paritala sunitha
-
పరిటాల సునీతపై మైనారిటీలు ఫైర్..
-
పరిటాల సునీతపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్
-
మాకు అడ్డొస్తే చంపేస్తాం..
సాక్షి టాస్క్ఫోర్స్: ‘మేము అధికారంలో ఉన్నాం.. మేం ఏం చెప్పినా జరుగుతుంది’ అంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండ చూసుకుని రోజూ మండలంలోని ఏదో ఒక గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారు. మంగళవారం కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటు తుపాకీ, కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించాడు. అతని తీరుతో విసుగు చెందిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇతను గతంలోనూ పెనుకొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం అలజడులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని తొమ్మిది పంచాయతీలకు గాను ఏడుచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. తొమ్మిది ఎంపీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దీన్ని జీరి్ణంచుకోలేని పరిటాల కుటుంబం సొంత మండలంలో ఆధిపత్యం కోసం గ్రామాల్లో గొడవలకు ఆజ్యం పోస్తోంది. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కుంటిమద్దిలో అలజడి సృష్టించే క్రమంలోనే పరిటాల అనుచరుడు గంగాధర్ ఎంపీటీసీ భర్తను తుపాకీతో బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు. -
Ananthapur: పరిటాల డర్టీ పాలిటిక్స్
♦ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఆత్మకూరుకు చెందిన ఓ వార్డు మెంబర్ వైఎస్సార్సీపీలో చేరాడు. ఈ క్రమంలోనే అదే రోజు సాయంత్రం సదరు వ్యక్తి ఇంటి వద్దకు బాలాజీ వెళ్లాడు. ఏదో చెప్పి టీడీపీ కండువా వేసి వచ్చారు. కానీ ఆ వార్డు మెంబర్ మాత్రం టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వైఎస్సార్సీపీ కార్యక్రమాలు, సమావేశాలకు హాజరవుతున్నారు. ♦ ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్దకు ఈ నెల 15న టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత సోదరుడు బాలాజీ వెళ్లాడు. ఏదో మాట్లాడుతూనే అతనికి బలవంతంగా టీడీపీ కండువా కప్పారు. వారు గడప దాటిన మరుక్షణమే సదరు వ్యక్తి టీడీపీ కండువా పక్కకు పడేశాడు. అతని కుమారుడు ఆ కండువాకు చెప్పు చూపించడమే కాకుండా నిప్పు పెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ♦ కొన్ని రోజుల క్రితం ఆత్మకూరుకు చెందిన నాయీ బ్రాహ్మణులు, కురుబ కులస్తులు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోని టీడీపీ నాయకులు అదే రోజు రాత్రి వారి ఇళ్ల వద్దకు వెళ్లారు.అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ నమ్మబలికి టీడీపీ కండువాలు వేశారు. అనంతపురం: ఎమ్మెల్యే, మంత్రి పదవులను అనుభవించినా రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధికి పరిటాల కుటుంబీకులు చేసిన కృషి శూన్యం. పైగా, నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజల్నే వేధించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అధికారం మాటున వందల కోట్లు వెనకేసుకున్నారు. వారి ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా, బుద్ధి నేర్వని వారు మళ్లీ నేడు ఎన్నికలు వచ్చాయని ప్రజల్లోకి వెళ్తూ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చు.. ప్రచారం పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్న పరిటాల కుటుంబీకులు ఆ మాటున యథేచ్ఛగా ప్రలోభాలకు దిగుతున్నారు. అధికారంలోకి రావడానికి ఏం చేయడానికైనా రెడీ అంటూ హల్చల్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్ల దగ్గరకు వెళ్లి తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ఏ పని కావాలన్నా చేసి పెడతాం లేదా డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాం అంటూ ఎర వేస్తున్నారు. పైగా గ్రామీణులను కులాల పేరిట విడగొట్టి సమావేశాలు నిర్వహిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు. రాత్రి సమయాల్లో ఒక్కో రోజు ఒక్కో వర్గం వారిని కలుస్తూ ఏ కులంలో ఎంత మంది ఉన్నారంటూ తెలుసుకొని డబ్బు ముట్టజెబుతూ వల వేస్తున్నారు. ఓట్ల కోసం పచ్చటి పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్లీ బీజం వేస్తున్నారు. సొంత పార్టీ నాయకులకూ తాయిలాలు.. పరిటాల కుటుంబం సొంత పార్టీ కేడర్ను కూడా నమ్మడం లేదు. వారికి కూడా తాయిలాల ఎర వేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం చేస్తే ఆ రోజంతా ప్రచారంలో పాల్గొనే వారికి మందు, ఖర్చులకు డబ్బుతో పాటు రవాణా ఖర్చులకు కూడా ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ వారిని, ఆ పార్టీ సానుభూతిపరులను టీడీపీలో చేర్పించి ఎంత కావాలన్నా తీసుకోండి అంటూ కమీషన్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లో టీడీపీకి చెందిన వారినే సునీత, శ్రీరాం దగ్గరకు తీసుకెళ్లి పార్టీ కండువాలు వేయిస్తూ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బయటకొచ్చాక పారవేస్తున్నారు.. భయపెట్టో, ప్రలోభ పెట్టో తమ వైపు జనాన్ని తిప్పుకోవాలన్న పరిటాల కుటుంబ పాచికలు ఏ మాత్రమూ పారడం లేదు. టీడీపీ కండువాలు కప్పుకున్న వారు బయటకు వచ్చాక వాటిని అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. తమ ఇంటికే వచ్చి పార్టీ కండువాలు వేసి వెళ్లాక వాటిని పారవేస్తున్నారు. కొంతమందైతే తగులబెడుతున్నారు. ఎన్ని రకాలుగా వల పన్నుతున్నా ప్రజలు లొంగకపోవడం చూసి పరిటాల సునీత డీలా పడినట్లు తెలుస్తోంది. ఓడిపోతామన్న భయంతోనే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయి. రూపాయి కూడా లంచం తీసుకోకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధి చేకూర్చారు. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే ప్రజలకు రూ. వేల కోట్లు ప్రభుత్వం అందించింది. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలల్లోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరూరు డ్యాంను నీటితో నింపారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. రూ. వేల కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో ప్రజలు ఈ సారి కూడా వైఎస్సార్ సీపీకి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇదంతా గమనించి మళ్లీ ఓటమి తప్పదని గుర్తించిన పరిటాల సునీత ఎలాగైనా, ఏం చేసైనా ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. బలవంతంగా టీడీపీ కండువాలు కప్పుతూ అపహాస్యం పాలవుతున్నారు. అంతా గమనిస్తున్న ప్రజలు లోలోనే నవ్వుకుంటున్నారు. -
ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావ్...తోపుదుర్తి కౌంటర్
-
చంద్రబాబు, లోకేశ్ల.. ఎమ్మెల్సీ మంత్రం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని టీడీపీలో ఇప్పుడు నియోజక వర్గానికో కొల్ల అప్పలనాయుడు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ గొంప కృష్ణ, ఓ కిమిడి నాగార్జున, ఓ బొబ్బిలి చిరంజీవులు, ఓ ఆర్పీ భంజ్దేవ్, ఓ మీసాల గీత, ఓ తెంటు లక్ష్మునాయుడు, ఓ కేఏ నాయుడు, ఓ కావలి గ్రీష్మ, ఓ కర్రోతు బంగార్రాజు.. ఇలా ఊహూ అన్న ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్సీ చేసేస్తామని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హామీలిచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ ఉద్యోగాలిస్తామని హీరో రవితేజ బృందాన్ని బురిడీ కొట్టించిన సీన్ గుర్తొస్తుంది. ‘ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్యార్డా, ఏసియాడా, జింకా, బంకా (హెచ్పీసీఎల్)... ఏ కంపెనీలో ఉద్యోగం కావాలి? జీఎం కావాల్న? ఏజీఎం కావాల్న?’ అని ఊరించి డబ్బులు నొక్కేసి కృష్ణభగవాన్ లాఘవంగా జెల్ల కొట్టేసిన హాస్యభరిత సన్నివేశం ఇప్పుడీ టీడీపీ నాయకుల సీట్ల వ్యవహారంలో కనిపిస్తోంది. మాట ఇస్తే ఆరునూరైనా అమలుచేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి మనస్థత్వం కాదు వారిది!. చంద్రబాబు, లోకేశ్ హామీలిచ్చి ఎన్నికల్లో గట్టెక్కిన తర్వాత ఎలా ముంచేస్తారో కొల్ల అప్పలనాయుడి అనుభవమే నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా మద్దతు కూడగట్టాలని ప్రతి నియోజకవర్గంలో రెబెల్స్కు ఎమ్మెల్సీ ఆశ చూపిస్తున్నారు. లేదంటే నామినేటెడ్ పోస్టు.. అదీ లేదంటే సముచిత స్థానం కల్పిస్తామని భ్రమలు కల్పిస్తున్నారు. ఉన్నవెన్ని? వచ్చేవెన్ని? రాష్ట్ర శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. రెండేళ్లకోసారి మూడింట ఒకటో వంతు మంది పదవీ విరమణ చేస్తుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ బలం 43 కాగా టీడీపీకి ఉన్నవి ఎనిమిది మాత్రమే. మిగతావాటిలో పీడీఎఫ్ సభ్యులు ఇద్దరు, స్వతంత్ర సభ్యులు నలుగురు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిపోయినట్లుగానే భవిష్యత్తులో శాసనమండలి నుంచి కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేట్లు ఉంది. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాల్లో భాగంగా సొమ్ములు దండిగా ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడినవారికి మొండిచేయి చూపిస్తున్నారు. వారిని బుజ్జగించడానికి ‘ఎమ్మెల్సీ’ పదవులనే బిస్కెట్లు వేస్తున్నారు. మన రెండు జిల్లాల్లోనే పది మంది వరకూ ఇలాంటి ఆశాజీవులు ఉంటే... రాష్ట్రంలో ఇలా ఆశలపల్లకి ఎక్కిస్తున్నవారి సంఖ్య వందకు పైమాటే. చంద్రబాబు బూటకపు హామీలిచ్చి ప్రజలనే కాదు సొంత పార్టీ నాయకులనూ బురిడీ కొట్టిస్తున్నారడంలో సందేహం అక్కర్లేదు. కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి.. మరీ.. ఈయన పేరు కొల్ల అప్పలనాయుడు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంతకవిటి మండలంలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. ఎంపీపీగా మూడు పర్యాయాలు పనిచేశారు. మరో రెండుసార్లు తన అనుచరులనే ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టారు. తన భార్యను కూడా జెడ్పీటీసీగా ఒక పర్యాయం గెలిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వాడుకొనే ఉద్దేశంతో చంద్రబాబు తాయిలం వేశారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ను చేస్తానని ఆశచూపించారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా మొండిచేయి చూపించారు. చౌదరి ధనలక్ష్మిని చంద్రబాబు ఆ పదవిలో కూర్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి... ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. 2017 ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు అవకాశం ఇస్తారని ఆశించిన కొల్లకు జెల్ల కొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన శత్రుచర్ల విజయరామరాజును అందలం ఎక్కించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొల్ల తాను రెబెల్గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. నాడు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి మంత్రిగానున్న పరిటాల సునీత, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు హుటాహుటిన కొల్ల స్వగ్రామం మామిడిపల్లి వెళ్లి మరీ బుజ్జగించారు. నామినేటెడ్ పదవి ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా కొల్ల కల నెరవేరలేదు. ఇవి చదవండి: బాబు తన ప్లాన్ ప్రకారమే జనసేన 'కుర్చీ మడతెట్టేశాడు'! -
‘ఫ్యామిలీ’ డ్రామా!
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయించడానికి చంద్రబాబు అనుసరిస్తున్న విధానంపై టీడీపీలో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒక కుటుంబంలో ఒకరికే సీటు ఇస్తానని ఆయన పెట్టిన నిబంధనతో పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ఆ కుటుంబాల్లో ఒకరికే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఈ సాకు చూపుతున్నా తాను కావాలనుకుంటే మాత్రం దానికి సడలింపు ఇచ్చేస్తున్నారు. దీనిపై సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు తన కుటుంబంలో కావాల్సిన వారందరికీ సీట్లు ఇచ్చుకుంటూ పార్టీలోని సీనియర్లకు మాత్రమే ఈ రూలు పెడుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి.. చంద్రబాబు ఇప్పటికే తన కుటుంబంలో ముగ్గురికి సీట్లు ప్రకటించుకోగా, ఇంకో సీటు మలి జాబితాలో ప్రకటించనున్నారు. తనకు కుప్పం, తన కుమారుడు లోకేశ్కు మంగళగిరి, తన బావమరిది–వియ్యంకుడు బాలకృష్ణకి హిందూపురం సీట్లను కేటాయించుకున్నారు. మరో సీటును లోకేశ్ తోడల్లుడు, బాలకృష్ణ రెండో అల్లుడు భరత్కి ఎక్కడో ఒకచోట ఇవ్వడం ఖాయమైంది. ఇలా నాలుగు సీట్లు చంద్రబాబు తన కుటుంబానికి కేటాయించుకున్నారు. సీనియర్ల విషయానికి వచ్చేసరికి ఒకరికే సీటు ఇవ్వగలమని, కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెబుతున్నారు. అదేమంటే పొత్తుల్లో సీట్లు తగ్గిపోయాయని వంకలు చెబుతున్నా సొంత కుటుంబానికి నాలుగు సీట్లు ఎలా ఇచ్చుకున్నారనే ప్రశ్నకు సమాధానంలేదు. అయ్యన్నకు సీటు..కొడుక్కి మొండిచేయి.. అనకాపల్లి జిల్లాలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం సీటును ప్రకటించగా ఆయన కుమారుడు విజయ్కి సీటు ఇవ్వలేదు. అయ్యన్న తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఒక దశలో తనకు కాకుండా తన కుమారుడికి సీటు ఇవ్వాలని అయ్యన్న గట్టిగా కోరినా ఆయన మాట పెడచెవిన పెట్టారు. దీంతో కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి, తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీకి కాపుకాసిన తమకు ఈ పరిస్థితి ఏమిటని ఆవేదనతో ఆయన కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తనకు నర్సీపట్నం సీటు ఇచ్చినా అయ్యన్న సంతృప్తిగా లేరు. తనకో నిబంధన, చంద్రబాబుకి మరో నిబంధనా అని అంటూ అంతర్గతంగా రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేసీ బ్రదర్స్కి ఝలక్.. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ సోదరులకు కూడా చంద్రబాబు ఇదే తరహా ఝలక్ ఇచ్చారు. జేసీ సోదరులు గత ఎన్నికల్లోనూ తాము పక్కకు తప్పుకుని తమ కుమారులను బరిలోకి దింపారు. అనంతపురం ఎంపీ స్థానంలో దివాకర్ కుమారుడు పవన్, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానంలో ప్రభాకర్రెడ్డి కుమారుడు అస్మిత్ని పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో అలాగే సీట్లు ఇవ్వాలని ఎంత లాబీయింగ్ చేసినా అస్మిత్ ఒక్కడికే సీటిచ్చి పవన్కి సీటు నిరాకరించారు. దీంతో జేసీ సోదరులు పైకి మామూలుగానే మాట్లాడుతున్నా లోలోన మాత్రం రగిలిపోతూ చంద్రబాబుపై మండిపడుతున్నారు. పనబాక విషయంలోనూ గందరగోళమే.. మరోవైపు.. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి కుటుంబాన్నీ చంద్రబాబు గాల్లో పెట్టారు. పార్టీలో చేరే ముందు ఆమెతో పాటు ఆమె భర్త కృష్ణయ్యకు సీటిస్తామని చెప్పి తీసుకొచ్చినా ఇప్పుడు ఏ విషయం తేల్చడంలేదు. ఆమెకు మొదట తిరుపతి ఎంపీ సీటు ఇస్తామని చెప్పినా ప్రస్తుతం దానిపైన స్పష్టత ఇవ్వలేదు. బీజేపీతో పొత్తు ఉంటే ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీంతో పనబాక కుటుంబం చంద్రబాబు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేస్తోంది. దీన్నిబట్టి చంద్రబాబు ఒక కుటుంబానికి ఒక సీటనే రూలును తన రెండుకళ్ల సిద్ధాంతం మాదిరిగానే తనకు అవసరమైన చోట మాత్రమే ప్రయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పరిటాల కుటుంబానికి చెక్.. ఈ జిల్లాలోనే మరో సీనియర్ నేత పరిటాల సునీత కుటుంబానికి చంద్రబాబు షాకిచ్చారు. సునీతకు రాప్తాడు సీటు ప్రకటించి ఆమె కుమారుడు శ్రీరామ్కి సీటు నిరాకరించారు. ధర్మవరం సీటు తన కుమారుడికివ్వాలని పట్టుబట్టినా ఒక కుటుంబానికి ఒకే సీటు పేరుతో అతన్ని పక్కనపెట్టారు. దీంతో పరిటాల కుటుంబం కక్కలేక మింగలేక ఉండిపోయింది. ఇలా సీనియర్ల కుటుంబాలను కట్టడి చేసిన చంద్రబాబు తన కుటుంబానికి మాత్రం నిబంధనలేవీ వర్తించవనేలా వ్యవహరిస్తుండడం సీనియర్లకు మింగుడుపడడంలేదు. ఇక తన కుటుంబానికే కాకుండా కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కలి సీటు ఇవ్వగా, ఆయన అన్న కుమారుడు రామ్మోహన్నాయుడికి శ్రీకాకుళం ఎంపీ సీటు ఖరారు చేశారు. -
Anantapur: పరిటాల సునీతకు గట్టి షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమి పాలైన విషయం విదితమే. నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో ధీమా సన్నగిల్లుతోంది. రోజుకో సమీకరణంతో టికెట్ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది. మొన్నటివరకు రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ తమకే అని పరిటాల కుటుంబం చెప్పుకుంది. ఇప్పుడు అందులో ఒక టికెట్పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో కలవరం మొదలైంది. రాప్తాడు నుంచి తెరపైకి రియల్టర్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ సీటు కోసం ఆయన భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నెల 18 లేదా 19న ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్టు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో బంధువర్గం ఉండటంతోపాటు బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ఉండటంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాప్తాడు ఇవ్వకపోతే ధర్మవరం? రాప్తాడు నియోజకవర్గంలో సునీతకు టికెట్ ఇవ్వని పక్షంలో ధర్మవరం పంపించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ధర్మవరం టికెట్ కావాలని సునీత కుమారుడు శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీరామ్కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా.. తల్లి సునీతకు ధర్మవరం టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. రాప్తాడులో సునీతకు అనుకూల పరిస్థితులు లేవని, కొత్త అభ్యర్థి అయితే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. సునీతకు నియోజకవర్గంలో అనుకూలంగా లేదనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది. సూరిని తీసుకుంటే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఎక్కడున్నా తగవులు పెట్టి తన్నుకునేలా చేస్తారనే విమర్శ ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరికే టికెట్ ఇవ్వాలని ఆలోచిసూ్తనే సునీతకు కూడా ఇస్తామని లీకులిస్తున్నారు. ఒకవేళ ధర్మవరం నియోజకవర్గానికి సూరిని నియమిస్తే సునీతను పెనుకొండకైనా పంపించాలని మరో వాదన వినిపిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం చేసే పరిటాల సునీతకు స్థానచలనం చేస్తే ఏళ్ల తరబడి నమ్మకంతో ఉన్న మన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కేడర్లో మొదలైంది. కొంప ముంచుతున్న నాన్చుడు ధోరణి చంద్రబాబు చివరివరకూ నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఎక్కడ ఏ అభ్యర్థో తేల్చకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం గందరగోళంగా ఉంది. 2019లో చంద్రబాబును నమ్ముకుని రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కూడా ఆయన్ని నమ్ముకుంటే మునుగుతామో తేలుతామో అర్థం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు. -
రాప్తాడు నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి
-
‘స్టాంప్ పేపర్పై సంతకం పెడుతున్నా.. దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి’
సాక్షి, అనంతపురం: తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఘాటుగా స్పందించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను కిడ్నాప్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి.. అనంతపురం ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం శాన్వి - లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని తెలిపారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని.. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయని.. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని ఆయన మీడియా ఎదుట వంద రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి సవాల్ విసిరారు. -
మహాతల్లి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా..? పరిటాల సునీతకి కౌంటర్
-
పరిటాల సునీత, శ్రీరామ్లపై కేసు నమోదు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్పై పోలీస్ చేసు నమోదైంది. కాగా కనగానపల్లి మండలంలో బుధవారం అనుమతి లేకుండా నిర్వహించిన ర్యాలీలో రాప్తాడు టీడీపీ ఇంచార్జి పరిటాల సునీత, ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరాం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిటాల సునీత, శ్రీరామ్ సహా 119 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పరిటాల సునీత, ఆమె తనయుడిపై నిబంధనలకు విరుద్ధంగా వ్వహరించినందుకు కేసు ఫైల్ అవ్వడం ఇదేం తొలిసారి కాదు. అంతకముందు కూడా అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినందుకు వీరిపై కేసులు నమోదయ్యాయి. చదవండి: దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు -
పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరుగురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడానికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్ (48), బి.రమేశ్కుమార్ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు. ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది. స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు. ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక.. నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు. నేడు వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు. -
అనంతపురంలో పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం
-
దళిత మహిళ ఆదిలక్ష్మిపై పరిటాల సునిత వర్గీయుల దాడి
-
అనంత: టీడీపీ నేతల దౌర్జన్యకాండ.. మహిళపై సునీత వర్గీయుల దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ దళితురాలిపై పరిటాల సునీత వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు బంధువులు. ఈ దాడిలో గాయపడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిటాల వర్గీయులు తనను వేధిస్తన్నారని, వాళ్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆదిలక్ష్మి చెబుతోంది. అంతేకాదు బాధితురాలు గత నెలలో పరిటాల సునీతకు తన సమస్య చెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయిందని చెబుతోందామె. -
పచ్చదళంలో మహిళా పోలీస్!
సాక్షి, అనంతపురం(ఆత్మకూరు): ఓ ప్రభుత్వ ఉద్యోగి గీత దాటారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఓ రాజకీయ పార్టీ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫొటోలకు ఫోజులిస్తూ హల్చల్ చేశారు. ఆమె వ్యవహార శైలి చూసి అక్కడున్న వారంతా ముక్కునవేలేసుకున్నారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి గ్రామానికి చెందిన రామాంజినమ్మ మదిగుబ్బ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తోంది. గురువారం ఆత్మకూరు మండలం సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా సాగిన పరిటాల సునీత పాదయాత్రలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రామాంజినమ్మ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తగా పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఎంపీడీఓ కొండన్న, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులను వివరణ కోరగా.. విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
పరిటాల సునీతకు చేదు అనుభవం
-
Paritala Family: పరిటాల కుటుంబం.. దిక్కు ‘లేని’ చూపులు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంతోషంగా ఉన్న జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చీప్ ట్రిక్స్ చూసి ఛీదరించుకుంటున్నారు. ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా? చేయకుంటే క్యాడర్ వెంట ఉంటుందా? పక్క నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుందా? అనే సందిగ్ధంలో కొందరు నేతలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. పరిటాల కుటుంబం గురించే! సాక్షి, పుట్టపర్తి: 1994 నుంచి అనంతపురం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభావం చూపిన పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబ సభ్యులే మోసుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక కార్యకర్తలు వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పరిటాల కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. రాప్తాడు, ధర్మవరం వద్దనుకుంటే పెనుకొండ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది. రాప్తాడుకు రాం..రాం.. రాప్తాడుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు తీస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి చేస్తున్న ప్రజారంజక పనులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ నేతలే భావిస్తున్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం అంత ఈజీ కాదని.. అప్పట్లో మంత్రిగా ఉన్న పరిటాల సునీత అన్నారు.. దాన్ని కూడా ప్రకాశ్రెడ్డి సాధ్యం చేసి చూపించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో పరిటాల కుటుంబం రాప్తాడులో మనుగడ సాగించడం కష్టంగా మారింది. అంతేకాకుండా పరిటాల కుటుంబం నుంచి రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. మాజీ మంత్రి పరిటాల సునీత బరిలో దిగుతారా? లేక ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. దీంతో పరిటాల కుటుంబం వెనుక నడించేందుకు కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. ధర్మవరం.. అయోమయం రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ టికెట్ వస్తుందా? ఒకవేళ వస్తే పోటీ చేస్తారా? పోటీ చేసినా గెలుస్తాడా? అనే సందేహాలకు సమాధానమే చిక్కడం లేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ ధాటిని తట్టుకుని టీడీపీ గెలవడం కష్టమని జనం భావిస్తున్నారు. దీనికి తోడు పరిటాల శ్రీరామ్కు మరోవైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) నుంచి ప్రమాదం పొంచి ఉంది. సూరి టీడీపీలో చేరినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. బీజేపీలో కొనసాగినా.. పరిటాల శ్రీరామ్కు నష్టమే. పెనుకొండ.. కష్టమేనంట బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం పెనుకొండ. అక్కడి నుంచి వైఎస్సార్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకర్నారాయణ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ప్రజల్లో ఒకడిగా.. నిత్యం సమస్యలపై దృష్టి పెట్టి.. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు బీకే పార్థసారథి, సవితమ్మ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన పరిటాల కుటుంబ సభ్యులు పెనుకొండ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కూడా కష్టమే. బీసీ ఓట్లు అధికంగా ఉన్న పెనుకొండలో అగ్రవర్ణ కులాల నుంచి పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ చీప్ ట్రిక్స్.. పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి పరాజయాల బాటలో ఉన్నారు. వెంట నడిచే కార్యకర్తలు కరువయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని చీప్ ట్రిక్స్కు పాల్పడుతున్నారు. అసత్య ప్రచారాలు చేయడం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించడం లాంటివి చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలపై అధికారులతో వాగ్వాదానికి దిగడం.. పోలీసులతో వాదించడం చేస్తూ ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ, ఎస్సీ కులాలకు చెందిన వారికి రాజకీయ పదవులు ఆశ చూపి.. ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. కేసుల్లో ఇరికిస్తే వెంట ఉంటారని.. సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు. (క్లిక్ చేయండి: చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు) అన్ని ఎన్నికల్లో చిత్తు చిత్తు.. రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ధర్మవరం మున్సిపాలిటీలోని 40 స్థానాలనూ వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో సైతం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ నేతలే కొనసాగుతున్నారు. కొత్తగా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన పెనుకొండలోని 20 స్థానాలకు 18 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇలా అన్నింటా వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించడంతో ఎక్కడైనా టీడీపీకి ఎదురుగాలే వీస్తోందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. (క్లిక్ చేయండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు) -
పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు
సాక్షి, అనంతపురం: ‘మా ఓర్పు, సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. మేము తింటున్నదీ ఉప్పూ కారమే. మీకు నిజంగా ధైర్యం ఉంటే మా ఇంటి వద్దకు వచ్చి వెళ్లండి. అప్పుడు మీకు అర్థమవుతుంద’ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్పుగా ఉన్నామే గానీ ఏనాడూ సహనం కోల్పోలేదన్నారు. ఇప్పుడు కిరాయి హంతకులతో తమ అమ్మను తిట్టించినా ఓర్పుగానే ఉన్నామన్నారు. అలాగని తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పరిటాల శ్రీరామ్ తమపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎవరైనా దాడి చేస్తే తమకు సంబంధం లేదంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. అయినప్పటికీ తాము సహనం కోల్పోలేదన్నారు. భాష తప్పే.. భావం కరెక్ట్ చంద్రబాబు విషయంలో తమ అన్న తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి వాడిన భాష తప్పే కానీ.. ఆయన భావం కరెక్ట్ అని ప్రకా‹Ùరెడ్డి స్పష్టం చేశారు. తమ్ముడికి జరగరానిది ఏదైనా జరుగుతుందనే బాధతోనే అలా మాట్లాడారని పేర్కొన్నారు. తమ రాజకీయ చరిత్రలో ఏనాడూ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎంతో ఓర్పు, సహనంతో ప్రజల వద్దకు వెళ్తున్నామే తప్ప నీచ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమపై కక్ష సాధింపుతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆస్తులు నష్టపోయామని, చివరికి తమపై అక్రమ కేసులు బనాయించినా ఓర్పు, సహనంతో ఉన్నామని గుర్తు చేశారు. ఆనాడు హత్యాకాండకు పాల్పడ్డారు.. పరిటాల రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎన్నో హత్యలు చేయించారన్నారు. అలాగే పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు కూడా హత్యా రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. పరిటాల సునీత మహానటి అని ఎద్దేవా చేశారు. ఆమె నటన వెనుక చంద్రబాబు పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే రాప్తాడు నియోజకవర్గంలో పది చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో టీడీపీ చేసిన హత్యాకాండ, అరాచకాలు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జాకీ పరిశ్రమ విషయంలో దు్రష్పచారాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు చెప్పారు. ఆ పరిశ్రమ టీడీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. లేని జాకీపైన పదేపదే మాట్లాడుతున్నారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడార్: రౌడీ షీటర్ విడుదల కోసం రోడ్డెక్కిన పరిటాల సునీత
-
25 ఏళ్లుగా పరిటాల కుటుంబం అనంతపురం జిల్లాకు చేసిందేమి లేదు : తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
అనంతపురంలో టీడీపీ నేత పరిటాల సునీత తీరు వివాదాస్పదం
-
రాప్తాడు ఎమ్మెల్యే తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. పరిటాల సునీత అనుచరుడు అరెస్ట్
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిపై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాయలేని భాషలో బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద ఆమె తనయుడితో కలిసి హల్చల్ చేశారు. చదవండి: (షిప్ రిపేర్ హబ్గా విశాఖ.. అదానీ పోర్ట్స్ నుంచి అమెరికా షిప్స్ వరకూ..) -
‘కిరాయి హంతకుడి తరుఫున ధర్నా చేస్తారా?.. సిగ్గుచేటు’
సాక్షి, అనంతపురం: పరిటాల సునీత ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరుపై మండిపడ్డారు. కిరాయి హంతకుడు గంటాపురం జగ్గు తరుఫున ధర్నా చేస్తారా?.. మహిళలను కించపరిచిన వ్యక్తిని మీరెలా సమర్థిస్తారు? అంటూ నిప్పులు చెరిగారు. గంటాపురం జగ్గుకు అండగా నిలవడం సిగ్గుచేటు అని మాధవ్, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు. కాగా, అనంతపురం జిల్లాలో పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లి పై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం తలదించుకునే బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ధర్నా చేపట్టారు. దీన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఖండించారు. మహిళలను అవమానకరంగా మాట్లాడిన గంటాపురం జగ్గుకు మద్దతుగా ఆందోళన చేయడం పరిటాల సునీతకు తగదన్నారు. చదవండి: దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..! -
జాకీని అడ్డుకుంది అప్పటి పప్పు, తుప్పు మంత్రులే
అనంతపురం: జాకీ ఇంటర్నేషనల్ కంపెనీని అడ్డుకున్నది అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని పప్పు, తుప్పు మంత్రులేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెళ్లిపోయిన సంస్థతో తనకు ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఎక్కడ జాకీ, ఎవరి జాకీ, ఎక్కడుంది జాకీ? ఈ సంస్థకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కటైనా నిర్మాణం జరిగిందా’ అని ప్రశ్నించారు. అదో దోపిడీ ఒప్పందం ‘జాకీ దుస్తులు ఉత్పత్తి చేసే పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.140 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.2.80 కోట్లకే ఇచ్చారు. 2017లో భూమి కేటాయించి 2018లో సేల్ డీడ్ చేశారు. మూడేళ్లు నడిపితే సేలబుల్ రైట్స్ ఇచ్చారు. వారు ఉద్యోగాలు కూడా దశలవారీగా ఇస్తామన్నారు. తొలుత వెయ్యి మందికి, మూడేళ్లకు రెండు వేల మందికి, ఆ తర్వాత దశలవారీగా 6 వేలమందికి ఉపాధి కల్పిస్తామని డీపీఆర్లో చెప్పారు. ఈ ఫ్యాక్టరీకి విద్యుత్తు సరఫరా, తాగు నీటి సదుపాయానికి కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా క్యాపిటల్ సబ్సిడీ దాదాపు రూ.15 కోట్లు ఇచ్చేలా, వడ్డీ సబ్సిడీ ఆరు శాతం ఏడేళ్ల పాటు.. అంటే రూ.42 కోట్లు, భూమికి రూ.130 కోట్లు, ఇవి కాకుండా వారు చెబుతున్న ప్రకారం 6 వేల మంది ఉద్యోగుల జీతాలపై సబ్సిడీ ఏడేళ్లకు రూ. 130 కోట్లు కలిపి మొత్తం రూ.300 కోట్లకు పైగా దోచిపెట్టేలా ఒప్పందం జరిగింది. తీరా చూస్తే ఆ ప్రాజెక్ట్ విలువ కేవలం రూ.40 కోట్లే. దాని డీపీఆర్ పెంచుకుని రూ.300కోట్లు దోచుకోవాలని పన్నాగం పన్నారు. ఆ సంస్థ 2017లో సివిల్ పనులు ప్రారంభించి, 2018 ఆగస్టు నాటికి ఫ్యాక్టరీ, బిల్డింగ్లు పూర్తి చేసి, 2018 అక్టోబరులో ఉత్పత్తి చేస్తామన్నారు. ఇంత హడావుడిగా షెడ్యూలు ఇచ్చిన ఆ సంస్థ ఎందుకు ఉత్పత్తి ప్రారంభించలేదు? బేరాలు కుదరలేదా?’ అని ప్రకాష్రెడ్డి అన్నారు. ‘ఆరోజు పప్పు మంత్రి నారా లోకేష్, తుప్పు మంత్రి పరిటాల సునీత చీకటి ఒప్పందం చేసుకున్నారు. తుప్పు మంత్రి కొడుకు, తమ్ముడు పోటీ పడి జాకీ కంపెనీ కాంపౌండ్ వాల్ నిర్మించాలని అనుకున్నారు. వారిద్దరూ కలిసి 2018 జూన్లో వంద మీటర్ల పనులు ప్రారంభించారు. మధ్యలోనే ఆపేశారు. హిందూపురంలో పది ఎకరాల్లో టెక్సో్పర్ట్ వచ్చింది. వారికి ప్రైమ్ ల్యాండ్ ఇవ్వలేదే? ఇక్కడేమో జాకీకి ప్రైమ్ ల్యాండ్ ఇచ్చారు. అయినా ఎందుకు రాలేదు? మీ చేతగానితనానికి మాపై విమర్శలు చేస్తారా’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పరిటాల పాపం.. రైతులకు శాపం
టీడీపీ హయాంలో తమ కాంట్రాక్ట్ పనులకు అవసరమైన మట్టి కోసం పరిటాల కుటుంబం జంగాలపల్లి చెరువుపై కన్నేసింది. చెరువు స్వరూపం దెబ్బతీసేలా అధునాతన యంత్రాలతో మట్టిని తవ్వేశారు. కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. చెరువు ఆయకట్టులో ఊట పడటానికి కారకులయ్యారు. పంటలు దెబ్బతినడంతో పాటు జమ్ము గడ్డి ఏపుగా పెరిగి ఇకపై సాగు చేయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. పరిటాల కుటుంబానికి కాసులు.. ఆయకట్టు రైతులకు కన్నీళ్లు మిగిలాయి. రాప్తాడు రూరల్: అనంతపురం మండలం జంగాలపల్లి చెరువు (కందుకూరు చౌడు చెరువు) 33 ఏళ్ల తర్వాత నిండింది. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఎమ్మెల్యే కాగానే ఆయా గ్రామస్తులు పట్టుబట్టి ధర్మవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జలాలను చెరువుకు తెప్పించుకున్నారు. చెరువుకు నీళ్లు రాగానే భూగర్భజలాలు పెరిగి బోరుబావులు రీచార్జ్ అవుతాయని ఆయకట్టు రైతులు ఆశపడ్డారు. అయితే వారి అశలు అడియాసలయ్యాయి. గత టీడీపీ పాలకులు చేసిన పాపం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. అప్పట్లో చెరువులో జరిపిన తవ్వకాల వల్ల కింది భాగం మట్టి లూజు అయ్యింది. ఫలితంగా ఊటలు ఏర్పడి సాగు చేసిన పంటల్లో నీరు ప్రవహిస్తోంది. తుడిచిపెట్టుకుపోయిన పంటలు ఈ చెరువు ఆయకట్టు దాదాపు 275 ఎకరాల దాకా ఉంది. నీటి ఊట కారణంగా 150 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణారెడ్డి, సోమశేఖర్రెడ్డి, రవిశేఖర్రెడ్డి, రాంభూపాల్రెడ్డి, పరుశురాం, వెంకటరాముడు, చరణ్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, సతీష్రెడ్డి, వెంకటరామిరెడ్డి తదితర రైతులు సాగు చేసిన చీనీ, అరటి, బొప్పాయి, స్వీట్ ఆరెంజ్, కాయగూరల పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. రైల్వే పనులకు చెరువు మట్టి గత టీడీపీ ప్రభుత్వంలో పరిటాల కుటుంబం కాంట్రాక్ట్ చేసిన రైల్వే పనులకు అవసరమైన కోట్లాది రూపాయల విలువైన మట్టిని జంగాలపల్లి చెరువు నుంచే తరలించింది. దాదాపు 30 అడుగుల లోతు ఇష్టారాజ్యంగా హిటాచీల సాయంతో తవ్వేశారు. జీడిబంక మట్టి అంతాపోయింది. ఇసుక, గరుసు వచ్చేవరకు తవ్వకాలు జరిపారు. టిప్పర్లు కింది నుంచి పైకి వచ్చేందుకు ప్రత్యేకంగా రన్వే ఏర్పాటు చేశారంటే ఏ స్థాయితో తవ్వకాలు చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఉబికి వస్తున్న నీళ్లు చెరువు ఆయకట్టులో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఉన్న పంటలు నష్టపోవడంతో పాటు కొత్తగా పంటలు సాగు చేసేందుకు కూడా వీలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. బోర్లలో నుంచి నీరు బయటకు వస్తోంది. నీటి ప్రవాహంతో పెద్ద ఎత్తున జమ్ము పెరిగింది. చేపల చెరువులకు లీజుకు ఇచ్చిన రైతులు నీటి ఊటతో పంటలు సాగు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో తొలిసారి చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. ఆయకట్టు కింద వెంకటరామిరెడ్డి, చరణ్కుమార్రెడ్డి వరి సాగు చేసేవారు. మంచి దిగుబడి వచ్చేది. ఈసారి నీటి ప్రవాహం కారణంగా పంట సాగు చేసేందుకు వీలు కాకపోవడంతో తమ భూమిని నెల్లూరు జిల్లా వాసులకు చేపల చెరువుల కోసం లీజుకు ఇచ్చారు. మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి.. టీడీపీ పాలనలో చెరువులో జరిపిన మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దుగుమర్రి గోవిందరెడ్డి, సర్పంచ్ ప్రశాంత్కుమార్, ఎంపీటీసీ సభ్యులు రాగే రేవతి, పెద్దప్ప, ఉపసర్పంచ్ ఓబులేసు, పార్టీ గ్రామ కమిటీ చైర్మన్ గోవర్దన్రెడ్డి, నరసింహారెడ్డి, సుధీర్రెడ్డి తదితరులు తెలిపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఎంతో కష్టపడి కృష్ణాజలాలతో చెరువును నింపించారన్నారు. చెరువు అడుగు భాగం బాగా దెబ్బతినడంతో ఊటలు ఏర్పడి ఆయకట్టు అంతా నీరుపారుతోందన్నారు. ఇప్పటికే 60 శాతం దాకా నీళ్లు బయటికిపోయాయని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆయకట్టులో జమ్ము గడ్డి పెరిగిందన్నారు. దీంతో ఇకపై పంటలు పెట్టేందుకు వీలుకాదని తెలిపారు. వ్యవసాయ పంటలకు దెబ్బ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చెరువుకు 75 శాతం నీళ్లు వచ్చినా ఏరోజూ ఊట పడలేదు. ఆనందంగా వరి సాగు చేసి.. 450 ప్యాకెట్ల ధాన్యం తీసేవాళ్లం. ఇప్పుడు ఆయకట్టులో భారీగా నీళ్లు ఊరుతున్నాయి. నా జీవితంలో ఎప్పుడూ ఆయకట్టులో జమ్ము గడ్డి పెరగడం చూడలేదు. ఇప్పుడా పరిస్థితి రావడంతో వ్యవసాయ పంటలకు పెద్ద దెబ్బ పడింది. – చరణ్కుమార్రెడ్డి, రైతు, జంగాలపల్లి మోటార్లతో నీళ్లు తోడుతున్నాం ఆయకట్టు కింద నాలుగు ఎకరాల్లో చీనీ పంట, మూడెకరాల్లో అరటి సాగు చేశాను. ఊట దిగడంతో అరటి పంట మొత్తం దెబ్బతింది. అరటిపంటలో మొత్తం జమ్ము పెరిగింది. నాలుగున్నరేళ్ల వయసున్న చీనీచెట్లను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నా. రోజూ మోటార్లతో నీళ్లు తోడిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. చెరువు అంతా పెద్ద పెద్ద గుంతలు తవ్వడం వల్లే నీటి ఊటలు ఏర్పడ్డాయి. – కృష్ణారెడ్డి, చెరువు ఆయకట్టు దారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఊటలోనే 12 ఎకరాలు.. చెరువు ఆయకట్టు కింద 19 ఎకరాలు ఉంది. అరటి, బొప్పాయి, చీనీచెట్లు సాగు చేశాం. ఊట ఏర్పడి రెండెకరాలు మినహా తక్కిన పంటలన్నీ పూర్తిగా ఎత్తిపోయాయి. ఏడెనిమిది నెలలవుతున్నా 12 ఎకరాల భూమి నీళ్లలోనే ఉంది. 15 ఏళ్ల వయసున్న చీనీచెట్లు, కోతకు వచ్చిన అరటి, బొప్పాయి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు రూ. 20 లక్షల పైనే నష్టం వాటిల్లింది. గతంలో చెరువులో నీళ్లు ఉన్నా...ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. – సోమశేఖర్రెడ్డి, రైతు, కందుకూరు -
‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’
రాప్తాడు రూరల్: ‘బాబూ శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’ అని పరిటాల శ్రీరామ్ను కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు కూతురు రామాంజనమ్మ ప్రశ్నించారు. పరిటాల శ్రీరాములుకు కుడి భుజంగా ఉన్న తన తండ్రి బోయ రామాంజనేయులు అప్పట్లో పరిటాల శ్రీరాములుతో పాటు హత్యకు గురైన వైనాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. మంగళవారం తాను మాట్లాడిన వీడియో సందేశాన్ని ఆమె పత్రికలకు విడుదల చేశారు. సందేశంలోని అంశం ఆమె మాటల్లోనే... ‘మీ నాన్న పరిటాల రవీంద్ర, మీ అమ్మ పరిటాల సునీత మంత్రులుగా పని చేసిన సమయంలో తగరకుంట రామాంజనేయులు కుటుంబం మీకు గుర్తుకు రాలేదా? మీ తాత పరిటాల శ్రీరాములు కోసం మా నాన్న బోయ రామాంజనేయులు 1975లో ప్రాణాలిచ్చాడు. బాబూ శ్రీరామ్... మీ తాత కోసం మానాన్న ప్రాణాలిచ్చాడని ఈ రోజు గుర్తించావా? ఇన్నేళ్లలో ఈ మాట ఎప్పుడైనా చెప్పావా? ఏ రోజైనా మా గురించి ఆలోచించావా? మమ్మల్ని పకలరించావా? మాకేమైనా సాయం చేశావా? మా నాన్న చనిపోయినప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నా. నాకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొందో మాకు తెలుసు. ఈ రోజు మీ స్థాయి ఎలా ఉందో... మాస్థాయి ఎలా ఉందో ఆలోచించు. మమ్మల్ని గుర్తించింది ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఒక్కరే. ఆయన ఎంతో సాయమందించారు. భూమి ఇప్పించారు. బోరు వేయించారు. ఈ రోజు ప్రకా‹Ùరెడ్డి అన్న రూ. 500 కోట్లు సంపాదించాడని అంటున్నావు. మీ తాత ఉన్నప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో జనాలకు తెలుసు. నువ్వు అక్రమంగా ఎంత సంపాదించావో, ప్రకాశ్రెడ్డి ఎంత సంపాదించారో ప్రజలకు తెలుసు. మీ నాన్న, మీ అమ్మ మంత్రులుగా పని చేశారు. బోయ కులస్తులను గుర్తించి ఏ ఒక్క పదవైనా ఇచ్చారా? తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి బోయ కులస్తులను గుర్తించి అనేక పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ సొంత మండలం రామగిరిలో బోయ కులస్తులకు మీరు ఎన్ని పదవులు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని బెదిరించి ఎంత సంపాదించావో అందరికీ తెలుసు. మీ అవినీతి అంతా ప్రజలకు తెలుసు’ అని స్పష్టం చేశారు. -
టీడీపీ నేత పరిటాల సునీత దురుసు ప్రవర్తన
-
సత్యసాయి: టీడీపీ నేత పరిటాల సునీత దురుసు ప్రవర్తన
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ సోమవారం పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. వీరిద్దరూ అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో వాహనాల్లో పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు బయల్దేరారు. రామగిరి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న చెక్పోస్టు వద్ద వీరి వాహనాలను ఎస్ఐ జనార్దన్ నాయుడు ఆపారు. సీఎం పర్యటన ఉన్నందున భద్రత కారణాల దృష్ట్యా ఇన్ని వాహనాలను అనుమతించలేమని, కొన్నింటిని మాత్రమే పంపుతామని చెప్పారు. దీంతో పరిటాల సునీత శివాలెత్తారు. ‘గేటు ఎత్తరా.. ఏం చేస్తాడో చూద్దాం’ అంటూ అనుచరులు, రౌడీషీటర్లను ఉసిగొల్పారు. ఇది మంచి పద్ధతి కాదని, పరిస్థితులను అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరినా పట్టించుకోలేదు. ఎస్ఐతో సునీత, శ్రీరామ్ దురుసుగా ప్రవర్తించారు. ‘మీరు పంపకపోతే మేం దౌర్జన్యం చేస్తాం’ అంటూ బెదిరించారు. ఎస్ఐ అనే గౌరవం లేకుండా ‘ఏందయ్యా.. నువ్వు..’ అంటూ ఏకవచనంతో మాట్లాడారు. చివరకు చెక్పోస్టు గుండా నాలుగు వాహనాలు వెళ్లేందుకు ఎస్ఐ అనుమతించారు. కానీ పరిటాల అనుచరులు పోలీసుల ఆదేశాలను సైతం లెక్కచేయలేదు. దౌర్జన్యంగా చెక్పోస్టు గేటు పైకెత్తారు. వేరే మార్గాల గుండా వాహనాల్లో తరలివెళ్లారు. చదవండి: (అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి) -
దాడి చేసొస్తే.. దాచేస్తాం!.. పరిటాల కుటుంబం తీరుపై సర్వత్రా విమర్శలు
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): ఎవరైనా తప్పు చేస్తే మందలించాలి. నేరం చేస్తే పోలీసులకు అప్పగించాలి. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా చూడాలి. కానీ పరిటాల కుటుంబం మాత్రం తప్పు చేసిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కందుకూరు శివారెడ్డి హత్య కేసు నిందితులకు పరిటాల శ్రీరామ్ ఆశ్రయం ఇవ్వగా..తాజాగా గిరిజన యువకుడిపై హత్యాయత్నం కేసులోని నిందితులకు పరిటాల సునీత చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరి తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో పరిటాల కుటుంబం తీరుపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: కుప్పంలో టీడీపీ నేతల ‘కరెంట్ డ్రామా’ నిందితులను ఇంట్లో ఉంచుకున్న సునీత చిన్నాన్న రామగిరి మండలం సుద్దకుంటపల్లిలో రఘు నాయక్ అనే గిరిజన యువకుడిపై గత నెల నాల్గో తేదీన అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు బ్రహ్మ, శరత్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్తో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో నిందితులిద్దరూ గ్రామం నుంచి వెళ్లిపోయారు. వారికి మాజీ మంత్రి పరిటాల సునీత చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరి, ఆయన కుమారుడు ఎల్.నరేంద్ర చౌదరి ఆశ్రయం కల్పించారు. అనంతపురం నగరంలోని తమ నివాసంలోనే వారికి ఆశ్రయమిచ్చారు. సంఘటన గత నెల నాల్గో తేదీ జరగ్గా... ఎట్టకేలకు 29వ తేదీన ఎల్.నారాయణ చౌదరి నివాసంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు ఆశ్రయమిచ్చినందుకు ఎల్.నారాయణ చౌదరి (ఏ–11), ఆయన కుమారుడు ఎల్.నరేంద్ర చౌదరి (ఏ–12)పైనా రామగిరి పోలీసులు సెక్షన్ 212 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాడు హత్య కేసు నిందితులకు ఆశ్రయం గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన శివారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ట్యాంకర్తో గ్రామంలో నీరు ఉచితంగా అందిస్తూ సేవ చేస్తున్న శివారెడ్డిని నిష్కారణంగా చంపారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి గ్రామంలో ప్రజల మద్దతు తగ్గుతుందనే భావనతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా శివారెడ్డిని అంతమొందించారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సాకే బాలకృష్ణ ప్రధాన నిందితుడు. నిందితులు పోలీసులకు చిక్కే వరకు పరిటాల శ్రీరామ్ ఇంట్లోనే ఆశ్రయం కలి్పంచారు. కేసులో అరెస్టయ్యి బెయిల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పరిటాల శ్రీరామ్ పంచనే వారు ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. శ్రీరామ్ ప్రధాన అనుచరుల్లో బాలకృష్ణ ఒకరు కావడం గమనార్హం. ఆయన సమకూర్చిన వాహనంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు కందుకూరు గ్రామానికి నిందితులు వెళ్లగా.. జనం మూకుమ్మడిగా తరిమికొట్టారు. ఓటు సైతం వేయనీయలేదు. భయాందోళనలు సృష్టించేందుకేనా? గత సార్వత్రిక ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గ ఓటర్లు పరిటాల కుటుంబాన్ని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. నియోజకవర్గంలో తిరిగి పట్టు సంపాదించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులకు ఆశ్రయం కల్పిస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు
సాక్షి, అనంతపురం: ‘అనంత’ టీడీపీ అతుకుల బొంతగా మారింది. ఒకప్పుడు కంచుకోటగా గొప్పలు చెప్పుకున్న జిల్లాలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అంతర్గత కుమ్ములాటతో కేడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారంలో ఉన్నన్నాళ్లూ విక్టరీలు చూపించిన నేతలంతా... 2019 ఎన్నికల్లో తర్వాత పార్టీకి..ప్రజలకూ పూర్తిగా దూరమయ్యారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నియోజక వర్గాలే సామంతరాజ్యాలుగా భావించి పావులు కదుపుతున్నారు. ప్రతినియోజకవర్గంలోనూ రెండు మూడు గ్రూపులు. ఇద్దరు ముగ్గురు నాయకులు. మార్చి 29వ తేదీతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్లు నిండిన నేపథ్యంలో జిల్లాలో మంగళవారం జరిగిన పార్టీ కార్యక్రమాలు వర్గవిభేదాలకు అద్దం పట్టాయి. ఏ నియోజకవర్గంలోనూ నేతలంతా కలిసి ఒకే వేదికపైనుంచి కార్యక్రమాలు నిర్వహించిన దృశ్యం కనిపించలేదు. మడకశిరలో లుకలుకలు మడకశిర నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రెండు వర్గాల నాయకులను ఇటీవలే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలుపించుకుని మాట్లాడారు. కలిసి కట్టుగా పనిచేయాలని ఆదేశించారు. అయినా వేర్వేరుగానే అన్ని కార్యక్రమాలూ నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు కూడా తలోవైపు వెళ్లిపోయారు. పెనుకొండలో బీకే పార్థసారథి లేకుండానే ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుతున్న సవిత జేసీ..పరిటాలపై అసమ్మతి సెగలు జేసీ బ్రదర్స్ వ్యవహారంపై జిల్లాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిన్నటికి నిన్న పుట్టపర్తిలో జేసీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ పల్లె రఘునాథరెడ్డికి కాకుండా మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే పల్లె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు జేసీ వర్గానికి ప్రభాకర్చౌదరి వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జేసీ వర్గానికి అనంతపురంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వడానికి వీల్లేదంటూ జిల్లాలో చాలామంది పావులు కదుపుతున్నారు. ఇటీవల ప్రభాకర్ చౌదరి పాదయాత్ర చేస్తే ఎవరూ మద్దతు ఇవ్వలేదు. మరోవైవు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిని ఎట్టిపరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని పరిటాల శ్రీరాం తేల్చి చెప్పారు. బహిరంగంగానే సూరిపై విమర్శలు చేశారు. గుంతకల్లులో నాలుగు స్తంభాలాట గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి స్తంభాలాటగా మారింది. గుంతకల్లులో నియోజకవర్గ ఇన్చార్జ్ జితేంద్రగౌడ్ నాయకత్వంలో పరిటాల శ్రీరాములు కళ్యాణమండపంలోను, పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ వర్గం బీరప్పగుడి సర్కిల్ సమీపంలోనూ వేడుకలు నిర్వహించారు. గుత్తిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్ నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వాస్తవానికి వెంకటశివుడుయాదవ్, బండారు ఆనంద్కు పార్టీ ఇన్చార్జి జితేంద్రగౌడ్ నుంచి ఎలాంటి ఆహ్వానం కానీ సమాచారం కానీ అందలేదని తెలుస్తోంది. ఈ నలుగురు నాయకులు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటి నుంచే పార్టీ కేడర్పై పెత్తనం కోసం పావులు కదుపుతున్నారు. గుంతకల్లులో బండారు ఆనంద్ నేతృత్వంలో టీడీపీ జెండాను ఆవిష్కరిస్తున్న దృశ్యం పెనుకొండలో ఎడమొహం.. పెడమొహం పెనుకొండలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవిత ఎడమొహం పెడమొహంగా కనిపించారు. స్కూటర్ ర్యాలీలోనూ అలాగే వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకంటే తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటుండటంతో కేడర్ అయోమయంలో పడింది. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పార్టీ ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉన్నారు. బీకే వ్యవహారం నచ్చకే ఆయన ఇంటికి పరిమితమయ్యారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అటు అత్తార్..ఇటు కందింకుట కదిరిలో రెండు గ్రూపులుగా విడిపోయి టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ తన అనుచరులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించగా, మరో వైపు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా తన వర్గంతో కలిసి అత్తార్ రెసిడెన్సీలో సమావేశం నిర్వహించారు. కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి అత్తార్ చాంద్బాషా అంటూ అనుచరులు గట్టిగా నినాదాలు చేశారు. ఇంకోవైపు కందికుంట వర్గం ఈసారి కూడా టికెట్ కందికుంట అన్నకే..అని ఈలలు, కేకలు వేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రాయదుర్గంలో ఉనికి కోసం.. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకలకు వస్తే రూ.500తో పాటు మద్యం పంపిణీ చేస్తామని గుమ్మఘట్టకు చెందిన ఓ నాయకుడు కార్యకర్తలకు నమ్మబలికాడు. వచ్చిన తర్వాత నగదు ఇచ్చి మద్యం పంపిణీని విస్మరించడంతో కార్యకర్తలు మద్యం షాపుల వద్ద బండ బూతులు తిట్టారు. రాయదుర్గంలో కూడా రూ.300 నగదు, మద్యం ఇస్తామని చెప్పి మాట తప్పారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారే యమునా తీరే.. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, మహేశ్వర నాయుడు ఎవరికి వారు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఎటు వెళ్లాలో తెలియక కొందరు దూరంగా వెళ్లిపోయారు. -
పరిటాల సునీత, శ్రీరామ్పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం(రాప్తాడు): నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్తో పాటు మరికొందరిపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ బి.రాఘవరెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. అయితే రాప్తాడు మండల టీడీపీ కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మల్లికార్జున తదితరులతో కలిసి సునీత, శ్రీరామ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు బుధవారం జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రచార వాహనంపై నుంచి సునీత, శ్రీరామ్, సర్పంచ్ సాకే తిరుపాలు, పంపు కొండప్ప, సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ తదితరులు ప్రసంగాలు చేశారని, 30 యాక్ట్ ఉల్లంఘన కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. చదవండి: (హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్) -
అనంతపురంలో టీడీపీ నేతల భూ కుంభకోణం
సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సైనికుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి టీడీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ భూ బాగోతం రాచానపల్లి, ఇటుకలపల్లి, కురుగుంట గ్రామాల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై అనంతపురం ఆర్డీవో మధుసూదన్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రూ.100 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. అక్రమార్కులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. మాజీ సైనికుల పేరుతో వంద కోట్ల రూపాయల విలువైన భూములు స్వాహా చేసిన టీడీపీ నేతల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అనంతపురం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలతో.. మాజీ సైనికుల పేర్లతో భూమి పట్టాలు పొంది.. ఆ వెంటనే విక్రయించి సొమ్ము చేసుకున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని.. లోతుగా విచారిస్తే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు ఏవిధంగా స్వాహా చేశారో తెలుస్తుందని స్థానికులు కోరుతున్నారు. చదవండిః కన్నయ్య కుమార్పై దాడికి యత్నం -
పరిటాల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని వార్నింగ్.?
-
పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: టీడీపీ పాలనలో అవినీతి, దౌర్జన్యాలు చేసింది పరిటాల కుటుంబీకులేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల సునీత, శ్రీరామ్ వంటి వ్యక్తులు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తోపుదుర్తి మహిళా డైరీలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని పరిటాల సునీత, శ్రీరామ్కు సవాల్ విసిరారు. చదవండి: (ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్న్యూస్) -
పరిటాల సునీతకు నా రాజీనామా ఇస్తా: వల్లభనేని వంశీ
-
మీ ప్రతీ మాటకు నేనంతే స్థాయిలో సమాధానం చెప్తా: వల్లభనేని వంశీ
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కంటే విశ్వాస ఘాతకుడు ఎవరున్నారంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్ అయ్యారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇందిరా గాంధీ, ఎన్టీఆర్లకు విశ్వాస ఘాతుకం చేసింది చంద్రబాబు కాదా?. చంద్రబాబు బల్లాల దేవ అని సాక్షాత్తూ ప్రధాని మోదీ చెప్పారు. టీడీపీ నేతలు ఏం తిట్టినా అవి బాబుకే వర్తిస్తాయి. నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. లోకేష్కి దమ్ముంటే గన్నవరం వచ్చి పోటీ చెయ్యాలి. లోకేష్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా నేను రెడీ. పరిటాల సునీతకు నా రాజీనామా ఇస్తాను. నాపై పోటీకి ఎవరొస్తారో డిసైడ్ చేసి చెప్పండి. ప్రపంచంలో ఉన్న కమ్మోళ్లంతా వచ్చి ప్రచారం చేయండి. నన్ను, నా కుటుంబంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మీ ప్రతీ మాటకు నేను అంతే స్థాయిలో సమాధానం చెప్తాను. చదవండి: (ఇప్పుడే రాజీనామా చేస్తా: వల్లభనేని వంశీ) పరిటాల రవిపై చంద్రబాబు నిరంతరం తప్పుడు ప్రచారం చేయించాడు. ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం పరిటాలపై వ్యతిరేకంగా రాయించేవారు. పరిటాల రవిని దారుణంగా అవమానించింది చంద్రబాబే. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబు కారణం కాదా?. కోడెల పనులకి మాకు సంబంధం లేదని పార్టీ ఆఫీస్లో ప్రెస్మీట్ పెట్టించలేదా?. ఆడవాళ్లంటే చంద్రబాబు ఇంట్లో వాళ్లే ఆడవాళ్లా. మా ఇంట్లో ఆడవాళ్లని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చా?. ముఖ్యమంత్రి తల్లిని దూషించవచ్చా?. జయప్రదంగా చంద్రబాబు సైకిల్ గుర్తు దక్కించుకోలేదా?. కాల్ మనీ సెక్స్ రాకెట్లో చంద్రబాబు ఎవ్వరినైనా శిక్షించాడా. కాల్ మనీ వ్యాపారులకు పదవులిచ్చింది చంద్రబాబు కాదా. దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు కాదా. వీళ్లా మహిళల కోసం మాట్లాడేది' అంటూ వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చదవండి: (చంద్రబాబు చరిత్ర వింటేనే అసహ్యం: మంత్రి బాలినేని) -
పరిటాల సునీత వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ కౌంటర్
-
పరిటాల సునీతను నేను వదినగానే చూస్తాను: వల్లభనేని వంశీ
-
ఇప్పుడే రాజీనామా చేస్తా: వల్లభనేని వంశీ
సాక్షి, విజయవాడ: చంద్రబాబు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ‘‘పరిటాల సునీతను నేను వదినగానే చూస్తాను. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వచ్చే ఎన్నిక వరకు ఎందుకు.. ఇప్పుడే రాజీనామా చేస్తా. తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి చంద్రబాబు’’ అని వంశీ మండిపడ్డారు. చదవండి: టీడీపీ జాతీయ పార్టీనా?: ఎమ్మెల్యే వంశీ లోకేష్కు మీటర్, మోటార్, మేటర్ లేదు: వల్లభనేని వంశీ -
ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. ఆక్రమణ విలువ రూ.100 కోట్ల పైమాటే
-
చిక్కుల్లో పడ్డ పరిటాల సిద్దార్థ
-
పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం ఉందా? తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. గతంలో అతను లైసెన్స్ తీసుకున్న ఆయుధానికి, బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో అతని బ్యాగేజ్ నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్కు పొంతన లేకపోవడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లోనే ఆయుధం సరెండర్... పరిటాల సిద్ధార్థ్ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అనంతపురం కలెక్టర్ నుంచి ఆయుధ లైసెన్స్ తీసుకొని .32 క్యాలిబర్ పిస్టల్ కొన్నారు. దాని కాలపరిమితి 2019తో ముగియడం, అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎన్నికలకు ముందే తన ఆయుధాన్ని రామగిరి పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన బ్యాగేజ్లో లభించినవి 5.56 క్యాలిబర్ తూటాలు. ఇవి కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడే ఇన్సాస్ రైఫిల్స్కు సంబంధించినవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ వద్ద 5.56 క్యాలిబర్కు చెందిన అక్రమ ఆయుధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో శంషాబాద్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరి స్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా నిషేధిత తుపాకీ తూటాలు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు నిందితులను విడిచిపెట్టరు. అయితే సిద్ధార్థ్ను మాత్రం వివరణ కోరుతూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేసి వదిలేయడం గమనార్హం. ఆ కానిస్టేబుల్తో లింకులు ఉన్నాయా..? సిద్ధార్థ్ వద్ద లభించిన తూటాకు, ఈ ఏడాది ఏప్రిల్లో అస్సాంలోని బాగ్డోగ్రా విమానా శ్రయంలో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్ వద్ద లభిం చిన తూటాలకు లింకులున్నాయా? అనే అను మానాలు కలుగుతున్నాయి. అస్సాంలో పని చేసే అనంతపురం జిల్లా ములకనూరుకు చెందిన ఓ ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు కానిస్టేబుల్ ఏప్రిల్ 17న బెంగళూరు వెళ్లేందుకు బాగ్డోగ్రా విమానాశ్రయానికి రాగా ఆయన బ్యాగేజ్లో 5.56 క్యాలిబర్కు చెందిన 100 పేల్చని తూటాలు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఐటీబీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికితోడు ఆ కానిస్టేబుల్కు పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీతకు తన జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలింది. కనగానపల్లి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రామలింగయ్య టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యేతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ నుంచి పలువురు నాయాకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. టీడీపీ ఆవిర్భవం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ సర్పంచ్గా ఎంపీపీగా, పదవులు అలంకరించిన కేఎస్ ఫైరోజ్ బేగం, ఆమె భర్త జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు కేఎస్ ఉమర్తో పాటు మరో 50 కుటుంబాలకు చెందిన 200 మంది ఆదివారం వైఎస్సార్సీపీలో చెరిన విషయం తెలిసిందే. చదవండి: ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదు -
సునీత కుట్ర రాజకీయాలు చేస్తున్నారు
సాక్షి, అనంతపురం : చిత్రావతి రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని, 240 కోట్ల రూపాయల పరిహారం అందించి ముఖ్యమంత్రి వారికి న్యాయం చేశారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి పరిటాల సునీత కుట్ర రాజకీయాలు మానుకోవాలని, టీడీపీ హయాంలో ముంపు బాధితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు. చిత్రావతి ముంపు బాధితులందరికీ పరిహారం ఇచ్చామని తెలిపారు. ( రేపు రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు ) కేవలం 23 ఇళ్ల విషయంలో మాత్రమే వివాదం నడుస్తోందని, దీనిపై పరిటాల సునీత కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా లోకేష్ ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. ‘ గతంలో మంత్రి దేవినేని ఇదే గ్రామానికి వచ్చారు. ఏం న్యాయం చేశారు? 30 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను తీరుస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పరిటాల సునీత అనుచరుడి భూ బాగోతం
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడి భూ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత, రామగిరి మాజీ ఎంపీపీ బాలరంగయ్య ధర్మవరంలో 3 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్తో 8.5 సెంట్ల మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న బాలరంగయ్య, పరిటాల సునీతకు ప్రధాన అనుచరుడు. బాలరంగయ్య ఇచ్చిన నకిలీ పత్రాలతో మున్సిపల్ స్థలాన్ని అప్పటి సబ్ రిజిస్టర్ చేశారు. కాగా ఈ అక్రమాలను గుర్తించిన ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మున్సిపల్ స్థలాన్ని అక్రమంగా రిజస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. బాల రంగయ్య, సబ్ రిజిస్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’ -
‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’
సాక్షి, అనంతపురం: హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్కు నీరు తరలించాలన్న కల సాకారమైందని.. దివంగత మహానేత వైఎస్సార్ ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ పేరూరు డ్యామ్కు హంద్రీనీవా నీరు చేరటం హర్షణీయమన్నారు. కమీషన్ల కక్కుర్తితో పరిటాల సునీత హంద్రీనీవా పనులను నిర్లక్ష్యం చేశారని, అంచనాలు పెంచి పరిటాల కుటుంబం దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. 119 కోట్ల పనులను 1100 కోట్ల రూపాయలకు పెంచి నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తక్కువ వ్యయంతోనే మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పేరూరు డ్యామ్కు కృష్ణా జలాలను పేరూరు డ్యామ్కు తీసుకెళ్లామని.. రాప్తాడు అభివృద్ధిని చూసి పరిటాల సునీత ఓర్వలేకపోతున్నారన్నారు. (వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం) మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం.. మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి విగ్రహానికి కృష్ణా జలాలతో వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలు అభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుకు 2007లో అనంత వెంకటరెడ్డి పేరు పెట్టారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ 2015లో ప్రాజెక్టుకు ఆయన పేరును తొలగించింది. హంద్రీనీవా ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరును పునరుద్ధరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. -
'సీఐడీ విచారణ జరిపిస్తే నిజస్వరూపం తెలుస్తుంది'
సాక్షి, అనంతపురం : మంత్రిగా ఉన్న సమయంలో పరిటాల సునీత అనేక అక్రమాలకు పాల్పడ్డారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. ఆమె అవినీతిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సునీత తన కుటుంబసభ్యులతో కలిసి వందల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. సీఐడీ విచారణ జరిపిస్తే ఆమె నిజస్వరూపం మొత్తం బయటపడుతుందని, పౌరసరఫలా శాఖ కాంట్రాక్టులన్నీ ఆమె తన బినామీలకే కట్టబెట్టారని మండిపడ్డారు. జంగాలపల్లిలోని ఎఫ్సీఐ గోదాంలను నంద్యాలకు మార్చడంతో ప్రభుత్వానికి రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. (చంద్రబాబు.. అప్పుడు ఎందుకు జోలె పట్టలేదు?) -
పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. కురుగుంట గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని పేదల నుంచి పరిటాల వర్గీయులు డబ్బులు వసూలు చేశారు. తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరిన వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు అనంతపురం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులను పరామర్శించిన తోపుదుర్తి చందు.. కురుగుంట గ్రామస్తులను ఆదివారం వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు చందు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు అధికమయ్యాయని మండిపడ్డారు. కౌంటర్ కేసులతో బాధితులను భయపెడుతున్నారన్నారు. పరిటాల వర్గీయులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. -
పరిటాల మైనింగ్ మాఫియాపై సీఎంకు ఫిర్యాదు
సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత బంధువులు, ఎస్ఆర్సీ సంస్థ నిర్వాహకులు ‘వడ్డెర్ల బండ’ ద్వారా రూ.250 కోట్లు దోపిడీ చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి, అక్రమంగా కంకర తరలించి సొమ్ము చేసుకున్నారని విరుచుకుపడ్డారు. ఆత్మకూరు మండలం కుర్లపల్లి సమీపంలోని కంకర క్రషర్ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ బండపై ఆధారపడి 200 వడ్డెర కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. అయితే పరిటాల సునీత బంధువులు, ఎస్ఆర్సీ సంస్థ వారు క్రషర్ పేరిట లీజుకు తీసుకుని, అక్రమంగా మరికొంత బండను ఆక్రమించుకున్నారని విమర్శించారు. మూడో ప్యాకేజీ కింద హంద్రీ–నీవా కాలువ నిర్మాణం కోసం 20 లక్షల క్యూబిక్ మీటర్ల రాయికి బిల్లు తీసుకున్నారన్నారు. వాస్తవానికి కాలువపై ఆ మేరకు రాయి కనిపించడం లేదన్నారు. మరో 30 లక్షల టన్నుల రాయిని కంకరగా మార్చి అక్రమ మార్గంలో అమ్మేసుకున్నారన్నారు. వడ్డెర్ల బండకు సంబంధించి 24 ఎకరాలకు గాను 18 ఎకరాల్లో 35 లక్షల టన్నుల బండను క్రషింగ్ చేశారన్నారు. అంతేకాకుండా బండపైన, కాలువకు పైన ఉన్న రాయిలో దాదాపు 50 లక్షల టన్నుల రాయిని అమ్ముకున్నారన్నారు. మూడు ఎకరాలు బండ లీజు తీసుకుని, అంతకు మించి ఆక్రమించి బండ కొడుతున్నారని తెలిపారు. యరపతినేని మైనింగ్ మాఫియా తరహాలోనే ఇక్కడ కూడా మాఫియా చెలరేగిపోయిందన్నారు. క్రషర్ నిర్వాహకులు ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొమ్ము చేసుకుంటున్నా మైనింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరించారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆత్మకూరు పంచాయతీ రూ.60 కోట్లకు పైగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు కంకర మిషన్ ద్వారా వెలువడే దుమ్ము సమీప పొలాలను కప్పేస్తుండటంతో పంటలు పండటం లేదని, స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారని రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టనట్టు వ్యవహరించారని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఫిర్యాదు చేసిన రైతులపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. అధికారులు ప్రజల పక్షాన పనిచేయాలని హితవు పలికారు. ఇదివరకే మైనింగ్ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే ఈ మైనింగ్ మాఫియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆత్మకూరు, కృష్ణమరెడ్డిపల్లి, నసనకోట, సుబ్బరాయునిపల్లి వద్ద మైనింగ్ దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు. అవినీతి అక్రమాలకు సహకారం అందిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆత్మకూరు వడ్డెర్లకు జీవనోపాధిగా ఉన్న బండను తిరిగి అప్పగించాలని ఆయన సూచించారు. -
మాజీ మంత్రి పరిటాల నిర్వాకం; నకిలీ చెక్కులతో..
సాక్షి, అనంతపురం : నకిలీ చెక్కులు పంపిణీ చేసి రైతులను మోసం చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. రైతులు ఆ చెక్కులను మార్చకోవడానికి బ్యాంక్కు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాల కోసం రాప్తాడు రైతుల వద్ద నుంచి 13.20 ఎకరాల భూమిని సేకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక్కో బాధిత రైతుకు దాదాపు రూ. 29 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించగా, వాటిని మార్చి 2వ తేదిన రైతులకు స్వయంగా చెక్కులను పంపిణీ చేసింది. మంత్రి ఇచ్చిన చెక్కులను మార్చుకునేందుకు రైతులు బ్యాంక్కు వెళ్లగా, చెక్కులు చెల్లవని బ్యాంక్ అధికారులు చెప్పడంతో సునీతపై రైతులు మండిపడుతున్నారు. నకిలీ చెక్కులు ఇచ్చి మాజీ మంత్రి మమ్మల్ని మోసం చేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మొసలి కన్నీరొద్దు సునీతమ్మా..
సాక్షి, అనంతపురం : ‘‘గత ఐదేళ్లూ మంత్రిగా ఉన్న మీరు రాప్తాడు పంచాయతీలోని గంగలకుంట చెరువుకూ నీళ్లెందుకు ఇవ్వలేక పోయారు..?, ధనదాహంతో జంగాలపల్లి ఎఫ్సీఐ గోదామును మీరే మూయించింది నిజం కాదా..? అక్కడ పని చేస్తున్న కార్మికుల పొట్ట కొట్టింది మీరు కాదా..?, కక్కలపల్లి సమీపంలో ప్రైవేట్ టమాట మండీలో తిష్టవేసిన మీ బంధువులు, అనచరులు రైతుల నుంచి పదిశాతం పన్ను వసూళ్లు చేస్తూ దోచుకున్నది వాస్తవం కాదా..?, 2016 నుంచి నీళ్లొస్తున్నా మీ సొంత మండలంలోని పేరూరు డ్యాంకు ఎందుకు నీళ్లివ్వలేకపోయారు...?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాజీ మంత్రి పరిటాల సునీతను ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంద రోజుల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేశామనీ. గంగలకుంట చెరువుకు నీళ్లు ఇచ్చేందుకు ఇప్పటికే సర్వే పూర్తి చేయించామన్నారు. పీఏబీఆర్ కుడికాలువకు నీళ్లివ్వగానే గంగలకుంట చెరువుకు నీళ్లిస్తామన్నారు. పరిటాల సునీత మూసివేయించిన ఎఫ్సీఐ గోదామును తెలిపించి కార్మికులకు ఉపాధి కల్పించేందుకు డిల్లీకి వెళ్లి ఎఫ్సీఐ సీఎండీని కలిసి విన్నవించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే అక్కడే కొనసాగిస్తామని వారు చెప్పగా... ఇదే విషయాన్ని అధికారులతో కలిసి విన్నవించగా... సానుకూలంగా స్పందించారన్నారు. టమాటా మండీతో దోచుకున్నారు అనంతపురం రూరల్ కక్కలపల్లి సమీపంలో ప్రైవేట్ టమాట మండీని పరిటాల సునీత బంధువులు, అనచరులు నడుపుతున్నారనీ, పదిశాతం పన్ను రైతుల నుంచి వసూళ్లు చేస్తూ దోచుకుంటున్నా సునీత, అప్పటి ప్రభుత్వం కళ్లు మూసుకుందని ప్రకాష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా టమాట పండించిన రైతులు ధరలు లేక కోట్లాది రూపాయలు నష్టపోయారన్నారు. అసలు మండీ నడపడానికి ఎలాంటి అనుమతులు లేవని, దీన్ని సుమోటా తీసుకుని కలెక్టర్, ఎస్పీ కేసులు నమోదు చేయొచ్చన్నారు. ఈ మండీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరామన్నారు. ఇక సునీత సొంత మండలంలోని పేరూరు డ్యాంకు అతి తక్కువ ఖర్చుతో నీళ్లివచ్చని తాము చెబితే నవ్వారనీ, సీఎం జగన్మోహన్రెడ్డి సహకారంతో సర్వే పూర్తి చేయించామన్నారు. త్వరలోనే జీఓ కూడా విడుదలవుతుందన్నారు. డిసెంబరు 31లోపు పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చి డ్యాం కింద ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొస్తామన్నారు. అనంతపురం రూరల్ పాపంపేట, కక్కలపల్లికాలనీ పంచాయతీలకు పీఏబీఆర్ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందనీ, పైపులైను పనులు పూర్తికాగానే నీటి సరఫరా ప్రారంభమవుతుందన్నారు. పరిటాల సునీత ఐదేళ్లు ఎమ్మెల్యేగా, మరో ఐదేళ్లు మంత్రిగా పని చేసినా పరిష్కరించలేని సమస్యను తాము 60 రోజుల్లోనే పరిష్కరించామని చెప్పేందుకు గర్వపడుతున్నామన్నారు. అలాగే నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ప్రక్రియ మొదలైందని, రెండేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తామని ప్రకాష్రెడ్డి స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సీఎం పరితపిస్తున్నారనీ, వందరోజుల పాలనలో అభివృద్ధికి బీజం పడిందన్నారు. రానున్న రోజుల్లో సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు మహానందరెడ్డి, ముక్తాపురం లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీనివాసులు, రామాంజనేయులు పాల్గొన్నారు. -
పరిటాల సునీత వర్గీయుల దాష్టీకం
-
పరిటాల వర్గీయుల బరితెగింపు
సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో పరిటాల వర్గీయులు బరితెగించారు. వినాయక నిమజ్జనం ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నసనకోట గ్రామంలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం నిర్వహించారు. నిమజ్జన ఘట్టాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు పక్కనే వెంకటాపురం, గంగంపల్లి గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే గొడవ నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామంలోకి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పరిటాల వర్గీయులు, చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో కట్టెలు, రాళ్లతో దాడి చేయడంతో నసనకోట వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు బోయ సూర్యం తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు చాకలి నాగభూషణ, నరసింహులు, సావిత్రమ్మ, ముత్యాలప్ప, నరేష్, ప్రతాప్, క్రిష్ణమ్మ గాయపడ్డారు. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీస్పికెట్ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి తదితరులు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. -
పరిటాల సునీత వర్గీయుల దాష్టికం
సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. రామగిరి వైఎస్సార్సీపీ నేత బోయ సూర్యంపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వేటకొడవళ్లతో సూర్యంపై దాడి చేశారు. పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో ఈ ఘటన జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలు అయ్యాయి. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ డాడి చేయించారని బాధితులు ఆరోపించారు. గాయపడిన వారిని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు పరామార్శించారు. -
చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడు!
పెనుకొండ/చెన్నేకొత్తపల్లి : రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మంత్రి పరిటాల సునీత ఒత్తిడి నేపథ్యంలో అప్పట్లో పోలీసులు ఇద్దరు వైఎస్సార్సీపీ వర్గీయులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. మృతుడు మరో ప్రాంతంలో తిరుగుతుండటాన్ని గుర్తించిన గ్రామస్తులు అతడిని పోలీసుస్టేషన్లో అప్పగించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తు ఏ స్థాయిలో సాగుతుందో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్లో చెన్నేకొత్తపల్లి మండలం హరేన్చెరువుకు చెందిన తలారి శ్రీనివాసులు (38) హత్యకు గురైనట్లు పెనుకొండ పోలీసులు 2017 మార్చి 20న కేసు నమోదు చేశారు. హత్య చేశారనే అభియోగంతో హరేన్చెరువుకు చెందిన భాస్కర్రెడ్డి, ఓబిరెడ్డి అనే వ్యక్తులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత పోలీసులు అప్పగించిన మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. సీన్ కట్చేస్తే.. మృతుడు తలారి శ్రీనివాసులును హరేన్చెరువు గ్రామస్తులు శనివారం ధర్మవరంలో గుర్తించి అతన్ని చెన్నేకొత్తపల్లి పోలీసుస్టేషన్లో అప్పగించారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా అమాయకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గొల్లపల్లి రిజర్వాయర్లో చనిపోయినది శ్రీనివాసులు కాదని తేలడంతో అప్పట్లో వెలుగుచూసిన మృతదేహం ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. కేసును మూసివేసి చేతులు దులుపుకున్న వారికి ఈ కేసు కత్తి మీద సాముగా మారనుంది. కేసు పూర్వాపరాలివీ.. చెన్నేకొత్తపల్లి మండలంలోని హరియాన్చెరువు గ్రామానికి చెందిన తలారి శ్రీనివాసులు మండల కేంద్రంలోని గంగన ఓబిరెడ్డి రైస్మిల్లో దినసరి కూలీ. అయితే, 2017 మార్చి 19న తన బంధువుల ఊరికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ విషయమై తలారి శ్రీనివాసులు భార్య చిలకమ్మ చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్లో మర్నాడు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో అదే ఏడాది ఏప్రిల్ 4న పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్లో ఓ గుర్తు తెలియని శవం లభ్యమైంది. అది చెన్నేకొత్తపల్లిలో అదృశ్యమైన తలారి శ్రీనివాసులదేనని పెనుకొండ పోలీసులు గుర్తించి అతని కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించగా వారు అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానికులు గుర్తించిన శ్రీనివాసులును చెన్నేకొత్తపల్లి పోలీసుస్టేషన్లో అప్పగించారు. విషయం అతని కుటుంబ సభ్యులకు తెలియజేసిన సీఐ సిద్ధా తేజమూర్తి, తహసీల్దార్ తుకారంలు భార్య చిలకమ్మకు శ్రీనివాసులును అప్పగించారు. మరోవైపు.. ఈ అంశంపై మాట్లాడేందుకు పోలీసులెవరూ నోరు మెదపడంలేదు. తలారి శ్రీనివాసులు సైతం నోరు విప్పడంలేదు. అప్పట్లో పోలీసుల తీవ్ర వేధింపులు.. కాగా, చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్లో తలారి శ్రీనివాసులు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా రైస్మిల్ యజమాని వైఎస్సార్సీపీ నాయకులు గంగన ఓబిరెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్రెడ్డిలను అప్పట్లో తీవ్ర వేధింపులకు గురిచేశారు. మీరే చంపినట్లు ఒప్పుకోవాలని మంత్రి పరిటాల సునీత ప్రోద్బలంతో అప్పటి సీఐ యుగంధర్, ఎస్ఐ మహమ్మద్ రఫిలు తీవ్ర ఒత్తిడి చేశారు. తాజాగా.. శ్రీనివాసులు తిరిగి ప్రత్యక్షం కావడంతో పోలీసులు అధికార పార్టీకి ఏ విధంగా కొమ్ము కాశారనే విషయం అర్థమవుతోంది. విచారణ చేపడతాం అప్పట్లో ఈ కేసును ఎస్ఐ లింగన్న చూశారు. గొల్లపల్లి రిజర్వాయర్లో చనిపోయిన వ్యక్తి హరేన్చెరువుకు చెందిన తలారి శ్రీనివాసులుగా గుర్తించి కేసు నమోదు చేసి అనుమానితులను రిమాండ్కు పంపడం వాస్తవమే. తాజాగా ఆయన బతికే ఉన్న నేపథ్యంలో కేసును పునఃసమీక్షిస్తాం. – జనార్ధన్, ఎస్ఐ, పెనుకొండ -
పరిటాల శ్రీరామ్ అనుచరుల వీరంగం
చెన్నేకొత్తపల్లి: అనంతపురం జిల్లాలో రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. నాగసముద్రం గేటు వద్ద శుక్రవారం మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అనుచరులు వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడికి దిగారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల యూత్ కన్వీనర్ ఓబిలేసు,నాయకులు చింతకాయల పోతన్న, నాగేంద్ర, మేడాపురం రాజు, ముత్యాలు శుక్రవారం ఎన్.ఎస్.గేటులోని ఒక కూల్డ్రింక్ షాపు వద్ద నిలబడి ఉన్నా రు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరిటాల శ్రీరామ్ అనుచరులు మహేష్, పవన్కుమార్రెడ్డి, పోతలయ్య, సురేష్, రమణాచారి, ఫిరోజ్ వారితో గొడవకు దిగారు. ‘ఈ ప్రాంతం పరిటాల శ్రీరామ్ అడ్డా.. ఇక్కడ వైఎస్సార్సీపీ నాయకులు ఎవ్వరూ తిరగకూడదు’ అంటూ చిందులు తొక్కారు. వారిని అడ్డుకోబోయిన ఓబిలేసుతోపాటు మరో నలుగురిపై మారణాయుధాలు, కట్టెలతో దాడి చేసి గాయపరిచారు. వైఎస్సార్సీపీ నేతలు నేరుగా చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులంతా చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాయి. తమ పార్టీ నాయకులపై దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పార్టీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు రెండు గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డ ఆరుగురిని అరెస్టు చేసినట్లు రామగిరి సీఐ తేజోమూర్తి తెలిపారు. దాడికి పాల్పడిన మహేష్, పవన్కుమార్రెడ్డి, పోతలయ్య, సురేష్, రమణాచారి, ఫిరోజ్పై 143, 147, 148, 307, 324 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. -
మంత్రి పరిటాల సునీత దాష్టీకం
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరించని వారిని మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ టార్గెట్ చేశారు. మంత్రి అండతో చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో పరిటాల వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ రోజున వైఎస్సార్ సీపీకి ఎందుకు ఓట్లు వేశారంటూ రాడ్లు, కర్రలతో దాడి చేశారు.ఈ సంఘటనలో నలుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడులు చేసిన వారిలో ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే దాడికి పాల్పడ్డ పరిటాల వర్గీయులను వదిలివేయాలంటూ మంత్రి పరిటాల సునీత... ఎస్ఐ రఫీకి ఫోన్ కాల్ చేశారు. మంత్రి ఆదేశాలతో దాడి చేసినవారిని ఎస్ఐ వదిలివేయడంతో పాటు, పోలీసులు ఓ వర్గంవారికే వత్తాసు పలుకుతున్నారంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఆదేశాలతోనే దాడులు చేశామని నిందితులు చెబుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎన్ఎస్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. -
మంత్రి సునీత బంధువు నిర్వాకం
తమ పార్టీ అధికారంలో ఉందన్న ధైర్యం.. సాక్షాత్తూ మంత్రే తనకు అండగా ఉందన్న ధీమాతో తెలుగు తమ్ముడు రెచ్చిపోయాడు. అక్రమమని తెలిసినా.. ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో ప్రభుత్వ నిధులతో నిర్మించిన గదులకు అద్దె వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడు.తీరా అద్దెలు కట్టాలని కలెక్టర్ నోటీసు పంపడంతో అసలు విషయం వెలుగుచూసింది. రామగిరి : అధికారం అండతో టీడీపీ నాయకులు... వారి అనుచరులు అందినకాడికి దండుకున్నారు. మంత్రులంతా రూ.కోట్లలో దోపిడీ పర్వం కొనసాగిస్తే...వారి అనుచరులూ అదే స్థాయిలో రెచ్చిపో యారు. మండల కేంద్రంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో రామగిరి వికాస కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించారు. దీనికి పరిటాల రవీంద్ర గ్రీన్ఫీల్డ్గా నామకరణం కూడా చేశారు. 2015 ఆగస్టు 1న అప్పటి క్రీడాయువజన శాఖామంత్రి అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీతతోపాటు జిల్లా అధికారులు, నాయకులు హాజరై ప్రారంభించారు. బాడుగ సొమ్ము స్వాహా ముందుభాగంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లో 11 రూములను అప్పట్లోనే ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిచ్చారు. నెలకు రూ.1000 చొప్పున బాడుగ నిర్ణయించారు. ఈమేరకు షాపు నిర్వాహకులు ప్రతినెలా బాడుగ మొత్తాన్ని మంత్రి పరిటాల సునీత సమీప బంధువు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామ్మూర్తి నాయిుడుకు అందజేస్తున్నారు. కానీ అతను ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి కట్టకపోవడంతో ఈ 18న కలెక్టర్ దుకాణదారులకు నోటీసులు పంపారు. బకాయిగా ఉన్న 43 నెలల అద్దె వెంటనే చెల్లించాలని, ఇక నుంచి బాడుగ నెలకు రూ.2 వేలకు పెంచుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రతి నెలా సక్రమంగా బాడుగ చెల్లించిన వారికి కూడా నోటీసులు అందడంతో షాపు నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. -
రాప్తాడు చరిత్రలో..తొలి తిరుగుబాటు
ఈ ఏడాది ఫిబ్రవరి 3న తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా పసుపు – కుంకుమ చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు రోజులు ముందుగా గ్రామస్తులకు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. దాదాపు ఎన్నికలకు ఒక నెల ముందు సంక్షేమ ఫలాలు అందజేసే కార్యక్రమాలకు మంత్రి తెరలేపడంపై స్థానికులు భగ్గుమన్నారు. ఇంత కాలం తమ గ్రామంలోని ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించని ఆమెకు గ్రామంలో కాలు పెట్టే అర్హత లేదని, కాదూకూడదంటూ గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంక్ల్లో డీఫాల్టర్లుగా మారాల్సి వచ్చిందని దీనికంతకూ కారణం టీడీపీ ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు. పరువు దక్కించుకునేందుకు బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంక్లకు వడ్డీలు కట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చలేని అసమర్థ మంత్రి తమకు అక్కర లేదంటూ తేల్చి చెప్పారు. పసుపు – కుంకుమ పేరుతో వేసే భిక్షం తమకు అక్కర లేదని, చేయగలిగితే పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణాలు మాఫీ చేసి గ్రామంలోకి కాలు పెట్టాలని సవాల్ విసిరారు. దీనిపై మంత్రి కూడా అప్పట్లో స్పందించారు. గ్రామస్తుల్లో ఐక్యతను దెబ్బతీసేందుకు ఇది ప్రతిపక్షాల కుట్ర అని దుమ్మెత్తిపోశారు. తన పర్యటనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఘాటుగా స్పందించారు. చివరకు ఫిబ్రవరి 3వ తేదీ రానేవచ్చింది. ఉదయం నుంచి గ్రామంలో వాహనాలు రాకుండా స్థానికులు కాపుకాసారు. మంత్రి ఆదేశాల మేరకు సాక్షాత్తూ ఎస్సీ జీవీజీ అశోక్కుమార్ నేరుగా రంగంలోకి దిగారు. భారీగా పోలీసు బలగాలను గ్రామంలో మొహరింపజేసి మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు కేవలం మహిళలే రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. చివరకు మంత్రి సునీత కాన్వాయ్ రానే వచ్చింది. సభావేదిక వద్దకు నేరుగా వెళ్లేందుకు మంత్రి ప్రయత్నించడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఇక తమ చేతికి చిక్కిన చీపర్లు, చెప్పులను మంత్రి కాన్వాయ్పై విసిరారు. ఇచ్చిన హామీలు నెరవ్చేకుండా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావ్ అంటూ నినదించారు. మంత్రికి జరిగిన ఈ ఘోర పరాభవం నేటికీ నియోజకవర్గ ప్రజల మది నుంచి చెరిగిపోలేదు. హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఆమె ఇంత వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. గ్రామ స్వపరిపాలనకు స్వర్ణయుగం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ స్వపరిపాలన అనేది స్వర్ణయుగంలా సాగింది. గ్రామ పరిధిలో ఏ పని చేయాలన్నా.. స్థానిక ప్రజాప్రతినిధులదే తుదినిర్ణయంగా ఉండేది. దీని వల్ల గ్రామాల్లో చాలా వరకు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్వపరిపాలనను అపహాస్యం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలు లేకుండా చేశారు. అక్రమాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. భూదందాలు, భూకబ్జాల పెచ్చరిల్లాయి. పొరబాటున మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆ అరాచక పాలనను భరించలేం. గతంలోనూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చాలా దుర్మార్గమైన పాలన కొనసాగించారు. ఇంతటి దుర్మార్గమైన పాలన పోవాలంటే మళ్లీ వైఎస్సార్ పాలన రావాలి. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమవుతుంది. – మారుతీప్రసాద్ , తాజామాజీ సర్పంచ్, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం ‘వైఎస్సార్ చేయూత’ చంద్రబాబు పాలనలో కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేద విద్యార్థులు ఉన్నత చదువుల అవకాశాన్ని కోల్పోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించక చాలా మంది మధ్యలోనే చదువులు మానేశారు. రుణమాఫీ కాక రైతులు నానా అవస్థలు పడ్డారు. బ్యాంక్ల్లో డ్వాక్రా మహిళలు డీఫాల్టరయ్యారు. హౌసింగ్ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పునాదుల దశలోనే పేదల సొంతింటి కల నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ ప్రజలు అన్ని విధాలుగా దగాపడ్డారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు వచ్చారు. నవరత్న పథకాలను ప్రకటించి ప్రతి ఒక్కరికీ అభయమిచ్చారు. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల ఇళ్లలో ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 1 లక్ష వైఎస్సార్ కానుకగా ఇస్తానని పేర్కొనడం చాలా బాగుంది. అన్ని కులాల వారికీ ప్రత్యేక కార్పొరేషన్ల ు ఏర్పాటు చేసి జీవనోపాధుల పెంపునకు కృషి చేస్తాననడం చాలా బాగుంది. అందుకే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. – రవి, కళ్యాణదుర్గం -
ఏం చేశారని ఓట్ల కోసం వచ్చారు?
అనంతపురం : ‘ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ఓట్లు అడగడానికి వచ్చారు. మా ఇళ్లను కూల్చేశారు. భూములను లాక్కున్నారు. మరుగుదొడ్ల బిల్లులను తినేశారు. అష్టకష్టాలు పడుతున్న మమ్మల్ని ఏనాడూ పలకరించిన పాపాన పోలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చామా?’.. అంటూ మంత్రి పరిటాల సునీత, టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాంను రాప్తాడు వాసులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరాం, ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప ఆదివారం రాత్రి 9 గంటలకు అనంతపురం జిల్లా రాప్తాడుకు చేరుకున్నారు. సునీత మాట్లాడే సమయంలో స్థానిక మహిళలు పెద్దఎత్తున చుట్టుముట్టి ఇళ్లను కూల్చేశారంటూ మండిపడ్డారు. మరుగుదొడ్ల బిల్లుల మంజూరులో అవినీతిపై, జాకీ ఫ్యాక్టరీ కోసమంటూ నిరుపేదలకు చెందిన 50 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై నిలదీశారు. ఇలాంటి అవినీతిపరులకు తామెలా ఓటు వేస్తామనుకుని వచ్చారంటూ ప్రశ్నించారు. రాత్రి 11 వరకూ మంత్రి, ఆమె తనయుడు రాప్తాడులో మైకులు పెట్టి మరీ ప్రచారం నిర్వహించారు. -
జనాన్ని చూసి బేజారు.. పరిటాల వర్గీయుల దాడి..!
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి మంత్రి పరిటాల సునీత జీర్ణించుకోలేక పోతున్నారు. రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆమె సొంత మండలమైన రామగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుతుర్తి ప్రకాష్రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించగా..అక్కడి ప్రజలు భారీ ఎత్తున మద్దతు పలికారు. దీంతో ఆమె వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. ముత్యాలంపల్లి వద్ద ప్రకాష్ రెడ్డి కాన్వాయ్పై రాళ్లతో దాడి చేసి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఇంత జరగుతున్నా అక్కడున్న పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప టీడీపీ గూండాలను అడ్డుకునే యత్నం చేయలేదు. ఈ క్రమంలో డీఎస్పీ వెంకటరమణకి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాప్తాడులో సునీత దౌర్జన్యాలపై ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని, గత 25 ఏళ్లుగా పదవుల్లో ఉన్నా రామగిరి ప్రజల సమస్యలను పరిటాల కుటుంబం తీర్చలేకపోయిందని అన్నారు. ఐదేళ్లుగా రామగిరి మండలంలో పర్యటించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ఇదంతా మంత్రి కుట్రేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రామగిరి, కొత్తపల్లి, నసనకోట, పేరూరు గ్రామాల్లో ప్రకాష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. -
పోలింగ్ కేంద్రంలో తిష్టవేసిన పరిటాల సునీత
సాక్షి, అనంతపురం : ఎన్నికల వేళ టీడీపీ ప్రలోభాలకు తెరతీస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు డబ్బు కట్టలతో అడ్డంగా దొరకుతున్నారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాప్తాడులోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోనే తిష్టవేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు తాయిలాలు ఇచ్చేందుకు అక్కడే కూర్చుని ఉన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పరిటాల వర్గీయులు హడావిడి చేస్తున్నా.. అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలింగ్ కేంద్రం వద్ద ఉండకుండా పోలీసులు పంపేస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం.. రాప్తాడు పోస్టల్ బ్యాలెట్స్ కేంద్రం వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఒకే ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటుపై అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతపురం అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరారు. అరకొర ఏర్పాట్లపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నా సూరీ వర్గీయులు ధర్మవరం టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరీ వర్గీయులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సూరీ వర్గీయులు చుట్టుముట్టారు. ఎమ్మెల్యే వరదాపురం తనయుడు నితిన్సాయి తన అనుచరులతో వీరంగం సృష్టించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులను బెదిరిస్తున్నారు. వాటిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తూ.. చోద్యం చూస్తున్నారు. -
ఫ్యాక్షన్ను రూపుమాపుతాం
సాక్షి, ఆత్మకూరు: పదేళ్ల పరిటాల కుటుంబ నియంత పాలనతో రాప్తాడు నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. దాడులు, గొడవలు సృష్టించే వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్సార్సీపీకి ఒక్క అవకాశమిస్తే నియోజకవర్గంలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి అభివృద్ధికి బాట వేస్తాం’ అని వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం వేపచెర్ల, వేపచెర్ల ఎగువ తండా, దిగువ తండా గ్రామాల్లో బుధవారం వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోరంట్ల మాధవ్, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ – నీవా పిల్లకాలువల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. పరిటాల పాలనలో రాప్తాడు నియోజకవర్గం ఎటుంటి అభివృద్ధికీ నోచుకోలేదని, ప్రజలు పనులు లేక వలసలు వెళ్లారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి గ్రామాల్లో ఫ్యాక్షనిజం లేకుండా చే స్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 2.50 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేసి ఉచిత బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 8 చిన్న రిజర్వాయర్లను ఏర్పాటు చేసి పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందేలా చూస్తామని తెలియచేశారు. పీఏబీఆర్ కాలువ ద్వారా ప్రతి ఇంటికీ తాగు నీటిని అందజేస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే ఒక్క జగన్తోనే సాధ్యమన్నారు. నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీల ద్రోహి చంద్రబాబు బీసీల ద్రోహి చంద్రబాబునాయుడు అని వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విమర్శించారు. బీసీల అభ్యున్నతికి జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బీసీ డిక్లరేషన్తో బీసీలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాప్తాడు నియోజకవర్గం సాగునీటితో సçస్యశ్యామలం కావాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. -
పరిటాల వర్గీయుల బెదిరింపులు..
-
రాప్తాడులో విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ
-
హైదరాబాద్లో బట్టబయలైన పరిటాల నిర్వాకం
సాక్షి, హైదరాబాద్/అనంతపురం: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్లో పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. నగరంలోని అరాంఘర్ చౌరస్తా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పరిటాల వర్గీయుడి నుంచి పోలీసులు 24లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సునీత ముఖ్య అనుచరుడు రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ డ్రైవర్ సంతోష్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఓటమి భయంతోనే సునీత ఆరోపణలు
సాక్షి, అనంతపురం సెంట్రల్: ఓటమి భయం వెంటాడటం వల్లే రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పరిటాల సునీత తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. రాప్తాడులో పాతిక వేల ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలవబోతోందనే విషయాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాల గురించి ఆదివారం సాయంత్రం అనంతపురంలో ఎస్పీ అశోక్కుమార్ను క్యాంపు కార్యాలయంలో కలిసి వివరించారు. తాము రెచ్చగొట్టే పనులు చేస్తున్నామని, కక్షలకు ఆజ్యం పోస్తున్నామని ఎటువంటి ఆధారం లేకుండానే మంత్రి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో గొర్రెల కాపరులను తమ పొలాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నామని చెబుతుండడం బాధాకరమన్నారు. తమ గ్రామంలో 600 మంది గొర్రెల కాపరులుంటే అన్ని ఓట్లూ తమకే పడుతాయని, టీడీపీ నేతలు సైతం మా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం తమ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వ చ్చిన తమ పార్టీ నాయకుడు నరేందర్రెడ్డి వాహనంలో జెండా కర్రలు దొరికాయని కేసులు నమోదు చేయించారన్నారు. దీన్ని టీడీపీ నాయకుడు సోషల్మీడియాలో షేర్ చేయడం, ఇదే విషయాన్ని బలపరుస్తూ మంత్రి పరిటాల సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ముఖ్య నాయకులను పొట్టనపెట్టుకున్నారు! రాప్తాడు నియోజకవర్గంలో కనీసం ప్రతిపక్ష పార్టీ జెండా కర్రలు కూడా పట్టుకొని తిరిగే పరిస్థితి కల్పించకుండా టీడీపీ నాయకులు గత ఐదేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ ముఖ్యమైన నాయకులను పొట్టన పెట్టుకున్నారని ప్రకాష్రెడ్డి ఆరోపించారు. నిరాధాయుడైన రాప్తాడు మండల కన్వీనర్ ప్రసాద్రెడ్డిని తహసీల్దార్ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారన్నారు. కందుకూరు శివారెడ్డి, ఆత్మకూరు కేశవరెడ్డిలను వేటకొడవళ్లతో నరికి చంపారన్నారు. ఆ సమయంలో వారి వద్ద వైఎస్సార్సీపీ జెండా కర్రలున్నా ప్రాణాలతో బయటపడేవారని అన్నారు. సదరు హత్య కేసుల్లో నిందితులకు పరిటాల శ్రీరామ్ ఆశ్రయం కల్పిస్తున్నాడని, తమ వద్ద సాక్షాలున్నాయని స్పష్టం చేశారు. సదరు కేసుల్లో బాధిత కుటుంబాలు రాతపూర్వకంగా పరిటాల శ్రీరామ్, బాలాజీ, పరిటాల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. గతంలో పరిటాల రవి పీపుల్స్ వార్, ఆర్వోసీ సంస్థలు ఏర్పరుచుకొని హిట్లిస్టులు ప్రకటించి మరీ కాంగ్రెస్ నేతలను హత్య చేసిన చరిత్ర వారిదని తెలిపారు. రక్త చరిత్ర సినిమాలో కూడా ఇదే చూపించారన్నారు. ప్రస్తుతం ఓటమి అంగీకరించలేక రక్త చరిత్ర–3 ద్వారా ప్రత్యర్థులను హత్య చేయడానికి పన్నాగం పన్నుతున్నారన్నారు. సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు పండక 20వేల మంది వలసలు పోయారన్నారు. ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్త వడ్డే రాజయ్యను పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని, ప్రకాష్రెడ్డిని పదిరోజుల్లో చంపుతామని శ్రీరామ్ హెచ్చరించినా, సునీత తమ్ముడు మురళి మహిళలపై రాళ్లు రువ్వినా, ముకుందనాయుడు అనే వ్యక్తి పరిటాల సునీత సమక్షంలోనే ఎస్సీ, బీసీలకు వార్నింగ్లు ఇచ్చినా, హత్య కేసుల్లో బాధిత కుటుంబాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు. తెల్లకాగితంలా బతుకుతున్న తమపై బురుదజల్లే కార్యక్రమాలు పరిటాల సునీత ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజారాం, నాయకులు ప్రసాద్రెడ్డి, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాప్తాడులో టెన్షన్.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు
-
రాప్తాడులో టెన్షన్.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే గత నాలుగున్నరేళ్లుగా మంత్రి పరిటాల సునీత సొంత గ్రామమైన రామగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. మంత్రి సునీత ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను కూడా రామగిరి మండలంలోనికి అనుమతించలేదు. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పరిస్థితులు మారాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాప్తాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డికి రామగిరి మండలం ఎన్నికల ప్రచారానికి పోలీసులు అనుమతిచ్చారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి రామగిరి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రకాశ్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రామగిరి మండలంలోని ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సునీత తమ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రకాశ్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రకాశ్రెడ్డికి మద్దుతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. స్థానికులు మాత్రమే ప్రకాశ్రెడ్డి వెంట ప్రచారం చేయాలని ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల సునీత దౌర్జన్యాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. పరిటాల సునీత మండలమైన రామగిరిలోకి వీసా తీసుకుని వెళ్లేలా పోలీసులు ఆంక్షలు విధించారని.. గత నాలుగున్నరేళ్లుగా తమను రామగిరిలోకి అనుమతించకపోవటం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. కొందరు పోలీసులు, అధికారులు పరిటాల సునీతకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రామగిరిలో సునీత ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్కు ఓటు వేయకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలను భయపెట్టి గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాప్తాడులో వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
‘పరిటాల శ్రీరామ్ ఓడిపోతే ఊరుకోం’
సాక్షి, అనంతపురం : జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. శ్రీరామ్ గెలవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ప్రజలను బెదిరిస్తున్నారు. ఈ సారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ పరిటాల శ్రీరాంను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. అయితే పరిటాల శ్రీరాం ఓడిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. టీడీపీకి ఓటేయకపోతే చంపేస్తామంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను బెదిరిస్తున్నారు. తాజాగా కనగానపల్లి టీడీపీ నేత ముకుంద నాయుడు బహిరంగంగానే ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. పరిటాల సునీతతో కలిసి తల్లిమడుగు గ్రామంలో ప్రచారం నిర్వహించిన ముకుంద నాయుడు పోలింగ్ తేదీలోగా అందరూ టీడీపీలో చేరిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటేయకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్నారని ఆయన ఓడిపోతే సహించే ప్రసక్తే లేదన్నారు. ‘బెదిరింపు అనుకోండి.. వార్నింగ్ అనుకోండి.. పోలింగ్ తేదీలోగా అందరు టీడీపీలో చేరాలి. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి’ అంటూ ముకుందనాయుడు జనాలను హెచ్చరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ వియషంలో రాప్తాడు పోలీసులు ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
పరిటాల కుటుంబంలో టికెట్ చిచ్చు!
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత కుటుంబంలో ఎమ్మెల్యే టికెట్ చిచ్చురేపింది. వివరాల్లోకి వెళ్తే.. పరిటాల కుటుంబం రాప్తాడు, కల్యాణదుర్గం టికెట్లను తమకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరింది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఖరారు చేశారు. రాప్తాడు టికెట్ను మరోసారి పరిటాల సునీతకు కేటాయించారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆసక్తి కనబరిచారు. దీంతో రాప్తాడు నుంచి శ్రీరామ్ను బరిలో నిలిపేందుకు సునీత సిద్దమయ్యారు. తాము రెండు స్థానాలు కోరినప్పటికీ చంద్రబాబు ఒకటే సీటు కేటాయించడంతో.. సునీత పోటీ నుంచి తప్పుకున్నారు. శ్రీరామ్ను గెలిపించాల్సిందిగా ఆమె పార్టీ శ్రేణులను కోరారు. కాగా, రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీపై సునీత కుటుంబంలో అభిప్రాయ భేదాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్ పోటీని కుటుంబంలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. -
బొక్కచేర్ల నల్లపరెడ్డి టీడీపీకి రాజీనామ
-
వైఎస్సార్సీపీతోనే రాప్తాడుకు స్వాతంత్య్రం
అనంతపురం: ‘‘మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల రాక్షల పాలన నుంచి రాప్తాడు నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళపై ఉంది. వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వస్తుంది.’’ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో శుక్రవారం రాప్తాడు నియోజకర్గ పరిధిలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో ‘డ్వాక్రా ఢమరుకం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా విభాగం నియోజకవర్గ కన్వీనర్ అపర్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన మహిళలను చూస్తుంటే ‘లేచింది.. నిద్రలేచింది.. మహిళా లోకం. దద్దరిల్లింది చంద్రబాబు ప్రభుత్వం’ అన్నట్లుందన్నారు. మంత్రి పరిటాల సునీత మహిళగా ఉండి మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న ఆమె స్త్రీ, శిశువుల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆమె కుటుంబ సంక్షేమం మాత్రమే చూసుకుంటోందన్నారు. టీడీపీకి ఓటు వేస్తే వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ అక్కచెల్లెమ్మలతో ఓట్లు వేయించుకుని ఇప్పటిదాకా రూపాయి కూడా మాఫీ చేయకపోవడంపై సునీత ఏమి జవాబు చెబుతారని ప్రశ్నించారు. పరిటాల కుటుంబం మహిళల జీవితాలు, వారి పసుపు కుంకుమలతో ఆడుకుంటున్నారనేది ఇక్కడికి వచ్చిన కొన్ని కుటుంబాలను చూస్తే అర్థమవుతోందన్నారు. మగవాళ్లను చంపి ఆ కుటుంబాలను దిక్కులేని వాళ్లను చేశారన్నారు. పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు దోచుకోవడంతో పాటు అడ్డొచ్చిన వారిని దారుణంగా చంపిస్తున్నారన్నారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులతో కొట్టించిన మంత్రి సునీత మహిళ కాదా? అనిప్రశ్నించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా సునీత, ఆమె తనయుడు, కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారన్నారు. తోపుదుర్తిలో ఎలాగైతే మహిళలు మంత్రి సునీతకు నిలబెట్టి నీళ్తు తాపించారో.. నియోజకవర్గమంతా అదే రీతిన బుద్ధి చెప్పి ప్రకాష్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. రాప్తాడులో మరోమారు సునీతను గెలిపిస్తే ఆమె కొడుకు శ్రీరామ్ను మీ మీద రుద్దుతారని.. అలాంటి గన్నేరుపప్పు అవసరమా? అనేది మహిళలు నిర్ణయించుకోవాలన్నారు. సైకిల్కు ఓటు వేస్తే ఉగ్రవాదానికి ఓటేసినట్లేనన్నారు. ఫ్యానుకు ఓటేస్తే అభివృద్ధికి, ప్రత్యేకహోదాకు ఓటేసినట్లన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శైలజ చరణ్రెడ్డి, బోయ సుశీలమ్మ, శ్రీదేవి, అనంతపురం, హిందూపురం పార్లమెంటు జిల్లాల అధ్యక్షురాళ్లు గిరిజమ్మ, పార్వతమ్మ, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకురాళ్లు నయనత, అంజనాదేవి, ఉషారాణి, భానుకోట రాధమ్మ పాల్గొన్నారు. క్షీర విప్లవం తీసుకొస్తాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలతో సహకార డైరీలు ఏర్పాటు చేసి క్షీర విప్లవం తీసుకొస్తాం. తాను బతికున్నంత వరకు మహిళలకు అండగా ఉంటానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేశారు. అప్పట్లో ఆయన రుణ విప్లవం తీసుకొచ్చారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత డ్వాక్రా మహిళలను మోసం చేశారు. వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గెలిచిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. రుణాలు మాఫీ చేయలేమంటూ మంత్రి పరిటాల సునీత స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీతో ఆర్నెల్ల పాటు మహిళలు రుణాలు చెల్లించలేదు. ఈ కారణంగా చాలా సంఘాలను బ్యాంకర్లు డిఫాల్టర్ల జాబితాలో చేర్చితే రూ.4–5 వడ్డీతో అప్పులు చేసి మరీ రుణాలు చెల్లించారు. ఇంతటి మోసం చేసిన చంద్రబాబు తీరా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పసుపు కుంకుమ పేరుతో మరోమారు మోసగించేందుకు వస్తున్నారు. రుణ మాఫీ హామీతో చేసిన మోసంపై ప్రతి ఒక్కరూ నిలదీయాలి. రాప్తాడు నియోజకవర్గంలో మండలానికో సామంతరాజును పెట్టి మంత్రి సునీత దోచుకుంటున్నారు. స్వచ్ఛభారత్ కింద 82 వేల మరుగుదొడ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే నిర్మంచకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తాం. లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం.– తోపుదుర్తి ప్రకాష్రెడ్డి,రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త -
మంత్రి సునీత కుటుంబ సభ్యులు దోచుకుతింటున్నారు
-
ఎన్నికల కోడ్ అమల్లోనూ పక్షపాతం!
సాక్షి, పొన్నూరు: ఎన్నికల కోడ్ను అమలు చేయాల్సిన అధికారుల పనితీరుపై విమర్శలొస్తున్నాయి. మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు, దొప్పలపూడి, మన్నవ, ఉప్పరపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల కోడ్ను పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. రాజకీయపార్టీ నాయకులకు చెందిన విగ్రహలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంటే తొలగించాలని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడు వచ్చి 10 రోజులు దాటినా అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికై నా ఎన్నికల అధికారులు స్పందించి అన్ని గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చేబ్రోలు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికి అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అధికారులు స్పందించికపోవటంపై విమర్శలు వ్యక్తంమవుతున్నాయి. మండల కేంద్రమైన చేబ్రోలులో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలోని జీబీసీ ప్రధాన రహదారి పక్కన ఉన్న తల్లీ బిడ్డ చల్లగా కార్యాలయ గోడలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, పరిటాల సునీత, ఎమ్మెల్యే నరేంద్రకుమార్ల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు, వాల్ ఫోస్టర్లు తొలగింపునకు నోచుకోలేదు. చంద్రన్న సంచార చికిత్స వాహనంపై ముఖ్యమంత్రి ఫొటోను అలాగే ఉంచారు. నారాకోడూరు, చేబ్రోలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థతి. గ్రామాల్లో అధికారుల పనితీరు టీడీపీకి ఒక న్యాయం, వైఎస్సార్ సీపీకి మరో న్యాయం అన్న చందంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. -
భయం.. భయం
ఈ చిత్రంలో కనిపిస్తున్న పూరి గుడిసె అంగన్వాడీ కేంద్రమంటే ఎవరైనా నమ్ముతారా! దీన్ని చూడలంటే అగళి మండలం డి.గొల్లట్టి గ్రామానికి వెళ్ళాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే అరొకర అద్దెకు ఇదిగో ఇలాంటి పూరి గుడిసెను అద్దెకు తీసుకొని నడిపిస్తున్నారు. ఇది ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుత వేసవిలో గాలి వెలుతురు రాక ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అనంతపురం సెంట్రల్: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ముక్కుపచ్చలారని పసిపిల్లలు, గర్భిణులు, బాలింతలు వచ్చే కేంద్రాలు ప్రమాదాకరంగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా,శిశు సంక్షేమశాఖకు జిల్లా చెందిన పరిటాల సునీత మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంపై అంతటా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో 5126 అంగన్కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2320 కేంద్రాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే నెట్టుకొస్తున్నారు. మిగిలిన కేంద్రాల్లో 1900 భవనాలు వివిధ స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తికి నోచుకోకపోవడంతో చాలా సెంటర్లు పాత భవనాల్లోనే నడిపిస్తున్నారు. కొన్నింటికి కొత్త భవనాలు నిర్మాణం చేపట్టకపోవడంతో వాటిలోనే కొనసాగిస్తున్నారు. పూర్తి శిథిలావస్థకు చేరుకున్న భవనాలు అనేకం ఉండడంతో వాటిలో సెంటర్లు నిర్వహించడానికి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరగరానిది జరిగితే ఎవరు భాద్యత వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుదిబండగా మారిన అద్దెలు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా 3.35 లక్షల మంది లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఇందులో దాదాపు 2.20 లక్షల మంది చిన్నారులు, 66,018 మంది గర్భిణులు, బాలింతలు, 4703 మంది కిశోర బాలికలు ఉన్నారు. వీరందరూ ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం, ఆరోగ్య మెలకువలు తీసుకుంటున్నారు. అయితే అంగన్వాడీ భవనాల విషయంలో ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. శిథిలావస్థకు చేరుకున్న భవనాల విషయాన్ని పక్కన పెడితే 2320 కేంద్రాలను అద్దె భవనాల్లో నడుపుతుండడం చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం అర్థం అవుతుంది. భవనాల అద్దె కూడా అంగన్వాడీ కార్యకర్తలకు గుదిబండగా మారుతోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1000, పట్టణ ప్రాంతాల్లో రూ. 4 వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. ఈ రేట్లకు కొన్ని ప్రాంతాల్లో భవనాలు కూడా దొరకడం లేదు. దీనికి తోడు సక్రమంగా అద్దె బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 9 నెలల నుంచి సెంటర్ అద్దెలు పేరుకుపోయాయి. దీంతో చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు జీతాల్లో నుంచి, అప్పుల తెచ్చి సెంటర్లు నడుపుతున్నారు. త్వరితగతిన నిర్మిస్తాం జిల్లాలో 1900 అంగన్వాడీ కేంద్రాలు కొత్తగా నిర్మిస్తున్నాం. ఇందులో చాలా భవనాలు పూర్తయ్యాయి. కొన్నింటిలో విద్యుత్, నీటి వసతి తదితర పనులు పెండింగ్ ఉన్నాయి. వీటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. త్వరలో ఈ భవానాల్లోకి అంగన్వాడీ కేంద్రాలు మార్పు చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తాం. – చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, మహిళాశిశు సంక్షేమశాఖ -
రాప్తాడులో మంత్రి సునీతకు ఎదురుగాలి
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత ఎదురుగాలి వీస్తోంది. కుటుంబ పాలనతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న టీడీపీ నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండడంతో మంత్రికి షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా రాప్తాడు మండలం బుక్కచెర్లకు చెందిన ఐడీసీ మాజీ చైర్మన్ నల్లపరెడ్డి, ఆయన సోదరులు మాజీ ఎంపీపీ వీరారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుబ్బారెడ్డి టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో వీరు మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. శుక్రవారం అనంతపురం నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో నల్లపరెడ్డి సోదరులు ఏర్పాటు చేసిన ‘ఆత్మీయ సభ’కు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గంగుల భానుమతి, మహానందరెడ్డి, జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, సాకే ఉమా, రిలాక్స్ నాగరాజు, మైనార్టీ నాయకులు రిజ్వాన్, ఖాదర్బాషా, తొండమాల రవి, ఎద్దుల అమర్నాథ్రెడ్డి, గౌస్, ఇలియాజ్, భూలక్ష్మి, వన్నా హనుమంతరెడ్డి, కదిరప్ప హాజరయ్యారు. రాప్తాడులో కుటుంబ పాలన ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు నియోజవకర్గంలోని అన్ని మండలాలకు మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారినే ఇన్చార్జ్లుగా నియమించుకుని కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మొదలుకుని నియోజకవర్గం వరకు ఒకే కులానిదే పెత్తనం సాగుతోందని విమర్శించారు. ఆ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపించడం లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం దోపిడీ చేస్తోందన్నారు.‘నీరు–చెట్టు’ కార్యక్రమంలో ప్రతిరూపాయి వారి కుటుంబమే దోచుకుందని ఆరోపించారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, దీంతో చాలా మంది పార్టీకి దూరమవుతున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో భయపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. ఫ్యాక్షన్కు దూరంగా ఉంటామని చెప్పిన పరిటాల కుటుంబం ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాల్లో చిచ్చు పెడుతోందన్నారు. అనంతపురంలో ఎంపీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి, మేయర్ స్వరూప మూడుముక్కలాట ఆడుతున్నారంటూ మండిపడ్డారు. త్వరలోనే వైఎస్ జగన్ను కలిసి వైఎస్సార్సీపీలో చేరుతామన్నారు. రాప్తాడు, అనంతపురంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు తమవంతు కృషి చేస్తామన్నారు. -
పరిటాల సునీతకు షాక్
సాక్షి, అనంతపురం/కడప: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. అధినాయకత్వం వ్యవహార శైలితో తెలుగు దేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తుండటాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన టీడీపీలో ఉండలేమంటూ బయటకు వెళ్లిపోతున్నారు. (కాంగ్రెస్ టీడీపీల మధ్య సీక్రెట్ బట్టబయలు..) నలపరెడ్డి రాజీనామా అనంతపురంలో మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నియోజకవర్గం రాప్తాడుకు చెందిన నాయకుడు నలపరెడ్డి శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు, సునీత తమ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా నలపరెడ్డి ఆరోపించారు. రాప్తాడులో పరిటాల సునీత అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు. (‘కాల్వ’కు ఎదురుదెబ్బ!) టీడీపీకి బాలకొండయ్య గుడ్బై వైఎస్సార్ జిల్లా కడప టీడీపీలోనూ అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. జిల్లా టీడీపీ నాయకత్వ తీరు నచ్చక ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. తాజాగా కడప కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ ఓర్సు బాలకొండయ్య నేడు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో నాయకుల దగ్గర నీతితో కూడిన విలువలు లేకపోవడం వల్లే రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. (అవినీతి మంత్రి మాకొద్దంటూ టీడీపీ నేతల ర్యాలీ) -
‘రెండు ఓట్లు ఉన్నాయంటూ.. ఉన్న ఓటునే తొలగిస్తున్నారు’
-
‘రెండు ఓట్లు ఉన్నాయంటూ.. ఉన్న ఓటునే తొలగిస్తున్నారు’
అనంతపురం: తమ పార్టీ ఓట్లు తొలగింపుకు మంత్రి పరిటాల సునీత కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తనకు అనుకూలంగా ఉన్న రెవిన్యూ సిబ్బందితో సునీత కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పి.. ఉన్న ఒక్క ఓటునే తొలగిస్తున్నారని మండిపడ్డారు. ‘మంత్రి కొత్త ఎత్తుగడతో వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించడానికి యత్నిస్తున్నారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పి, ఒక చోట తొలగిస్తామని సంతకాలు చేయించుకుంటున్నారు. సంతకం చేశాక ఉన్న ఒక్క ఓటు తొలగిస్తున్నారు. దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. మంత్రి సునీతకు ఓటమి భయం పట్టుకుంది. దాంతోనే కుట్ర చేస్తున్నారు. ఆమెకు అనుకూలంగా ఉన్న అధికారుల ద్వారా వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించేందుకు పన్నాగం రచించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి’ అని తోపుదుర్తి స్పష్టం చేశారు. -
పరిటాలకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి మఖ్య అనుచరుడు
సాక్షి, అనంతపురం : ఎన్నికలు సమీపిస్తున్నవేళ మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్సార్ జిల్లాలో గురువారం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజన్నకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాప్తాడు వైస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. వేపకుంట రాజన్న చేరికతో నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పెరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా అందరిని కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పారు. -
మంత్రి పరిటాలకు భారీ షాక్..
-
గొందిరెడ్డిపల్లి ఘటనపై కేసు
అనంతపురం ,రాప్తాడు: గొందిరెడ్డిపల్లి ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో జరిగిన ఘటనలో 34 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పది మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులపైన, ఎనిమిది మంది టీడీపీ నాయకులపైన, అలాగే కానిస్టేబుల్పై జరిగిన దాడికి సంబంధించి ఇరు పార్టీలకు చెందిన 16 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆరోజు ఏం జరిగిందంటే..? ఈ నెల నాలుగో తేదీన గొందిరెడ్డిపల్లిలో జరిగిన ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మిడతల శీనయ్య వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని చంద్రబాబు ఫొటోపై పాలు పోసి ప్రమాణం చేయాలని డ్వాక్రా మహిళలకు హుకుం జారీ చేశాడు. దీంతో కొందరు మహిళలు తాము చంద్రబాబుకు ఓటు వేయబోమని, వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తామని స్పష్టం చేశారు. రెచ్చిపోయిన మిడతల శీనయ్య ఓ మహిళను చెప్పుకాలితో తన్నాడు. దీంతో మహిళలు, గ్రామస్తులు శీనయ్యపై ఎదురు దాడికి దిగారు. పోలీసులు కూడా టీడీపీ నాయకులకే వత్తాసు పలకడంతో ఆగ్రహించిన మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత సోదరుడు, టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి, మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ అనుచరులు పెద్ద ఎత్తున గ్రామంలోకి వచ్చి హల్చల్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మహిళలు అనే ఇంగిత జ్ఞానం లేకుండా వారిని చితకబాదారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు మరో ఐదుగురుకు స్వల్పంగా గాయపడిన విషయం విదితమే. 8 మందిపై కేసు నమోదు టీడీపీ నేతలు దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. మిడతల శీనయ్య, ఈశ్వరయ్య, మహమ్మదయ్య, డీలర్ మల్లికార్జున, పుటుక నాగభూషణం, మిడతల ముత్యాలు, మిడతల ఉజ్జినయ్య, ఎం.బండమీదపల్లి మాజీ సర్పంచు దుగ్గపాటి శ్రీనివాసులుతో పాటు మరికొంత మంది ఘటనలో ఉన్నట్లు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపైనా.. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు మాత్రమే దెబ్బలు తగిలాయని, టీడీపీ కార్యకర్తలకు ఒక్కరికి కూడా గాయం కాలేదని గొందిరెడ్డిపల్లి వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. అయితే కేసును తప్పుదోవ పట్టించేందు కోసం టీడీపీకి చెందిన గోపాల్, మల్లికార్జున, రామాంజినేయులుకు దెబ్బలు తగలకున్నా దెబ్బలు తగిలాయంటూ ప్రభుత్వాస్పత్రిలో చేరారని తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వెంకట్రామిరెడ్డి, శశిధర్రెడ్డి, హన్మంత రెడ్డి, వివేకానందరెడ్డి, మంజునాథ్రెడ్డి, సోమశేఖర్రెడ్డి, నరసింహరెడ్డి, కొండారెడ్డి, చెన్నారెడ్డి, నరేష్ కుమార్రెడ్డిలతో పాటు మరి కొంతమందిపై కేసు కట్టారు. వీరిలో ఆరోజు ఎవరూ కుడా ఘటలో పాల్గొనకున్నా పోలీసులు కేసు నమోదు చేయడం గమన్హారం. కానిస్టేబుల్పై దాడి ఘటనలో 16మందిపై కేసు ఈ ఘటనలో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ జయచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు ఇరు పార్టీలకు చెందిన 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో మిడతల శీనయ్య, శీనా, ఉజ్జినయ్య, డీలర్ మల్లికార్జున, గురవ మల్లికార్జున, మల్లప్ప, ఈశ్వరయ్య, మంజునాథ్రెడ్డి, వెంకట్రామిరెడ్డి, హరినాథ్రెడ్డి, పుల్లారెడ్డి, మధు, మిషన్ కొండారెడ్డి, లక్ష్మీదేవి, భాగ్యమ్మ, సింహాద్రిలతో పాటు మరి కొంతమంది ఉన్నారు. ధర్మవరపు మురళి పేరు తొలగింపు టీడీపీ నేతలు కొట్టిన దెబ్బలకు గాయపడి అనంతపురంలో చికిత్స పొందుతున్న బాధితులు హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మలు తమను గ్రామస్తులతో పాటు మంత్రి సోదరుడు ధర్మవరపు మురళి, పరిటాల శ్రీరామ్ అనుచరులు వచ్చి దాడి చేశారని, ధర్మవరపు మురళినే కొట్టించాడని, అతన్ని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. ధర్మవరపు మురళి తన కాన్వాయ్తో వచ్చి బా«ధితులపై రాళ్లు రువ్విన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పలు మీడియా చానళ్లలో కూడా ధర్మవరపు మురళి రాళ్లు రువ్విన దృశ్యాలను పదే పదే చూపిస్తున్నా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆయన మంత్రి పరిటాల సునీత సొదరుడు కాబట్టి. ధర్మవరపు మురళిని అరెస్ట్ చేస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయన్నది పోలీసుల భయం. ధర్మవరపు మురళితో పాటు మండల వ్యాప్తంగా పలువురు టీడీపీ నాయకులు ఈ ఘటనలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను చూస్తే పాల్గొన్నదెవరో పోలీసులకే తెలుస్తుంది. -
రౌడీ షీటర్తో కలిసి మంత్రి పరిటాల సునీత చెక్కుల పంపిణీ
-
మరో వివాదంలో పరిటాల సునీత
సాక్షి, అనంతపురం: ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ అన్న విషయం తెలిసిందే. తెర వెనుక రౌడీయిజాన్ని పెంచి పోషిస్తూ బయటకి మాత్రం అమాయక ముసుగు వేసుకోవడంలో టీడీపీ నాయకులు సిద్దహస్తులు. తాజాగా మరోసారి రౌడీ షీటర్లకు, టీడీపీ నాయకుల మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడ్డాయి. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడే ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా రావడం అందరినీ షాక్కు గురిచేసింది. ఈ సంఘటన అనంతపురంలోని చిన్మయ్ నగర్లో చోటుచేసుకుంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిటాల సునీత రౌడీ షీటర్ ఉప్పర శీనాతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వివాదంలో చిక్కుకున్నారు. రౌడీషీటర్తో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం వివాదస్పదమవుతోంది. రాప్తాడు తహశీల్దారు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఉప్పర శీనా కీలక నిందితుడు. అయితే అధికారిక కార్యక్రమాల్లో మంత్రి సునీత రౌడీ షీటర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై స్వపక్ష విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ రౌడీలు, గూండాలను పెంచిపోషించడం పరిటాల సునీతకు తగదని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. పోలీసులు కూడా పరిటాల కుటుంబానికి తొత్తులుగా పనిచేయం బాధాకరమన్నారు. మంత్రి తనయడు పరిటాల శ్రీరామ్ సోదరులు మురళీ, బాలాజీలపై పలు హత్యకేసుల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఎస్పీ అశోక్ కుమార్ మంత్రి వర్గీయులు ఆగడాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. -
మహిళలపై స్వయంగా మంత్రి సోదరుడి దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో డ్వాక్రా మహిళలపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. స్వయంగా మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళీ మహిళలపై రాళ్లు రువ్వాడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి సోదరుడు మురళీ రెచ్చిపోయాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తామని ప్రమాణం చేయాల్సిందిగా పరిటాల వర్గీయులు అడుగగా.. అందుకు డ్వాక్రా మహిళలు నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి పరిటాల సునీత వర్గీయులు దాడులకు దిగారు. పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంత్రి సోదరుడు మురళీ, పరిటాల అనుచరుల దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలా?
అనంతపురం: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన మంత్రి పరిటాల సునీతనే.. చట్టాన్ని ఉల్లంఘించేలా వ్యవహరించడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా...? అన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నగరంలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రికి హితవు పలికారు. డ్వాక్రా మహిళలకు ‘పసుపు–కుంకుమ’ కింద ఇస్తున్న డబ్బు కంటే ప్రభుత్వ ప్రచారమే ఎక్కువగా ఉందన్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మంత్రి సునీత..తమ గ్రామం వస్తుందని తెలుసుకునే తోపుదుర్తి మహిళలు ఆమెను నిలదీయాలని రెండు రోజుల కిందటే నిర్ణయించుకున్నారన్నారు. ఇది గ్రహించిన మంత్రి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని గ్రామాల్లోకి రానివ్వకుండా రాజకీయాలు చేసేది ఆడమగ కానివారేననీ, అదీ గతంలో ఎవరు... ఎక్కడ.... చేశారో వారికే తెలుసన్నారు. పదేళ్లలో మంత్రి సునీతను ఎన్నోమార్లు అడ్డుకున్నామనీ, నేడు సమస్య వచ్చింది కాబట్టే మహిళలు తిరగబడ్డారన్నారు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా..?ప్రకాష్రెడ్డికి పోయేకాలం వచ్చిందని మాట్లాడతారా...? అని ప్రశ్నించారు. తాము ఎంతో సంస్కారవంతంగా మాట్లాడతామనీ, తమ కుటుంబం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్రెడ్డి మంత్రి సునీతకు పలు ప్రశ్నలు సంధించారు. ♦ స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాల్లో రాప్తాడు నియోజకవర్గంలోనే రూ. వందల కోట్ల అవినీతి జరిగలేదా...? ఈ విషయంలో మహిళలను ఇబ్బంది పెట్టలేదా..? నిధులను మీ కార్యకర్తలు స్వాహా చేయలేదా..? కాణిపాకం వినాయకుడి మీద లేదంటే నీ భర్త పరిటాల రవి మీద ప్రమాణం చేసి అవినీతి జరగలేదని చెబుతారా...? ♦ రూ.వేల కోట్ల నిధులు ఉపాధి హామీ నిధులు నియోజకవర్గానికి వస్తే అందులో ఫారంపాండ్లకు నిధులు మళ్లించి జేసీబీలతో తవ్వించి, పాత వాటికి బిల్లులు చేసుకోలేదా..? నియోజకవర్గంలో 82 వేల మంది ఉపాధి కూలీల కడుపు కొట్టలేదా..? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయండి. విచారణకు ఆదేశించండి. ♦ మహిళలకు జరిగిన అన్యాయంపై కనీసం గొంతెత్తలేని మంత్రి ఈరోజు దమ్ముధైర్యం గురించి మాట్లాడతారా..? దమ్ము అనేది ప్రజలకు అండగా నిలబడడంలో ఉండాలి. వారు కష్టాల్లో ఉంటే నేనున్నానంటూ ఆదుకునే విషయంలో దమ్ముండాలి. ఇచ్చిన మాట నిలుపుకునే దానిలో దమ్ముండాలి. అలాంటి దమ్మున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని ప్రకాష్రెడ్డి స్పష్టం చేశారు. ♦ ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలి.. వచ్చిన తర్వాత దోచుకోవాలని ఆలోచించేది మీరు. రాజకీయాల పట్ల అవగాహన లేకపోతే పాఠాలు చెప్పించుకోండని మంత్రికి సూచించారు. ♦ ఐదేళ్ల కరువుతో రైతులు విలవిల్లాడుతున్నా.. ఇన్సూరెన్స్ గురించి ఆలోచించారా..? ఇన్పుట్ సబ్సిడీ ఏమైంది..? జిల్లాలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ మనసు కరగలేదా..? ♦ మంత్రిగా ఉంటూ కియా పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించే విషయమై మాట్లాడారా...? 3 వేలమంది ఉద్యోగులుంటే జిల్లాకు చెందిన వారికి 300 మందికైనా అవకాశం ఇప్పించారా...? జేజేలు పలికించుకోవాలంటే ముందుగా ప్రజల మన్నలు పొందాలని ప్రకాష్రెడ్డి హితవు పలికారు. ఈ విషయం మీ కుమారుడికి తెలియజెప్పండని సూచించారు. ♦ 25 ఏళ్లుగా మీ క్షుద్ర రాజకీయాలు చూసి ప్రజలు అలిసిపోయారనీ, అందుకే మార్పు కోసం ఎదురు చూస్తున్నారని ప్రకాష్రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు అండగా నిలుస్తున్నారనీ, రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని భరోసా ఇచ్చారన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు అండగా ఉంటామంటున్నామన్నారు. అందుకే ప్రజలు వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రాజారాం పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన సునీత సోదరుడు మురళి
-
పరిటాల దౌర్జన్యకాండ
-
రాప్తాడులో ‘దేశం’ దౌర్జన్యకాండ
అనంతపురం సెంట్రల్/రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత అనుచరుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తోపుదుర్తిలో ఆదివారం జరిగిన ఘటన మరువకముందే రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. గ్రామంలో సోమవారం జరిగిన ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమంలో ఓ మహిళను మంత్రి సునీత అనుచరుడు కాలితో తన్నడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో తమపైనే తిరగబడతారా అని మంత్రి సునీత సోదరుడు ధర్మవరపు మురళీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు గ్రామంపైకి దండెత్తారు. దొరికిన వాళ్లను దొరికినట్లుగా చితకబాదారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది తీవ్రంగా గాయపడగా ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఘటనలో కానిస్టేబుల్ జయచంద్రారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గొందిరెడ్డిపల్లిలో సోమవారం పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పరిటాల సునీత సోదరుడు, రాప్తాడు మండల టీడీపీ ఇన్చార్జ్ ధర్మవరపు మురళీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత కొంతమందికి చెక్కులు పంపిణీ చేసిన ఆయన.. అనంతరం పక్కనే ఉన్న పుల్లలరేవు గ్రామానికి వెళ్లారు. ఆ తర్వాత గొందిరెడ్డిపల్లిలో సభ నిర్వహించిన మంత్రి అనుచరుడు, మండల నాయకుడు మిడతల శీనయ్య.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని పాలతో ప్రమాణం చేయాలని డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చారు. అయితే, ఇందుకు కొంతమంది మహిళలు కుదరదని చెబుతూ తాము ఓటు వేసేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకేనని సభలో స్పష్టంచేశారు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన శీనయ్య.. ఓ మహిళను కాలితో తన్నడంతో ఆమె కిందపడింది. దీంతో సభలోని మహిళలు, గ్రామ ప్రజలు ఎదురుతిరిగారు. పోలీసులు కూడా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ ప్రజలను, మహిళలను పక్కకు తోసేస్తుండడంతో వారు అక్కడే రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మురళీ, మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ అనుచరులు పెద్దఎత్తున గ్రామానికి చేరుకున్నారు. ప్రశ్నించిన వారిలో దొరికిన వారిని దొరికినట్లుగా చితకబాదారు. పోలీసుల చేతుల్లో లాఠీలను తీసుకొని చావబాదారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి, నాగరత్న, లక్ష్మమ్మ, ఈశ్వరమ్మ, మల్లికార్జునరెడ్డి, పార్వతమ్మ, నాగేంద్రమ్మ, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హనుమంతరెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా, నాగరత్నమ్మ కాలు విరగడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భయాందోళనలో గొందిరెడ్డిపల్లి ప్రజలు మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్, ఆమె సోదరుడు ధర్మవరపు మురళీ తమ అనుచరులతో దాడులు చేయించడంతో గొందిరెడ్డిపల్లి గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ‘మా ప్రభుత్వంలో మాకే ఎదురుతిరుగుతారా?’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరులు, డ్వాక్రా మహిళలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మురళీ అర్ధరాత్రి వరకూ గ్రామంలోనే ఉండి భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితులు తెలిపారు. -
డ్వాక్రా మహిళలపై పరిటాల వర్గీయుల దాడి
సాక్షి, అనంతపురం : జిల్లాలోని రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో నిర్వహించిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు ప్రమాణం చేయాలని జారీ చేసిన హుకుంను నిరాకరించిన డ్వాక్రా మహిళలపై పరిటాల వర్గీయులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం, సోదరుడు మురళీ సమక్షంలోనే ఈ దాడులు జరిగాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయాలంటూ ప్రమాణం చేయించుకోవడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు పాలభిషేకం, టీడీపీకి ఓటు వేయాలని ప్రమాణం చేస్తేనే చెక్కులు ఇస్తున్నారు మహిళలు ఆరోపిస్తున్నారు. -
డ్వాక్రా మహిళలపై మంత్రి పరిటాల వర్గీయులు దాడి
-
మహిళలేమైనా మావోయిస్టులా : ప్రకాశ్రెడ్డి ఆవేదన
మంత్రి పరిటాల సునీతకు తన రాజకీయ జీవితంలో చవిచూడని ఎదురుదెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గంలో ఆర్భాటంగా ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం నిర్వహించాలనుకున్న ఆమెకుఅడుగడుగునా అడ్డుంకులే ఎదురయ్యాయి. ఆదివారం తోపుదుర్తి వెళ్లిన సునీతను.. డ్వాక్రా మహిళలుఅడ్డుకున్నారు. రోడ్లపై బైఠాయించి.. నల్లజెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ‘నిన్ను నమ్మం సునీతమ్మా’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో చేసిన మోసం చాలనీ, ఇప్పుడు కొత్తగామళ్లీ స్మార్ట్ఫోన్ రూ.10 వేల పేరుతో మాయచేయడం మానుకోవాలన్నారు. మహిళల ప్రతిఘటన..పోలీసుల బలవంతపు అరెస్టులతో తోపుదుర్తి గ్రామం అట్టుడికింది. అనంతపురం, ఆత్మకూరు : మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఆదివారం ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయాలని మంత్రి పరిటాల సునీత నిర్ణయించుకున్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆ గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలు రెండురోజుల కిందటే సమావేశమయ్యారు. మంత్రి సునీత, టీడీపీ సర్కార్ చేసిన మోసానికి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మంత్రి గ్రామానికి వస్తున్నట్లు తెలిసి రోడ్డుపై బైఠాయించారు. నల్లజెండాలు చేతబట్టి నిరసన తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది చాలక మళ్లీ ఇప్పుడు రూ.10వేలు ఇస్తామని పోస్ట్డేటెట్ చెక్కులు(మూన్నెల్ల తర్వాత చెల్లేలా తేదీ వేసిన చెక్కులు) ఇచ్చి మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. తమకిచ్చిన హామీలు నెరవేరిస్తేనే మంత్రిని గ్రామంలోనికి అడుగుపెట్టనిస్తామని, లేదంటే అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. ఇదంతా తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత గ్రామంలోకి కచ్చితంగా వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ బాబుతో పాటు సీఐలు, ఎస్ఐలు, సుమారు 400 మంది పోలీసులను గ్రామంలో మొహరించారు. మహిళలపై పోలీసు జులుం గ్రామానికి వస్తున్న మంత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతామని మహిళలు భీష్మించారు. దీంతో పోలీసులు వారిని చుట్టుముట్టారు. ‘వజ్ర’ వాహనాలను రప్పించారు. 11 గంటలకు మంత్రి కార్యక్రమం జరగాల్సి ఉండగా.. మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ సమయంలోనే మహిళలు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. చివరకు పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. గంటన్నర గ్రామం బయటే... గ్రామంలోని పరిస్థితి తెలుసుకున్న మంత్రి సునీత గ్రామం బయటే వేసి చూశారు. ఆ తర్వాత గ్రామానికి వెళ్లారు. అయితే పరిస్థితి అదుపులోకి రాలేదని తెలిసి దారిలోని గంటన్నరేపు కాన్వాయ్ నిలిపేశారు. దీంతో ఎస్పీ అశోక్కుమార్ గ్రామానికి వచ్చి పోలీసు బలగాలతో మహిళలను అరెస్టు చేసి తరలించారు. ఆ తర్వాత మంత్రి కాన్వాయ్ గ్రామంలోకి రాగానే పోలీసులు రెండువైపులా రక్షణగా ఉండి గ్రామంలోకి అనుమతించారు. అయినప్పటికీ గ్రామస్తులు మంత్రి కాన్వాయ్పై చెప్పులు, పొరకలు, చేటలు విసిరి నిరసన తెలిపారు. తోపుదుర్తి మహిళల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు మద్దతు తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని కూడా బలవంతంగా అరెస్టు చేశారు. రోడ్డుపై బైఠాయించి మంత్రి సునీతకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తోపుదుర్తి గ్రామ మహిళలు వడ్డీ మాఫీ కాలేదు మహిళా సంఘాల్లో తీసుకున్న రుణం అంతా మాఫీ అవుతుందని ఆశపడ్డాం. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇంత వరకు రుణాలు కాదు కదా...వాటికి సంభందించిన వడ్డీలు కూడా మాఫీ కాలేదు. అలాంటప్పుడు మోసపూరిత హామీలు ఎందుకివ్వాలి. – భావమ్మ, తోపుదుర్తి పోలీసుల అండతో వచ్చారు డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మహిళలం నిలదీస్తామని తెలియడంతో మంత్రి సునీత గ్రామంలోకి పోలీసులు అండతో వచ్చారు. నిజంగా హామీలు నెరవేర్చి ఉంటే మహిళలు ఎందుకు నిలదీస్తారు. ఇప్పుడు ‘పసుపు –కుంకుమ’, సెల్ఫోన్ అంటూ మళ్లీ మోసం చేస్తూ.. చెక్కులను అందజేస్తున్నారు. – చంద్రకళ, తోపుదుర్తి మహిళలకుఅన్యాయం చేసిన మంత్రి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని పరిటాల సునీత ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ రుణమాఫీ కాదు కదా కనీసం వడ్డీ కూడా కట్టలేదు. పెట్టుబడి నిధి కింద రూ.10 వేలు ఇస్తే.. ఆ డబ్బును బ్యాంకోళ్లు వడ్డీ కింద జమ చేసుకున్నారు. మహిళలకు అన్యాయం చేసిన మంత్రి మాకు వద్దేవద్దు.– అక్కమ్మ, తోపుదుర్తి -
మంత్రి కాన్వాయ్పై చెప్పుల వర్షం
-
మహిళామంత్రి సమక్షంలో ఆడపడుచులపై దౌర్జన్యం
ఆత్మకూరు: రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో మహిళలపై దౌర్జన్యం జరిగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రిని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన మహిళలను పోలీసులు ఈడ్చిపారేశారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు మంత్రి సునీత కాన్వాయ్పై చెప్పులు, పొరకలు, చేటలు విసిరి నిరసన తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చేయకుండా మోసం చేసి, తిరిగి ఎన్నికల సమయంలో మోసపు మాటలు చెప్పడం, ప్రశ్నించిన మహిళలను పోలీసులతో అరెస్టు చేయించి విచక్షణారహితంగా వ్యవహరించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని తోపుదుర్తిలో ఆదివారం ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయడానికి మంత్రి పరిటాల సునీత వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. తమకిచ్చిన హామీలు నెరవేరిస్తేనే గ్రామంలోకి మంత్రిని అడుగుపెట్టనిస్తామని మహిళలు తెగేసి చెప్పారు. దీంతో 400 మంది పోలీసుల భద్రతతో మంత్రి వెళ్లారు. మంత్రి వస్తున్న సమయంలో వందలాది మంది మహిళలు నల్లజెండాలు చేతపట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. మహిళలపై పోలీసుల జులుం మహిళలను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో మహిళలు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. రుణమాఫీ చేస్తామని చేయకుండా కేవలం రూ.10వేలు పెట్టుబడి నిధి కింద ఇచ్చారని, ఇది బ్యాంకర్లు రుణం కింద జమ చేసుకున్నారని.. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలు ఇస్తాం, స్మార్ట్ ఫోన్లిస్తామని మోసపూరిత మాటలు చెబుతున్నారని.. మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించడంతో కొందరికి గాయాలయ్యాయి. రోడ్డుపై కిందపడిపోతే ఈడ్చుకుంటూ వెళ్లి వాహనంలోకి ఎక్కించారు. సమావేశానికి మహిళలను తెచ్చుకున్న మంత్రి అనంతరం తన కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలను సొంతంగా ఏర్పాటు చేసిన 60 వాహనాల్లో ఇతర గ్రామాలనుంచి రప్పించారు. మంత్రి కారుపై గ్రామస్తులు పెద్ద ఎత్తున చెప్పులు విసిరారు. అదే సమయంలో మంత్రి తనయుడు పరిటాల శ్రీరాం తన అనుచరులతో గ్రామానికి వచ్చారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారితో సమావేశం తూతూమంత్రంగా నిర్వహించి వెనుదిరిగారు. తాళిబొట్టు తెంపేశారు డ్వాక్రా రుణం మాఫీ కాలేదని మంత్రిని ప్రశ్నించాలనుకున్నాం. పోలీసులు అడ్డుకోవడంతో దాదాపు మూడు గంటల పాటు రోడ్డు పైనే కూర్చున్నాం. మంత్రి వస్తున్నారని పోలీసులు రోడ్డుపై ఉన్న మమ్మల్ని ఈడ్చిపడేశారు. ఆ సమయంలో నా తాళిబొట్టు తెగిపోయింది. ఇంత అరాచకం చేస్తారా? ఒక మహిళగా మంత్రి సునీత వ్యవహరించిన తీరు ఏం బాగోలేదు. మా ఉసురు తప్పక తగులుతుంది. – మమత, తోపుదుర్తి -
డ్వాక్రా మహిళలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
-
మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల నిరసన సెగ!
-
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత
-
మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల సెగ!
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ పేరుతో తమను మోసం చేశారంటూ తోపుదుర్తిలో డ్వాక్రా మహిళలు మంత్రి పరిటాల సునీతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు కర్కషంగా అరెస్టు చేశారు. డ్వాక్రా మహిళలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. డ్వాక్రా రుణమాఫీ గురించి అడిగితే అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వందలాదిమంది పోలీసులతో మహిళలను ఈడ్చిపారేస్తున్నారని వారు మండిపడ్డారు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ఎవరినీ మోసం చేస్తారని మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రి పరిటాల సునీత పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. డ్వాక్రా మహిళల అరెస్టులను వైఎస్సార్సీపీ ఖండించింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తే అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్వాక్రా మహిళల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని, డ్వాక్రా మహిళలపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టి అర్థమవుతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. డ్వాక్రా మహిళలను పోలీసులు అడ్డుకోవడం దారుణమని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మండిపడ్డారు. డ్వాక్రా మహిళలతో మాట్లాడటానికి కూడా మంత్రి పరిటాల సిద్ధంగా లేరని, రుణమాఫీపై మంత్రి సమాధానం చెప్పాలంటూ మహిళలు తిరగబడ్డారని ఆయన తెలిపారు. మరోసారి మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆరోపించారు. -
మోసకారి సునీత!
నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజలపై ప్రేమ ఒలకబోస్తున్న టీడీపీ మోసాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. నెత్తీనోరు కొట్టుకున్నా కొత్త పింఛన్లు ఇయ్యని సర్కారు.. ఇప్పుడు పింఛను సొమ్ము పెంచామని గొప్పలు చెప్పడాన్ని ఏ ఒక్కరూ నమ్మని పరిస్థితి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. నమ్మించి మోసగించిన బాబు తీరుపై మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. నమ్మి ఓట్లేసినందుకు బ్యాంకర్ల ఒత్తిళ్లకు ఒంటిపై నగలు తాకట్టుపెట్టి వడ్డీలు కట్టినామని కళ్ల నిండా నీళ్లతో ఉగ్రరూపం దాలుస్తున్నారు. అనంతపురం, ఆత్మకూరు: ఓ మహిళగా మంత్రి సునీత చేసిన మోసాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడంపై ఒంటికాలి మీద లేస్తున్నారు. కనీసం కొత్త పింఛన్లు కూడా ఇప్పించలేదని, మరుగుదొడ్ల నిర్మాణానికీ కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదని వాపోతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పాలనతో విసిగిపోయామని, తమ యోగక్షేమాలుపట్టించుకోని సునీతను తమ ఊళ్లోకి రానిచ్చేది లేదని మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని తోపుదుర్తి గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచారు. ఈనెల 3వ తేదీన మంత్రి సునీత పింఛన్లు, డ్వాక్రా చెక్కులను పంపిణీ చేయడానికి వస్తున్నారని తెలిసి శుక్రవారం తోపుదుర్తి గ్రామస్తులంతా మూకుమ్మడిగా సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఏ ఒక్క అభివృద్ధి చేయని మంత్రిని తమ ఊళ్లోకి రానిచ్చేది లేదని మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని నమ్మి బ్యాంకుల్లో రుణాలు కట్టలేదని, తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకోళ్ల ఒత్తిడితో అప్పులు చేసి, ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి కూడా మాఫీ చెయ్యలేదు ఏ ఒక్క అభివృద్ధి పనీ చేయని మంత్రి సునీత ఏమి ముఖం పెట్టుకొని గ్రామంలోకి వస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. డ్వాక్రా రుణాల విషయంలో పూర్తిగా మోసపోయామని, ఇప్పుడు చెక్కుల పేరిట కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని, కనీసం తాము కట్టిన వడ్డీని కూడా రీయింబర్స్ చేయలేదని వాపోయారు. పెట్టుబడి నిధి కింద రూ.10వేలు మాత్రమే ఇచ్చారని, ఇది కార్పస్ఫండ్ మాత్రమేనని, ఉచితంగా ఇచ్చింది కాదన్నారు. మళ్లీ పెట్టుబడి నిధి కింద రూ.10వేలు ఇస్తామని కొత్త పాట పాడుతున్నారని, ఇంత మాత్రానికి మంత్రి వచ్చి చేసేది ఏమీ లేదన్నారు. పింఛన్ల విషయంలోనూ మోసగిస్తున్నారని, కొత్తగా ఎలాంటి పింఛన్లు ఇయ్యని ప్రభుత్వం ఇప్పుడు రెట్టింపు పింఛనంటూ ఎన్నికల వేళ డ్రామా ఆడుతోందన్నారు. ఇంటికో ఉద్యోగం అని మోసగించారని, నిరుద్యోగ భృతి విషయంలోనూ ఎన్నో మెలికలు పెట్టి రూ.వెయ్యితో సరిపెట్టారన్నారు. తోపుదుర్తిలో 300 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సునీత కనీసం ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదన్నారు. కనీసం మరుగుదొడ్డి నిర్మించుకుందామంటే.. లెక్కలేనన్ని సార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. పైగా రూ.5వేలు లంచం అడిగారని వాపోయారు. ఇలా అన్నివిధాల మోసగించిన మంత్రి సునీతను తమ గ్రామంలో అడుగుపెట్టనిచ్చేది లేదని తోపుదుర్తి గ్రామస్తులు ఒక్కతాటిపై ప్రకటించారు. నగలు తాకట్టు పెట్టి రుణాలు కట్టినా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఊదరగొట్టారు. అది నమ్మి బ్యాంకులో రుణాలు కట్టలేదు. గవర్నమెంటు వచ్చినా బ్యాంకు అధికారులు కట్టాల్సిందేనని మొండికేయడంతో నలుగురిలో మర్యాద పోతుందని ఒంటిపై ఉన్న నగలు తాకట్టు పెట్టి రుణాలు చెల్లించినా. హామీ నిలబెట్టుకోలేని మంత్రికి మా ఊళ్లోకి వచ్చే హక్కు లేదు. – లలితమ్మ, తొపుదుర్తి 70 సంవత్సరాలున్నా పింఛను ఇయ్యలేదు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛను కోసం ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినానో లెక్కలేదు. 70 ఏండ్ల వయస్సున్నా నాకు పింఛను ఇస్తలేరు. నాలుగేండ్లు ఏమీ పట్టించుకోలేదు కానీ, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు పింఛను రూ.2వేలకు పెంచినామని మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మలేం.– నారాయణ, తోపుదుర్తి -
ఆమెతో వేగలేం..అందుకే వెళ్లిపోదాం..
కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గంలో కుటుంబ పాలన సాగిస్తున్న మంత్రి పరిటాల సునీత అసలు పేరు ధర్మవరపు సునీత అని టీడీపీ నేత, పరిటాల రవి ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న అన్నారు. సునీత వైఖరితో పాటు చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదన్న కారణంతో నాలుగేళ్లుగా ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తల్లిమడుగుల గ్రామంలో తన అనుచరులు, పలువురు టీడీపీ నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మామిళ్లపల్లి పెద్దప్పయ్య, వెంకటరామిరెడ్డి, గంగంపల్లి జేష్ట రామయ్య, కనగానపల్లి రామక్రిష్ణ, నెట్టం సుబ్రమణ్యం తదితరులు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో తమతో పాటు పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. అనంతరం వేపకుంట రాజన్న మాట్లాడుతూ.. నాడు నిరుపేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పరిటాల రవితో కలసి భూస్వామ్య పోరాటాలు చేశామన్నారు. అయితే రవి మరణించిన తర్వాత... రాజకీయాల్లోకి వచ్చిన అతని భార్య సునీతమ్మ తమ ఆశయాలను పక్కన పెట్టి కుటుంబ రాజకీయాలకు తెరలేపిందన్నారు. సునీత పాలనలో వారి కుటుంబ సభ్యులకు తప్ప... ఈ ప్రాంతంలోని బడుగు, బలహీన వర్గాల్లోని పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. వీటితో పాటు సీఎం చంద్రబాబు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడన్నారు. ‘ఇక ఆమెతో వేగలేం.. అందరమూ కలిసి వెళ్లిపోదాం’ అంటూ పిలుపునిచ్చారు. పేదల పక్షాన పనిచేసే నాయకులు, పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో రాజన్న మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదనీ, అందువల్లే పేదలకు అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి పక్షాన నిలిచేందుకు తన అనుచరుల కోరిక మేరకు త్వరలో∙వైఎస్సార్సీపీలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ నాయకులు గంగంపల్లి నారాయణరెడ్డి, ముత్యాలు, కనగానపల్లి ములుగురు గోపాల్, రమేష్, కోనాపురం ఆదినారాయణ, తల్లిమడుగుల జయరాంలు, శ్రీనివాస్, రమేష్, ముత్తువకుంట్ల గోపాల్తోపాటు వందలాది మంది అనుచరులు పాల్గొన్నారు. -
పారని నారాయణ మంత్రం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో అసమ్మతి ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఒంగోలు, బాపట్ల పార్లమెంటు ఇన్చార్జిలుగా ఉన్న పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత టీడీపీలో వర్గ విబేధాలను సర్దుబాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అసమ్మతి నేతలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ఇన్చార్జి మంత్రుల మాటలు అసమ్మతి నేతలు ఖాతరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వర్గ రాజకీయాల గోడు పడలేక ఇద్దరు మంత్రులు చేతులెత్తేశారు. ఎవరికి వారే యమునా తీరే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కొండపి, మార్కాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్రాజు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అజితారావుతోపాటు దొనకొండ జెడ్పీటీసీ సభ్యుడు మన్నే రవీంద్రలు నియోజకవర్గంలో వర్గ రాజకీయాలను కొనసాగించారు. దీంతో యర్రగొండపాలెంలో అధికార పార్టీ మూడు వర్గాలుగా విడిపోయింది. నేతలు ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా మారారు. పార్టీ ఫిరాయించడంతో డేవిడ్ రాజు ప్రజావ్యతిరేకత మూట కట్టుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే సాహసం చేసే పరిస్థితి కనిపించడం లేదు. మూడు గ్రూపులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్చార్జి మంత్రి పొంగూరు నారాయణ పలుమార్లు సమావేశాలు పెట్టినా అసమ్మతి కొలిక్కి రాలేదు. కొండపిలో వర్గ విబేధాలు రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన సొదరుడు దామచర్ల సత్య కుటుంబం ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. రాబోయే ఎన్నికల్లో స్వామిని తప్పించి కొత్త అభ్యర్థిని టీడీపీ అభ్యర్థిగా నిలపాలంటూ అసమ్మతి నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. పలుమార్లు ఇన్చార్జి మంత్రి సమావేశాలు పెట్టి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా ఇక్కడ అసమ్మతి సమసి పోలేదు. మార్కాపురం నియోజకవర్గంలో ఇన్చార్జి కందుల నారాయణరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గొడవకు దిగారు. నారాయణరెడ్డిని తప్పించి రాబోయే ఎన్నికల్లో కొత్తవారికి టిక్కెట్ ఇవ్వాలని ఇమ్మడి కాశీనా«థ్తో పాటుమరి కొందరు నేతలు పలుమార్లు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. ఇన్చార్జి మంత్రి నారాయణ నేతృత్వంలో అసమ్మతి నేతలతో సమావేశాలు నిర్వహించినా గొడవలు సద్దుమణగలేదు. ఒంగోలులోనూ పలువురు రెండో శ్రేణి నేతలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు వ్యతిరేకంగా మారారు. కొందరు ఆయనకు దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో దామచర్లకు మద్దతు పలికేది లేదంటూ మరి కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు పుట్టిస్తున్నారు. ఇక్కడ అసమ్మతిని కట్టడి చేయాలని ఇన్చార్జి మంత్రి ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దర్శి, గిద్దలూరుల్లోనూ అసంతృప్తులు ఉన్నాయి. కొందరు బహిరంగ విమర్శలకు దిగుతుండగా మరి కొందరు అంతర్గంతగా సిట్టింగ్లను వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార టీడీపీలో వర్గ విభేధాలు రోజు రోజుకుపెరుగుతున్నాయి. నారాయణను రెండు సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంటుకు ఇన్చార్జిగా నియమించినా అసమ్మతి పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇన్చార్జి మంత్రి చేతులెత్తేయడంతో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లాలో రెండు రోజులు మకాం వేసి యర్రగొండపాలెం, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించి నేతలకు వార్నింగ్లు ఇచ్చినా ఎవరూ ఖాతరు పెట్టలేదు. అసమ్మతి సమసి పోలేదు. పనిచేయని పరిటాల తంత్రం ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని నాలుగు నియోజకవర్గాల్లో అసమ్మతి మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. అద్దంకి, చీరాల, పర్చూరు, సంతనూతలపాడులలో వర్గ విభేదాలు రోడ్డున పడ్డాయి. వీటిని సద్దుమణిచేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీతను ఇన్చార్జిగా నియమించారు. సంతనూతలపాడులో మాజీ ఎమ్మెల్యే విజయ్కుమార్ను ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. రాబోయేఎన్నికల్లో విజయ్కుమార్ను తప్పించి కొత్తవారిని అభ్యర్థిగా నిలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్లకు సైతం పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్సీ కరణం బలరాం, టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రెండు వర్గాల పక్షం నిలిచి ఆధిపత్య పోరు సాగిస్తుండటంతో ఇక్కడ వర్గ విభేదాలు తగ్గడం సంగతి అటుంటి మరింత పెరిగాయి. మంత్రి పరిటాల సునీత పలుమార్లు అసమ్మతి నేతలతో సమావేశం నిర్వహించినా వారు ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చిన తరువాత కొంత మేర తగ్గినట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం కొనసాగుతున్నాయి. మంత్రి పరిటాల సునీత సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. చీరాలలో అసమ్మతి ఆది నుంచి ఉన్నా తొలుత అంతగా బయటపడలేదు. ఇటీవల కాలంలో నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు, ముఖ్యనేతలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ సమావేశాలు పెట్టి మరీ ఆయన అవినీతి, అక్రమాలను బయట పెడుతున్నారు. ఏలూరిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ అసంతృప్తులను చల్లార్చడం మంత్రి సునీతకు చేతకావడం లేదు. ఇక కీలకమైన అద్దంకి వర్గ విభేదాలు సద్దుమణచడం మంత్రి సునీతకే కాదు ఏకంగా ముఖ్యమంత్రితోనూ సాధ్యం కావడం లేదు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరడాన్ని ఎమ్మెల్సీ కరణం బలరాం ఆదిలోనే వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇద్దరినీ రాజీ చేయడంలో విఫలమయ్యారు. పేరుకు ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నా వారు కలిసి పనిచేయడం జరిగే పనికాదు. తొలుత ఒకటి రెండు సమావేశాల్లో ఇరు వర్గాల్లో సై అంటే సై అంటూ గొడవలకు సైతం దిగాయి. ఇన్చార్జిగా ఉన్న మంత్రి సునీత సమక్షంలోనే ఘర్షణలు తలెత్తాయి. వారిని సర్దుబాటు చేయడం సాధ్యం కాక మంత్రి సునీత చేతులెత్తేసింది. -
పరిటాల శ్రీరాం రాజ్యాంగేతర శక్తి
అనంతపురం: గతంలో పరిటాల రవీంద్ర హయాంలో జిల్లాలో ఎలా దౌర్జన్యాలు జరిగాయో ఈరోజు పరిటాల సునీత మంత్రి అయిన తర్వాత ఆ కుటుంబం అదే తరహాలో దౌర్జన్యాలకు పాల్పడుతోందని, శ్రీరాం రాజ్యాంగేతర శక్తిగా మారారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరాం, ఎమ్మెల్యే పార్థసారథి ‘సాక్షి’ కార్యాలయం వద్ద ధర్నా చేసి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడిన తీరును నిరసిస్తూ శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా పరిటాల కుటుంబం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఓఎస్డీ స్వామికి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో పత్రికాస్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ పథకం చూసినా అవినీతిమయం చేశారన్నారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను లాగేసుకుంటున్నారన్నారు. పత్రికలు కాని, రాజకీయ పార్టీలు ప్రశ్నించినా వారిపై దౌర్జన్యాలు చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం, ఆస్తుల, ప్రాణ నష్టం కల్గించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అభివృద్ధి పేరుతో మంత్రి సునీత సాగిస్తున్న దోపిడీని ‘సాక్షి’ పత్రిక ప్రచురించిందన్నారు. నియోజకవర్గంలో తన బంధువులను మండలానికి ఒక ఇన్చార్జిని నియమించుకుని సాగిస్తున్న దోపిడీపై కథనం వచ్చిందన్నారు. ఇందులో ఏవైనా తప్పులుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పరిటాల సునీత మంత్రి హోదాలో ఉన్నా.. తనయుడు పరిటాల శ్రీరాం ‘సాక్షి’ కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కూడా గతంలో ‘సాక్షి’ కార్యాలయం ఎదుట రచ్చ చేశారన్నారు. వారి అవినీతి అక్రమాలు ‘సాక్షి’లోనే కాదు తక్కిన పత్రికల్లో కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను భయభ్రాంతులకు గురచేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే కుటిల ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ఎవరూ జీర్ణించుకోరని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు పూర్తిగా కీలుబొమ్మలుగా మారాయన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారన్నారు. పత్రికలపై దాడులకు పా ల్పడాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. ఏకంగా పత్రికా కార్యాలయానికి వచ్చారంటే వారు దేనికైనా తెగిస్తారనేది అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్ర«ధా న కార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ మంత్రి కుటుంబానికి ఉన్నది ఉన్నట్లు రాస్తే అంత ఉలుకెందుకన్నారు. ఆరు మండలాల్లోనూ తమ బంధువులను ఇన్చార్జ్లుగా నియమించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వారి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుందని, దాన్నికూడా హరించాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి కుటుంబం సాగిస్తున్న దందా ప్రజలందరికీ తెలుసన్నారు. గాలి మరల నుంచి రైల్వే టెండర్ల దాకా ప్రతిదాంట్లోనూ దోచుకుంటున్నారన్నారు. నాయకులు కోగటం విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఒక ఓటుకు ఐదుగురు మంత్రులు, ఎమ్మెల్యేలయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రి సునీత బంధువులు మండలానికో ఇన్చార్జ్ కాదని ఎమ్మెల్యే, మంత్రిలా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, గౌస్బేగ్, మహానందరెడ్డి, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మైనుద్దిన్, పెన్నోబులేసు, తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం నరేంద్రరెడ్డి, ఎద్దుల రాజేష్, మహిళా విభాగం వాసంతి సాహిత్య, కొండమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు. ఉనికి కోసమే ‘సాక్షి’పై బెదిరింపులు రాప్తాడు నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా మంత్రి సునీత కుటుంబం చేస్తున్న దోపిడీపై పత్రికల్లో లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. ఆధారాలతో సహా ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన రోజే కథనం రావడంతో పరిటాల కుటుంబం టీడీపీలో ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. తమ ప్రతిష్ట దిగజారుతోందనే ఆక్రోషంతో మంత్రి సునీత తన కుమారుడు శ్రీరాం, మరికొందరు గూండాలను ఉసిగొలిపి ‘సాక్షి’ పత్రిక జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలో ఆమె తనయుడు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సమాజంలో నాలుగో స్తంభమైన మీడియాను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో నోరెత్తిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుంది. ఇందుకోసమే ‘సాక్షి’కి అండగా నిలుస్తున్నాం. – తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త -
పరిటాల దౌర్జన్యం పై జర్నలిస్టుల ఆందోళన
-
సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం
-
సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం
సాక్షి, అనంతపురం : అనంతపురంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు వీరంగం సృష్టించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ అనంతపురం కమలానగర్లోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల వర్గీయులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్.. సాక్షి మీడియా పై తన అక్కసు వెళ్లగక్కారు. సాక్షి కార్యాలయం వద్ద మంత్రి పరిటాల సునీత వర్గీయుల ధర్నాను వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజాలు నిర్భయంగా తెలియజేసే సాక్షి మీడియాపై అనవసర రాద్ధాంతం చేయటం మంత్రి పరిటాల సునీతకు తగదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు వందల కోట్ల అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వాటిని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తున్న సాక్షి మీడియా పై అక్కసు వెళ్లగక్కటం మంత్రి పదవిలో ఉన్న పరిటాల సునీతకు తగదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి -
దోపిడీ రాజ్యం.. దొరల చిత్తం !!.
రాప్తాడు నియోజకవర్గం. ఈ పేరు వింటేనే అధికారుల నుంచి కాంట్రాక్టర్ల వరకూ అందరికీ హడల్. ఎందుకంటే అది ఓ ప్రత్యేక సామ్రాజ్యం. ఇప్పటికీ అక్కడ సామంతుల పాలనే నడుస్తోంది. ‘కప్పం’ కట్టే సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. అక్కడి పాలకులకు ఎదురు మాట్లాడిన వారిని వేధించే ఘటనలు రోజుకో పల్లెలో రివాజుగా మారింది. ఇవన్నీ తెలిసీ జిల్లా అధికారులు, పోలీసులు ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే అది మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. మంత్రి భర్త పరిటాల రవీంద్ర పేరుతో ఓ భయాన్ని సృష్టించి, దాని ముసుగులో రాజకీయం చేస్తున్నారు. ఈ భయం, దీనికి తోడైన అధికారమే వాళ్లకు కాసుల పంట పండిస్తోంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండటంతో అధికారంలో ఉండే ఐదేళ్లలో 50 ఏళ్లకు సరిపడా వెనకేసుకోవాలనేది ‘రాప్తాడు’ టీడీపీ శ్రేణుల భావనగా తెలుస్తోంది. సర్పంచ్ స్థాయి వ్యక్తి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ ఎవరి పరిధిలో వారు, ప్రభుత్వ ధనాన్ని దోచేశారు. గత నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు రూ.3వేల కోట్ల అవినీతి జరిగిందంటే.. పరిటాల కుటుంబం సాగిస్తున్న దోపిడీ ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇసుక క్వారీల నుంచి చెరువుల్లో మట్టిదాకా.. గుడి భూముల నుంచి గుడిలో లింగం మింగేసే దాకా ప్రతీచోట అవినీతే. ఈక్రమంలో నియోజకవర్గాల్లో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధన ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో అవినీతిపై గ్రౌండ్ రిపోర్ట్. సాక్షి ప్రతినిధి, అనంతపురం :ఈ మూడు ఉదాహరణలే కాదు.. రాప్తాడు నియోజకవర్గాన్ని మండలాలు, గ్రామాలుగా విభజించుకుని ప్రతి పనికీ ఓ రేటు కట్టి, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా మంత్రి పరిటాల సునీత కుటుంబీకులు, టీడీపీ నేతలు ఈ నాలుగున్నరేళ్లు దోపిడీ సాగించారు. ఇన్నేళ్లలో ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేసిన అవినీతి కనీసం 3వేల కోట్ల వరకు ఉంటుందని స్పష్టమవుతోంది. 2004 నుంచి 2014 వరకూ పదేళ్లపాటు టీడీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చారు. దీంతో ‘దీపం ఉండగానే ఇల్లు్ల చక్కబెట్టుకోవాలి’ అనే చందంగా అధికారమే అండగా ఈ నియోజకవర్గంలో అడ్డూ అదుపు లేకుండా దోపిడీ కొనసాగింది. పైగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న పరిటాల సునీత మంత్రిగా ఉండడం మరింత కలిసి వచ్చింది. అనంతపురం నగరం చుట్టూ రాప్తాడు నియోజకవర్గం విస్తరించి ఉండడం, అనంతపురం నియోజకవర్గ ప్రజలకు అవసరమైనా సెంటు స్థలం కూడా ‘అనంత’ పరిధిలో లేకుండా పోయింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేయాలన్నా, పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వాలన్నా రాప్తాడు పరిధిలలోకి అడుగు పెట్టాల్సిందే! దీంతో ఈ ప్రాంతంలో స్థలాల విలువను భారీగా పెంచేశారు. ఖాళీ స్థలం కన్పిస్తే పాగా వేసి ప్రభుత్వ భూములను ఎక్కడికక్కడ కబ్జా చేశారు. కుటుంబీకులే సామంతులుగా మంత్రి పరిటాల సునీత మండలాల వారీగా తన కుటుంబీకులకు బాధ్యతలు కట్టబెట్టారు. ఆత్మకూరు, రాప్తాడులను తన సోదరులు బాలాజీ, మురళీకి, చెన్నేకొత్తపల్లిని తన చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరికి, అనంతపురం రూరల్ను మరిది పరిటాల మహేంద్రకు, కనగానపల్లి మండలాన్ని తమ అస్మదీయుడు నెట్టెం వెంకటేశ్కు కట్టబెట్టారు. రామగిరి మండలంతో పాటు నియోజకవర్గాన్ని సునీతతో పాటు ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం పర్యవేక్షిస్తున్నారు. సామంతుల పాలనను తలపిస్తూ మండలాల వారీగా దోపిడీ పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించారు. మొత్తం నాలుగున్నరేళ్లలో మంత్రి పరిటాల సునీత, మంత్రి కుటుంబీకులు, టీడీపీ నేతలు సాగించిన దోపిడీని లెక్కిస్తే కనీసం రూ.2,500 కోట్ల నుంచి రూ. 3వేల కోట్ల వరకూ ఉంటుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే ప్రాజెక్ట్లోరూ.500 కోట్లకు పైగా దోపిడీ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యాంకు నీళ్లిచ్చేందుకు ఫేజ్–1లో రూ.850కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో రూ. 803.96 కోట్లకు పరిపాలన అనుమతులు వచ్చాయి. పేజ్–1లో రూ.505కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలెట్టారు. ఈ పనులను ‘మెయిల్’ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. నిజానికి పేరూరు డ్యాంకు రూ. 10కోట్లతో ఒక విధానం ద్వారా, రూ.170కోట్లతో మరో విధానం ద్వారా నీళ్లివ్వొచ్చు. కానీ రూ.803కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో ఏజెన్సీ చేస్తున్న పని కూడా రూ.300కోట్ల కంటే ఎక్కువ కాదు. కానీ అంచనాలను భారీగా పెంచి రూ.500కోట్లు దోపిడీకి తెరలేపారు. లిఫ్ట్ అవసరం లేకుండా.. హంద్రీ–నీవా ప్యాకేజి కింద మడకశిర బ్రాంచ్ కెనాల్లోని 26వ కిలోమీటర్ నుంచి (6వ లిఫ్ట్ తర్వాత) తురకలాపట్నం చెరువు నింపడం ద్వారా మరువ పారితే వంక ద్వారా ప్రవహించే నీరు పెద్దకోడిపల్లి మీదుగా పావగడ మండలంలోని నాగలమడక చెరువులోకి చేరుకుంటాయి. అక్కడి నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు అందుతాయి. మొత్తం 20 కిలోమీటర్లు మేర నీరు ప్రవహిస్తుంది. ఇందులో 4 కిలోమీటర్లు కర్ణాటకలో, తక్కిన 16 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో ప్రవహిస్తుంది. పైగా ఎక్కడా లిఫ్ట్(ఎత్తిపోతలు) అవసరం ఉండదు. గ్రావిటీ ద్వారానే నీళ్లందుతాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్ వద్ద 650 అడుగుల ఎత్తు ఉంటే, పేరూరు డ్యాం 530 అడుగుల్లో ఉంది. రూ.10కోట్లతో వంకను ఆధునికీకరిస్తే చాలు. ఒకవేళ పైపులైన్ వేసినా రూ.30కోట్లు కంటే ఎక్కువ ఖర్చు కాదు. ఇది కాక2008లో అప్పటి సీఎం వైఎస్సార్ బోరంపల్లి నుంచి కంబదూరు మీదుగా పేరూరుకు నీళ్లిచ్చేందుకు సర్వే చేయించారు. రూ.85కోట్లతో డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ ప్రకారం నీళ్లిచ్చినా 2008కి ఇప్పటికీ ఏడాదికి 10శాతం అంచనా వ్యయం పెరిగినా వందశాతం రెట్టింపుతో రూ.170కోట్లతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వొచ్చు. ఇవన్నీ కాదని ఇప్పుడు రూ.803కోట్లు ఖర్చు చేయడం వెనుక మర్మం ఏమిటో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. ప్రభుత్వ భూములూ వదల్లేదు కనగానపల్లి మండలం కోనాపురం, ముక్తాపురం గ్రామాల్లో సోలార్ ప్లాంటు ఏర్పాటవుతోంది. దీంతో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములపై టీడీపీ నేతల కన్ను పడింది. అధికారులూ వత్తాసు పలికారు. దాదాపు 60 ఎకరాల ప్రభుత్వ భూములను మంత్రి సునీత కుటుంబ సభ్యులకు అప్పనంగా అప్పగించారు. వారి పేర్లతో డీ పట్టాలిచ్చేశారు. ఇవే కాక మరో 150 ఎకరాలు ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలకు కట్టబెట్టారు. పట్టాలు చేయించుకున్న ప్రభుత్వ భూములను సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు తిరిగి స్వాధీనం చేయడం ద్వారా ప్రజా ధనాన్ని స్వాహా చేసే కుట్రకు తెరలేపారు. మంత్రి సమీప బంధువులైన పరిటాల రవీంద్ర, పరిటాల చాయమ్మ తదితరులకు కనగానపల్లిలోనూ, ఇదే మండలంలోని ముత్తువకుంట్ల గ్రామంలోనూ ప్రభుత్వ భూములు కేటాయించి, డీ పట్టాలు మంజూరు చేసి అధికారులు తమ స్వామి భక్తిని చాటుకున్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలో ⇔ మేడాపురం– ఒంటికొండ, చెన్నేకొత్తపల్లి– ముష్టికోవెల, చెన్నేకొత్తపల్లి– వెంకటంపల్లి గ్రామాల్లో రూ.4 కోట్లతో తారు, సీసీ రోడ్ల పనులను మంత్రి సునీత చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరి చేపట్టారు. నాణ్యత లేకుండా చేసిన ఈ పనుల్లో 40 శాతం నిధులు ఆయన జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం. ⇔ నీరు–చెట్టు పథకం కింద రూ.30.8కోట్లతో 323 పనులు చేశారు. ఇందులో పనులు చేయకుండానే రూ.11 కోట్ల మేర సొమ్ము కాజేశారు. అనంతపురం రూరల్ మండలంలో ⇔ అనంతపురం రూరల్ పరిధిలో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. ఇక్క డ ఎవరు వెంచర్ వేయాలన్నా మంత్రి సునీత భర్త పరిటాల రవీంద్ర చిన్నాన్న∙కుమారుడు పరిటాల మహేంద్ర అనుమతి పొందితీరాలి. అతన్ని అన్ని విధాలుగా సంతోషపరిచిన తర్వాతనే ముందుకు వెళ్లాలి. లేకుంటే అన్నీ అడ్డంకులు సృష్టిస్తూ ఇబ్బంది పెడతారు. ⇔ కురుగుంటలోని సర్వే నంబర్ 133–4లో మూడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో 60మందికి పట్టాలు ఇచ్చారు. మరో 45 పట్టాలను తన అనుచరుల ద్వారా ఒక్కో పట్టాకు రూ.2లక్షల చొప్పున వసూలు చేశారు. ఇక్కడ సెంటు భూమి రూ.8 లక్షలకు పైగా ధర పలుకుతోంది. అక్రమ మార్గల ద్వారా పరిటాల మహీంద్రనే సొమ్ము చేసుకున్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ⇔ విద్యారణ్య నగర్ సర్వే నంబర్ 106లోని 4.5 ఎకరాల స్థలాన్ని బ్యాంక్ వేలంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దక్కించుకున్నాడు. అయితే ఈ స్థలంలో 30 ఏళ్లుగా 200 మంది పక్కా గృహాలు నిర్మించుకుని జీవిస్తున్నారు. దీంతో ఆ స్థలాన్ని సుబ్రహ్మణ్యం ఖాళీ చేయించలేకపోయారు. ఈ పంచాయితీలో పరిటాల కుటుంబీకులు జోక్యం చేసుకున్నారు. సెంటు విస్తీర్ణానికి కొంత మొత్తం చొప్పున చెల్లించి, పక్కా గృహాలు నిర్మించుకున్న 200 మందితో భారీగా డబ్బులు వసూలు చేసుకున్నారు. ⇔ ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో సర్వే నంబర్ 343–2ఏలోని 70సెంట్ల స్థలాన్ని పరిటాల శ్రీరామ్ అనుచరుడు ఆక్రమించి ఇళ్లు కట్టారు. ఇక్కడ సెంటు భూమి విలువ రూ.4లక్షలు పైగా ఉంది. ఈ లెక్కన రూ.2.50కోట్ల విలువైన స్థలం కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ⇔ కక్కలపల్లి సమీపంలో ఓ వెంచర్ వేశారు. అనుమతి లేకుండా వెంచర్ వేశారంటూ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తూ దుప్పటి పంచాయితీతో రూ. 3కోట్ల మేర వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆత్మకూరు మండలంలో ⇔ ఆత్మకూరు మండలంలో జరిగే ప్రతి పనిలో మంత్రి సునీత సోదరుడు బాలాజీకి కమీషన్ ఇవ్వాల్సిందే! ఆయనకు తెలీకుండా ఏ కాంట్రాక్టులు చేసేందుకు వీల్లేదు. గుడ్విల్ ఇ చ్చిన తర్వాతే పని ముందుకు కదులుతుంది. ⇔ నీరు– చెట్టు పథకం కింద ఈ నాలుగేళ్లలో రూ.14 కోట్ల మేర విలువైన పనులు చేశారు. ఇందులో ఎలాంటి పనులు చేయకుండానే రూ.11 కోట్ల మేర బిల్లులను మంత్రి సునీత అండతో టీడీపీ నేతలు చేయించుకున్నారు. ⇔ బి.యాలేరు, పంపనూరులో ఇళ్ల పట్టాల పేరుతో దళితుల భూములను స్వాధీనం చేసుకుని, టీడీపీ నాయకులే పట్టాలు చేయించుకున్నారు. ⇔ గాలిమరల కోసం వందల ఎకరాల భూములను రైతుల నుంచి తక్కువ ధరకు బాలాజీ కొనుగోలు చేసి వాటిని కంపెనీలకు ఎక్కువ ధరకు విక్రయించినట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. రైతులకు ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు చెల్లించి, కంపెనీ యాజమాన్యాలకు రూ.14 లక్షల వరకూ విక్రయించినట్లు తెలుస్తోంది. రాప్తాడు మండలంలో ⇔ రాప్తాడు మండలంలో నీరు–చెట్టు కింద 186 పనులకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో కొన్ని పనులు నాసిరకంగా ఉన్నాయి. పనులు చేయకుండానే రూ.13 కోట్ల మేర బిల్లులు కాజేశారు. ⇔ జి.కొత్తపల్లి నుంచి పండమేరువంకపై నీరు–చెట్టు పథకం కింద రూ.28 లక్షలతో టీడీపీ నాయకులు కాలువను తవ్వారు. పనులు పూర్తి చేయకనే మొత్తం బిల్లులను మంజూరు చేయించుకున్నారు. ⇔ ఒక్క మొక్క నాటకుండానే అవెన్యూ ప్లాంటేషన్ కింద రూ.3.5 కోట్లు నొక్కేశారు. ⇔ కనగానపల్లి మండలం కోనాపురం వద్ద ఉన్న హంద్రీ–నీవా కాలువ నుంచి రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి చెరువుకు నీటిని మళ్లించేందుకు రూ.8 కోట్లతో కాలువ పనులు చేపట్టారు. సొంతపార్టీ ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ను కాదని తన సోదరుడు మురళికి ఈ పనులను మంత్రి సునీత కట్టబెట్టారు. ఈ పనులు నాణ్యత లేకుండా చేశారు. ఇందులో రూ.3.5కోట్లు మురళీ జేబులోకి చేరినట్లు ఆరోపణలున్నాయి. ⇔ మరూరులో మూడు చెక్ డ్యాం పనులకు రూ.13లక్షలు, పైపులైన్ పనులకు మరో రూ.13 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులు అప్పటి సర్పంచ్ సాకే వెంకటేష్ పూర్తి చేయాల్సి ఉండగా, ‘గుడ్విల్’ ఇవ్వలేదంటూ పనులను మురళీ అడ్డుకుని, అదే గ్రామానికి చెందిన గోపాల్కు అప్పగించారు. ⇔ ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం నుంచి మంత్రి కుటుంబీకులు రూ.40లక్షలు హఫ్తా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ⇔ దాదాపు 42 ఎకరాల్లో రాప్తాడు వద్ద ఏర్పాటు కానున్న ‘జాకీ’ ఫ్యాక్టరీ యాజమాన్యం ‘గుడ్విల్’ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఈ పరిశ్రమ కాస్త తమిళనాడులోని సేలంకు తరలిపోయింది. కనగానపల్లి మండలంలో ⇔ దాదులూరు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న నాదారు చెరువును టీడీపీ నేతలు ఆక్రమించారు. చెరువుకట్ట పైభాగంలో 594, 595 సర్వే నంబర్లలో కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో పట్టాలు తీసుకుని మంత్రి బంధువులు 30 ఎకరాల చెరువు మిగులు భూములనూ నొక్కేశారు. ⇔ నీరు–చెట్టు ద్వారా టీడీపీ ప్రజాప్రతినిధులు రూ.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు కాజేశారు. ⇔ ప్రభుత్వ భూములకు టీడీపీ నేతలు పట్టాలు చేయించుకుని గాలిమరలు, సోలార్ ప్లాంట్లకు విక్రయిస్తున్నారు. రామగిరి మండలంలో ⇔ మంత్రి సునీత అండతో వందల ఎకరాల డీకేటీ భూములను విక్రయించడం ద్వారా టీడీపీ నేత, మాజీ ఎంపీపీ రంగయ్య రూ.కోట్లు కొల్లగొట్టినట్లు ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ⇔ బెంగుళూరు హైవేలోని గంతిమర్రి, పెనుబోలు సరిహద్దుల్లోని డీ పట్టా భూములను పంజాబ్ వాసులకు, ప్రైవేటు కంపెనీలకు విక్రయించి భారీగా లబ్ధి పొందారు. ⇔ చెర్లోపల్లి, పాపిరెడ్డి పరిధిలో 300 ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలు పొంది వాటిని ప్రైవేటు కంపెనీలకు విక్రయించి రూ.కోట్ల దండుకున్నారు. ⇔ రామగిరిలో గాలిమరలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూమిని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, కంపెనీలకు ఎక్కువ మొత్తాలకు విక్రయించారు. ఈ వ్యవహారాలన్నీ మంత్రి తనయుడు పరిటాల శ్రీరామ్ కన్నుసన్నల్లోనే జరిగాయి. ‘పరిటాల భవన్’ పేరుతో ఈ ఫొటోలో కన్పిస్తున్న టీడీపీ కార్యాలయం రాప్తాడు సమీపంలోని ఆటోనగర్లో నిర్మించారు. పండమేరు వేంకటరమణస్వామి ఆలయ మాన్యం భూమి ఇది! జిల్లా కేంద్రానికి సరిహద్దులో, బెంగుళూరు హైవే పక్కనే ఉన్న ఈ ప్రాంతంలో సెంటు ధర కనీసం రూ.10లక్షలు ఉంది. ఇక్కడ 45 సెంట్ల స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ ఆక్రమణ విలువ రూ.4.5 కోట్లకు పైగానే! -
పరిటాల సునీత అండతోనే సూరీ హత్య : భానుమతి
సాక్షి, అనంతపురం: మద్దెలచెరువు సూరీ హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్కు ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని సూరీ భార్య గంగుల భానుమతి హైకోర్టును అభ్యర్థించారు. మద్దెలచెరువు సూరీ హత్యకేసు విషయమై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. భానుకిరణ్ సూరీ పేరు చెప్పి జిల్లాలో సూమారు 700 కోట్ల రూపాయలు సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు. తన భర్త సూరీ హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని ఆమె ఆరోపించారు. పరిటాల కుటుంబం అండ లేకపోతే భానుకిరణ్ ఇంతటి దారుణానికి పాల్పడేవాడు కాదని అన్నారు. పరిటాల కుటుంబ అండతోనే ఈ దారుణానికి పాల్పడ్డాని భానుమతి తెలిపారు. -
వసూల్ రాజా
అనంతపురం, రాప్తాడు: సామంత రాజుల పాలన ఎలా సాగుతుందో వెంకటేష్ పరిస్థితి చూస్తే తెలుస్తుంది. రాప్తాడు మండలంలో మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళీ చెప్పిందే వేదం. మండలంలో ఏ పని చేసిన ఆయనకు కమీషన్లు ఇవ్వాల్సిందే. టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను సైతం మురళీ వదలడం లేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు. రూ.లక్ష వర్క్ ఇస్తే రూ.10 వేలు ఆయనకు ముట్టజెప్పాల్సిందేనట. ఇక.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి ఏ అధికారంతో మండలానికి ఒకరిని ఇన్చార్జ్లుగా పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మరూరు పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటేష్ ఒక్కడే కాదు అన్ని మండలాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. రాప్తాడు మండలంలో ఎన్నో ఏళ్లుగా టీడీపీ కాపాడుకుంటూ వస్తే మంత్రి సోదరుడు మురళీ భ్రష్టు పట్టించాడని టీడీపీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మంత్రి సోదరుడు మురళీ, ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్కు విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. ప్రసాద్ను మళ్లీ బెదిరించి టీడీపీలోనే కొనసాగుతానంటూ పత్రికల్లో వార్తలు కూడా రాయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎంపీపీ చిన్నాన్న నెట్టేం వెంకటేష్ పార్టీని విడి బయటకు వచ్చాడు. ఇన్చార్జ్లు చెబితేనే పనులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇన్చార్జులు చెబితేనే అధికారులు పనులు చేయాలి. లేకుంటే వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయిస్తారన్న విమర్శలున్నాయి. చేసేదేమీ లేక అధికారులు తమకు ఇష్టం లేకున్నా ఇన్చార్జీలు చెప్పినట్లు పనులు చేస్తున్నారు. ఆత్మకూరు, రాప్తాడుకు సునీత సోదరులు బాలాజీ, మురళీ, చెన్నేకొత్తపల్లికి మంత్రి చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరి, అనంతపురం రూరల్కు పరిటాల మహీంద్రా, రామగిరికి రామ్మూర్తి నాయుడు, కనగానపల్లికి నెట్టెం వెంకటేశ్లను నియమించారు. వీరు అభివృద్ధిని పక్కన పెట్టి ఆయా మండలాల్లో భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా రాప్తాడు నియోజకవర్గంలో సాగుతున్న సామంత రాజుల పాలనపై టీడీపీకి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. చాలామంది ద్వితీయ శ్రేణి బీసీ నాయకులు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. చెక్ డ్యాం పనులు చేజిక్కించుకున్న టీడీపీ నేత గోపాల్ గడ్డ కట్టిన సిమెంట్ని పోడి చేసి చెక్ డ్యాం పనులకు వినియోగిస్తున్నారు. ఇలాంటి సిమెంట్ను వాడితే చెక్ డ్యాంలు నాణ్యత కోల్పోతాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెక్ డ్యాంలు నాణ్యతగా నిర్మించేలా చూడాలి. – వెంటకేష్ , మాజీ సర్పంచ్ -
పరిటాల సునీత సోదరుడు వర్సెస్ మాజీ సర్పంచ్
సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత సోదరుడికి టీడీపీ నేత, మాజీ సర్పంచ్కు విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పరిటాల సునీత సోదరుడు మురళి తమపై ఆధిపత్యం చెలాయించడంపై మరూరు టీడీపీ నేత, మాజీ సర్పంచ్ బోయ వెంకటేష్ మండిపడ్డారు. తనపై కావాలనే కక్ష్య కట్టాడని బోయ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అండదండలు చూసుకుని తనకు వచ్చిన కాంట్రాక్టు పనులను మురళి రద్దు చేయించారని ఆరోపించారు. జిల్లాలో బీసీల ఎదుగుదలను పరిటాల కుటుంబం ఓర్వలేకపోతుందని విమర్శించాడు. తాను ఇన్ని రోజులుగా టీడీపీలో పని చేసినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. -
పరిటాల సునీతకు ఎదురుదెబ్బ?
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళిపై రాప్తాడు మండల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఆయన ఆధిపత్యం చెలాయించడమేమిటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండలాధ్యక్షుడు దగ్గుపాటి ప్రసాద్కు సమాచారం ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించమని మురళి ఎలా చెప్తారంటూ ఆందోళనకు దిగారు. కాగా మురళి ఆదేశాల మేరకు బండమీదపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంతో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్కు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ విషయమై పరిటాల వర్గంలో చర్చ మొదలైంది. -
పరిటాల పాలనంతా అరాచకం
అనంతపురం, రాప్తాడు: దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హయాంలో మాదిరే ప్రస్తుత మంత్రి పరిటాల సునీత పాలన కూడా అరాచకాలు, దౌర్జన్యాలతోనే సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సాకే నారాయణ, రాప్తాడ మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యువజన విభాగం మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నదీ పరిటాల కుటుంబమేనని అన్నారు. మరూరులో టీడీపీ కార్యకర్త కురుబ సామాజిక వర్గానికి చెందిన బాబయ్య స్థలాన్ని అదే పార్టీ వర్గీయులే కక్ష కట్టారన్నారు. దౌర్జన్యంగా బాబయ్య స్థలం లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నంపై ‘పన్నెండేళ్ల కక్ష’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి వైఎస్సార్సీపీ నాయకులు స్పందించారు. బుధవారం మండల కేంద్రం రాప్తాడులో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు పేద్ద పీట వేస్తున్నామని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మరూరులో బాబయ్యపై ఆ పార్టీకి చెందిన పరిటాల వర్గీయులు దాడి చేస్తే నోరు మెదపడం లేదని మండిపడ్డారు. మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, సోదరుడు ధర్మవరపు మురళి కలుగజేసుకొని స్థలాన్ని ఆ పార్టీ నేతలకు చెందేలా అధికారులపై ఒత్తిడి తేవడంతో అధికారులు కూడా విధులు నిర్వర్తించలేక సెలవుపై వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఫ్యాక్షన్ పేరుతో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో పరిటాల కుటుంబం బీసీలను టార్గెట్ చేస్తూ బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దాడుల్లో మచ్చుకు కొన్ని.. ♦ రాప్తాడు పండమేరు వంకలో బోయ ఓబులేస్పై పరిటాల శ్రీరాం డ్రైవర్ డాడి చేశాడు. ♦ రామగిరి మండలం పేరూరులో సుబ్బు క్రిష్టపై దాడి చేశారు. ♦ కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్పై ఎంపీపీ పద్మాగీత భర్త ముకుంద నాయుడు దాడి, వాటర్షెడ్ ఫీల్డ్ అసిస్టెంట్ కుళ్లాయప్పపై ముకుందనాయుడు అనుచరుల దాడి చేశారు. తూంచెర్లలో అంగన్వాడీ కార్యకర్త గాలెమ్మపై టీడీపీ నాయకుల దాడి చేసి గాయపరిచారు. కొండ్రెడ్డిబాయికి చెందిన సూరిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ♦ రామగిరి మండలం నసనకోటలో ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డితో కలిసి తిరిగాడని బోయ సూర్యంపై పరిటాల శ్రీరాం, ఆయన అనుచురులు మాదాపురం శంకర్, కొత్తపల్లి శివకుమార్, పరంధామ యాదవ్ దాడి చేశారు. ♦ అనంతపురం మండలం చంద్రబాబునగర్కు చెందిన నరసింహులును మూడు సెంట్ల స్థలం కోసం టీడీపీకి చెందిన వారు హత్య చేశారు. ♦ ఆత్మకూరు మండలం వేపచెర్ల తండాకు చెందిన కేశవనాయక్ను భూ తగాదాల నేపథ్యంలో టీడీపీ నాయకులు మట్టుబెట్టారు. ♦ రాప్తాడులో వైఎస్సార్సీపీ మండల మాజీ కన్వీ నర్ భూమిరెడ్డి శివప్రసాద్రెడ్డి, అనంతపురం రూరల్ మండలం కందుకూరులో వైఎస్సార్సీపీ నేత శివారెడ్డిని అంత్యంత కిరాతంగా పరిటాల కుటంబం హత్య చేయించింది. మహిళలకూ భద్రత కరువు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో మహిళలకు భద్రత కరువైందని వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గొందిరెడ్డిపల్లిలో భూ సమస్యపై ఇద్దరు మహిళలు, యర్రగుంటలో మాజీ స్టోర్ డీలర్ భార్యపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారన్నారు. ఇలా పరిటాల వర్గీయులు అనేక మంది బీసీ నేతలపై దాడులు చేశారని గుర్తు చేశారు. పరిటాల కుటుంబం, టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు చరమగీతం పాడాలని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు దండు రామాంజినేయులు, జూటూరు శేఖర్, చెర్లోపల్లి శేఖర్, ఉమాపతి, రమేష్, నాగరాజు, గోర్ల కేశవ రెడ్డి, విజయ్ వర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు రాప్తాడులో కురుబల ధర్నా స్థల విషయంలో టీడీపీ కార్యకర్త బాబయ్యకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కురుబ కులస్తులు గురువారం రాప్తాడులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. బాబయ్యపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకుని, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేటి ధర్నాకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వైఎస్సార్సీపీ నాయకులు ప్రకటించారు. -
ప్రత్యర్థులను మట్టుబెట్టడమే 'పరిటాల' పని
ఆత్మకూరు: ‘గత 30 ఏళ్లుగా తమ రాజకీయ ప్రత్యర్థులకు ఎవరితో అయినా తగాదాలు ఉంటే వాళ్లను చేరదీసుకొని రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయించడమన్నది పరిటాల కుటుంబానికి వెన్నతోపెట్టిన విద్య.. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ కుటుంబమని సినిమాలే తీశారు. గ్రామాల్లో ఆధిపత్యం కోసం వర్గ పోరు రాజేసి రాజకీయ హత్యలు చేయిస్తున్నారు. ప్రస్తుతం మాకు మండలంలో పట్టు తగ్గుతుందన్న భయంతో కేశవరెడ్డిని హతమార్చారు. మండలంలో టీడీపీ ఇన్చార్జ్ బాలాజీకి తెలియకుండా ఏ పని జరగదు. కనీసం పింఛన్, లోన్, ఇళ్లు వంటి ఏ పనులూ జరగవు. కానీ ఈ హత్య బాలాజీకి తెలియకుండా జరిగిందంటే ప్రజలు నమ్ముతారా?’ అని వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఆత్మకూరు మండల సీనియర్ నాయకులు కేశవరెడ్డి(67)బుధవారం దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. గురువారం కేశవరెడ్డి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ప్రకాష్రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కేశవరెడ్డి ఒకసారి సర్పంచుగా, మరోసారి సింగల్విండో ప్రసిడెంట్గా ఉండి మండల ప్రజలకు ఎనలేని సేవలను అందించారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక బలమైన నాయకుడు, అందరికీ అండగా ఉన్న వ్యక్తిని హత్య గావించడం వెనుక రాజకీయ కోణం ఉందని కేశవరెడ్డి బంధువులు, అభిమానులు చెబుతున్నారన్నారు. మంత్రి సునీత సోదరుడు, టీడీపీ మండల ఇన్చార్జ్ బాలాజీ హస్తంతోనే కేశవరెడ్డితో విభేదాలు ఉన్న నరసింహారెడ్డి చేత హత్య చేయించారని ఆరోపించారు. గతంలో ప్రసన్నాయపల్లి ప్రసాద్రెడ్డి హత్య వెనుక మంత్రి కుటుంబం ప్రోత్సాహం ఉందని, ఆ విషయం ప్రసాద్రెడ్డి సోదరుడు చెప్పినా పట్టించుకోలేదన్నారు. కందుకూరు శివారెడ్డి, తగరకుంట కొండారెడ్డి హత్య వెనుక మంత్రి హస్తం ఉందని మృతుల బంధువులు ఆరోపించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ చెప్పుచేతుల్లో అధికార యంత్రాంగం నడుస్తోందని, ఎనిమిదేళ్లుగా ఎలాంటి సమస్యలు లేవని, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మకూరులో ఈ హత్య జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన రోజే ఈ హత్య జరిగినా ఆయన స్పందించకపొవడం హత్య రాజకీయాలకు పోత్సహించేలా ఉందని ప్రకాష్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేశవరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ప్రజాదరణ పొందిన వ్యక్తి కేశవరెడ్డి కేశవరెడ్డి 30 ఏళ్లుగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ప్రజలకు ఎనలేని సేవలను అందించారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, రాజకీయ ఎదుగదలను చూసి ఓర్వలేక ఈ హత్య చేయించారు. కేవలం టీడీపీకి అడ్డుగా ఉంటాడని ఈ హత్య చేసి వైఎస్సార్సీపీకి మంచి నాయకుడిని దూరం చేశారు. -తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి ఇది ప్రభుత్వ హత్యే ఎప్పటికప్పుడు సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరుతుంది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కేశవరెడ్డిది ప్రభుత్వ హత్యగానే భావించాలి. హత్యలు చేయడం ద్వారా అందర్ని భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలనుకోవడం మూర్ఖత్వం. బాధితులు తప్పు చేసిన వారు పేర్ల ఫిర్యాదులో తెలిపినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకొకపోవడం అన్యాయం.’ -వెన్నపూస గోపాల్రెడ్డి ఎమ్మెల్సీ మంత్రి సునీతకు ప్రకాష్రెడ్డి ప్రశ్నలు అనంతపురం: కేశవరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జ్ తోపుదుర్తి ప్రకాష్రెడ్డి గురువారం మంత్రి పరిటాల సునీతకు పలు ప్రశ్నలు సంధించారు. నాలుగేళ్లలో జరిగిన హత్యలు, ఇతర ఘటనలపై ఆయన మంత్రిని నిలదీశారు. ప్రశ్నల పర్వం ఇలా.. - కేశవరెడ్డి హత్య కేసులో అధికారులకు ఆదేశిలిచ్చామని మంత్రి చెబుతున్నారు. బహుశా ఆమె ఆదేశాలతోనే హతుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఫిర్యాదులో మీ సోదరుడు బాలాజీ పేరు తొలగించాలంటూ పోలీసులు మృతుడి బంధువులపై ఒత్తిడి తేలేదా?. ప్రజలు తిరగబడితే పోస్టుమార్టం చేయించారు. ఇదేనేమో మంత్రి గారి ఒత్తిడి. - స్వయంగా హతుడు కేశవరెడ్డి భార్య తన ఫిర్యాదులో మీ సోదరుడు బాలాజీ పేరు పెడితే ఈరోజు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదు? ఇదేనా మంత్రి ఆదేశం. మీ తమ్ముడిని తప్పించేందుకే సాయంత్రం ఆరు గంటలకే ముద్దాయిని సరెండర్ చేయించారు. అతడిచ్చిన వాంగ్మూలం మేరకే బాలాజీ పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా చేశామంటూ క్రియేట్ చేయడం వాస్తవం కాదా? - అనంతపురం రూరల్ పిల్లిగుండ్లకాలనీలో ధనుంజయయాదవ్కి ఈడిగ వెంకటేష్ మధ్య వ్యక్తిగత కక్షలే. మీ దగ్గర వెంకటేష్ ఉండి, మావద్ద‡ ధనుంజయయాదవ్ ఉన్నంత వరకు అతడిపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. ధనుంజయయాదవ్ భయపడి మీ దగ్గరికి వస్తే ఇప్పుడు వారిద్దరూ ఒకే బండిపై తిరగడం లేదా? - ప్రసన్నాయపల్లి ప్రసాద్రెడ్డి, ఉప్పెర శ్రీనివాసులుకు కూడా వ్యక్తిగత కక్షలేనని మీరే వారిద్దరని రాజీ చేయలేదా? మీకు రాజకీయంగా నష్టం జరగనంతవరకు వారికి ఇబ్బంది లేదు. రాజకీయంగా అడ్డుపడతాని భావించినప్పుడు ప్రసాద్రెడ్డిని హత్య చేయించారు. ఈరోజు మళ్లీ శ్రీనివాసులు తదితరులకు రాజకీయ పదవులిచ్చి మీదగ్గర ఉంచుకున్నారు. - కందుకూరు శివారెడ్డివి కూడా వ్యక్తిగత కక్షలే. ప్రత్యర్థులు మిమ్మల్ని కలవడం మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే బాలకృష్ణ తదితరులు హత్య చేశారు. ఈరోజు వారిని మీ వద్దే ఉంచుకోవడం వాస్తం కాదా? - తగరకుంట కొండారెడ్డిది రాజకీయ హత్యే. ఆయనను తుద ముట్టించకపోతే రాజకీయ ంగా ఇబ్బంది తప్పదనే హత్య చేయించారు. - ఆత్మకూరు కేశవరెడ్డి హత్య వెనుక వ్యక్తిగత కక్షలే కారణం అంటున్నారు. 8 ఏళ్లుగా కేశవరెడ్డి, నరసింహారెడ్డి కుటుంబాలు అనేక కార్యక్రమాల్లో కలిసే పాల్గొన్నాయి. మొన్నటిదాకా తటస్థంగా ఉన్న కేశవరెడ్డి ఇటీవల వైఎస్సార్సీపీలో బలంగా ఎదుగుతున్నాడు. తీరా ఎన్నికల ముందు ఎందుకు చంపారు?. నరసింహారెడ్డి ఒక్కడే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోలేడనే విషయం మండలమంతా కోడై కూస్తోంది. - ఈరోజు అధికారం అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ధర్మం, న్యాయం ప్రజలకు తెలుస్తుందనే విషయం మంత్రి గుర్తు పెట్టుకోవాలి. -
రైతు నోట్లో మట్టి
మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామపరిధిలోని పేరూరు కాలవను తవ్వుతున్న దృశ్యమిది. ఈ కాలవ డీపీఆర్ పరిధిలో భూసేకరణ జరగలేదు. రైతులకు పరిహారం ఇవ్వలేదు. కానీ కాలవలు తవ్వేస్తున్నారు. పరిహారం ఇప్పించి పనులు ప్రారంభించేలా చూడాల్సిన మంత్రి, చిరునవ్వులు చిందిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. మంత్రి అండతో పనులు దక్కించుకున్న నిర్మాణసంస్థ ‘మెయిల్’ రైతుల అభిప్రాయాలతో పనిలేకుండా తవ్వకాలు చేపడుతోంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు జిల్లాలో ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం రైతులను ఎలా అన్యాయం చేస్తోందో చెప్పేందుకు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతలో అధికార పార్టీ నేతల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రైతుల పేరు చెప్పి ఆ రైతుల నోట్లోనే మట్టికొడుతున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పిందే శాసనం...అధికారులకు వారి మాటే శిరోధార్యం. భూసేకరణచట్టంతో పనిలేదు...రైతుల భవిష్యత్తుపై బాధ్యత లేదు...ప్రాజెక్టుల కాలువ నిర్మాణాలకు సంబంధించి గ్రామస్తుల అభ్యంతరాలు పట్టించుకోరు. తమకిష్టమొచ్చినట్లు చేసేస్తారు. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చినా, రైతులు, విపక్షపార్టీలు ఉద్యమించినా కాలవ నిర్మాణాల పేరుతో జరుగుతున్న ‘దౌర్జన్యకాండ’కు అడ్డుకట్టపడడంలేదు. చివరకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కూడా ‘చట్టం ఒకలా చెబుతుంటే ప్రభుత్వం మరోలా వ్యవహరిస్తే ఎలా?’ అనే కనీస ఆలోచన చేయడం లేదు. ఆ మూడు పనుల్లో వారు చెప్పిందే శాసనం ఉరవకొండ నియోజకవర్గంలో రూ.244.72 కోట్లతో 36వ ప్యాకేజీ పనులు సాగుతున్నాయి. ఈ పనులను టీడీపీ ఎంపీ సీఎం రమేశ్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఇక్కడ భూసేకరణ జరగకుండానే పనులు చేస్తుండగా..రైతులు అడ్డుకున్నారు. వామపక్షపార్టీలు, వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అయినా శాసనమండలి చీఫ్విప్ పయ్యావుల కేశవ్ అండతోనే ఈ పనులు సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. కలెక్టర్, జేసీ కూడా ఈ దౌర్జన్యకాండను ఆపలేకపోయారు. ఇక ఇదే స్ఫూర్తితో పేరూరు పనులకు మంత్రి పరిటాల సునీత శంకుస్థాపన చేసి ప్రారంభించారు. గొరిదిండ్లలో పనులు మొదలయ్యాయి. ఇక్కడా ఇదే పరిస్థితి. ‘భూసేకరణ చట్టం’లోని అంశాలు ఎక్కడా అమలు చేయకుండా పనులు ప్రారంభించారు. అయినప్పటికీ నిర్మాణసంస్థ ‘మెయిల్’ పనులు యథేచ్ఛగా పనులు చేస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ నేతల పొలాల్లోనే మొదటగా పనులు చేపడుతున్నారు. కాలవ పనులు తవ్విన తర్వాత, సామాన్య రైతుల పొలాల్లో తవ్వాలనేది వీరి వ్యూహం. తోటిపొలంలో భారీగా కాలువ తవ్విన తర్వాత, రైతులు పరిహారం ఇవ్వకుండా తవ్వేది లేదని ధిక్కారస్వరం విన్పిస్తే పరిహారం అందడంలో సమస్యలు తలెత్తుతాయేమోనని, పెద్దోళ్లతో తమకు ఎందుకు, అందరికీ అందినంతే, అందినప్పుడే పరిహారం అందుతుందని గుండెలో బాధను దిగమింగుకుని అయిష్టంగా భూములు త్యాగం చేస్తున్నారు. బీటీపీ ప్రాజెక్టు పనులకు నేడు సీఎం శంకుస్థాపన 36వ ప్యాకేజీ, పేరూరు పనులు వివాదస్పదంగా సాగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు బీటీపీకి నీళ్లిచ్చే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులకు సంబంధించి పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామసభలు, రేట్లు నిర్ధారణ, తదితర ప్రక్రియలు కొనసాగలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. భూసేకరణ జరగకుండానే మంత్రి పరిటాల సునీత పనులు ప్రారంభించి, అప్పుడప్పుడు పరిశీలనకు వస్తుండేవారు. నేడు మంత్రి కాలవ శ్రీనివాసులతో పాటు ఏకంగా సీఎం చంద్రబాబే వస్తున్నారు. ఈ పనులను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేపడుతోంది. ప్రజలకు మేలు జరగాలని చేసిన చట్టాలని పరిరక్షించాల్సిన బాధ్యత మంత్రులు, ముఖ్యమంత్రులపై ఉంటుంది. వారే వాటిని ఉల్లంఘించి రైతుల పొట్టకొట్టే చర్యలకు ఉపక్రమిస్తుంటే, రైతులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలో 36వ ప్యాకేజీ రూపంలో భూసేకరణ చట్టంతో పనిలేకుండా ప్రభుత్వం పనులు చేయడం ప్రారంభిస్తే...అది పేరూరు, బీటీపీ వరకూ వ్యాపించిందని, భవిష్యత్తులో అనంత– అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, ఇతర ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణ విషయంలో కూడా ఇదే పంథా అవలంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా రైతు, ప్రజా, కుల సంఘాలతో పాటు విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ‘దౌర్జన్యకాండ’ను అడ్డుకోకపోతే భవిష్యత్తులో ‘అనంత’ రైతులు, ప్రజల భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదముంది. రిజిస్ట్రేషన్ విలువ మేరకే పరిహామిస్తే రైతులకు నష్టం బీటీపీ పనుల కోసం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 22 రెవెన్యూ గ్రామాలలో బీటీపీ, కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పనులకు ప్రభుత్వం భూములను గుర్తించింది. 1,117 మంది రైతులకు చెందిన 1130.51 ఎకరా>లు భూమి కాల్వకు అవసరమని అధికారులు నిర్ధారించారు. ఆయా రెవెన్యూ గ్రామాల పొలాలు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చాలా తక్కువగా ఉంది. మండల కేంద్రాల్లో ఎకరం రిజిస్ట్రేషన్ విలువ రూ.2 లక్షలు, గ్రామాల్లో రూ.1.20 లక్షలు ఉండగా.. ముదిగల్లు రెవెన్యూ పరిధిలో మాత్రం రూ.2.10 లక్షల మేర రిజిస్ట్రేషన్ విలువ పలుకుతోంది. దీని ప్రకారం భూసేకరణ నిబంధనలు పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ విలువ భూమికి అదనంగా వంద శాతం పరిహారం అందించే అవకాశాలున్నాయి. అంటే ఎకరం రిజిస్ట్రేషన్ విలువ రూ.2 లక్షలు పలికితే రైతుకు పరిహారం రూ.4 లక్షలకు మించి అందదు. ఎకరం రిజిస్ట్రేషన్ విలువ రూ.1.20 లక్షలు పలికితే నిబంధనల ప్రకారం ఎకరం రూ.2.40 లక్షలు అందుతుంది. దీనిని బట్టి చూస్తే లక్షలాది రూపాయలు విలువ చేసే భూములను ప్రభుత్వం, టీడీపీ పాలకులు దౌర్జన్యంగా గుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. భూసేకరణ చట్టం ఏం చెబుతోందంటే 2013–భూసేకరణచట్టం ప్రకారం ఒక ప్రాజెక్టుకు ఏదైనా భూమి అవసరమైతే ఎంత అవసరం అవుతుందో ప్రాజెక్టు చేపట్టే సంబంధిత నీటిపారుదలశాఖ డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్)ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలి. ప్రభుత్వం భూమిని సేకరించాల్సిందిగా కలెక్టర్ను ఆదేశిస్తుంది. డీపీఆర్ ఆధారంగా ప్రాజెక్టు చేపట్టే గ్రామాల్లో ఎక్కడ భూమి అవసరం ఉంది..? అది ప్రభుత్వ, ప్రైవేటు భూమా? అని సర్వే చేయించాలి. ఎన్ని ఎకరాలు అవసరం అవుతుందో లెక్కించాలి. ప్రభుత్వ ధరలతో సంబంధం లేకుండా బహిరంగ మార్కెట్లో ఎంత ధర పలుకుతుందో లెక్కించి, దానికి అదనంగా ధరను నిర్ణయించాలి. ధర నిర్ణయించిన తర్వాత భూమి కోల్పోయే గ్రామాలన్నిటిలో జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించాలి. అందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ధరలపైన, కాలవ వెళ్లే మార్గాలపైన అభ్యంతరాలుంటే పరిగణలోకి తీసుకోవాలి. అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి, ఆపై రైతులు, గ్రామసభ ఆమోదం తెలిపినట్లు గ్రామస్తులు, రైతులతో సంతకాలు తీసుకోవాలి. తర్వాత జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆ తర్వాత కూడా అభ్యంతరాలు ఉంటే పరిగణలోకి తీసుకోవాలి. చివరగా రైతులకు పరిహారం ఇవ్వాలి. పరిహారం అందిన తర్వాత భూములు ప్రభుత్వానికి అప్పగించినట్లు రైతులు డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తారు. దీంతో భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత భూమిని నిర్మాణసంస్థకు అప్పగించాలి. పనులు ప్రారంభించాలి. ఇందులో ఏ ఒక్క ప్రక్రియ జిల్లాలో జరగలేదు. -
పతనం మొదలు.. పరిటాల కోటకు బీటలు
‘పరిటాల కోట’కు బీటలు వారుతున్నాయా? మంత్రి సునీత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఆ కుటుంబం తీరుతో విసిగిపోతున్నారా? టీడీపీనీ వీడి ప్రత్యామ్నాయ అన్వేషణలో ఉన్నారా? నియోజకవర్గంలో టీడీపీ పతనావస్థకు చేరిందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోన్న వేపకుంట రాజన్న, రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్లు టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరు పార్టీని వీడేందుకు ఉత్పన్నమైన పరిణామాలు, నియోజకవర్గంలో పరిటాల కుటుంబ తీరుతెన్నులు.. పార్టీ స్థితిగతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గం నుంచి మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సునీత సొంత నియోజకవర్గంలోనే పాలన పూర్తిగా గాడి తప్పింది. తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు ప్రజలచేత ఎన్నికైన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయాధికారాలు లేవు. ఏ మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నా ‘పరిటాల ఫ్యామిలీ’ నిర్ణయమే ఫైనల్. ఇందుకోసం సునీత తమ రక్త సంబంధీకులు, ఆత్మీయులనే ఇన్చా ర్జీలుగా నియమించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సంగతి పక్కనపెడితే మండలాల వారీగా భూకబ్జాలు, సెటిల్మెంట్లు, కాంట్రాక్టులతో పాటు ఆర్థిక లబ్ధి పొందే అంశాల్లో వీరు కీలకశక్తిగా ఎదిగారు. ఈ పరిస్థితి ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు, కీలక నేతలకుమింగుడు పడని పరిస్థితి. పరిటాల కుటుంబాన్ని ఎదిరించేందుకు బెదిరి మొదట్లో సర్దుకుపోయారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మంత్రికి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్న తరుణంలో ఒక్కొక్కరుగా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. చివరకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వీరిలో సునీత సామాజికవర్గానికి చెందిన కీలక నేతలే ఉండటం గమనార్హం. సైకిల్ దిగనున్న దగ్గుబాటి ప్రసాద్ రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ పరిటాల కుటుంబంతో అన్యాయానికి గురైన జాబితాలో చేరారు. వ్యాపారవేత్త అయిన ప్రసాద్ ఎంపీపీగా ఎన్నికయ్యేందుకు భారీగా ఖర్చు చేశారు. తర్వాత కూడా పార్టీ కోసం రూ.కోట్లు కుమ్మరించారు. అయితే సునీత సోదరుడు మురళీ నాలుగేళ్లుగా ప్రసాద్ను తీవ్ర వేదనుకు గురిచేశారని తెలుస్తోంది. ఎంపీపీగా పూర్తి డమ్మీని చేసి, తానే ఎంపీపీగా వ్యవహరించారు. మురళీ సిఫార్సు లేకుండా ఎంపీపీ చెబితే పింఛన్ కూడా ఇవ్వలేని స్థితికి ప్రసాద్ చేరారు. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంపీపీ చేయాల్సిన పనులను మురళీ చేస్తున్నారు. బుక్కచెర్లలో రూ.కోటితో చేసిన సామిరెడ్డిపల్లి వంక అభివృద్ధి పనులకు మురళీ భూమిపూజ చేశారు. బోగినేపల్లి సీసీరోడ్డుకు భూమి పూజ చేశారు. చివరకు గురువారం అయ్యవారిపల్లి సీసీరోడ్డుకు కూడా అతనే భూమిపూజ చేశారు. మురళీ కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అయినప్పటికీ అధికారులు ప్రొటోకాల్కు విరుద్ధంగా ఆయనతోనే కార్యక్రమాలు చేయిస్తున్నారు. చివరకు రాప్తాడులో నిర్మించిన టీడీపీ ఆఫీసుకు ప్రసాద్ రూ.10లక్షలు విరాళం ఇచ్చారు. దీని ప్రారంభోత్సవానికి ఆహ్వానం కూడా పంపలేదు. ఇక శుక్రవారం పండమేరులో మంత్రి నిర్వహించిన జలహారతి కార్యక్రమానికీ ఎంపీపీకి సమాచారం ఇవ్వలేదు. ఇలా ప్రతీ అంశంలో కనీసమర్యాద లేకుండా ప్రసాద్ను అవమానానికి గురిచేశారు. ఆర్థికంగా బలహీనుడి చేసే ప్రయత్నం ఆర్థికంగా కూడా ప్రసాద్ను బలహీనుడిని చేసే ప్రయత్నం చేశారు. నాలుగేళ్లలో ఎలాంటి కాంట్రాక్టు ప్రసాద్కు దక్కకుండా మంత్రి ప్రయత్నించారని తెలుస్తోంది. ప్రసాద్ సొంత గ్రామం బండమీదపల్లిలో రూ.8.5కోట్లతో చేస్తున్న కాలవ పని ప్రసాద్కు దక్కుకుండా మురళీనే ఎన్ఎంఆర్ కన్స్ట్రక్షన్స్కు ఇప్పించుకుని పనిచేస్తున్నారు. ఆర్థికంగా తాను నష్టపోయానని, పని ఇవ్వాలని విన్నవించినా ఖాతరు చేయలేదు. దీంతోపాటు వ్యాపార రీత్యా ప్రసాద్ను దెబ్బతీసే యత్నం చేశారు. ప్రసాద్కు హైదరాబాద్లో ‘డీబీ పాలిమర్స్’ అనే పెట్రో కెమిల్లైన్స్ పైపులు తయారు చేసే పరిశ్రమ ఉంది. ఇందులో మురళీ కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు. వారంతా మూడేళ్లు అందులో పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత వారిని అక్కడి నుంచి రప్పించి, రూ.20కోట్లతో గతేడాది డిసెంబర్లో ‘ఎస్వీఆర్ఎస్ పాలిమర్స్’ పేరుతో కొత్త పరిశ్రమను స్థాపించారు. ఈ ఘటనతో ప్రసాద్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను మంత్రి సునీత వద్దకు తీసుకెళ్లి ఇచ్చారు. అయితే ఎన్నికలు ముగిసే వరకూ రాజీనామా చేయొద్దని, పార్టీలోనే ఉండాలని.. వెళితే పార్టీకి వ్యతిరక పవనాలు వీస్తున్నాయనే మెసేజ్ ప్రజల్లోకి వెళుతుందని ప్రసాద్ను బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే బెదిరింపులకు లొంగకుండా పార్టీని వీడేందుకే ప్రసాద్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వేపకుంట రాజన్నదీ అదేబాట పరిటాల రవీంద్ర హయాంలో ఆయనకు కుడిభుజంగా వేపకుంట రాజన్న ఎదిగారు. కనగానపల్లి మండలంలో కీలక నేత. సునీత, ఆమె కుటుంసభ్యుల తీరుతో విసిగిపోయిన రాజన్న టీడీపీకి దూరంగా ఉంటున్నారు. త్వరలోనే పార్టీని వీడుతానని సన్నిహితులకు చెబుతున్నారు. కనగానపల్లి ఇన్చార్జిగా నెట్టెం వెంకటేశ్ మొన్నటి వరకూ కొనసాగారు. ఇటీవల వైఎస్సార్సీపీ నేత ముకుందనాయుడు టీడీపీలోకి వెళ్లారు. నాయుడు భర్త పద్మీగీత ఎంపీపీగా కొనసాగుతున్నారు. నెట్టెం వెంకటేశ్ను తప్పించి నాయుడికి కనగానపల్లి బాధ్యతలు అప్పగించారు. దీంతో వెంకటేశ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. నాలుగేళ్లుగా పరిటాల కుటుంబం ఆర్థికంగా అత్యంత బలంగా ఎదగడం మినహా ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలకు ఒరిగిందేమీ లేదని.. వీరిని నమ్ముకుంటే రోడ్డునపడక తప్పదనే నిర్ణయంతో పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
రుణ మాఫీ కాలేదు
-
డ్వాక్రా రుణమాఫీకి పైసా కూడా ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ అయిన డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదని, అసలు అలాంటి ఆలోచనే లేదని టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని స్త్రీ,శిశు సంక్షేమ, సెర్ప్, మహిళా సాధికారిత మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో డ్వాక్రా రుణాల చెల్లింపులపై సమాధానం ఇస్తూ ఈ విషయం తెలిపారు. 2014–15, 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్వాక్రారుణాల మాఫీ మొత్తం ఎంత? జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని, రాష్ట్రంలో 2014 జూన్ నాటికి మిగిలి ఉన్న డ్వాక్రా రుణాల మొత్తం ఎంత, ఇప్పటి వరకూ మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంత, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదన ఉందా? అయితే ఆ వివరాలు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు పాముల పుష్ప శ్రీవాణి, ఆర్కే రోజా, గౌరు చరితారెడ్డి రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి మంత్రి సునీత సమాధానమిస్తూ.. 2014 నుంచి 2018 వరకూ ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాల మొత్తం రూ. 11,069 కోట్లు ఉన్నాయని, దీనికి ఒక్క పైసా కూడా మాఫీ కింద చెల్లించలేదని, దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనా కూడా లేదని జవాబిచ్చారు. అయితే మహిళలకు పసుపు కుంకుమల కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రకటించామని, ఇప్పటికే రూ.8 వేలు ఇచ్చామన్నారు. డ్వాక్రా రుణమాఫీ కంటే పసుపు కుంకుమకే ఎక్కువ ఇచ్చామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 2014 మార్చి 31కి ముందు రిజిస్టర్ అయిన గ్రూపులకు మాత్రమే ఇచ్చామని, కొత్త గ్రూపులకు ఇవ్వలేదని స్పష్టంచేశారు. ప్రతిపక్షం మీ దగ్గరే ఉందికదా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ ప్రశ్న వేశారని టీడీపీ ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు. మంత్రి దీనిపై మరో రకంగా సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. వాస్తవానికి పసుపు కుంకుమ కింద అంతకంటే ఎక్కువే ఇచ్చామని, డ్వాక్రా రుణాల మాఫీ గురించి ప్రస్తావించకూడదని ఆయన సలహా ఇచ్చారు. దీనిపై బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్రాజు స్పందిస్తూ.. 22 మంది ప్రతిపక్ష సభ్యులు మీదగ్గరే ఉన్నారు కదా అని అన్నారు. అలాంటప్పుడు ప్రతిపక్షం బయట ఉందని ఎలా అంటారని ప్రశ్నించారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇరుకున పడ్డారు. వెంటనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కలుగజేసుకుని ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషిస్తున్నామని చెప్పి టాపిక్ను మార్చేప్రయత్నం చేశారు. మహిళలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు గ్రామ దర్శిని, నగర దర్శిని కార్యక్రమాల్లో ఊళ్లకు వెళ్లినపుడు మహిళలు డ్వాక్రా రుణాల మాఫీపై గట్టిగా ప్రశ్నిస్తున్నారని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆన్లైన్ ఇబ్బందులని, ఆధార్ ఎన్రోల్మెంటు లేదని, బ్యాంకు ఖాతాలు లేవని అధికారులు చెబుతున్నారని బోండా ఉమా, జోగేశ్వరరావు, వర్మ తదితరులు తెలిపారు. నాలుగేళ్లుగా డ్వాక్రా మాఫీపై అడుగుతూనే ఉన్నాం, మంత్రి చెబుతూనే ఉన్నారని, కానీ మాఫీ కాలేదని పేర్కొన్నారు. ఏ ఊరికి వెళ్లినా.. మేనిఫెస్టోలో పెట్టిన డ్వాక్రా రుణమాఫీ హామీని ఎందుకు నెరవేర్చడం లేదంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కమిటీ ఎందుకు వేయడంలేదు రాష్ట్రంలో అక్రమంగా మైనింగ్పై ఎందుకు కమిటీ వేసి నిగ్గుతేల్చలేక పోతున్నారని, దీనికి భయమెందుకని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పలు సిమెంటు కంపెనీలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నాయని, ప్రభుత్వం దీనిపై కమిటీ వేస్తే సాక్ష్యాలు చూపిస్తానని, కానీ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతోందో అర్థం కాలేదని అన్నారు. దీనికి మంత్రి సుజయకృష్ణ రంగారావు ‘చర్యలు తీసుకుంటాం’ అని క్లుప్తంగా సమాధానం చెప్పారు. డ్వాక్రా రుణాలపై ఎమ్మెల్యేలు ఏమన్నారు మృణాళిని: పెట్టుబడి నిధి రావట్లేదని మహిళలు చెబుతున్నారు. తాము డ్వాక్రా కమిటీలో సభ్యులమైనా ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. చాలామంది తమ ఖాతాల్లో డబ్బులు వెయ్యడం లేదని చెబుతున్నారు. వర్మ: గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు మహిళలు దీనిపైనే గట్టిగా నిలదీస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రూపుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందిగా ఉంది. మంత్రిగారు దీనిపై చర్యలు తీసుకోవాలి. కూనరవికుమార్ గౌడ్: 2014 తర్వాత ఏర్పడిన గ్రూపులు ఏం కావాలి. పాత వారికి కూడా ఆన్లైన్లో సమస్యలని, ఆధార్ ఎన్రోల్లో సమస్యలని ఏదో ఒక కారణంతో పసుపు కుంకుమకు ఇచ్చే నిధులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. జోగేశ్వరరావు: తమకు పసుపు కుంకుమ పథకం అందడంలేదని చాలా చోట్ల మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. -
మా కుటుంబానికి ప్రాణహాని వుంది
-
‘పరిటాల నుంచి మా కుటుంబానికి ప్రాణహాని’
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మూడేళ్ల కిందట రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి దారుణహత్యకు గురైన సంగతి తెల్సిందే. తాజాగా ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రసాద్ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు పేరిట అడంగల్ జారీ చేశారు. దీనిపై ప్రసాద్ రెడ్డి సోదరుడు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహానందరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీత తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన అన్నను చంపినట్టే తననూ హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము కొనుగోలు చేసిన భూమిలో కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని చెప్పారు. మంత్రి పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మహానంద రెడ్డి విలేకరుల ఎదుట వెల్లడించారు. -
సిగ్గుసిగ్గు..
అనంతపురం న్యూసిటీ: స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ మహిళాధ్యక్షురాలు బోయ గిరిజమ్మ విమర్శించారు. కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్వాడీ కార్యకర్తపై శనివారం జరిగిన దాడిని ఆమె ఖండించారు. అనంత సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె ఆదివారం కలిసి పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో దౌర్జన్యాలు, అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. పట్టపగలే అంగన్వాడీ కార్యకర్తపై అత్యాచారయత్నానికి తెగబడడం సిగ్గు చేటన్నారు. ఘటనకు కారకుడైన టీడీపీ కార్యకర్తపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేకూరేవరకూ వైఎస్సార్ సీపీ తరుఫున పోరాటం సాగిస్తామని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తను పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు లక్ష్మి, పద్మ, రత్న, మణి, రామాంజినమ్మ, తదితరులున్నారు. కామాంధుడిపై చర్యలకు ఐద్వా డిమాండ్ అనంతపురం న్యూసిటీ: కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్వాడీ కార్యకర్తపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ను ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఎస్పీకు ఆమె వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. గ్రామాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై బలమైన సెక్షన్లు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీని కలిసిన వారిలో ఐద్వా నగర కార్యదర్శి చంద్రిక, నాయకురాలు వనజ, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్రయాదవ్ తదితరులున్నారు. అంతకు ముందు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలను వారు పరామర్శించి, జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఎస్సీని కలిసిన సీఐటీయూ నేతలు అనంతపురం రూరల్: కనగానపల్లి మండలం తూంచర్ల అంగన్వాడీ కార్యకర్తపై లైంగిక దాడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్త నాగరాజుపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ జిల్లా ఎస్పీ అశోక్కుమార్ను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఓ కార్యక్రమానికి హాజరైన ఎస్పీని వారు కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తపై లైంగిక దాడికి ప్రయత్నించిన నాగరాజుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గోపాల్, కదిరప్ప, అంగన్వాడీ హెల్పర్ యూనియన్ నాయకురాళ్లు జమునా, దిల్షాద్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు సైకిళ్లు.. నేడు స్కార్పియోలు
అనంతపురం, రాప్తాడు: ‘‘పరిటాల కుటుంబ సభ్యులు 1993లో సైకిళ్లలో తిరిగేవారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి స్కార్పియోల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కుటుంబ సభ్యులు, సమీప బంధువులను ఇన్చార్జీలుగా నియమించుకుని పరిటాల కుటుంబం నియంత పాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని టీడీపీ సీనియర్ నేత, రాప్తాడు మండల మాజీ కన్వీనర్ నెట్టెం లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ఎం.బండమీదపల్లిలో శుక్రవారం ‘గ్రామదర్శిని–గ్రామవికాసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే మండలంలోనే సీనియర్ నేత అయిన నెట్టెం లక్ష్మీనారాయణతో పాటు ఆయన అనుచరవర్గం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. సమావేశం ముగిసేంత వరకు వీరంతా గ్రామంలోని ఆయన తోటలో విందు చేసుకున్నారు. గ్రామంలో దాదాపు 500 మంది కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పరిటాల కుటుంబం తనను రాజకీయంగా అణగదొక్కిందన్నారు. సంక్షేమ పథకాల విషయంలో తన వర్గీయులకు తీరని అన్యాయం చేశారన్నారు. 36 సంవత్సరాలు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినా కనీస గుర్తింపును కూడా ఇవ్వలేదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పరిటాల కుటుంబానికి అసమ్మతి వర్గం తయారైందన్నారు. ఎన్నికల్లో వీరంతా పరిటాల కుటుంబానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
మంత్రి సునీత సమక్షంలోనే కొట్టుకున్న తమ్ముళ్లు
కనగానపల్లి: ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం టీడీపీ చేపట్టిన గ్రామదర్శిని – గ్రామ వికాసం కార్యక్రమం మంత్రి పరిటాల సునీతకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు బయటపడుతుండడంతో పాటు సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ స్థానికులు నిలదీస్తుండడంతో సమాధానాలు చెప్పుకోలేక మంత్రి సతమతమవుతున్నారు. బుధవారం కనగానపల్లి మండలం చంద్రశ్చర్లలో మంత్రి సమక్షంలోనే తమ్ముళ్లు ఘర్షణ పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం చంద్రశ్చర్ల గ్రామానికి చేరుకున్న మంత్రి సునీతకు స్థానిక ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. టీడీపీకి పట్టు ఉన్న ఈ గ్రామంలో మంత్రి ఏకపక్షంగా ఓ వర్గానికే మద్దతు తెలుపుతుండడంతో విభేదాల కుంపటి రాజుకుంది. ఇంతకాలం అవకాశం కోసం కాచుకుని ఉన్న అసమ్మతి వాదులకు మంత్రి రాక ఓ వరంలా మారింది. గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ద్వారా రూ. 5తో నీటిని అమ్ముకుంటున్నారంటూ సర్పంచ్ రామసుబ్బయ్యకు వ్యతిరేకంగా పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ సర్పంచ్ వర్గీయులు ఫిర్యాదు చేసిన రామకృష్ణ, సాయిరాం వర్గీయులపై దాడికి దిగారు. మంత్రి వారిస్తున్న వినకుండా ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అర్ధంతరంగా కార్యక్రమాన్ని ముగించుకుని మంత్రి వెనుదిరిగిపోయారు. -
పరిటాల శ్రీరామ్ రైతులపై అనుచిత వ్యాఖ్యలు
-
పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు.. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రైతులు, రైతు కుటుంబాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సునీత, తన తనయుడి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఆ అర్హత శ్రీరామ్కు లేదు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. రైతుల మనోభాలను పరిటాల కుటుంబం దెబ్బతీస్తోందన్నారు. రైతు బిడ్డలు రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారంటూ శ్రీరామ్ వ్యాఖ్యానించటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు.. కర్నాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లారని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా పదవుల్లో ఉంటున్న పరిటాల కుటుంబం ఏం సాధించిందని ప్రశ్నించారు. కరవుపై మాట్లాడే అర్హత పరిటాల శ్రీరామ్కు లేదని ఆయన పేర్కొన్నారు. -
శిశు సంక్షేమం.. అనారోగ్యం పాలు!
రామగిరి: మహిళా శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత ఇలాకాలోనే మహిళలు, శిశువులకు అన్యాయం జరుగుతోంది. పౌష్టికాహారం పేరుతో అందజేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపిస్తుండడంతో వాటిని స్వీకరించిన పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్కు ఉన్నత స్థాయి పలుకుబడి ఉండడంతో అధికారులు పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. దీంతో నాసిరకం కోడిగుడ్లు, కాలంచెల్లిన పాల ప్యాకెట్లు గర్భిణులు, చిన్నారులు, బాలింతల వద్దకు చేరిపోతున్నాయి. మంత్రి సునీత సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్త పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాలం చెల్లిన పాలు :రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ పాలను సరఫరా చేశారు. వీటిని తయారు చేసిన మూడు నెలల్లోపు వినియోగించాల్సి ఉంది. అయితే ఆరు నెలల క్రితం ప్యాక్ చేసిన పాలు కొన్నింటిని సరఫరా చేయగా.. మరికొన్ని పాలుకు నేటితో (మంగళవారం)తో గడువు ముగియనుంది. వీటిని చెన్నేకొత్తపల్లి మండలంలోని 62 అంగన్ వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్ సరఫరా చేసి చేతులు దులుపుకున్నాడు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించారు. ప్రజారోగ్యంతో చెలగాటం : స్త్రీ శిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గొప్పలకు పోతున్న రాష్ట్ర మంత్రి పరిటాల సునీత.. తన సొంత నియోజకవర్గంలోనే మహిళలు, శిశువుల సంక్షేమాన్ని విస్మరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నాణ్యత లేని, నాసిరకంగా కాలం చెల్లిన సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నా.. ఆమె స్పందించకపోవడం ఇందుకు అద్దం పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. చెన్నేకొత్తపల్లి మండలంలోని మొత్తం 62 అంగన్ వాడీ కేంద్రాలకు ఇటీవల కాలం చెల్లిన పాలను సరఫరా చేశారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో 2,408 మంది చిన్నారులు, 281 మంది బాలింతలు, 294 మంది గర్భిణులు ఉన్నారు. వీరందరికీ పౌష్టికాహారం కింద కోడి గుడ్లు, పాల ప్యాకెట్లను అందజేస్తున్నారు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు కానీ.. కాలం చెల్లిన, నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడడం దుమారం రేపుతోంది. వెనక్కు తెప్పిస్తాం చెన్నేకొత్తపల్లి మండలంలో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు సరఫరా చేసిన మాట వాస్తవమే. అంగన్వాడీ కేంద్రాల నుంచి వాటన్నింటినీ వెనక్కు తెప్పిస్తున్నాం. పాలు సరఫరా చేసే ఏజన్సీ వారు అదనంగా స్టాక్ ఉందని ఎక్కువగా సరఫరా చేయడం వల్లనే ఈ సమస్య తలెత్తింది. ఇకపై ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.– గాయత్రి, సీడీపీవో, చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ -
మంత్రి తమ్ముడా.. మజాకా!
మంత్రాలయం: అధికారం ఉంటే ఎలాంటి మర్యాదైనా అలా నడిచివస్తుందేమో! మంత్రి తమ్ముడి రాకతో ఇక్కడి రెవెన్యూ అధికారులు రాచమర్యాదలు చేశారు. అడుగడుగునా వంగి వంగి దండాలు పెట్టారు. అడిగిన వెంటనే స్వామి దర్శనంతో పాటు పీఠాధిపతి ఆశీర్వచనాలూ అందజేయించారు. ఆఖరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లుగానూ మారిపోయారు. మండల మేజిస్ట్రేట్ మొదలు ఇద్దరు వీఆర్వోలు ‘తమ్ముడి’ సేవలో తరించారు. ఈ దృశ్యం చూసి భక్తులంతా ముక్కున వేలేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తమ్ముడు మురళీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చారు. రెవెన్యూ అధికారులు ప్రొటోకాల్ను విస్మరించి.. దగ్గరుండి ‘తమ్ముడి’ సేవలో తరించారు. విడిది కోసం వసతి మొదలు పీఠాధిపతి ఆశీర్వచనం వరకు దగ్గరుండి చేయించారు. తహసీల్దార్ చంద్రశేఖర్, వీఆర్వోలు జనార్దన్రావు, భీమయ్య వారి సేవల్లో తరించారు. గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీరాఘవేంద్రస్వామి దర్శనం, పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల ఆశీర్వచనాలు రాచమర్యాదలతో చేయించారు. ప్రసాదాల పార్శిళ్లతో పాటు ఆశీర్వచన ఫల, పూల మంత్రాక్షింతలు, శేషవస్త్రాలను రెవెన్యూ అధికారులే మోసుకుని ప్రదక్షిణ చేశారు. శ్రీమఠంలో చివరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి వీఆర్వో జనార్దన్రావు ఫొటోగ్రాఫర్గా మారిపోయారు. మంత్రులు వస్తే ఇవ్వాల్సిన ప్రొటోకాల్ వారి తమ్ముళ్లకు సైతం లభిస్తోందంటే నిజంగా దౌర్భాగ్యమని భక్తులు వ్యాఖ్యానించారు. కార్యాలయాల్లో పనులు పక్కనపెట్టి రెవెన్యూ అధికారులు ఇలా ‘తమ్ముడి’ సేవలో తరించడం విమర్శలకు తావిస్తోంది. -
‘పరిటాల సునీత నైతిక బాధ్యత వహించాలి’
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత వర్గీయుల అరాచకాలు జిల్లాలో తీవ్ర స్థాయికి చేరాయని వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. అనంతపురం ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల భూములను టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూరు మండలం వేపచర్లకు చెందిన రైతు కేశవనాయక్ ఆత్మహత్యకు మంత్రి పరిటాల సునీత నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేశవనాయక్ అసైన్డ్ భూమిని పరిటాల వర్గీయులు రద్దు చేయించారని అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు తొత్తుగా వ్యవహరించిన తహశీల్దార్ నాగరాజుపై బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినా కలెక్టర్ స్పందించకపోవడం దారుణమన్నారు. బాధితుల పక్షాన నిలబడిన తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై హైకోర్టు, లోకాయుక్తలో కేసులు వేస్తామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. -
‘పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో క్రిమినల్ గ్యాంగ్స్’
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్లను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంత్రి పరిటాల సునీతను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. టీడీపీ నేతల గూండాగిరికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్న కేసుల్లో సరైన విచారణ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. వారిపై ఆలస్యంగా ఛార్జిషీట్లు నమోదు చేసి శిక్షలు పడకుండా పోలీసులు సహకరిస్తున్నారని కృష్ణప్ప ధ్వజమెత్తారు. చదవండి : పరిటాల అనుచరుల రౌడీరాజ్యం -
పవన్ కల్యాణ్కు పరిటాల సునీత హితవు
గుంటూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మంత్రి సునీత ఆహ్వానం పలికారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ది యువరక్తమని, యాత్రల పేరుతో సమయం వృథా చేసుకోవడం అనవసరమని హితవు పలికారు. తమతో కలిసి ముందు నడిస్తే బాగుంటుందని చెప్పారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. -
కులాల మధ్య మంత్రి చిచ్చు
అనంతపురం: మంత్రి పరిటాల సునీత గ్రామాల్లో కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. రామగిరి మండలం పోలేపల్లి చోటు చేసుకున్న ఘటనపై వారు మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ డిల్లీరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అధికార పార్టీ నేతలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గ్రామాలు ప్రశాంతంగా ఉండడం టీడీపీ వారికి ఇష్టం లేదన్నారు. ఎంతసేపూ చిచ్చుపెట్టి గ్రూపులు తయారు చేసి తాము లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కులాల చిచ్చుతో శాంతిభద్రతలకు ముప్పు పోలేపల్లిలో కనకదాస విగ్రహం ఏర్పాటు చేయాలని కురుబ కులస్తులు ఏడాదికిందటే సిద్ధం చేసుకున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. అయితే విగ్రహం ఏర్పాటు చేయకుండా అధికార పార్టీ వారు అడ్డుపడ్డారని ఆరోపించారు. దీంతో గ్రామంలో కురుబ కులస్తులు వ్యతిరేకమవుతున్నారని భావించి వారి దృష్టి మళ్లించేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి గడ్డివాము కల్లాలు తొలగించి బీసీలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రకటించారన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే రెడ్డి – కురుబ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతల సమస్య తలెత్తేందుకు కారణమవుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డిని చూసి నేర్చుకోండి బీసీలకు న్యాయం చేయడంలో మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి తనకు తానే సాటి అని, ఆయన్ని చూసి నేర్చుకోవాలని మంత్రి పరిటాల సునీతకు తోపుదుర్తి సూచించారు. స్థలం కొని బీసీలకు పట్టాలివ్వండి ఎస్. రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో ఏడు ఎకరాల భూమి కొనుగోలు చేసి పట్టాలిప్పించి ఇళ్లు కూడా నిర్మించారని వైఎస్సార్సీపీ నాయకులు చిట్ర రఘునాథ్, బోయ సూరి, గ్రామ రైతులు తెలిపారు. మరి 25 ఏళ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న పరిటాల కుటుంబం ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసి ఎందుకు పట్టాలివ్వలేదని ప్రశ్నించారు. గ్రామంలోని బీసీలు కోరుకుంటే రైతులంతా చందాలు వేసుకుని వారి ఇళ్లస్థలాల కోసం భూమి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే గడ్డివాము కల్లాలను తొలగించకుండా ప్రభుత్వం ద్వారా çస్థలం కొనుగోలు చేసి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కుంటిమద్ది కేశవనారాయణ, రైతు విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి పోలేపల్లి ఆదిరెడ్డి ఉన్నారు. ఖాళీ కాగితాలతో మభ్యపెట్టొద్దు.. టీడీపీ ఐదేళ్ల పాలనలో రాప్తడు నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. వైఎస్ హయాంలో 30 వేల ఇళ్లు నిర్మించారని, ఒక్క రామగిరి మండలంలోనే 5 వేల ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. ఇదే రామగిరి మండలంలో మంత్రి పరిటాల సునీత కనీసం 500 ఇళ్లు కూడా కట్టించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇళ్ల స్థలాలంటూ ఖాళీ కాగితాలతో ప్రజలను మభ్యపెట్టొద్దని హితవు పలికారు. చిత్తశుద్ధి ఉంటే కనకదాన విగ్రహం ఏర్పాటు చేయించి, ప్రభుత్వంతో భూమి కొనుగోలు చేయించి బీసీలకు పట్టాలిప్పించి పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పరిటాల ముఖ్య అనుచరుడు చమన్ హఠాన్మరణం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ హఠాన్మరణం చెందారు. చమన్కు సోమవారం ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్న సవేరా అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పరిటాల రవి కుమార్తె వివాహ వేడుకల పర్యవేక్షణ కోసం గత మూడు రోజులుగా చమన్ వెంకటాపురంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఆయన అస్వస్తతకు గురైనట్టు సన్నిహితులు తెలిపారు. చమన్ మరణవార్త విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆయనకు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన చమన్.. రవి హత్య తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చమన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 2014 నుంచి 2017 వరకు ఆయన అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. సొమ్మసిల్లిన మంత్రి సునీత చమన్ అస్వస్తతకు గురైన వార్త తెలుసుకున్న మంత్రి సునీత హుటాహుటిన సవేరా ఆసుపత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చమన్ చనిపోయారన్న వార్త విన్న ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. డాక్టర్లు వెంటనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించారు. -
మహిళా ఉద్యోగి కంటతడి
అనంతపురం సిటీ : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలో మహిళా ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి. నిన్న ఐసీడీఎస్ పీడీ వెంకటేశం.. నేడు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా పరిషత్లోని ఆడిటింగ్ కార్యాలయంలో సరస్వతి ఆడిటర్గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 10.20 గంటల సమయంలో కార్యాలయంలోంచి గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చారు. తోటి ఉద్యోగులు, స్థానికులు ఏమని ఆరా తీయగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి తనపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆమె గోడు వెల్లబోసుకున్నారు. అదే పనిగా అవసరం లేని ఫైళ్లను తెప్పించుకోవడమే కాకుండా పని చేయడం సరిగా రాదంటూ మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగికి కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగితం లేకుండా తరచూ సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తుండటంతో పరిపాలనా అధికారి (ఏఓ) రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందనా లేకపోయిందన్నారు. గురువారం ఉదయం వచ్చీరాగానే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో తట్టుకోలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. విచారణలో వెటకారం! అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి దురుసు ప్రవర్తన గురించి బాధితురాలు సరస్వతి సాయంత్రం ఏఓ దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురినీ తన ఛాంబర్లోకి పిలిపించుకున్న ఏఓ విచారణలో హుందాగా వ్యవహరించలేదు. వలవలా ఏడుస్తున్న బాధితురాలికి ధైర్యం చెప్పకుండా.. మహిళా ఉద్యోగుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో చివాట్లు పెట్టకుండా.. సమన్వయంతో పని చేసుకుని వెళ్లాలని అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ను మందలించకుండా.. తన సీటులో వెనక్కు ఆనుకుని.. ‘ఏమ్ జరిగిందీ..’ అంటూ వెటకారంగా విచారణ మొదలు పెట్టారు. తన బాధను అర్థం చేసుకోవడం లేదని భావించిన సరస్వతి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నట్లు చెప్పడంతో కంగుతిన్న అధికారులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడుతున్న అధికారి వ్యవహారంపై ఇప్పటిదాకా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
‘పరిటాల సునీతానే.. ఆయన చావుకు కారణం’
ఆత్మకూరు : ‘మంత్రి పరిటాల సునీత అధికార దాహానికి అంతు లేకుండా పోతోంది. భూ దాహంతో రైతుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. రైతు కేశవ్నాయక్ చావుకు మంత్రి సునీతే కారణం’ అంటూ వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. కేశవనాయక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. కార్యక్రమానికి సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ నాయకులు మద్ధతు పలికారు. మండలాలు పంచుకుని.. రాప్తాడు నియోజకవర్గంలోని ఒక్కొ మండలానికి ఇన్చార్జ్గా తన బంధువులను నియమించి మంత్రి సునీత పెత్తందారి పాలన సాగిస్తున్నారని ప్రకాష్రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా అధికారులు ముందుగా మంత్రి గడప తొక్కాల్సి వస్తోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీని మంత్రి సోదరుడు బాలాజీ చెప్పిన వారికే స్థానిక వ్యవసాయాధికారి పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఎంపీడీవో ఆదినారాయణ పచ్చ చొక్కా వేసుకున్న అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్పంచ్లను కీలుబొమ్మలను చేసి ఆడిస్తున్నారన్నారు. టీడీపీలో చేరకపోతే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ సాక్షాత్తూ ఓ అధికారి చెప్పడం సిగ్టుచేటన్నారు. అన్యాయాలపై పోలీసులు సైతం కళ్లు మూసుకున్నారన్నారు. అన్యాయాలపై ప్రజలు తిరగబడితే మంత్రి సునీతనే కాదు ఎవరూ కాపాడలేరంటూ బాలాజీకి హితవు పలికారు. నాలుగేళ్ల పాలనలో అక్రమాల పుట్ట నాలుగేళ్ల పాలనలో నియోజకవర్గంలో మంత్రి సునీత అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్లుగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులు అడ్డుకున్నారన్నారు. వై.కొత్తపల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను డి.నారాయణస్వామి చేస్తున్నాడని గుర్తు చేశారు. ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఈ పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కుర్లపల్లి వద్ద దళితులకు ఇచ్చిన భూమిని మంత్రి బంధువు లాగేసుకుని కంకర మిషన్ వేసి, సిద్ధరాంపురం వద్ద అనధికారికంగా గుట్టలను ఆన్లైన్లో వారి పేరుపై చేసుకున్నారన్నారు. పుట్టపర్తి వద్ద బైపాస్ నిర్మాణానికి ఎకరాకు రూ.23 లక్షలు ఇస్తుండగా ఆత్మకూరు వద్ద మాత్రం ఎకరాకు రూ.5 లక్షల ఇచ్చి అన్నదాతల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా తాము చేస్తున్నది అక్రమమని అధికారులు గుర్తించి, ప్రజలకు న్యాయం చేకూర్చకపోతే మండలంలో ఏ ఒక్క ప్రభుత్వాధికారిని తిరగబోనివ్వమని హెచ్చరించారు. రూ. 20 లక్షలు పరిహారం ఇవ్వండి ఆత్మహత్య చేసుకున్న రైతు కేశవనాయక్ కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారంతో పాటు ఐదు ఎకరాల పొలాన్ని ఇవ్వాలని ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన విషయం ముందుగానే తెలుసుకున్న తహసీల్దార్ మంగళవారం విధులకు రాలేదు. దీంతో ఆర్డీవో మలోలాతో ప్రకాష్రెడ్డి, సీపీఎం నేతలు నేరుగా ఫోన్లో మాట్లాడారు. అక్రమంగా భూమిని మరొకరి పేరుపై చేసిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్పై విచారణ జరిపి తహసీల్దార్పై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారాం, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ముమ్మాటికీ ఇది హత్యే అధికారుల చేతిలో రూ. వెయ్యి పెడితే రాత్రికి రాత్రి ఒకరి పేరుమీద ఉన్న పొలాన్ని మరొకరి పేరు మీద మార్చేస్తున్నారు. ఇలా చేసే కేశవ్నాయక్ ప్రాణాన్ని బలిగొన్నారు. ఆయన భార్యబిడ్డల్ని రోడ్డన పడేశారు. ఇది ముమ్మాటికీ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసిన హత్యే. ఆత్మహత్యతో ఈ అన్యాయం వెలుగు చూసింది. ఇలాంటి అన్యాయాలు ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి. బాధిత రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటూ పోతే శవాల గుట్టలు తేలుతాయి. ప్రభుత్వ కార్యాలయాలు టీడీపీ నాయకుల జాగీరు కాదు. నియంతృత్వ పాలన రాప్తాడు నియోజకవర్గంలో నియంతృత్వ పాలన సాగుతోంది, ఇంకా ఈ ప్రాంత ప్రజలకు స్వాతంత్య్రం రాలేదు. రామగిరి మండలంలో ఏవైనా కార్యక్రమాలకు వెళ్తే మంత్రి పరిటాల సునీత.. టీడీపీ గుండాలతో దాడులను ప్రోత్సహిస్తారు. అంటే మంత్రి సొంత మండలానికి వెళ్లాలంటే వీసాలు, పాస్పోర్టులు లాంటివి తీసుకెళ్లాలా? వీరి అక్రమాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇటీవల కనగానపల్లిలో ఓ రెవెన్యూ అధికారిని చెప్పుతో కొట్టారంటే ఇంత కన్నా అన్యాయం ఏముంటుంది? వైఎస్సార్ సీపీలో చేరిన ఎంపీపీని బెదిరించి, బలవంతంగా టీడీపీని వీడకుండా చేశారు. ప్రజలు ఐక్యమత్యంతో ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలి. -
పచ్చని స్నేహం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఇదో చిత్రమైన రాజకీయం. ఒక జేడీఏను కాదని డీడీని జేడీ కుర్చీలో ఇన్చార్జ్గా నియమించడం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. తన సన్నిహితుడికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఓ వర్గం అధికారులతో కలిసి జేడీఏ నడిపిన విజయవంతమైన రాయ‘బేరం’. మంత్రి పరిటాల సునీత సిఫార్సు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆదేశాలతో ఇష్టం లేకపోయినా తాను జారీ చేసిన జీఓ స్థానంలో 10 గంటల్లోనే మరో జీఓ జారీ చేసిన వ్యవసాయ శాఖలోని కీలక అధికారి వ్యథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లా అవసరాలు, ఉద్యోగస్థాయి.. పారదర్శకత అన్నీ ‘రాజకీయం’ ముందు తేలిపోయాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు, నియామకాలు ఎలా సాగుతున్నాయో మరోసారి సుస్పష్టమైంది. అనంతపురం జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద జిల్లా. వ్యవసాయంలో దేశంలోనే అత్యంత వెనుకడిన జిల్లాలలో ఒకటి. ఇలాంటి జిల్లాలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భాలు చాలా ఉంటాయి. వెరసి నిత్యం కరువుతో, రైతుల ఆత్మహత్యలు, రైతులు, రైతు కూలీల వలసలతో కొట్టుమిట్టాడుతున్న జిల్లాలో వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఎక్కువగా ఉంటుంది. కానీ ‘అనంత’ ప్రజాప్రతినిధులు మాత్రం రాజకీయాలకే పెద్దపీట వేశారు. జిల్లా అవసరాలను కాలరాశారు. ఐదేళ్ల కిందటి వరకూ వ్యవసాయశాఖ ఇన్చార్జ్ జేడీఏ శ్రీరామమూర్తి కొనసాగారు. అప్పట్లో జేడీఏను కాకుండా ఇన్చార్జిని నియమించడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత శ్రీరామమూర్తి జేడీఏగా పదోన్నతి పొందారు. ఈ నెల 11న జేడీఏ శ్రీరామమూర్తిని ప్రకాశం జిల్లాకు బదిలీ చేస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జేడీఏగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జేడీఏ చంద్రానాయక్ను నియమిస్తూ జీఓలో పేర్కొన్నారు. గంటల వ్యవధిలో నిర్ణయం మార్పు శ్రీరామమూర్తిది గుంటూరు జిల్లా. అగ్రానమీ డీడీ శ్రీనివాసమూర్తి, శ్రీరామమూర్తికి సన్నిహితుడు. అనంతపురం జిల్లాకు శ్రీరామమూర్తి చొరవతోనే శ్రీనివాసమూర్తి వచ్చారనేది వ్యవసాయశాఖవర్గాల అభిప్రాయం. ఈ క్రమంలో జేడీఏ బదిలీ నేపథ్యంలో శ్రీనివాసమూర్తి, శ్రీరామమూర్తి ఇద్దరూ ‘అనంత’ జేడీ పోస్టుపై రాజకీయం నడిపినట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరిద్దరితో పాటు వీరి కిందిస్థాయి ఉద్యోగులు కొందరు కలిసి మంత్రి పరిటాల సునీత వద్దకు 12వ తేది రాత్రి వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రనాయక్ ముక్కుసూటి మనిషి అని, అతను ఇక్కడి అధికారపార్టీ నేతల సిఫార్సులు పట్టించుకోరని తెలిపినట్లు తెలుస్తోంది. శ్రీనివాసమూర్తి అయితే చెప్పినట్లు వింటారని కూడా విన్నవించినట్లు సమాచారం. ఈ క్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఫోన్ చేసి జేడీఏగా చంద్రనాయక్ వద్దని, అతని స్థానంలో ఇన్చార్జ్ జేడీఏగా శ్రీనివాసమూర్తిని నియమించాలని ఆమె సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. సునీత సిఫార్సు మేరకు సోమిరెడ్డి వెంటనే వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్కు ఫోన్ చేసి ఉత్తర్వులు మార్చి పంపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్కు మంచి అధికారిగా పేరుంది. ఒకసారి జారీచేసిన ఉత్తర్వులను తిరిగి మార్చి పంపేందుకు ఆయన కూడా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. విధిలేని పరిస్థితుల్లో మంత్రి ఆదేశాల మేరకు 12తేదీ మధ్యాహ్నం 12.30గంటలకే చంద్రనాయక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు రావడంతో వ్యవసాయశాఖలోని ఓ వర్గం సంతోషంతో సంబరాలు చేసుకుంటే, జరిగిన పరిణామాలపై మరో వర్గం తీవ్ర ఆవేదనతో ఉంది. జేడీఏపై ఎరువుల కుంభకోణం ఆరోపణలు 2016 జూలైలో ఎరువుల రేక్ నుంచి 2,400 టన్నుల యూరియా వచ్చింది. ఇందులో 50శాతం నిల్వలు మంత్రి కాలవ శ్రీనివాసులు అస్మదీయులకు చెందిన భాస్కర్ ఫర్టిలైజర్స్కుకు పంపారు. అప్పట్లో ఈ వ్యవహారంలో జేడీఏ పేరు కూడా వినిపించింది. 2016 విత్తన పంపిణీలోనూ వ్యవసాయశాఖ ఘోరంగా విఫలమైంది. విత్తనాలకు బదులు డబ్బులు ఇస్తామని అప్పటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటనలు ఇచ్చే పరిస్థితి తలెత్తిందంటే విత్తన సేకరణలో వైఫల్యం ఏంటో ఇట్టే తెలుస్తోంది. అలాగే రెయిన్గన్ల ద్వారా పంటలను కాపాడామని ఇచ్చిన నివేదికలు కూడా తప్పులతడకగా ఉండి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేశాయి. రేయిన్గన్ పరికరాల రికవరీలో కూడా అధికారులు విఫలమయ్యారు. వెరసి జేడీఏ బదిలీ నేపథ్యంలో సమర్థ అధికారిని ప్రజాప్రతినిధులు కాంక్షించాలి. చంద్రనాయక్ జేడీఏ.. శ్రీనివాసమూర్తి డీడీఏ.. జేడీఏను కాదని, తమ అవసరాల కోసం డీడీఏను నియమించేలా సిఫార్సు చేశారంటే జిల్లా ప్రయోజనాలపై మంత్రులకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో ఇట్టే తెలుస్తోంది. పైగా ఉద్యోగం కోసం రాజకీయాలు చేసిన అధికారులు పారదర్శకతను పక్కనపెట్టి అధికారపార్టీ నేతలకు ‘జీ.. హుజూర్’ అనక తప్పదు. ఇలాంటి నిర్ణయాలతో రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లడంతో పాటు జిల్లా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. -
టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం కందుకూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యకు గురికావడమే అందుకు నిదర్శనమన్నారు. మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేసినా మంత్రి సునీత, ఆమె కుటుంబీకులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని, ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందంటూ ఆయన మండిపడ్డారు. సునీతపై కుటుంబీకులపై కేసు నమోదు చేయలేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యపై ఆయన కుటుంబీకులు ఫిర్యాదు చేయగా ప్రధాన నిందితుడు, టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, వారి సమీప బంధువులు మురళీ, మహేంద్ర అండతోనే హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నా.. వీరిపై మాత్రం కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. కాగా, ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని శుక్రవారం టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప నేతలు, కార్యకర్తల హత్యలకు పాల్పడటం దారుణమని తోపుదుర్తి పేర్కొన్నారు. -
పరిటాల X జేసీ
వారిద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలే.. ఒకరు మంత్రి..మరొకరు గత ఎన్నికల్లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. కానీ ఒకరంటే..మరొకరికి పడదు. దీంతో వారి అనుచరులూ రెండుగా చీలిపోయి ఆధిపత్యపోరు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరును నిరసిస్తూ మంత్రి సునీత అనుచరులు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగగా..పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. తాడిపత్రి:టీడీపీకి చెందిన స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ తీరుపై ఇటీవల కొందరు కరపత్రాలు ముద్రించి పట్టణంలో పంచిపెట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎస్ఐ రాఘవరెడ్డి టీడీపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హీరాపురం ఫయాజ్బాషాకు చెందిన డ్రైవరు మౌసిన్ను గురువారం అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత వర్గీయులైన హీరాపురం ఫయాజ్బాషా, జగదీశ్వర్రెడ్డి, కాకర్ల రంగనాథ్లు పోలీస్స్టేషన్కు చేరుకుని తమ అనుచరున్ని ఎందుకు అరెస్టు చేశారని పట్టణ సీఐ సురేందర్రెడ్డిని ప్రశ్నించారు. కరపత్రాలు పంపిణీ చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం వల్లే అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే గతంలో తమపై కరపత్రాలు వేసిన వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి పరిటాల సునీత వర్గీయులు పట్టుబట్టారు. దీంతో సీఐ సురేందర్రెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో ఫయాజ్బాషా, జగదీశ్వర్రెడ్డి, కాకర్ల రంగనాథ్ తదితరులు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. సీఐ సురేందర్రెడ్డి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, టీడీపీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన జగదీశ్వర్రెడ్డి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే లాఠీలకు పనిచెప్పిన పోలీసులు అక్కడున్న వారందరినీ తరిమికొట్టారు. అంతేకాకుండా స్టేషన్ సమీపంలో ఉన్న సామాన్యులపై కూడా లాఠీ ఝులిపించారు. స్టేషన్ ముందు బైఠాయించిన టీడీపీ నాయకులను ఈడ్చుకుని వెళ్లారు. ఎమ్మెల్యే జేసీ ప్రోద్బలంతోనే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ప్రోద్బలంతోనే తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని టీడీపీ సీనియర్ నాయకులు జగదీశ్వర్రెడ్డి, ఫయాజ్బాషా, కాకర్ల రంగనాథ్లు ఆరోపించారు. తాడిపత్రిలో పోలీసుల వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. కేవలం ఒక వర్గానికే వత్తాసు పలుకుతూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నారని మండిపడ్డారు. -
మంత్రి సునీత ధన పిశాచి: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు ఇంఛార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. నీటి సరఫరా పేరుతో టీడీపీ పాలనలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ప్రకాశ్ రెడ్డి.. ప్రజాధనం దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని, లేనిపక్షంలో మంత్రి సునీత బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. అనంతపురంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాముకు పైసా ఖర్చు లేకుండా నీళ్లు అందించ వచ్చన్నారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ మీదుగా నీరు సరఫరా చేస్తే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పేరూరు నీటి సరఫరా పనుల కోసం 1,140 కోట్ల రూపాయల కేటాయింపు వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. మంత్రి పరిటాల సునీత ధనపిశాచిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రకాశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా ధనం దుర్వినియోగం, మంత్రి పరిటాల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని లోకాయుక్తను కోరారు. విచారణ జరపని పక్షంలో ఆమె అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగంపై బహిరంగ చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంత్రి సునీత అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన రైతులకు వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
అగచాట్లవాడి
అనంతపురం సెంట్రల్: అంగన్వాడీ సిబ్బంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటిలోనూ భాగస్వామ్యం చేసి ఊడిగం చేయించే ప్రభుత్వం.. వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. కనీసం అద్దెలు కూడా ఇవ్వకపోవడంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది. జిల్లాకు చెందిన పరిటాల సునీతనే మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నా... తమ బతుకులు మారడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పెర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 నెలలుగా అందని అద్దె జిల్లాలో 5,126 అంగన్వాడీ సెంటర్లు ఉండగా... అందులో దాదాపు 1,600 పైచిలుకు కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.750 చొప్పున భవనాలకు అద్దె చెల్లిస్తున్నారు. కానీ దాదాపు తొమ్మిది నెలలుగా అద్దె బిల్లులు మంజూరు కాలేదు. ఇంటి యజమానులు ఖాళీ చేయాలని గొడవ చేస్తున్నారు. ఈ క్రమంలో దిక్కుతోచని స్థితిలో ఇటీవల అనంతపురం అర్బన్ సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అయినప్పటికీ పరిస్థితి మార్పు రాలేదు. మరోవైపు రూరల్ మండల కేంద్రాల్లోకూడా భవనానికి రూ. 750 మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. ఈ మొత్తానికి భవనాలు దొరకగా ఇరుకు సందుల్లోనూ, కొట్టాల్లోనూ అంగన్వాడీ కేంద్రాలను నడిపిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి అంగన్వాడీ సిబ్బందికి కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రెండు, మూడు నెలలకోసారి జీతాలు మంజూరు చేస్తున్నారు. అయితే ఇటీవల ఆన్లైన్పేరుతో జిలాల్లో చాలా మంది అంగన్వాడీ సిబ్బందికి జీతాలు మంజూరు చేయడం లేదు. గతేడాది జూన్ నుంచి జీతాలు తీసుకోని వారు జిల్లాలో వందల మంది ఉన్నారు. జీతాలివ్వండి అంటూ కార్యకర్తలు కార్యాలయ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక అంగన్వాడీ కార్యకర్తలను, ఆయాలను నెలలో రెండు, మూడు సార్లు సమావేశాలకు పిలుస్తున్నా... టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. 2016 నుంచి టీఏ, డీఏలు ఇవ్వలేదని సమాచారం. పొరుగున తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలకు రూ. 13వేలు చెల్లిస్తున్నా..మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అంగన్వాడీలను రెగ్యులరైజేషన్ చేస్తామనీ, నెలకు రూ.15 వేలు చెల్లిస్తామంటూ ఎన్నికలకుముందు చంద్రబాబు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా అంగన్వాడీ సిబ్బంది సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోని మంత్రి పరిటాల శిశు, సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత తన సొంత జిల్లాలోని అంగన్వాడీల సమస్య కూడా పట్టించుకోవడం లేదు. నెలల తరబడి అద్దెలు రాకున్నా, సంవత్సరాల తరబడి బిల్లులు పేరుకుపోయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండు సార్లు తప్ప మహిళా, శిశు సంక్షేమశాఖపై పెద్దగా సమీక్షలు కూడా లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నాకేం జరిగినా పరిటాల సునీతదే బాధ్యత
-
'టీడీపీలో చేరకపోతే చంపేస్తామన్నారు'
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటా సునీత ఆదేశాలతోనే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మరోసారి రుజువైంది. టీడీపీలో చేరకపోతే చంపుతామని తనను ఆ పార్టీ కార్యకర్తలు బెదిరించారని దాడికి గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బోయ సూర్యం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మంత్రి సునీత తనయుడు శ్రీరామ్ సమక్షంలోనే నాపై దాడి జరిగింది. కానీ నాతో బలవంతంగా టీడీపీ నేతలు సంతకాలు సేకరించారు. టీడీపీలో చేరకపోతే చంపుతామని బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయిస్తుంటే పోలీసులు ఏమీ అనలేదు. అదే సంతకంతో వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి చందు, నాగరాజులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదుచేశారు. పరిటాల వర్గీయులు అరాచకాలు చేస్తుంటే రామగిరి సీఐ, ఎస్ఐ, ఇతర పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. మంత్రి సునీత నుంచి నాకు ప్రాణహాని ఉంది, దయచేసి రక్షణ కల్పించాలంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బోయ సూర్యం విజ్ఞప్తి చేశారు. మంత్రి సునీతను పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: ప్రకాష్ రెడ్డి రామగిరి మండలంలో పోలీసు వ్యవస్థ లేదు. మంత్రి పరిటాల సునీత అరాచకాలపై ఎస్పీ మౌనంగా ఉన్నారు. రామగిరిలో సమావేశాలు నిర్వహించేందుకు మూడేళ్లుగా అడుగుతున్నా అనుమతి ఇవ్వటం లేదు. మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ అరాచకంగా వ్యవహరిస్తున్నారు. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సూర్యంపై దాడి చేసి.. మాపైనే అక్రమ కేసులు బనాయించటం ఏం న్యాయమని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి పరిటాల సునీతను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఏపీ సర్కార్ను డిమాండ్ చేశారు. పరిటాల వర్గీయుల అరాచకాలపై హైకోర్టులో కేసు వేసి న్యాయాన్ని పరిరక్షించుకుంటామని ప్రకాష్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి -
మంత్రి సునీత సమక్షంలో బట్టబయలైన వర్గపోరు
ఒంగోలు సబర్బన్: బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ సమీక్షలో సంతనూతలపాడు పార్టీ ఇన్చార్జి వ్యవహారంలో అంతర్గత పోరు బట్టబయలైంది. పార్టీకి సంబంధించి ఆదివారం స్థానిక ఎన్ఎస్పీ అతిథి గృహంలో రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి, పార్టీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. సంతనూతలపాడు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండటం లేదంటూ ఓ వర్గం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయనను ఇన్చార్జి బాధ్యతల నుంచి మార్చాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇదిలా ఉంటే విజయకుమార్కు అనుకూలంగా కొందరు నాయకులు మాట్లాడారు. విజయకుమార్ను కొనసాగించాల్సిందేనంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై తొలుత సమీక్షించారు. అనంతరం చీరాల, పర్చూరు, అద్దంకి స్థానాలు, చివరగా సంతనూతలపాడు నియోజకవర్గ నాయకులతో రాత్రి పొద్దుపోయేవరకు మాట్లాడారు. సమీక్షకు చీరాల నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత, అద్దంకి నుంచి ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి హాజరుకాలేదు. సంతనూతలపాడుపై సోమవారం కూడా మరోసారి సమీక్ష నిర్వహిద్దామని నాయకులకు చెప్పి పంపారు. సమీక్షకు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి ఒంగోలు టౌన్: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల భవనాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పి.సునీత ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎన్ఎస్పీ అతిథి గృహంలో ఐసీడీఎస్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని భవనాలను, అసంఫూర్తిగా ఉన్న వాటిని త్వరగా నిర్మించాలని ఆదేశించారు. అన్న అమృతహస్తం, బాలామృతం పథకాల అమలు తీరు గురించి ఐసీడీఎస్ పీడీ సరోజినిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో న్యూట్రి గార్డెన్స్కు అవసరమైన స్థలాలు, వన్ స్టాప్ సెంటర్పై పీడీతో చర్చించారు. డీఆర్డీఏ, వెలుగు లక్ష్యాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళిని మంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో ఎనిమిది స్త్రీ శక్తి భవన నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయని మంత్రికి పీడీ వివరించారు. జిల్లాలో 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. -
ప్రకాష్రెడ్డి అంటే భయామా?
రామగిరి: రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ప్రకాష్రెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆదివారం అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేరూరు డ్యాంను నీటితో నింపడంతో పాటు పేరూరు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసే విషయంపై రైతులతో చర్చించేందుకు నసనకోట పంచాయతీలోని ముత్యాలంపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశానికి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే సమావేశం నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో పాటు ఆ ప్రాంతంలో ఎలాంటి అలజడులూ తలెత్తకుండా ఉండేందుకు పది మంది పోలీసులతో బందోబస్తు కల్పించాలంటూ పది రోజుల క్రితం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్, ధర్మవరం డీఎస్పీ, రామగిరి సీఐకు ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డితో కలిసి ప్రకాష్రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. గ్రామీణుల్లో ఆందోళన సమావేశం నిర్వహణపై సమాచారం అందుకున్న మంత్రి పరిటాల సునీత అప్రమత్తమయ్యారు. ప్రకాష్రెడ్డిని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకెళ్లారు. ఫలితంగా సమావేశం నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేవలం పది మంది పోలీసుల భద్రతతో సమావేశం ముగిసే అవకాశమున్నా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు.. రామగిరి మండల వ్యాప్తంగా వంద మందికి పైగా పైగా స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలో దింపారు. పేరూరు, వెంకటాపురం, ఎంసీ పల్లి, కుంటిమద్ది, గరిమేకలపల్లి, చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎన్ఎస్గేట్, కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు గ్రామాల చుట్టూ పోలీసులను మోహరింపజేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. అడుగడుగునా అరెస్ట్లు ముత్యాలంపల్లిలో నిర్వహించనున్న సమావేశానికి దాదాపు 200 మంది కార్యకర్తలతో బయలుదేరిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మీనుగ నాగరాజుకు అడుగుడునా నిర్భందాలే ఎదురయ్యాయి. ఎటుచూసినా పోలీసులు అతన్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. చివరకు నాగరాజు, తదితరులను రామగిరి సీఐ యుగంధర్ అదుపులోకి పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే చిగురుచెట్టు వద్ద ఉన్న వంద మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. మంత్రి పరిటాల సునీత ప్రమేయంతోనే ఉద్రిక్తత నెలకొందని, ప్రకాష్రెడ్డి అంటే అంత భయమెందుకు అంటూ గ్రామీణులు చర్చించుకుంటున్నారు. -
పరిటాల ఇంటికి పవన్ ; ఆసక్తికర వ్యాఖ్యలు
-
పరిటాల ఇంటికి పవన్; ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం : గుండు వివాదంపై స్పష్టత ఇచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి పరిటాల కుటుంబాన్ని కలుసుకున్నారు. చలోరే చలోరే చల్ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించి, అనంత సమస్యలపై చర్చోపచర్చలు చేశారు. పవన్ రాక సందర్భంగా పరిటాల నివాసం వద్ద కోలాహలం నెలకొంది. మంత్రి తనయుడు శ్రీరామ్ దగ్గరుండి పవన్ను లోనికి తీసుకెళ్లారు. ఆసక్తికర వ్యాఖ్యలు : అల్పాహార విందు అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. దివంగత పరిటాల రవితో తనకు ఎలాంటి విబేధాలు ఉండేవికావని మరోసారి చెప్పుకొచ్చారు. టీడీపీతో జనసేన పొత్తు, సీమకు పొంచిఉన్న ప్రమాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాభీష్టం మేరకు, ప్రజలు కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై నిర్ణయం తీసుకుంటా. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సరికాదు. ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తాను. వెనుకబాటుకు గురైన రాయలసీమను సత్వరం అభివృద్ధి చేయకుంటే ప్రాంతీయవాదం తలెత్తే ప్రమాదం ఉంది’’ అని పవన్ అన్నారు. 2019 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చెయ్యబోయేది ఇంకా నిర్ణయించుకోలేదని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు. బాబు మాట.. టీడీపీ నేతలతో భేటీలు : తాను ఎవరికీ తొత్తు కాదన్న పవన్.. సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేస్తున్నట్లు ఇదివరకే చెప్పుకున్నారు. అయితే బీజేపీతో పొత్తుపై సీఎం చంద్రబాబు విరక్తివ్యాఖ్యల అనంతరం.. టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా పవన్తో భేటీలకు సిద్ధం అవుతుండటం జిల్లాల్లో చర్చనీయాంశమైంది. శనివారం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో ప్రత్యేక భేటీ జరిపిన ఆయన ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటిలో అల్పాహారవిందు ఆరగించారు. ఆదేశానుసారం రాబోయే రోజుల్లో ఇంకొందరు టీడీపీ కీలక నేతలు కూడా పవన్ను కలుస్తారని వినికిడి. -
అభివృద్ధిపై కాదు..అవినీతిపైనే పోరాటం
అనంతపురం: ‘మా పోరాటం అభివృద్ధిపై కాదు.. అవినీతిపైనే’ అంటూ’ వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు పనులు అడ్డుకుంటున్నారంటూ మంత్రి పరిటాల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. అనంతపురంలోని తమ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేరూరు, బీటీపీ ప్రాజెక్టుల్లో వందల కోట్ల రూపాయాల ప్రజాధనం స్వాహా చేసేందుకు అధికార పార్టీ ఎత్తుగడ వేసిందని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకు వేదిక, సమయం వాళ్లు(పరిటాల సునీత) చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే’ అంటూ పేర్కొన్నారు. 59, 60 జీఓలు ప్రజాధనం దుర్వినియోగం కోసమేనన్నారు. పేరూరు డ్యాం గురించి పరిటాల రవి ఎన్నడూ అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. ఈ డ్యాంకు నీళ్లు రాకుండా ఎగువ ప్రాంతం కర్నాటకలో నిర్మించిన ప్రాజెక్టుకు భూమిపూజ చేసి తన బినామీ కాంట్రాక్టర్తో పనులు చేయించిన చరిత్ర పరిటాల రవీంద్రదన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు రావాలనే డిమాండ్తో పేరూరు జలసాధన సమితి పేరుతో 2008 ఏప్రిల్ 28న 10 వేల మంది రైతులతో భారీ బహిరంగ సభ తాము ఏర్పాటు చేశామన్నారు. అంతకు రెండ్రోజుల ముందు బహిరంగ సభకు సంబంధించి ప్రచారకర్తలను పరిటాల రవి బామ్మర్ది బాలాజీ దాడి చేయించి రెండు జీపులను ధ్వంసం చేయించారని గుర్తు చేశారు. పరిటాల శ్రీరామ్ పేరూరుకు ఎగువ, దిగువన నాలుగేళ్లుగా ఇసుకను తోడుకుంటూ కర్ణాటకకు తరలించి రూ.వందలాది కోట్లు అర్జించారని ఆరోపించారు. దమిడీ ఖర్చు లేకుండా తురకాలపట్నం వద్ద మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి వంకలోకి నీళ్లు వదిలితే, దిగువనున్న పెన్నానదిలోకి వెళ్లి అక్కడి నుంచి పేరూరు డ్యాంకు వస్తాయని తాము ప్రతిపాదనలు చేస్తే పట్టించుకోలేదన్నారు. 25 వేల ఎకరాలు ఎక్కడుందో..? హంద్రీ–నీవా ద్వారా పేరూరు డ్యాం కింద 25 వేల ఎకరాలు సాగు చేయాలని చెబుతున్నారని, ఆయకట్టు ఎక్కడుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేరూరు డ్యాం కింద ఉన్న 10,047 ఎకరాలకు గాను హంద్రీ–నీవా కాలువకు దిగువనే 5,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు పారుతోందన్నారు. రెండేళ్లుగా నీళ్లొస్తుంటే దిగువనున్న ఆయకట్టుకు నీళ్లివ్వకుండా పోలీసులతో అడ్డుకున్న మంత్రి కి పేరూరు డ్యాం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆ పనులు ఎందుకు రద్దు చేయించారు రాప్తాడు నియోజకవర్గంలో హంద్రీ–నీవా దిగువన 76 వేల ఎకరాలు, పీఏబీఆర్ కుడికాలువ దిగువ 50 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటరీ పనులు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఈ రోజు కేవలం 5 వేల ఎకరాల సాగుకే రూ.800 కోట్లు పెడుతున్నారు. ఈ 5 వేల ఎకరాలకు నీళ్లివ్వడానికి 36వ ప్యాకేజీ పేరూరు బ్రాంచి కాలువను స్వయంగా సీఎం చంద్రబాబు 2015 జూన్ 20న రద్దు చేయడానికి మౌఖిక ఆదేశాలు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. అప్పట్లో రూ.119 కోట్లతో ఈ పనులు పూర్తయ్యేవన్నారు. పేరూరు డ్యాంకు నీళ్ల ప్రతిపాదన మాదే పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకెళ్లొచ్చనే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది తామేనని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. 2007 జనవరి 16న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిని తాను, చెన్నంపల్లి నరసింహారెడ్డి క లిసి విన్నవించామన్నారు. దీనిపై స్పందించిన ఆయ న అధికారులతో డీపీఆర్ తయారు చేయించి 2009 లో రూ.119 కోట్లతో అంచనా వేయించారన్నారు. చేసి చూపిస్తాం రూ.374 కోట్లతో బీటీపీ, పేరూరుకు నీళ్లిచ్చేలా అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. టీడీపీ ప్రభుత్వం రూ.1,771 కోట్లతో పనులకు జీఓ ఇవ్వడం చూస్తే వెయ్యి కోట్లకు పైగా దోపిడీ కళ్లెదుటే కనిపిస్తోందని ప్రకాష్రెడ్డి అన్నారు. ఈ సమయంలో ఓ విలేకరి 36వ ప్యాకేజీ మికిచ్చి, రూ.119 కోట్లు అదనంగా ఇస్తే పేరూరు డ్యాంకు నీళ్లివ్వగలరా? అని ప్రశ్నించారు. అందుకాయన సమాధానమిస్తూ కచ్చితంగా ఇస్తామని, ఫ్రీగా బీటీపీ కుడి కాలువ కూడా తవ్విస్తామన్నారు. చిత్తశుద్ధి ఉంటే.. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, పేరూరు ఆయకట్టు రైతుల మేలుకోరే వారైతే ఒక్క ఎకరా ఆయకట్టు లేని రిజర్వాయర్లను పక్కను పెడితే 1.5 టీఎంసీల సామర్థ్యం కల్గిన పేరూరు డ్యాంకు మీరు సూచించిన అలైన్మెంట్ ద్వారా నీళ్లు తీసుకెళ్లినా రూ.200 కోట్లకు మించదని సలహా ఇచ్చారు. పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా అడ్డుకున్నారనే మీ కుటుంబానికి ఉన్న మచ్చను తుడుపుకోవాలంటే వెంటనే తురలాపట్నం వద్ద నీళ్లిచ్చే విషయాన్ని పరిశీలించాలన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ నాగిరెడ్డి పాల్గొన్నారు. -
దారితప్పిన మంత్రి పరిటాల సునీత
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి వెళుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి పరిటాల సునీత దారి తప్పారు. మంగళవారం ఆమె... గుంటూరులో టీడీపీ కార్యాలయం అడ్రస్ కనుక్కోలేకపోయారు. పార్టీ కార్యాలయం ఎక్కడుందో తెలియక నగరంలోని అన్ని వీధులు తిరిగారు. గంటసేపు పార్టీ కార్యాలయం కోసం వెతుకులాటలోనే సరిపోయింది. ఎంతసేపటికీ పార్టీ కార్యాలయం అడ్రస్ కనుక్కోలేక ఆమె కొద్దిగా హైరానా పడ్డారు. మరోవైపు స్థానిక పోలీసులు మంత్రికి సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యారంటూ జిల్లా టీడీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రుణమాఫీ చేస్తామన్నది రూ.లక్షన్నరే!
రామగిరి: ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది లక్షన్నర రూపాయలేనని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆదివారం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పలేదన్నారు. అది కూడా చేస్తామని చెప్పని ప్రతిపక్ష నేత జగన్ ఆయనను విమర్శించడం విడ్డూరమన్నారు. అన్ని రంగాలను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనన్నారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పూల నాగరాజు, నాయకులు ఎల్ నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, రంగయ్య, జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, ఎంపీపీ అమరేంద్ర, దండు ఓబిలేసు, ముత్యాలరెడ్డి, రాజా, శ్రీరాములు, సర్పంచ్ వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు. -
సారు పెళ్లికొస్తారు.. కేంద్రాలు తెరిచి ఉంచండి
అనంతపురం టౌన్ : శనివారం దసరా పండుగ.. ఆదివారం సెలవు.. అదే రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం పెళ్లి. ఈ వివాహానికి ప్రముఖులు విచ్చేయనున్నారు. ప్రభుత్వ సెక్రటరీ సునీత, కమిషనర్ అరుణ్కుమార్ ఒక రోజు ముందుగానే (30వ తేదీ) అనంతకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అంగన్వాడీలను తనిఖీ చేస్తారని అందువల్ల సెలవు రోజుల్లోనూ కొన్ని అంగన్వాడీ సెంటర్లను తెరిచే ఉంచాలని ఐసీడీఎస్ పీడీ వెంకటేశం మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం గురువారం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు మంత్రి కుమారుడి పెళ్లి వస్తే...తాము పండుగరోజున కూడా పనిచేయాలా..? అని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళతాము పనిచేసినా సెలవు రోజుల్లో సెంటర్లకు పిల్లలను ఎలా పిలుచుకురావాలని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ సెంటర్లను వారు తనిఖీ చేస్తారో కూడా తెలియని నేపథ్యంలో అందరూ సెంటర్లలోనే ఉండాలా? లేదా? అన్న సంశయంలో పడ్డారు. ఈ విషయమై ఐసీడీఎస్ పీడీ వెంకటేశంను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘30వ తేదీన ఉన్నతాధికారులు వస్తున్నారని సమాచారం ఉంది. ఇదే సమయంలో శిశుగృహ, సేవాసదనాలు పరిశీలించవచ్చు. అన్ని ప్రాజెక్టుల అధికారులు సెంటర్లు నడపాలని చెప్పలేదు. పెనుకొండ, చెన్నేకొత్తపల్లి ప్రాజెక్టుల పరిధిలోని సెంటర్లను పరిశీలించవచ్చు. అది కూడా హెడ్క్వార్టర్స్లో ఉన్నవి మాత్రమే. పిల్లలు తప్పకుండా ఉండాలనేమీ లేదు. భవనాలు, అక్కడి వసతులపై ఆరా తీసే అవకాశం ఉంది. ఇదంతా ముందు జాగ్రత్తగా చెప్పినదే’ అని తెలిపారు.