కృష్టానది ఇరువైపులా రాజధాని నిర్మించాలని... | Chandrababu naidu think New Capital Construction on Krishna river both sides, says Gadde Rammohan Rao | Sakshi
Sakshi News home page

కృష్టానది ఇరువైపులా రాజధాని నిర్మించాలని...

Published Fri, Sep 5 2014 12:45 PM | Last Updated on Mon, Aug 20 2018 2:00 PM

కృష్టానది ఇరువైపులా రాజధాని నిర్మించాలని... - Sakshi

కృష్టానది ఇరువైపులా రాజధాని నిర్మించాలని...

హైదరాబాద్: కృష్ణానదికి ఇరువైపులా రాజధానిని నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... కృష్ణాజిల్లాలోని రైతులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య 50 వేల ఎకరాల స్థలం వివాదంలో ఉందని చెప్పారు.

ఏపీలోని మొత్తం 13 జిల్లాలోని భూమి లభ్యతపై సమగ్ర సర్వే జరుగుతుందని గద్దె రామ్మోహన్ రావు వెల్లడించారు.  ఏపీ కొత్త రాజధాని విజయవాడలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement