తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురుమృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. పెళ్లి వ్యాను బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పందిరిమామిడి నుంచి పెళ్లి వ్యాను రంపచోడవరం వెళ్తుండగా గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.