'అన్ని నన్నే చేయమంటే సమస్యలు వస్తాయి' | chandrababu naidu comments in angallu meeting | Sakshi
Sakshi News home page

'అన్ని నన్నే చేయమంటే సమస్యలు వస్తాయి'

Published Wed, Nov 5 2014 5:30 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

'అన్ని నన్నే చేయమంటే సమస్యలు వస్తాయి' - Sakshi

'అన్ని నన్నే చేయమంటే సమస్యలు వస్తాయి'

అంగుళ్లు: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు మేలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఏం చంద్రబాబు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లా ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తామన్నారు. చిత్తూరు జిల్లా అంగుళ్లులో బుధవారం జరిగిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... అన్ని తననే చేయమని చెప్పి ప్రజలు ఇంట్లో పడుకుంటే సమస్యలు వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రజలు కలిసివస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. సెల్ఫోన్లపై ఉన్న శ్రద్ధ మరుగుదొడ్ల నిర్మాణంపై పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. గ్రామాల్లోనూ చెత్త సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement