బాబుతో సింగపూర్ వెళ్లనున్న సిఎం రమేష్ | AP CM Chandrababu with CM Ramesh and Anuradha go to singapore tour | Sakshi
Sakshi News home page

బాబుతో సింగపూర్ వెళ్లనున్న సిఎం రమేష్

Published Tue, Nov 11 2014 2:03 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

బాబుతో సింగపూర్ వెళ్లనున్న సిఎం రమేష్ - Sakshi

బాబుతో సింగపూర్ వెళ్లనున్న సిఎం రమేష్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సింగపూర్ వెళ్లేందుకు మరో ఇద్దరికి అనుమతి ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్తోపాటు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనురాధలు కూడా సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.  చంద్రబాబు ఈ నెల 11 నుంచి 14 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు.

ఆయనతోపాటు మరో 12 మంది సభ్యుల బృందం సింగపూర్ వెళ్లనుంది. అయితే ఆ బృందంలో సీఎం రమేష్, అనురాధలకు చోటు కల్పించడంతో బృందం సభ్యుల సంఖ్య 14కి చేరింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో మంగళవారం సింగపూర్ వెళ్లనున్నారు. అందుకు సంబంధించి జీవోను సాధారణ పరిపాలన శాఖ సోమవారం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement