రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
రొంపిచర్ల(గుంటూరు): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండల కేంద్రం సమీపంలోని అద్దంకి- నార్కెట్పల్లి రోడ్డుపై ఇన్నోవా వాహనాన్ని, బైకు ఢీకొట్టడంతో బైకు పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు రొంపిచర్ల మండలానికి చెందిన వారిగా సమాచారం.