
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ఉద్దేశించిన విధానంపై కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్థిక, సామాజిక సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శులు సభ్యులుగా నియమించారు. భూపరిపాలనా శాఖ ప్రత్యేక కమిషనర్ను కన్వీనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఉగాది నాటికి 25 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది
Comments
Please login to add a commentAdd a comment