
వామపక్షాలతో కలిసి ఉద్యమాలు: వైఎస్ఆర్ సిపి
ప్రజాసమస్యల పరిష్కారానికి వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారానికి వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు.
ఇందిరా పార్క్ వద్ద చేనేత కార్మికులు తలపెట్టిన దీక్షకు తమ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. చేనేత కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు నుంచి 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. చేనేత వస్త్రాలపై రిబేటును కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.