
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆదివారం కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8929కి చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 24,451 నమూనాలు పరీక్షించగా 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన 4 మందికి కరోనా సోకినట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
గడిచిన 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4307కు చేరుకుంది. కరోనాతో ఇవాళ ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 106కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4516 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.