జూన్‌లో రాజధానికి భూమి పూజ | bhumi puja for ap capital in june | Sakshi
Sakshi News home page

జూన్‌లో రాజధానికి భూమి పూజ

Apr 22 2015 3:46 AM | Updated on Jun 2 2018 3:08 PM

నూతన రాజధానికి జూన్ మొదటివారంలో శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

తాడికొండ: నూతన రాజధానికి జూన్ మొదటివారంలో శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో పొలం చదును చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకూ 5 వేల ఎకరాలకు సంబంధించి మొత్తం రూ.19.80 కోట్ల కౌలు డీడీలను రైతులకు అందించామన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచనలో పడిందని చెప్పారు. పురపాలక మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ  2018 నాటికి రాజధాని నిర్మాణం తొలిదశ పూర్తవుతుందన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement