కాలువలో పడిన బాలుడి మృతదేహం లభ్యం | Child's Body Found in palakollu canal | Sakshi
Sakshi News home page

కాలువలో పడిన బాలుడి మృతదేహం లభ్యం

Nov 10 2015 12:56 PM | Updated on Sep 3 2017 12:20 PM

పశ్చిమగోదావరి జిల్లాలో కాలువ పడి గల్లంతైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది.

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో కాలువ పడి గల్లంతైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. పాలకొల్లు రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన గుమ్మల రాజేష్(7) అనే రెండవ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ సోమవారం నర్సాపురం-నిడదవోలు ప్రధాన కాలువలో పడిపోయాడు.

సోమవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టినా దొరకలేదు. మంగళవారం మధ్యాహ్నాం పెంకులపాడు గ్రామం వద్ద బాలుడి శవం కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement