రేషన్కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు 'ఈ-పాస్' | AndhraPradesh Govt to introduce 'E- PASS' policy due to control ration card corruption | Sakshi

రేషన్కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు 'ఈ-పాస్'

Sep 14 2014 3:02 PM | Updated on Sep 22 2018 8:22 PM

రేషన్కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు 'ఈ-పాస్' - Sakshi

రేషన్కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు 'ఈ-పాస్'

రాష్ట్రంలో రేషన్కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు.

రాజమండ్రి: రాష్ట్రంలో రేషన్కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. అందుకోసం కొత్తగా ఈ-పాస్ విధానం అమల్లోకి తెస్తున్నామన్నారు. ఈ విధానం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లాను ఎంపిక చేసినట్లు ఆమె వివరించారు.  ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చిన సునీత విలేకర్లతో మాట్లాడారు.

రాష్ట్రంలో 5 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేసినట్లు సునీత తెలిపారు. రాష్ట్రంలో మొబైల్ వాహానాల ద్వారా ఆధార్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తున్నామని అందుకోసం ఈ ప్రక్రియను త్వరలో ఆచరణలో పెడుతున్నట్లు పేర్కొన్నారు దాన్యం కొనుగోలు విషయంలో రైతులు లాభపడే విధంగా చర్యలు తీసుకుంటామని సునీత రైతులకు భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement