్లైన్
మూడు సంస్థానాలు.. 46 జాగీర్లు
ఇదే నాకు చివరి రాత్రి.. గుడ్ బై ఇండియా!
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
లైఫ్ అంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు
బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
Akhil-Zainab డైమండ్ నగలతో గార్జియస్గా అఖిల్ అర్థాంగి
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
ఈ నకిలీ డాక్టర్కు అసలు ‘హృదయం’ లేద్సార్!
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
ఒక్క లాడెన్కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
మీరిచ్చిన గూగుల్ మ్యాప్లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 265 మంది మృతి
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరిచయాలు పెరుగుతాయి
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలలో పురోగతి
సినిమా

అనసూయ ఒయ్యారాలు.. హల్దీ వేడుకల్లో 'బిగ్బాస్' శుభశ్రీ
ఒంపుసొంపులతో గ్లామర్ బెండ్ తీస్తున్న అనసూయహల్దీ వేడుక వీడియోని షేర్ చేసిన బిగ్బాస్ శుభశ్రీకొరియాలోని సియోల్లో కల్యాణి ప్రియదర్శినిమాళవిక మోహనన్ మత్తెక్కించే బాత్రూమ్ పోజులువయ్యారంగా చూస్తూ కిక్ ఇస్తున్న కోమలి ప్రసాద్నల్లంచు తెల్లచీరలో అరియానా ఫుల్ ఎంజాయ్హాట్ హాట్గా కనిపించేస్తున్న హీరోయిన్ నేహాశర్మ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)

అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతే అది సామాన్యులకు సంకటం కావచ్చు కానీ సెలబ్రిటీల భవిష్యత్తుకు ఏ మాత్రం ఆటంకం కాదనేది తెలిసిందే. అందుకే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్లు సర్వసాధారణంగా కనిపించే తారా లోకంలో సంఘటనలు సామాన్యులకు ఎప్పుడూ వింతల్లా, విశేషాల్లాగే ఉంటాయి. అలాంటిదే అఖిల్ ప్రేమ, నిశ్చితార్ధం, బ్రేకప్... తాజాగా పెళ్లి... అక్కినేని వంశ ఘనమైన నట వారసత్వాన్ని మోయడానికి సినీ రంగంలోకి దిగిన అఖిల్... ఇంకా కెరీర్ నిర్మాణంలో తడబడుతూనే ఉన్నాడనేది తెలిసిందే. అయితే కారణం తెలీదు గానీ చాలా మంది నట వారసులకు భిన్నంగా ఇంకా కెరీర్ రూపుదిద్దుకోకుండానే అఖిల్ పెళ్లికి మాత్రం తొందరపడ్డాడనే చెప్పాలి. నిజానికి 2016లో, అఖిల్ అక్కినేని తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియా భూపాల్తో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు కేవలం 22 సంవత్సరాలు అని సమాచారం. అంటే అక్కినేని యంగ్ హీరోకి ఆమెకీ దాదాపు 4 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే...తాజాగా అఖిల్ పెళ్లి చేసుకున్న యువతి కూడా తనకన్నా వయసులో పెద్ద అంటూన్నారు.మరోవైపు అఖిల్తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రియా భూపాల్(Shriya Bhupal) ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే... హైదరాబాద్లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జివికె వారి ఇంట జన్మించిన శ్రియ, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ మేకర్. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్ స్కూల్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఆమె పట్టభద్రురాలైంది, ఫ్యాషన్ డిజైనర్గా శ్రియా శరణ్, సమంతా రూత్ ప్రభు కాజల్ అగర్వాల్ వంటి టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆమె డిజైన్లను అందించారు. అంతేకాకుండా శ్రియా ’శ్రియా సోమ్’ అనే దుస్తుల బ్రాండ్ కు వ్యవస్థాపకురాలు కూడా. ప్రస్తుతం ఆమె లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నా... తన పనిలో బిజీగానే ఉన్నారని సమాచారం.అఖిల్తో బ్రేకప్ తర్వాత ఆమె చాలా వేగంగా కొత్త అనుబంధంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడైన అనిందిత్ రెడ్డి ని ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు. సినిమా సెలబ్రిటీ కాకపోయినా అనిందిత్ రెడ్డి కూడా సాదా సీదా యువకుడేమీ కాదు. అత్యంత అరుదైన రంగంలో అతను రాణిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి టాప్ క్లాస్ రేసింగ్ డ్రైవర్గా నిలిచాడు. గత 2016లో యూరో జెకె 16 ఛాంపియన్ షిప్, యూరో జెకె 2017 ఛాంపియన్ షిప్లలో పాల్గొన్నాడు, ఫెడరేషన్ ఆఫ్ మోటార్స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎమ్ఎస్సి)లో 2017లో మోటార్స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు.అతను ఢిల్లీలో జరిగిన వోక్స్వ్యాగన్ వెంటో కప్ 2015ను గెలుచుకున్నాడు.2019లో, అతను వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ ఫార్మ్ నుంచి అత్యుత్తమ పెర్ఫార్మర్గా ఎంపికయ్యాడు.

మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్.. అవాక్కైన హీరో
అశ్విని శ్రీ (Ashwini Sree).. పలు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసినా రాని గుర్తింపు బిగ్బాస్ షోతో వచ్చింది. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొన్న ఈమె షోకు గ్లామర్ అద్దింది. ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో అశ్విని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్గా మారాయి. ఆ డ్యాన్స్ షోలో హీరో అడివి శేష్ గెస్టుగా రావడాన్ని చూసి ఈ బిగ్బాస్ బ్యూటీ సర్ప్రైజ్ అయింది. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని శేష్కు చెప్పింది. అక్కను పెళ్లి చేసుకుంటే..అందుకా హీరో.. నాక్కూడా మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని బదులిచ్చాడు. అప్పుడు అశ్విని.. మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది. అంటే అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను అనేసరికి శేష్ నోరెళ్లబెట్టాడు. అయితే ఎలా వస్తాననేది కూడా చెప్తాననేసరికి హీరో నవ్వుతూనే సరేనని బదులిచ్చాడు. సదరు డ్యాన్స్ షో ప్రోమోలో ఇంతవరకే చూపించారు. ఏదేమైనా అశ్విని మాట్లాడిన తీరుకు అక్కడున్న జనం నవ్వాపుకోలేకపోయారు. ఇలా ట్విస్టులు ఇచ్చుకుంటూ మాట్లాడేబదులు అసలు విషయమేంటో డైరెక్ట్గా చెప్పొచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. రెండో జన్మ ఎత్తిన సింగర్!

11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. మరో జన్మ ఎత్తిన సింగర్!
మనకేం అవుతుందిలే? అనుకునే రోజులు కావివి. మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్నామనడానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదమే నిలువెత్తు ఉదాహరణ. ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదం (Ahmedabad Plane Crash)లో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు. నా విషయంలోనూ ఇదే మిరాకిల్ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే 27 ఏళ్ల క్రితం తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు థాయ్ సింగర్ రౌంగ్సక్ లోయ్చుసక్ (47). సింగర్ మాట్లాడుతూ.. 'ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను. నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను.రెండో జన్మ..ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత విమానప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు కిటికీవైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని. నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు, పిడుగు శబ్ధం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని. నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది. ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు, ఆ మట్టి వాసన, నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.1998లో విషాదం1998లో సింగర్ ప్రయాణించిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG261 విమానం బ్యాంకాక్ నుంచి సూరత్ బయల్దేరింది. ల్యాండ్ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 101 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు.మాటలకందని విషాదంజూన్ 12.. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరింది. 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే అనూహ్య సమస్య తలెత్తింది. క్షణాల్లోనే బీఆర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోగా మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారు.చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

టీమిండియాతో టీ20 సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ
భారత మహిళలతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు నాట్ స్కివర్ బ్రంట్ సారథ్యం వహించనుంది. ఇక క్రికెట్ నుంచి తత్కాలిక విరామం తీసుకున్న స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ తిరిగి జట్టులోకి పునరాగమనం చేసింది. గత నెలలో స్వదేశంలో వెస్టిండీస్తో మహిళలతో జరిగిన వైట్బాల్ సిరీస్లకు ఎక్లెస్టోన్ దూరంగా ఉంది. మానసిక ఒత్తడి కారణంగా కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని సోఫీ నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు టీమిండియా సిరీస్ నేపథ్యంలో స్టార్ స్పిన్నర్ తన మనసును మార్చుకుంది. ఎక్లెస్టోన్ రాకతో మరో స్పిన్నర్ సారా గ్లెన్ జట్టులో చోటు కోల్పోయింది. అదేవిధంగా గత నెలలో వెస్టిండీస్ తో జరిగిన టీ20లో గాయపడిన మాజీ కెప్టెన్ హీథర్ నైట్ ఇంకా కోలుకోలేదు. దీంతో ఈ సిరీస్కు ఆమె దూరంగా ఉండనుంది.ఈ టీ20 సిరీస్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. కాగా టీ20 సిరీస్ తర్వాత భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. మరోవైస భారత పురుషల జట్టు కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.భారత్తో టీ20లకు ఇంగ్లండ్ జట్టునాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, పైజ్ స్కోల్ఫీల్డ్, లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్, ఇస్సీ వాంగ్ఇంగ్లండ్తో టీ20లకు భారత జట్టు:హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్టికా భాటియా , హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, సరణ్య గఢావ్, క్రాంతి గఢ్వ్ రెడ్డిభారత వన్డే జట్టు:హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ , యాస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, అమంజోత్ కౌర్, అరుంధతి గద్యారెడ్, శ్రీ చరణి, అమంజోత్ కౌర్, అరుంధతి గద్యారే.

'మ్యాచ్ ఇంకా ముగియ లేదు'.. ప్రోటీస్కు ఆసీస్ కోచ్ వార్నింగ్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగింపునకు చేరుకుంది. నాలుగో రోజు మొదటి సెషన్లో ఫలితం తేలే అవకాశముంది. తొలి డబ్ల్యూటీసీ టైటిల్ విజయానికి సౌతాఫ్రికా కేవలం 69 పరుగుల దూరంలో నిలవగా.. ఆస్ట్రేలియా 8 వికెట్ల దూరంలో ఉంది.ఆసీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా అద్బుతం జరిగాలి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెట్టోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్ ఇంకా ముగియలేదని, గెలిచేందుకు ఇంకా దారులు తెరిచే ఉన్నాయని ఈ కివీస్ మాజీ కెప్టెన్ తెలిపాడు.282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(102), బావుమా(65) ఉన్నారు."ఈ ఫైనల్ మ్యాచ్పై మాకు ఇంకా ఆశలు ఉన్నాయి. మ్యాచ్ ఇంకా ముగియలేదు, ఒక్క వికెట్ పడితే ఏదైన జరగొచ్చు. ప్రస్తుతం మార్క్రమ్, బావుమా తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ ఎవరో ఒకరు ఔటయ్యాక కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చే పరిస్థితి వెరే విధంగా ఉంటుంది.ఇప్పుడు వికెట్లు ఎలా తీయాలన్నదే మేము ఆలోచిస్తున్నాము. తొలి సెషన్లో సవాల్లను ఎదుర్కొనేందుకు మా బౌలర్లు సిద్దంగా ఉన్నారని" వెట్టోరి మూడో రోజు ఆట అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో నిప్పులు చెరిగిన స్టార్క్, కమ్మిన్స్, హాజిల్వుడ్ ఆసీస్ పేస్ త్రయం.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం పూర్తిగా తెలిపోయారు. స్టార్క్ ఒక్కడే ఇప్పటివరకు రెండు వికెట్లు పడగొట్టాడు.చదవండి: WTC Final 2025: మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు

WTC Final: ఓ వైపు గాయం.. అయినా కానీ! హ్యాట్సప్ బావుమా
టెంబా బావుమా.. ఓ జట్టు నాయకుడు ఎలా ఉండాలో తన పోరాట పటిమతో చాటి చెప్పాడు. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా ఓ వారియర్లా పోరాడుతున్నాడు. ఓవైపు తీవ్రమైన గాయంతో బాధపడుతూనే తన జట్టును రెండో ఐసీసీ టైటిల్ విజయానికి చేరువ చేశాడు.తన గాయం కంటే.. సఫారీల 27 ఏళ్ల కలే ముఖ్యమంటూ ముందుకు సాగుతున్నాడు. వియాన్ ముల్డర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బావుమాకు ఆదిలోనే ఓ లైఫ్ వచ్చింది. బావుమా ఇచ్చిన ఈజీ క్యాచ్ను స్లిప్స్లో స్టీవ్ స్మిత్ జారవిడిచాడు. ఆ తర్వాత టెంబా ఎడమ కాలి తొడ కండరాలు పట్టేశాయి.దీంతో ఫిజియో మైదానంలో వచ్చి చికిత్స అందించాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు రిటైర్డ్ హార్ట్గా వెనుదిరుగుతాడని అంతా భావించారు. కానీ బావుమా మాత్రం జట్టు విజయమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వికెట్ల మధ్య కుంటుతూనే పరుగులు తీశాడు. నొప్పిని భరిస్తూనే అవతలి ఎండ్లో మార్క్రమ్కు సపోర్ట్గా నిలిచాడు.సెంచరీ హీరో మార్క్రమ్తో కలిసి మూడో వికెట్కు 143 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో బావుమా పోరాట పటిమపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బావుమా ది వారియర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. బావుమా 65 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.కాగా ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తమ విజయానికి కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(102 నాటౌట్) అద్బుత శతకంతో చెలరేగాడు.అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (136 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.చదవండి: WTC Final 2025: మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు

మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు
రెండో ఐసీసీ ట్రోఫీని ముద్దాడేందుకు సౌతాఫ్రికా అడుగు దూరంలో నిలిచింది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది. మరో 69 పరుగులు సాధిస్తే 27 ఏళ్ల మరో ఐసీసీ టైటిల్ సఫారీల ఖాతాలో చేరనుంది.282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్ అద్బుత శతకంతో చెలరేగాడు. మార్క్రమ్ 102 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు కెప్టెన్ టెంబా బావుమా(65 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.తొలి ఆటగాడిగా..ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన ఐడైన్ మార్క్రమ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నాల్గవ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా మార్క్రమ్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరూ ఫీట్ సాధించలేకపోయారు.ఓవరాల్గా మార్క్రమ్ కంటే ముందు డబ్ల్యూటీసీ ఫైనల్లో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ మాత్రమే సెంచరీ సాధించారు. అయితే ఈ రెండు సెంచరీలు కూడా తొలి ఇన్నింగ్స్లో వచ్చినవే కావడం గమనార్హం. అదేవిధంగా లార్డ్స్ మైదానంలో ఒకే టెస్టులో డకౌట్, సెంచరీ నమోదు చేసిన తొమ్మిదవ బ్యాటర్గా మార్క్రమ్ నిలిచాడు.చదవండి: విజయం దిశగా దక్షిణాఫ్రికా
బిజినెస్

ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..
కొనేటప్పుడు తక్కువ ధరకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ రేటు రావాలనుకునేది ఒక్క స్థిరాస్తిలో మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే చాలు ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి అమ్మేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్ సెంటిమెంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గిరాకీ, సరఫరా కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని విక్రయించాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.వసతులే కీలకం.. ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాల్స్ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే.. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరం ఉండదు కాబట్టి ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకం.సౌకర్యాలే ముఖ్యం కాదు.. ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజారవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు ఇలాంటివే కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే.. భవిష్యత్తులో ఇల్లు విక్రయించే సమయంలో కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి విలువ లెక్కగడతారని గుర్తుంచుకోవాలి.చిక్కులుండొద్దు.. స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నా ఓ విషయంలో మాత్రం చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేము. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఉండాలన్నమాట. ఇంటికి లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటు మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.👉 ఇది చదవలేదా? రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..నిర్వహణతోనే రెట్టింపు విలువ.. గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది. ఇంటి విలువ కేవలం ఫ్లాట్కో.. ప్లాట్కో పరిమితం కాదు.. సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోంది. ఫుల్లీ ఫర్నీచర్, సెమీ ఫర్నీచర్ ఫ్లాట్లకు ఎక్కువే రేటు వస్తుంది.

ఇండియాలో స్టార్లింక్ సేవలకు డేట్ఫిక్స్?
ఎలాన్మస్క్కు చెందిన స్టార్లింక్ మరో రెండు నెలల్లో భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం భారతదేశం డిజిటల్ అంతరాన్ని, ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు తోడ్పడుతుందని కొందరు భావిస్తున్నారు.సమస్యలకు పరిష్కారం..స్టార్లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం చాలా కాలంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్న కమ్యూనిటీలకు పరిష్కారాన్ని అందిస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఫైబర్ ఆప్టిక్ లేదా సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ల మాదిరిగా కాకుండా స్టార్లింక్లో లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుంది. ఇది చాలా మారుమూల ప్రాంతాల్లో నిరంతర ఇంటర్నెట్ కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం 4,000 స్టార్లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!ఇండియాలో స్టార్లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్వేర్కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!
బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో డెవలపర్ ఉద్యోగం కోసం 14 రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్ చేశానని ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. విప్రో క్యాంపస్లో ఉన్న ఫొటోలతో పాటు కంపెనీ లోగోను చూపిస్తూ అంతరా మండల్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్లో వివరాలు షేర్ చేశారు.ధ్రువీకరణ కోసం ఇన్స్టాగ్రామ్లో ఆమె తన ఆఫీస్ ఐడీ కార్డు కూడా పోస్ట్ చేశారు. ఉద్యోగం కోసం ఏకంగా 14 రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేసి కొలువు దక్కించుకున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి చివరకు విప్రోలో డెవలపర్ పొజిషన్కు ఎంపికయ్యాను. మీ నిద్రలో వచ్చేవి కలలు కావు.. మిమ్మల్ని నిద్రపోనివ్వనివే అసలైన కలలు’ అని ఆమె రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Antara Mandal (@_antara.mandal)ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచనఅయితే సామాజిక మాధ్యామాల్లో ఈ పోస్ట్పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఉద్యోగం కోసం ఇన్ని రౌండ్లు ఇంటర్వ్యూ చేయడంపై చాలా మంది వినియోగదారులు విమర్శించారు. కొందరు ఇందుకు భిన్నంగా రిప్లై ఇచ్చారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూ? అది కూడా డెవలపర్ రోల్ కోసమే.. చాలా ఫన్నీ యార్’ అని ఒక యూజర్ స్పందించారు.

డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచన
‘స్మార్ట్’ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక కలలను నిజం చేస్తుంది. కొందరు మంచి కారు కొనాలనుకుంటారు.. కొందరికి ఖరీదైనా ఫోన్ కావాలనిపిస్తుంది.. ఇంకొందరు కాలేజ్ ఫీజు కోసం పొదుపు చేస్తారు.. ఇలా ఒక్కొక్కరి ఆర్థిక అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే వారి ఆర్థిక లక్ష్యాలను సరైన మార్గంలో సెట్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు పడ్సాలిందేనని నిపుణులు చెబుతున్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే ముందు ‘స్మార్ట్(SMART)’ పద్ధతులను అవలంభించాలని సూచిస్తున్నారు. కొత్తగా ఉద్యోగం సాధించిన యువత కింద తెలిపిన పద్ధతులను పాటిస్తే తప్పకుండా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారని తెలుపుతున్నారు.స్మార్ట్ లక్ష్యాలుSMARTSpecificMeasurableAchievableRealisticTime-boundనిర్దిష్ట లక్ష్యాలు(Specific): మీకు ఆర్థికంగా ఏమి కావాలో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. ‘నేను డబ్బు ఆదా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పడానికి ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. ‘నేను దేని కోసం పొదుపు చేస్తున్నాను? నాకు ఎంత డబ్బు అవసరం?..’ అనే అంశాలపై స్పష్టత ఉండాలి.కొలవదగినదై ఉండాలి..(Measurable): మీ లక్ష్యాలను మీ ఆదాయంతో పోల్చి చూసుకొని ఖర్చులు, ఆదాపై పురోగతిని ట్రాక్ చేయాలి. తక్కువ జీతంల ఉన్నవారు ఆచరణ సాధ్యం కాని భారీ లక్ష్యాలను పెట్టుకోవడంలో అర్థం ఉండదు.సాధించేదిగా ఉండాలి..(Achievable): మీ ఆదాయం లేదా ఖర్చుల ఆధారంగా లెక్కలు పక్కాగా చూసుకుంటూ..లక్ష్యాన్ని సాధించాలి. లెక్కల విషయంలో నిజాయితీగా ఉండాలి. అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నిరాశకు దారితీస్తుంది.ఇదీ చదవండి: పరుగాపని పసిడి.. రూ.1లక్ష దాటినా మంట తగ్గలేదు!వాస్తవికతకు దగ్గరగా..(Realistic): మీ లక్ష్యం మీ ప్రస్తుత జీవిత పరిస్థితికి సరిపోయేలా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఆర్థిక లక్ష్యానికి కట్టుబడి ఉండేలా స్వీయ క్రమశిక్షణతో మెలగాలి.కాలపరిమితి(Time-bound): ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా కాలపరిమితిని నిర్ధారించుకోవాలి. డెడ్ లైన్ ఉంటే మరింత మెరుగ్గా పొదుపుపై దృష్టి సారించేందుకు వీలవుతుంది.
ఫ్యామిలీ

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

'మిరాకిల్ సీట్ 11A'..! కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే..?
విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.రీజన్ ఏంటంటే..'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్లు లేదా స్ట్రక్చరల్ రీన్ఫోర్స్మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం. (చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?)

25 మందికి ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇచ్చిన స్టార్టప్ కంపెనీ
చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు కార్లను గిఫ్టగా ఇచ్చింది. కంపెనీలు లాభాలను ఉద్యోగులను పంచి ఇచ్చింది. "నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు; అనుచరులు లేకుండా నాయకుడు లేడు" అని అజిలిసియం వ్యవస్థాపకుడు, CEO రాజ్ బాబు తెలిపారు.ఈ పరంపర కొనసాగుతుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఈ వార్త నెట్టింట సందడిగా మారింది. 25 మందికి ఎస్యూవీ కార్లు గిప్ట్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు ప్రముఖ అటానమస్ ఏజెంట్ ఏఐ భాగస్వామిగా ఉన్న అజిలిసియం సంస్థ ఒక గొప్ప ఆవిష్కరణకు చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంగా తమ సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ హ్యుందాయ్ క్రెటా కార్లను బహుమతిగా గురువారం అందజేసింది. సంస్థ 10వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రారంభం నుంచి ప్రపంచ స్థాయికి దాని ప్రయాణాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉద్యోగులను గుర్తించి సత్కరించారు. విలువైన సేవలకు గుర్తింపుగా చెన్నైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని అజిలిసియం ప్రధాన కార్యాలయంలో ఈ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిలిసియంలో తమ ఉద్యోగుల సేవలను ఎల్లప్పుడు గుర్తిస్తూనే ఉన్నామని చెప్పారు. సకాలంలో సేవలను అందించడంలో , దీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి అందించిన ఈ కార్లు బహుమతులు కావని, అవి శాశ్వత విశ్వాసం, భాగస్వామ్య ఉద్దేశం కలిసిన అద్భుత స్పూర్తిగా ఆయన వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే! 2014లో అజిలిసియంను రాజ్ బాబు స్థాపించారు .ఇది ఏజెంట్ AI భాగస్వామిగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు సేవలందిస్తున్నందున బూట్స్ట్రాప్గా ఎదుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇది 45శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)తో వృద్ధి చెంది 2027 నాటికి 100 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా!

Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా!
సువాసనలు వెదజల్లే అందమైన పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ అందానికి అందంగా, సుగంధంగా గులాబీలు, మల్లె, జాజి పూలు అమ్మాయిలకు మరీ ఇష్టం. పురాతన కాలం నుంచీ మల్లి, జాజి, గులాబీ పూల రెక్కలను సౌందర్య సాధనంగా కూడా వాడేవారు. శరీరానికి మెరుపు, ముఖ తేజస్సును పెంచుకునేందుకు గులాబీ రేకులకు, కాస్త తేనె, కూసింత పసుపు,ఇతర అనేక సుగంధ ద్రవ్యాలను కలిపి వాడతారు. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా గులాబీ బాలగా మన ముఖం మెరిసిపోవాలంటే ఇవిగో టిప్స్...గులాబీ రేకులు, నల్ల నువ్వులు, బార్లీ గింజలు సమ పాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని తగినన్ని రోజ్వాటర్ కలిపి, ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. లేదంటే సింపుల్గా పది గులాబీ రేకలను మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల రోజ్వాటర్, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై వలయాకారంగా రాస్తూ పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే.. చక్కటి మెరుపు వస్తుంది. అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్తో చర్మ రంధ్రాలు శుభ్రపడి ముఖ చర్మం కాంతివంత మవుతుంది. (Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..)ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. చర్మం తాజాగా మెరుస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. దీంతో మృతకణాలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. ఇదీ చదవండి: సంజయ్ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా..!మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ప్యాక చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నోట్ : పువ్వులు ఎంత అందమైనవి అయినా కొంతమందికి ఎలర్జీ కలిగించవచ్చు. అందుకే ఏదైనా ప్యాక్ వేసుకునే ముందు కొద్దిగా టెస్టింగ్ ప్యాక్లా వేసుకోవడం మర్చిపోవద్దు. ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

ప్రశ్నించినందుకు! ఈడ్చుకెళ్లి, బేడీలేసి..
అమెరికా రాజకీయాల్లో ఓ ఘటన కలకలం రేపింది. కాలిఫోర్నియా సెనేటర్, డెమొక్రటిక్ సభ్యుడు అలెక్స్ పాడిల్లా(Alex Padilla)తో భద్రతా సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బలవంతంగా లాక్కెళ్లి మరీ ఆయన్ని నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి బేడీలు వేశారు అధికారులు. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం లాస్ ఏంజెల్స్లో హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ప్రెస్మీట్ నిర్వహించారు. గత వారం రోజులుగా అక్కడ వలసదారుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎంత మంది వివరాలు సేకరించారో గణాంకాలను నోయెమ్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘నా పేరు అలెక్స్ పాడిలా. సెనేటర్ని. సెక్రటరీకి నాదో ప్రశ్న అంటూ మాట్లాడబోయారు. ఇంతలో..URGENT BREAKING: Democrat US Senator Alex Padilla was just thrown to the ground and arrested for trying to speak at a DHS Press Conference by Secretary Kristi Noem. This is Trump’s America. This is so incredibly pathetic. I am so sad for the state of this country. pic.twitter.com/yI9fKdoYoW— Brian Krassenstein (@krassenstein) June 12, 2025అక్కడున్నన సిబ్బందిని ఆయన్ని బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు, వాళ్ల మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం.. ఎఫ్బీఐ సిబ్బంది ఆయన్ని బలవంతంగా నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి.. బేడీలు వేసి అదుపులోకి తీసున్నారు. అయితే కాసేపటికే ఆయన్ని అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.డీహెచ్ఎస్ ఈ చర్యలను సమర్థించుకుంది. పాడిల్లాను దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిగా భావించి అధికారులు అలా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఆయన చర్యను పొలిటికల్ డ్రామాగా అభిర్ణించింది. అయితే కాసేపటికే ఆయన్ని విడుదల చేశామని, నోయెమ్-పాడిల్లా 15 నిమిషాలపాటు భేటీ అయ్యారని ప్రకటించింది. మరోవైపు ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో కూడా తమ సిబ్బంది చర్యను వెనకేసుకొచ్చారు. ఈ ఘటనపై అలెక్స్ పాడిల్లా స్పందించారు. ఒక సెనేటర్ విషయంలోనే ఇలా జరిగితే.. సాధారణ వర్గాల ప్రజలతో ఇంకెలా వ్యవహరిస్తారో? అని నిలదీశారాయన. వలసవాదులతో ఎలా వ్యవహరిస్తున్నారో.. ఈ దేశ పౌరులతోనూ అలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ పాలనలో ఇలాంటి దుర్మార్గాలు కూడా మొదలయ్యాయ వ్యాఖ్యానిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, కమలా హారిస్, సెనేట్లో మైనారిటీ నేత చుక్ షూమర్ తదితరులు ఈ ఘటనను ఖండించారు. ఇంకోవైపు రిపబ్లికన్ పార్టీలోనూ ఈ ఘటనపై పలువురి నుంచి ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించాల్సి ఉంది.

ఇజ్రాయెల్-ఇరాన్ రెండూ భారత్కు మిత్రదేశాలే, కానీ..
ఇరాన్ నుంచి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’(Operation Rising Lion) పేరిట సైనిక చర్యకు దిగింది. ప్రతిగా.. ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. అయితే తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత దేశం స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఇరు పక్షాలను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది.‘‘ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దాడులు ఎంతో ఆందోళనకరం. భారత్ ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది. రెండు మాకు మంచి మిత్రదేశాలే. సాధ్యమైన మద్దతు అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అందుకే దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేగానీ, ఉద్రిక్తతలను పెంచే చర్యలను ఏమాత్రం ప్రోత్సహించకూడదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.అంతకు ముందు.. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 200 యుద్ద విమానాలతో టెహ్రాన్ దాకా ఇజ్రాయెల్ బలగాలు దూసుకెళ్లాయి. ఇరాన్ అణు.. క్షిపణి స్థావరాలను నాశనం చేయడంతో పాటు ఆ దేశ మిలిటరీ చీఫ్, కొందరు అగ్ర సైంటిస్టులను హతమార్చాయి. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది.

ఆపరేషన్ రైజింగ్ లయన్.. రేడియేషన్ రిలీజ్ అయ్యిందా?
ఆపరేషన్ రైజింగ్ లయన్.. అప్డేట్స్అణు ధార్మికత విడుదలైందా?ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులుకీలక స్థావరాలను నాశనం చేసినట్లు ప్రకటించుకున్న ఇజ్రాయెల్అందులో నతాంజ్, ఇస్ఫహాన్, బుషెహర్ కేంద్రాలు కూడాదీంతో రేడియేషన్ విడుదలైందంటూ ప్రచారంఖండించిన యూఎన్ విభాగం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీఎలాంటి అణు ధార్మికత విడుదల కాలేదని ఐఏఈఏ స్పష్టీకరణఅణు కేంద్రాలకు పెద్దగా నష్టమూ వాటిల్లలేదని ప్రకటన ఒక్క విమానం తిరగట్లేదు!!ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో గంభీరంగా గగనతలంఇజ్రాయెల్, ఇరాన్తో పాటు జోర్డాన్ మీదుగా సంచరించని విమానం విమానాలు తిరకపోవడాన్ని ధృవీకరించిన ఫ్లైట్రాడర్24As has been the case during previous hostilities between Iran and Israel, Jordan has also closed its airspace to flights. NOTAM read JORDAN AIRSPACE CLSD DUE TO OPS REASONS pic.twitter.com/JIWDUVhJjk— Flightradar24 (@flightradar24) June 13, 2025 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్పై దాడి పూర్తి!ఇరాన్ వైమానిక దళంపై దాడి పూర్తైందని ప్రకటించిన ఇజ్రాయెల్ఇరాన్ పంపిన డ్రోన్లను నేలకూల్చినట్లు ప్రకటించిన ఐడీఎఫ్ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ముగ్గురు సైనికాధికారులు, పలువురు సైంటిస్టులు దుర్మరణంప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ఇరు దేశాల ఉద్రిక్తతలపై భారత్ ఆందోళనరెండు మిత్రదేశాలేనని స్పష్టీకరణఅయితే ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని కోరిన భారత్దౌత్య మార్గాన చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచనఅంతకు ముందు.. ఇరాన్లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్వంద డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్ సైన్యండ్రోన్ దాడుల్ని తిప్పికొడుతున్న ఇజ్రాయెల్ఇరాన్ అణు ముప్పు తొలగించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ఇరాన్ మిలిటరీ చీఫ్, ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్, మరికొందరు అగ్ర అణు సైంటిస్టుల దుర్మరణం ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం ఖమేనీగంటల వ్యవధిలోనే ఇరాన్ కౌంటర్ ఎటాక్స్ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడులతో అట్టుడుకున్న పశ్చిమాసియాఆపరేషన్ రైజింగ్ లయన్పై నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ దాడులుమళ్లీ రగులుతున్న పశ్చిమాసియాఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్ ముప్పును తిప్పి కొట్టేందుకే ఈ సైనిక చర్యఇరాన్ అణు కార్యక్రమానికి గుండె కాయ లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశాంనంతాజ్లోని అణు శుద్ధి కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేశాంటెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంకు కారణమైన కేంద్రాలను ధ్వంసం చేశాంఅగ్ర అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాంఇటీవలె అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను తయారు చేసిన ఇరాన్ఆ యురేనియంతో 9 అణు బాంబులు తయారు చేసే కెపాసిటీఇరాన్ను ఇప్పుడు ఆపకపోతే పెను ముప్పు తప్పదుముప్పును పూర్తిగా తొలగించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందన్న నెతన్యాహు 1980 తర్వాత..ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులుఇప్పటికే 30-40 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యంఅణు కేంద్రాలతో పాటు మిస్సైల్స్ స్థావరాలపైనా కొనసాగుతున్న దాడులు1980 ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ అణుస్థావరాలపై దాడి జరగడం ఇదేఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్ హోసెయిన్ సలామీ మృతిదాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ బాఘేరి, మరికొందరు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు సమాచారం #BREAKING Iran armed forces chief of staff Mohammad Bagheri killed in Israel attack, reports state TV pic.twitter.com/nlGlzZmLqT— AFP News Agency (@AFP) June 13, 2025ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం: అయతొల్లా ఖమేనీ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మిలిటరీ చీఫ్, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధిపతిఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకఠిన శిక్ష తప్పదని ఇజ్రాయెల్ను హెచ్చరించిన ఖమేనీ With this crime, the Zionist regime has prepared for itself a bitter, painful fate, which it will definitely see.— Khamenei.ir (@khamenei_ir) June 13, 2025 ఇరాన్ గగన తలం నుంచి విమానాల మళ్లింపుఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులుదాడుల నేపథ్యంలో పలు విమానాల దారి మళ్లింపుఎయిరిండియాకు చెందిన 16 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం. దాడులకు ముందు ట్రంప్ పోస్టు వైరల్ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించి అణు స్థావరాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్దీనికి కొన్ని గంటల ముందు ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన ట్రంప్ఇరాన్ గొప్ప దేశమే కావొచ్చు.. కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని వ్యాఖ్యఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభంఇరాన్పై సైనిక చర్య ప్రారంభించిన ఇజ్రాయెల్ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలుపెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుఇరాన్ అణు ముప్పును తొలగించేందుకేనని స్పష్టీకరణఇజ్రాయెల్ సైనిక చర్యతో తమకు సంబంధం లేదని ప్రకటించిన అమెరికా

ఇరాన్కు భారీ షాక్.. ఆర్మీ చీఫ్, అణు శాస్త్రవేత్తలు మృతి!
జెరూసలెం: పశ్చిమాసియాలో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. తమ వ్యతిరేక శక్తులకు సహకారం అందిస్తుందనే కోపంతో ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్పై ఒక్కసారిగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇక, ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ హెడ్క్వార్టర్స్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ మరణించినట్టు సమాచారం. ఈ మేరకు పలు కథనాలు పేర్కొన్నాయి. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్లోని ఇతర టాప్ అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. BREAKING:Iran confirms that Israel has killed:– Hossein Salami (the IRGC’s Commander-in-Chief)– Gholam-Ali Rashid (the Armed Forces Strategic Commander)– Dr. Tehranchi (The project supervisor in the Amad Plan to develop nuclear weapons and project supervisor for… pic.twitter.com/y7FoHHJ7Ga— Visegrád 24 (@visegrad24) June 13, 2025ఇరాన్పై కొద్ది రోజుల్లోనే దాడులు చేస్తామని ఇజ్రాయెల్ వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికా సాయం లేకుండానే ఈ దాడులు జరగనున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా దాడులు చేస్తామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజీర్జాదే తెలిపారు. దీంతోపాటు ఇజ్రాయెల్పై వందల బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తామని స్పష్టంచేశారు.🚨 JUST IN: The Israeli military has KlLLED Iran’s Military Chief of Staff in a targeted strike, per FoxNetanyahu says Iran has enriched enough Uranium for nine atomic bombs. pic.twitter.com/VSU5t87iGZ— Nick Sortor (@nicksortor) June 13, 2025 అమెరికా అప్రమత్తంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా నుంచి తమ సైనిక, ఇతర సిబ్బందిని తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని సిబ్బందిని తగ్గించాలని సూచించారు. బహ్రెయిన్, కువైట్లలోనూ అత్యవసరం కాని సిబ్బందిని తగ్గించాలని ఆదేశించారు. వారంతా ఆయా దేశాలను వీడేందుకు సాయం చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
జాతీయం

Air India Crash: నాడు ‘ఎంపరర్ అశోక’.. నేడు ‘డ్రీమ్ లైనర్’.. అదే విషాదం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారి విషాద గాథలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఈ ప్రమాదంతో ముడిపడిన అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 1978 నాటి ‘ఎంపరర్ అశోక’ విషాదాన్ని పోలివుందనే కథనాలు తెరమీదకు వస్తున్నాయి. నాడుముంబైకి మూడు కి.మీ దూరంలో జరిగిన ‘ఎంపరర్ అశోక’ ప్రమాదంలో విమానంలోని 213 మంది కన్నుమూశారు. ఈ రెండు ఘటనల్లో విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే అవి కూలిపోయాయి.1978, నూతన సంవత్సరం తొలిరోజున..గురువారం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నివాస భవనాలపై ఎయిర్ ఇండియా విమానం ఏI 171, బోయింగ్ 787-8 ‘డ్రీమ్లైనర్’ కూలిపోయింది. ఈ ప్రమాదం దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ముంబై నుండి అరేబియా సముద్రంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం ఏI 855, ‘ఎంపరర్ అశోక’ఘటనను పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. 1978, జనవరి 1.. నూతన సంవత్సరం తొలిరోజున ఎయిర్ ఇండియా మొట్టమొదటి బోయింగ్ 747 అయిన ‘ఎంపరర్ అశోక’ ముంబైలోని శాంటా క్రజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం) నుండి దుబాయ్కి బయలుదేరింది. 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, ఎనిమిది వేల అడుగుల ఎత్తునకు చేరేందుకు అనుమతి లభించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం సాగిస్తోంది. అయితే ఇంతలో అత్యంత ముఖ్యమైన యాటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్ (ఏడీఐ)పనిచేయలేదు.నాడు సముద్రంలో.. నేడు జనావాసాల్లో..దాదాపు 18 వేల విమాన గంటలు నడిపిన కెప్టెన్, మదన్ లాల్ కుకర్(51) వెంటనే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విమానంలో మాజీ భారత వైమానిక దళ కమాండర్ ఇందు విర్మాణి(43) కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాలోని అత్యంత సీనియర్ ఇంజనీర్లలో వారు ఒకరు. అలాగే అనుభవజ్ఞులైన ఫ్లైట్ ఇంజనీర్ ఆల్ఫ్రెడో ఫారియాకూడా విమానంలో ఉన్నారు. విమానం రాత్రిపూట అరేబియా సముద్రం మీదుగా ఉన్నందున, దృశ్య హోరిజోన్ సూచన లేకపోవడంతో కెప్టెన్ కుకర్ ఎడమ నియంత్రణ ఇన్పుట్లను ఉపయోగించి కుడి ఒడ్డును సరిచేశారు. విమానం 108 డిగ్రీల కోణంలో ఎడమవైపుకు తిరుగుతూనే దాదాపు 2,000 అడుగుల నుండి నిటారుగా దాదాపు 35-40 డిగ్రీల కోణంలో కిందకు పడిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 213 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇది జరిగిన 47 ఏళ్ల తర్వాత మొన్నటి జూన్ 12న మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. ‘ఎంపరర్ అశోక’ మాదిరిగానే ‘డ్రీమ్లైనర్’ కూడా విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోయింది. అయితే ఈసారి జనావాస ప్రాంతంలోకూలిపోయి, పెను విషాదాన్ని మిగిల్చింది.ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..

బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలుశిక్ష.. ఐదు లక్షల జరిమానా
సాక్షి, చెన్నై: తమిళనాడులో కీలక బిల్లులకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం ఆమోదం తెలిపారు. కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేస్తున్న నేపథ్యంలో బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష విధించే బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అలాగే, బయో వ్యర్థాలకు సంబంధించిన బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. వివరాల ప్రకారం.. తమిళనాడులో కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్టేందుకు స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసినా, రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు.కాగా, బలవంతంగా అప్పు వసూలు చేసి రుణగ్రహీత బలవన్మరణానికి పాల్పడితే సదరు రుణసంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్లు భావించేలా, బెయిల్ లభించని విధంగా జైలుశిక్ష విధించేలా బిల్లును రూపొందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం, బిల్లును గవర్నర్ ఆర్.ఎన్.రవికి పంపించగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు.బయో మెడికల్ వ్యర్థాలను డంపింగ్ చేస్తే జైలుకే..అదేవిధంగా, తమిళనాడులో బయోమెడికల్ వ్యర్థాలను డంప్ చేసినందుకు విచారణ లేకుండా ప్రత్యక్ష జైలు శిక్ష విధించే బిల్లును మార్చి 24న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మాజీ న్యాయ మంత్రి రఘుపతి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 29న దీని చర్చ జరిపిన తరువాత ఆమోదించారు. అనంతరం, గవర్నర్కు పంపించడంతో.. ఈ బిల్లుకు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా బయో మెడికల్ వ్యర్థాలను సేకరించిన లేదా పొరుగు రాష్ట్రాల నుండి తమిళనాడులో వైద్య వ్యర్థాలను డంప్ చేసిన ఎవరైనా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నియమాలను ఉల్లంఘించినట్లు పరిగణించబడతారు. దీంతో, విచారణ లేకుండానే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రపంచం యావత్తూ సంతాపం తెలుపుతోంది. ఈ ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఒక్కో బాధిత కుటుంబానిది ఒక్కో విషాద గాథ. వీటిని వింటున్నప్పుడు ఎవరికైనా కళ్లు చమర్చరకమానవు. ఎయిర్ ఇండియా విమానం ఏI 171 ప్రమాదంలో మరణించిన 242 మందిలో 37 ఏళ్ల జావేద్, అతని భార్య మరియం, వారి ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.తల్లితో పండుగ చేసుకునేందుకు వచ్చి..15 ఏళ్ల తరువాత ఈద్ అల్-అధా పండుగను తమ తల్లితో కలిసి చేసుకునేందుకు జావేద్ నలుగురు తోబుట్టువులు తమ కుటుంబాలతో సహా అహ్మదాబాద్కు తరలివచ్చారు. ఈ విధంగా కుటుంబంలోని అందరూ కలుసుకునేందుకు వారు ఏళ్ల తరబడి ఎదురు చూశారు. అయితే ఈ విమాన ప్రమాదం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని వారు ఆ సమయంలో గ్రహించలేకపోయారు. ఈ ప్రమాదంలో జావేద్ కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయిందనే సంగతిని హృద్రోగంతో బాధపడుతూ, త్వరలో చికిత్స చేయించుకోబోతున్న అతని తల్లికి చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.దీనికి ఎవరు బాధ్యులు?తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి జావేద్ సోదరుడు ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ ‘అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో బాధితులను గుర్తించేందుకు వారి నమూనాలను సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు. మా సోదరుడు సంతోషంగా వేడుకలు చేసుకునేందుకు అహ్మదాబాద్ వచ్చాడు. ఇప్పుడు మేము నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయాం. దీనికి ఎవరు బాధ్యులు? ఈ ప్రమాదంలో 240 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. విమానం బయలుదేరిన కొద్ది సెకెన్లకే అది కూలిపోయింది. ఇది ఎలా జరిగింది? 11 ఏళ్ల క్రితం చదువుకునేందుకు యూకే వెళ్లిన నా సోదరుడు మరియంను వివాహం చేసుకుని, బ్రిటిష్ పౌరునిగా మారాడు.‘అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్’మా అమ్మతో ఈద్ వేడుక చేసుకునేందుకు జావేద్ ఇక్కడికి వచ్చాడు. అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్ జరగాల్సివుంది. మేమంతా గత 15 ఏళ్లుగా ఎప్పుడూ కలిసివుండలేదు. మా అమ్మకి ఇంకా ఆ విషయం చెప్పలేదు. జావేద్ను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పాం. మా కుటుంబం ఇద్దరు చిన్నారులను కూడా కోల్పోయింది. ఇది మాకు తీరని విషాదం. గురువారం రాత్రి జావేద్ మృతదేహాన్ని గుర్తించేందుకు రక్త నమూనాను ఇచ్చాను. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే మా సోదరుణ్ణి గుర్తించగలుగుతాం. ఆదివారం నాటికి రిపోర్టు వస్తుందని చెబుతున్నారు’ అని ఇంతియాజ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు..

పరిహార భారం ఎయిర్ ఇండియాదే
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయింది. విమానం ఖరీదు, బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. విమానానికి బీమా సదుపాయం ఎలాగూ ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే. అంటే ఇక్కడ ఎయిర్ ఇండియాదే. ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం.. విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే. అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ.120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్డీఆర్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) గతంలోనే ఖరారు చేసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం రూ.435 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్టప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాక ముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్డీఆర్లు(రూ.18 లక్షలు) అడ్వాన్స్గా చెల్లించాలి. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిసింది. విమానానికి బీమా, బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ రూ.1,000 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది.
ఎన్ఆర్ఐ

బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

న్యూయార్క్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ వేడుకలతో పాటు బాలోత్సవ్ ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు మంచి ఏర్పాట్లు చేయటంలో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరపున బహుమతులు అందించారు.కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: న్యూజిలాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్

న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరం లో “న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ “ ఆధ్వర్యం లో జై తెలంగాణ నినాదాలతో “తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక”లను ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.అసోసియేషన్ అధ్యక్షులు “కోడూరి చంద్రశేఖర్” అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా “Dr.మోహన్ కుమార్ సేథి” ముఖ్య అతిధి గా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారుఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశానికి సుదూరాన ఉన్నప్పటికీ న్యూజిలాండ్ నేల మీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పి భావి తరాలకి అందించడానికి సహృద్భహ వాతావరణాన్ని కల్పించి సహకరిస్తున్న న్యూజీలాండ్ ప్రభుత్వానికి , దేశ వాసులైన మౌరి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు అలాగే ఈ మధ్య నూతనంగా ఆక్లాండ్ నగరం లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి కాన్సులేట్ సేవలని అందిస్తున్నందుకు నిండు సభలో ప్రత్యేక తీర్మానం ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సభలో కాన్సులేట్ జనరల్ తో పాటు అసోసియేషన్ కి విశేష సేవలు అందించిన గత కార్యవర్గ సభ్యులని సన్మానించి మెమెంటోస్ అందించడం జరిగిందిప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమం లో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు “పట్లోళ్ల నరేందర్ రెడ్డి,మేకల ప్రసన్న కుమార్ తో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన శివ కిలారి,సత్యనారాయణ తట్టల, రాజేంద్ర ధరణికోట, ప్రదీప్ మేడసాని, రోహిత్ తమ్మినేని, లెజెండరీ మార్టుగేజ్ ప్రతినిధులు, దయానంద్ కటకం,జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల,విజేత యాచమనేని, శైలజ బాలకుల్ల, మధు ఎర్ర, శశికాంత్ గున్నల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, వర్ష పట్లోళ్ల, స్వాతి గుడిమెళ్ళ,కిరణ్మయి పద్మ,విశ్వనాథ్ అవిటి,సందీప్ నాగుల,పవనకుమార్ చారుకొండ,సలీం మహమ్మద్,హరీష్ గోపాల్,మనోహర్ కన్నం,కిరణ్ కుమార్ కొమ్ముల,రమేష్ రెడ్డి రామిండ్ల,శ్రీరామ్ విజయ్,శ్రీనివాస్ గాజుల,ప్రమోద్ ఇరుగు,అనిల్ మెరుగు,రమేష్ ఆడెపు,రవి కుమార్ వట్టం,విజయకుమార్ రెడ్డి చింతిరెడ్డి తదితరుల తో పాటు పెద్దఎత్తున తెలంగాణ ప్రజానీకం హాజరయ్యారు.
క్రైమ్

బ్యాంకింగ్ మోసాలు @ రూ.36,014 కోట్లు
సాక్షి, అమరావతి: రుణ ఖాతాలు, డిజిటల్ పేమెంట్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ నేరాల విలువ 2023–24తో పోల్చిచూస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ మోసాల విలువ రూ.12,230 కోట్ల నుంచి రూ.36,014 కోట్లకు ఎగసింది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఇదే కాలంలో నేరాల సంఖ్య మాత్రం 36,060 నుంచి 23,953కు తగ్గింది. ఫ్రాడ్ క్లాసిఫికేషన్కు సంబంధించి 2023 మార్చి 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, గత సంవత్సరాల్లో నివేదించిన రూ.18,674 కోట్ల విలువైన 122 కేసులను తిరిగి తాజా నేరాలుగా నమోదు చేయడం వల్ల మొత్తం నేరాల విలువ పెరిగిందని ఆర్బీఐ నివేదిక వివరించడం గమనార్హం. మొత్తం నేరాల సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులకు సంబంధించినవి 60 శాతం ఉన్నాయి. కానీ విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకులవి 71 శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..» నేరాల సంఖ్యలో ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల (కార్డ్, ఇంటర్నెట్) కేటగిరీలో చోటుచేసుకున్నాయి. అయితే విలువ పరంగా చూస్తే లోన్ లేదా అడ్వాన్స్ ఖాతాల్లోనే ఎక్కువ నేరాలు జరిగాయి. » ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువగా కార్డ్, ఇంటర్నెట్ నేరాలు జరగ్గా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్ పోర్టుఫోలియోకి సంబంధించిన నేరాలు ఎక్కువ ఉన్నాయి. » మొత్తం కేసుల్లో లోన్ సంబంధిత నేరాలు 33 శాతానికి పైగా ఉండగా, మొత్తం నేరాల విలువలో 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి.» 2024–25 చివరిలో కార్డ్, ఇంటర్నెట్ నేరాల కేటగిరీలో 13,516 కేసులు నమోదయ్యాయి. ఇవి మొత్తం 23,953 నేరాల్లో 56.5 శాతం.» రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఉన్న కేసుల వివరాలనే నివేదికలో పొందుపరచడం జరిగింది. » సంస్థలు తమ నివేదికలను సవరిస్తే ఈ డేటా మారే అవకాశం కూడా ఉంది. » నివేదికలో పేర్కొన్న మొత్తాన్ని ‘కోల్పోయిన నష్టం’గా పరిగణించడం సరికాదు. రికవరీల ఆధారంగా నష్టం తగ్గవచ్చు.భద్రత కోసం కొత్త డొమెయిన్లు..డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న నేరాలపై పోరాటానికి ఒక వినూత్న ప్రయత్నంగా భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా ‘..bank.in’, నాన్–బ్యాంకుల కోసం ‘fin.in’ అనే ఇంటర్నెట్ డొమెయిన్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ చేసింది. ఈ ప్రయత్నం డిజిటల్ బ్యాంకింగ్పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది, సైబర్ మోసాలను గుర్తించడంలో అలాగే ఫిషింగ్ వంటి ప్రమాదకరమైన కార్యకలాపాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్బీటీ) ఈ డొమెయిన్లకు ప్రత్యేక రిజిస్ట్రార్గా వ్యవహరిస్తుందని, బ్యాంకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని నివేదిక తెలిపింది.

డ్రైవర్ నిర్లక్ష్యానికి ఐదుగురు బలి
సాక్షి బెంగళూరు/కార్వేటినగరం: కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు మృతిచెందారు. ఏపీఎస్ ఆర్టీసీ చిత్తూరు–2 డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు గురువారం రాత్రి తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. బస్సు శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు శివారులోని హోసకోటె–కోలారు జాతీయ రహదారిపై గొట్టిపుర గేట్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. బస్సు అదుపు తప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో 18 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతి మారేడుపల్లె గ్రామానికి విశ్వనాథరెడ్డి భార్య శారద(40), వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కె.కేశవులురెడ్డి(45), అతని తమ్ముడు జనార్దన్రెడ్డి కుమారుడు 45 రోజుల చిన్నారి, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ గ్రామానికి చెందిన తులసి (22), తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన హరిబాబు, రోహిణి దంపతుల కుమార్తె ప్రణతి(4)గా గుర్తించారు. ప్రణతి తండ్రి బెంగళూరులో ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. క్షతగాత్రులను సిలికాన్ సిటీ, ఎంవీజే ఆస్పత్రుల్లో చేర్పిం చి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోపాటు అతి వేగంతో లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయతి్నంచడమే ఈ ప్రమాదానికి కారణమని హోసకోటె పోలీసులు తెలిపారు. బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ సీకే బాబా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

బాలికపై అఘాయిత్యం
రాజమహేంద్రవరం సిటీ: ప్రేమ పేరుతో వంచించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బాలికను గర్భిణిని చేసిన యువకుడు చివరకు మోసం చేసిన ఘటన రాజమహేంద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికతో కలసి రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి గురువారం మీడియాతో మాట్లాడారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామానికి చెందిన బాలికను మోరంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు పులపర్తి సత్యదేవ్ ప్రేమించానంటూ రెండేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ బాలికను లోబరచుకున్నాడు. గత ఏడాది నవంబర్లో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ బాలిక 6వ నెల గర్భిణిగా నిర్ధారణ అయ్యింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్ వద్దకు వెళ్లి తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామి మాలలో ఉన్నానని, మాల తీసేలోగా బాలికకు అబార్షన్ చేయించాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరంలోని సీఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్ 17న ఆ బాలికకు అబార్షన్ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్ నిరాకరిస్తున్నాడు. కులం తక్కువ దానివంటూ దూషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలిక, తల్లిదండ్రులు బొమ్మూరు సీఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితురాలికి చట్ట ప్రకారం న్యాయం జరగాలని కోరారు. బాలికకు అబార్షన్ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ గాండ్ల, తెలుకుల సంఘం అధ్యక్షురాలు సంకిస భవానీప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి పాల్గొన్నారు.బాలికపై లైంగిక దాడిగర్భం దాల్చడంతో తల్లి ఫిర్యాదునాగలాపురం: తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో 15 ఏళ్ల బాలికపై రెండునెలల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తిపై గురువారం పోక్సో కేసు నమోదు చేసినట్లు నిండ్ర సీఐ రవీంద్ర తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ప్రకారం.. పిచ్చాటూరు మండలం, కారూరు దళితవాడకు చెందిన శేఖర్ (55) అనే వ్యక్తి రెండు నెలల క్రితం 15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అనంతరం.. బాలిక గర్భం దాల్చడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. పిచ్చాటూరు పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండుకు తరలించినట్లు పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేశ్వర్ తెలిపారు.

పిడుగుపాటుకు ఆరుగురు మృతి
సాక్షి, ఆదిలాబాద్: మూడుచోట్ల పిడుగులు పడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా ఆదివాసీలే. గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన రైతు పెందూర్ మాధవరావు తన కుటుంబసభ్యులు, 14 మంది కూలీలతో కలిసి చేనులో గురువారం మొక్కజొన్న విత్తనాలు విత్తుతున్నారు. మధ్యాహ్న భోజన సమయం తర్వాత మళ్లీ అదేపనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో వారంతా సమీపంలోని ఓ పందిరి కిందకు చేరారు. అక్కడే ఓ టేకు చెట్టు ఉంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో దానికి దగ్గరలోనే ఉన్న పెందూర్ మాధవరావు(45), ఆయన కూతురు పెందూర్ సుజాత(16), సిడం రంభబాయి(40), మంగం భీమ్బాయి (45) అక్కడికక్కడే మృతిచెందారు. మాధవరావు భార్య, ఇద్దరు కుమారులు, బంధువులు 10 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని పీహెచ్సీలకు, మరికొందరిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. బేల మండల పరిధిలోని సాంగిడి గ్రామంలో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగు పడి గెడం నందిని(30), సోన్కాస్ గ్రామంలో పొలం పనులు చేస్తుండగా కోవ సునీత(40) అక్కడికక్కడే మృతిచెందారు. ఉట్నూర్ మండలం కుమ్మరితండాకు చెందిన ధర్మరాజు, కృష్ణబాయి, నిర్మల చేను పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.చేను సమీపంలోని చెట్టుపై పిడుగు పడడంతో ముగ్గురూ గాయపడ్డారు. వీరిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు.