Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Cabinet Expansion Effect Political Twist In Telangana Congress1
కాంగ్రెస్‌లో ‘కేబినెట్‌ బెర్త్‌’ హీట్‌.. ముగ్గురు అసంతృప్తి నేతల దారెటు?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు.. హైకమాండ్‌ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు. కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో పార్టీ సీనియర్‌ నేతలు బిజీ అయ్యారు.తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు కేబినెట్‌లో స్థానం ఉంటుందని ఆశించారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకులను బుజ్జగించేందుకు సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు.ఇద్దరు నేతలు ఎక్కడ?తాజాగా సుదర్శన్‌ రెడ్డి ఇంటికి తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ చేరుకున్నారు. మరో సీనియర్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావుతో కూడా పార్టీ నేతలు భేటీ కానున్నారు. అయితే, ప్రేమ్‌సాగర్‌ రావు, రాజగోపాల్‌ రెడ్డి మాత్రం అందుబాటులో లేకపోవడంతో హస్తం పార్టీలో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఇక, మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు స్పష్టం చేశారు. మరో నేత బీర్ల ఐలయ్య సైతం.. హైకమాండ్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. రోజంతా ఉత్కంఠ..రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం శనివారం రోజంతా చర్చనీయాంశమైంది. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని చర్చల మధ్య అడ్లూరి స్థానం దక్కింది. ఇక, రెడ్డి సామాజికవర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ మొదటి నుంచి జరిగింది. ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత పి.సుదర్శన్‌ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి అనే చర్చ ఎక్కడా జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు స్థానాలు పూర్తి అయ్యాయి.

Telangana New Ministers Take Oath Ceremony Updates2
రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ (మక్తల్‌), గడ్డం వివేక్‌ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్‌(ధర్మపురి) ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఎవరికి ఏ శాఖ?కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే దానిపై చర్చ నడుస్తుంది. ఇవాళ సాయంత్రానికి మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర హోం, మున్సిపల్‌, విద్య, సంక్షేమ శాఖలు ఉండగా.. ఆ శాఖలే కొత్త మంత్రులకు కేటాయించనున్నారు. 👉వివేక్‌ రాజకీయ ప్రస్థానంకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్‌ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయనకు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానాలు వచ్చాయి.అధిష్టానం తొలి విడతలోనే పదవీ ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణలు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమోదం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మరో వైపు జిల్లా నుంచే తన సోదరుడు వినోద్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధిష్టానం వివేక్‌ పేరు ఖరారు చేసింది👉శ్రీహరి రాజకీయ ప్రస్థానంకర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్‌గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు.ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్రను మక్తల్‌ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది.👉లక్ష్మణ్ రాజకీయ ప్రస్థానంధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

Teachers Besiege Visakhapatnam Deo Office3
మంత్రి లోకేష్‌ మోసం.. తిరగబడ్డ టీచర్లు

సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్‌పై ఉపాధ్యాయులు తిరగబడ్డారు. లోకేష్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయలు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాల ముట్టడిని టీచర్లు చేపట్టారు. విశాఖ డీఈవో కార్యాలయం ముట్టడికి కదం తొక్కారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎస్జీటీలకు మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ టీచర్లు నినాదాలు చేశారు. డీఈవో కార్యాలయం ముందు మహిళా టీచర్లు బైఠాయించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది.టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఎస్జీటీల బదిలీలను ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా చేపడతామని చెప్పి.. ఆన్‌లైన్‌ విధానం అమలు చేయడాన్ని తప్పుబడుతూ ఆ సంఘాలు ఆందోళన చేపట్టాయి. శనివారం కౌన్సెలింగ్‌ జరిగిన ఎంఈఓ కార్యాలయాల ఎదుట నిరసనలకు దిగారు. ఆదివారం కూడా అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి.ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు, విద్యాశాఖ మంత్రికి లేఖలు రాసినా ఎలాంటి సమాధానం ఇవ్వనందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేపడుతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి గతేడాది సెపె్టంబర్‌ నుంచి వారం వారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బదిలీలు, పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణపై విజ్ఞప్తులు తీసుకున్నారు.ఈ క్రమంలో ఈసారి ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేస్తున్నామని, ఏటా ఈ చట్ట ప్రకారమే ఆన్‌లైన్‌ బదిలీలు చేపడతామని అధికారులు తెలిపారు. అయితే, సంఖ్యాపరంగా అత్యధిక ప్రాథమిక పాఠశాలలు ఉండటంతో వాటిలో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఎక్కువ ఆప్షన్స్‌ ఇవ్వాల్సి ఉన్నందున ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎస్జీటీలకు మాన్యువల్‌ విధానంలో కౌన్సెలింగ్‌ చేపట్టి బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అందుకు అధికారులు అంగీకరించినా మార్చిలో చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో మాత్రం ఉపాధ్యాయులందరికీ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.అయినప్పటికీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని అధికారులు సంఘాలకు హామీ ఇచ్చారు. నాడు తాత్కాలికంగా సమస్య పరిష్కారమైందని భావించినా.. మే నెలల విడుదల చేసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో తిరిగి ఆన్‌లైన్‌ విధానం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో గత నెల 16న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈవో కార్యాలయాల ముట్టడి తలపెట్టింది. మరుసటి రోజు ఎస్జీటీల మాన్యువల్‌ కౌన్సెలింగ్‌కు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది. తాజాగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ మాత్రమే ఉంటుందని, అందరూ ఎంఈవో కార్యాలయాలకు వచ్చి ఆప్షన్స్‌ పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళనకు దిగాయి.

BRS KCR Sad Over Maganti Gopinath Tribute4
మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మాగంటి మృతదేహానికి నివాళి అర్పించేందుకు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెళ్లారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కాసేపటి క్రితమే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. మాగంటి గోపీనాథ్‌ ఇంటికి చేరుకున్నారు. అనంతరం, మాగంటి భౌతికకాయం వద్ద పుచ్చగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఈ క్రమంలో కేసీఆర్‌ భావోద్వేగానికి గురైన పెద్దాయన కన్నీరు పెట్టుకున్నారు. మాగంటి మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు. అనంతరం, మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాగంటి కుమారుడిని అప్యాయంగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు.

Israel Claims to Have Found Hamas Tunnel5
హమాస్‌ రహస్య సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్‌

జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్‌ రహస్య స్థావరాన్ని గుర్తించాయి. గాజా ఆస్పత్రి కింద హమాస్ టన్నెల్ నెట్‌వర్క్‌ను కొనుగొన్నట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా సాగించే హమాస్ కార్యకలాపాలకు ఈ సొరంగం కమాండ్ సెంటర్‌గా ఉపయోగిస్తుంటారని ఇజ్రాయెట్‌ తెలిపింది. అలాగే ఆయుధాలు, నిఘా సామగ్రితో కూడిన భూగర్భ మౌలిక సదుపాయాలు కలిగివున్న సొరంగపు ఫుటేజీని విడుదల చేసింది.గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒక కీలక ఆస్పత్రి కింద ఈ సొరంగం ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగం సీనియర్ హమాస్ నేతల కమాండ్ అండ్ కంట్రోల్‌కు కేంద్రంగా ఉంటూ, ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి ఉపయోగపడింది. ⭕️UNCOVERED: An underground tunnel route beneath the European Hospital in Khan Yunis, Gaza. In a special, targeted operation, IDF soldiers located an underground tunnel route containing numerous findings such as command and control rooms, weapons, and additional intelligence… pic.twitter.com/7bPM5ozHN8— Israel Defense Forces (@IDF) June 7, 2025ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలాని బ్రిగేడ్, యాహలోమ్ యూనిట్, ప్రత్యేక దళాలు పాల్గొన్న ఆపరేషన్ సమయంలో ఈ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్‌ తెలిపింది. హమాస్ తన ఉగ్రవాద ప్రయోజనాల కోసం గాజాలోని ఆస్పత్రులపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. 2023లో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి కింద కింద ఒక హమాస్ సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడీఎఫ్‌ గతంలో పేర్కొంది. అయితే యుద్ధంలో అది పూర్తిగా ధ్వంసమైంది. ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్‌ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది?

Anil Ambani Gets Big Win NCLAT Halts Reliance Infra Insolvency6
అనిల్‌ అంబానీకి భారీ ఉపశమనం

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దివాలా చర్యలను నిలిపివేస్తూ తాజాగా అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు జారీ చేసింది. తమ అప్పీల్‌ మేరకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ రద్దు చేసినట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశిస్తూ ఇంతక్రితం ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ సీపీ(ఐబీ)/624(ఎంబీ)2022 కేసులో 2025 మే 30న జారీ చేసిన ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ రద్దు చేసినట్లు పేర్కొంది. తమకు సౌర విద్యుత్‌ సరఫరా చేసిన ధుర్సర్‌ సోలార్‌ పవర్‌కి చెల్లింపులు జరపలేదంటూ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాపై ఆరోపణలు ఉన్నాయి. ధుర్సర్‌కి సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరించిన ఐడీబీఐ ట్రస్టీషిప్‌ సర్వీసెస్‌ సంస్థ 2022 ఏప్రిల్‌లో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాపై కార్పొరేట్‌ దివాలా పరిష్కార చర్యలు తీసుకోవాలంటూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 2018 ఆగస్టు 28 నుంచి అసలు రూ. 88.68 కోట్లతో పాటు వడ్డీ కూడా బాకీ పడిందని వివరించింది.దీనితో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాపై ఎన్‌సీఎల్‌టీ దివాలా చర్యలకు ఆదేశించింది. అయితే, ధుర్సర్‌ సోలార్‌ పవర్‌కు పూర్తిస్థాయిలో రూ. 92.68 కోట్లు చెల్లించేసినందున దివాలా చట్ట చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది. ఇంధన కొనుగోలు ఒప్పందంలో భాగంగా టారిఫ్‌లకింద సొమ్ము చెల్లించినట్లు తెలియజేసింది.

Balakrishna Lakshmi Narasimha Re Release Song Goes Controversy7
బాలకృష్ణ బర్త్‌డే సందేశం... కొత్త సీసాలో పాత సారా కలిపాడుగా!

ఆధునిక టెక్నాలజీతో బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో తీసిన సినిమాలను కలర్‌ లోకి తీసుసుకురావడం, ఆ తరువాత పాత సినిమాలను 4కెలో లో రీరిలీజ్‌ చేయడం వంటి మార్పుల్ని ఇప్పటికే మనకు పరిచయం చేసిన టాలీవుడ్‌ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. అదే పాత సినిమాలో కొత్త పాటల్ని కలపడం. పాత విజువల్స్‌కు కొత్త పాటని జత చేసే ట్రెండ్‌ కు నాంది పలికింది సినీనటుడు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా సినిమా. ప్రస్తుతం రీ రిలీజ్‌ సినిమాలకు కాసుల వర్షం కురుస్తుండడంతో మొత్తం టాలీవుడ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌లోకి పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లి అప్పట్లో హిట్‌ అయిన చిత్రాల్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు తెచ్చే క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 21 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహా సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు. జూన్‌ 8 న ఈ సినిమా రీరిలీజ్‌ కు రెడీ అయ్యింది. బాలకృష్ణ హీరోగా జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహా. దీనిని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ నిర్మించారు. ఈ చిత్రంలో ఆసిన్‌ హీరోయిన్‌ గా నటించింది. 21ఏళ్ల క్రితం 2004 లో రిలీజ్‌ అయిన ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రీరిలీజ్‌ సినిమా వస్తుంది అంటే కొత్తగా ట్రైలర్‌ ను రూపొందించి విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఒక కొత్త పాటనే రూపొందించారు. మొదట లక్ష్మీ నరసింహా సినిమాలోనే బాలకృష్ణ క్యారెక్టర్‌ ను రివీల్‌ చేసే సాంగ్‌ ఒకటి రూపొందించారట. అయితే షూటింగ్‌ కూడా చేసినా ఆ సాంగ్‌ ని వాడలేదట. దీంతో ఆ పాత బాలయ్య డ్యాన్స్‌ విజువల్స్‌ను కొత్తగా పాట రాయించి మరీ ఆ విజువల్స్‌కు జత చేశారట.తాజాగా ఈ కొత్త సాంగ్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు. మంచినీళ్లు తాగినోడు మామూలోడు, మజ్జిగ తాగినోడు మంచోడు.. మందేసినోడు ఘనుడు.. మ్యాన్షన్‌ హౌస్‌ వేసినోడు మహానుభావుడు అంటూ సాగే ఈ పాటనుచంద్రబోస్‌ రాయగా, స్వరాగ్‌ కీర్తన్‌ ఆలపించగా, భీమ్స్‌ నేపధ్య సంగీతం అందించారు. పాట చివర్లో జై బాలయ్య జైజై బాలయ్య అంటూ బాలకృష్ణకు యధాశక్తి భజన చేశారు బెల్లంకొండ. సినిమా రీరిలీజ్‌ రోజు కలెక్షన్స్‌ కోసం రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు..అలాగే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాత సినిమాకు కొత్త ఆకర్షణలను జోడించడం కూడా తప్పు కాదు. కానీ తాజాగా జోడించిన పాటలో వాక్యాలే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ వైపు మద్యం ప్రకటనల్లో, ప్రచారాల్లో సినిమా తారలు పాల్గొనడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏకంగా మందు తాగితేనే ఘనుడు, మ్యాన్షన్‌ హౌస్‌ తాగితేనే మహానుభావుడు..వాడిని ఎవడూ ఆపలేడు... అంటూ తన పాటల ద్వారా చెప్పడం అంటే... ఒక ప్రజా ప్రతినిధి యువతకు ఏం సందేశం ఇస్తున్నట్టు? పైగా ఆయన పుట్టిన రోజు నాడు.. అభిమానులకు ఇవ్వాల్సిన సందేశం ఇదేనా?

BRS MLA Maganti Gopinath Passed Away In AIG Hospital8
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్‌(62) మృతిచెందారు. అనారోగ్యం కారణంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్‌ ఆదివారం ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మాగంటి గోపీనాథ్‌ 1963 జూన్‌ 2న జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు. గోపినాథ్‌కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యవత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌పై 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని రుచిచూశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్‌ నుంచే పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌పై గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్‌ తెలంగాణే శ్వాసగా పనిచేసే బీఆర్‌ఎస్‌ జెండాను రెపరెపలాడించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగారు.

Navjot Singh Sidhu names Rohit Sharma as captain of his IPL 2025 team of the tournament9
ఐపీఎల్‌-2025 బెస్ట్ టీమ్ ప్ర‌క‌ట‌న.. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌

ఐపీఎల్‌-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రకటించాడు. తన ఎంపిక చేసిన జట్టుకు అనుహ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్‌గా సిద్దు నియమించాడు. ఈ ఏడాది సీజన్‌లో రోహిత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా లేనప్పటికి.. సిద్దు మాత్రం తన ఎంచుకున్న జట్టుకు సారథిగా రోహిత్ వైపే మొగ్గు చూపాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎన్నో అద్బుత విజయాలను సాధించాడని, అందుకే తన జట్టుకు నాయకుడిగా ఎంపిక చేశానని సిద్దు తెలిపాడు. కాగా ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌.. భారత్‌కు టీ20 వరల్డ్‌కప్‌, ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు.ఇక సిద్దూ ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా రోహిత్‌, విరాట్ కోహ్లికి చోటిచ్చాడు. అదేవిధంగా మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా జోస్ బట్లర్‌, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్‌కు అవ‌కాశం ద‌క్కింది. ఐదో స్ధానంలో నికోల‌స్ పూర‌న్‌కు ఛాన్స్ ద‌క్కింది. ఆల్‌రౌండ‌ర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాకు సిద్దు అవ​కాశం కల్పించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నూర్ ఆహ్మద్‌ను ఎంపిక చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధు.. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, హాజిల్‌వుడ్‌లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ జట్టులో ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయిసుదర్శన్‌, గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఐపీఎల్‌-2025 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో పంజాబ్‌ను ఓడించి తొలి ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకుంది.సిద్దు ఎంచుకున్న ఐపీఎల్ బెస్ట్ టీమ్‌రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, నికోలస్ పూరన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నూర్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్.చదవండి: ఆర్సీబీలోకి బుమ్రా, సూర్య‌కుమార్‌, పంత్‌: విజయ్‌ మాల్యా డ్రీమ్‌ టీమ్‌

Colombian Presidential Candidate Miguel Uribe shot in Head During Rally10
అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు.. కొలంబయాలో ఉద్రిక్తత

బొగోటా: అమెరికాలోని కొలంబియాలో దారుణం చోటుచేసుకుంది. కొలంబియన్ మితవాద ప్రతిపక్ష సెనేటర్, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థి మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే(39)పై కాల్పులు జరిగాయి. బొగోటాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే జనం మధ్య ప్రసంగిస్తుండగా, ఆయనపై కాల్పులు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. కొంతమంది అతనిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అటార్నీ జనరల్ లూజ్ అడ్రియానా కామార్గో కారకోల్ మీడియాతో మాట్లాడుతూ మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని తెలిపారు.సెనేటర్ మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే తలకు ఒక బుల్లెట్ తగిలిందని స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడిని ఖండిస్తున్నట్లు వామపక్ష అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రభుత్వం పేర్కొంది. ఈ హింసాత్మక చర్య కేవలం అతనిపైన మాత్రమే కాదని ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, కొలంబియాలో చట్టబద్ధమైన రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన దాడి అని అధ్యక్ష కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. Urgente 🇨🇴 Aquí está el momento del atentado al Dr Miguel Uribe Que dolor de PatriaGobierno miserable !Imágenes sensibles pic.twitter.com/tA3VWGap5V— Luis Aníbal Rincón Arguello. ® 🇨🇴 (@Rincon001A) June 7, 2025డెమోక్రటిక్ సెంటర్ పార్టీ సభ్యుడైన మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే గత అక్టోబర్‌లో తాను 2026లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా సాయుధుడైన ఒక వ్యక్తి తమ సెనేటర్‌ను వెనుక నుండి కాల్చాడని డెమోక్రటిక్ సెంటర్ పార్టీ తెలిపింది. ఈ దాడి ఒక రాజకీయ నాయకుని ప్రాణానికి ముప్పు కలిగించడమే కాకుండా, కొలంబియాలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు కూడా ముప్పు ఏర్పడేలా చేసిందని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ నేత కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్ మాట్లాడుతూ ఇది దేశానికున్న ఆశపై జరిగిన దాడిగా అభివర్ణించారు.బొగోటా మేయర్ కార్లోస్ గాలన్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో షూటర్‌ పట్టబడ్డాడని తెలిపారు. ఈ ఘటనలో ఒక 15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే కొలంబియాలో రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తాత కొలంబియా మాజీ అధ్యక్షుడు జూలియో సీజర్ టర్బే. ఆయన 1978 నుండి 1982 వరకు అధికార బాధ్యతలు చేపట్టారు. ఆయన తల్లి డయానా టర్బే.. ఆమె ప్రఖ్యాత జర్నలిస్ట్. మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే 2022 నుంచి సెనేటర్‌గా ఉన్నారు. గతంలో బొగోటా ప్రభుత్వ కార్యదర్శిగా, నగర కౌన్సిలర్‌గా పనిచేశారు. 2019లో నగర మేయర్ పదవికి కూడా పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు.ఇది కూడా చదవండి: జ్యోతి మల్హోత్రాకు పాకిస్తానీ రిటైర్డ్‌ అధికారితో లింకు ?

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement