
సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. రామగిరి వైఎస్సార్సీపీ నేత బోయ సూర్యంపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వేటకొడవళ్లతో సూర్యంపై దాడి చేశారు. పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో ఈ ఘటన జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలు అయ్యాయి. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ డాడి చేయించారని బాధితులు ఆరోపించారు. గాయపడిన వారిని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు పరామార్శించారు.
Comments
Please login to add a commentAdd a comment