ఆటో, స్కార్పియో ఢీ | 3 injured in road accident | Sakshi
Sakshi News home page

ఆటో, స్కార్పియో ఢీ

Oct 16 2015 7:12 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఆటో, స్కార్పియో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

జమ్మలమడుగు రూరల్ (వైఎస్సార్ జిల్లా) : ఆటో, స్కార్పియో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలో చోటుచేసుకుంది.

జమ్మలమడుగు నుంచి పెద్దమొడిగం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను మండలంలోని ఎస్.ఉప్పల పాడు గ్రామం వద్ద ఎదురుగా కోయిలకుంట్ల వైపు వెళ్తున్న స్కార్పియో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ముగ్గురు గాయాలపాలయ్యారు. అందులో తీవ్రంగా గాయపడ్డ ఒకరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి, స్వల్పంగా గాయపడ్డ ఇద్దరిని కడప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement